February 22, 2013

హైదరాబాద్ బాంబు పేలుడు విషయం తెలియగానే మనసు మనసులో లేదు. యాత్రను ఒక పూట వాయిదా వేసుకొని పరామర్శకు బయలుదేరాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పలకరించినప్పుడు.. వారి మోములో ఆవేదనతో పాటు ఆగ్రహమూ కనిపించింది. ఆ కోపం సర్కారుపైనేనని వాళ్ల మాటలను బట్టి తెలిసింది. ఒకే ప్రాంతంలో పదేపదే పేలుళ్లు జరుపుతుంటే హైదరాబాద్‌లోనూ, ఢిల్లీలోనూ ఉన్న ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయన్న ప్రశ్న ఆ వాడి కళ్లలో కనిపించింది. "ఎవరి పాపం..ఎవరికి శిక్ష?'' అని ఆక్రోశించారు.

నిజమే.. ఉగ్రవాదంతో గానీ, ఆ సమస్యకు ఆజ్యం పోసే ప్రభుత్వ విధానాలతో గానీ వీళ్లకేం సంబంధం? వీళ్లంతా బడుగులు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పని చేసుకొని ఏ రాత్రికో ఇంటికి చేరుకొనే సామాన్య జనం. ఆఫీస్‌లకు వెళ్లి వచ్చే మధ్యతరగతి మనుషులు. బజారుకు వచ్చిన మనిషి తిరిగి ఇంటికి చేరకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏదో పని వెతుక్కొని ఊరికొస్తాడనుకున్న కొడుకు విగతజీవిలా వస్తే ఆ తల్లి పడే క్షోభను ఏ ప్రభుత్వ ప్రకటన ఓదార్చగలదు?

దోనేపూడి గ్రామంలో నడుస్తున్నప్పుడు..ఆస్పత్రుల్లో కనిపించిన జనాలే కదా వీళ్లంతా అనిపించింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఎంత బూటకమో.. ఈ గ్రామాల్లో సంక్షేమం అంత నాటకం. కాకపోతే, కదం తొక్కుదామంటే..ఆ రోజు కూలీ పోయి పిల్లలు పస్తు పడుండాల్సి వస్తుందని పేదల భయం. రోడ్డెక్కుదామంటే మధ్యతరగతికి మర్యాదే పెద్ద అడ్డంకి. ఇళ్లు లేదంటూ నన్ను కలిసినవారిలో వారూవీరూ ఉన్నారు. ఇక సంక్షేమం అడ్రస్ ఎక్కడ?

సంక్షేమం అడ్రస్ ఏదీ?

ప్రభుత్వానిది ఘోర వైఫల్యం: బాబు..
బాధితులకు పరామర్శ...
అనంతరం యాత్ర కొనసాగింపు

"బాంబు పేలుళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది ఘోర వైఫల్యం. సీఎంది బాధ్యతా రాహి త్యం. కేంద్రం సమాచారం పంపినా జాగ్రత్తలు తీసుకోలేకపోయారు'' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. శుక్రవారం పాదయాత్రను ఒకపూట వాయిదా వేసుకొని హైదరాబాద్‌కు వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, పేలుళ్లపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఒక పట్టు పట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. అనంతరం ఆయన గుంటూరు జిల్లాకు వచ్చి పాదయాత్రను కొనసాగించారు. వేమూరు నియోజకవర్గంలోని దోనెపూ డి, కోటిపల్లి, వెల్లటూరులో పర్యటించిన ఆయన.. మళ్లీ అధికారంలోకి వస్తే వాటితో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.

మరోవైపు, కాంగ్రెస్ అసమర్థ పాలనతో హైదరాబాద్ తీవ్రవాదుల స్వర్గధామంగా మారిందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి దెబ్బతిందని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, పేలుళ్లుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమంటూ టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్ పార్లమెంటు ఉభయ సభల్లో గట్టిగా నిరసన తెలిపారు.

ఇంటికి వెళ్లని చంద్రబాబు
బాంబు పేలుడు ఘటన బాధితులను పరామర్శించడం కోసం తన పాదయాత్రకు విరామం ఇచ్చిమరీ హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు... అటు నుంచి అటే వెళ్ళిపోయారు. ఇంత దూరం వచ్చీ ఇంటికి వెళ్లకుండానే తిరుగుముఖం పట్టడం గమనార్హం. పాదయాత్ర పూర్తయిన తర్వాతే ఇంటికి తిరిగి రావాలని నియమం పెట్టుకొన్న చంద్రబాబు.. బాధితులను పరామర్శించిన అనంతరం నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడే పార్టీ నేతలతో మాట్లాడి.. విజయవాడ వెళ్లారు.

సీఎంది బాధ్యతా రాహిత్యం

పేలుళ్ల ఘటన దురదృష్టకరం
ప్రభుత్వ వైఫల్యమే కారణం

నగరంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, ఉగ్రవాదులు పక్కా పథకం ప్రకారమే పేలుళ్లకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం దారుణమని అన్నారు. పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు.

శుక్రవారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌లోని బాంబు పేలుళ్ల ఘటనాస్థలిని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వం ముందే హెచ్చరించింది, కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది. ఇన్ని హెచ్చరికలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వ తేలిగ్గా తీసుకోవడం బాధాకరమన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ప్రజలు సంయమన ం పాటించాలని చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు.

దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలియగానే చంద్రబాబు తమ పాదయాత్రను వాయిదా వేసి, శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఇకనైనా అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

ప్రజలు సయంమనం పాటించాలి : చంద్రబాబు

చంద్రబాబు పాదయాత్ర జిల్లాలోని వేమూరు నుంచి గురువారం సాయంత్రం పునఃప్రారంభమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో 48 గంటల విరామం అనంతరం చంద్రబాబు సాయంత్రం 5 గంటల సమయంలో బస్సు దిగగానే వందలాది మంది కార్యకర్తలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. వేమూరు పరిసర ప్రాంతాల నుంచి మహిళలు, విద్యార్థినులు, యువకులు వచ్చి చంద్రబాబుతో సంభాషించి ఆయన వెంట అడుగేశారు. వేమూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముసలిపాడు వద్దకు చేరుకోగానే స్థానికులు ఎదురువెళ్ళి చంద్రబాబుకు తమ సమస్యలు వివరించారు. సాగునీరు, విద్యుత్ సమస్యలతో వేగలేకపోతున్నామని, తమ కష్టాలు తీరాలంటే మీరు అధికారంలోకి రావాలని చంద్రబాబును కోరారు.

ముసలిపాడులో ప్రసంగించిన అనంతరం క్రాప అడ్డరోడ్డు వద్ద స్థానిక ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. కొల్లూరు శివారుకు చేరుకునే సరికి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ వేలాది మంది కార్యకర్తలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. కనకతప్పెట్లు, విచిత్ర వేషధారణలు, బాణాసంచ పేలుళ్ల మధ్య కొల్లూరులో చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. రోడ్డుకిరువైపులా కాన్వాయ్ వెంట వేలాది మంది ప్రజలు కదంతొక్కారు. మేడల మీద నుంచి చంద్రబాబుకు అభివాదం చేస్తూ పరవశించిపోయారు. చంద్రబాబు రాక నేపథ్యంలో కొల్లూరు అంతటా భారీ ఫ్లెక్సీలు, తోరణాలతో పసుపు పరవళ్లు తొక్కించారు. కొల్లూరులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తూ మీరు చూపించిన అభిమానం జీవితంలో మరిచిపోలేనిదని అన్నారు.

హైదరాబాద్ సంఘటన నేపథ్యంలో ప్రసంగించాలా వద్దా అని సంశయించారు. ఆ తర్వాత సమస్యలపై చర్చించుకుందామని ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే గంటల తరబడి వేచి వున్న ప్రజలను చూసి కొద్దిసేపు ఉపన్యసించారు. 1994లో రాష్ట్ర ఆదాయం 8 వేల కోట్లు ఉంటే తాను చేసిన సంస్కరణల కారణంగా రూ.లక్షా 50 వేల కోట్లకు చేరుకుందని, ఆ డబ్బులు కాంగ్రెస్ దొంగలు దోచుకోటానికే సరిపోతుందని ధ్వజమెత్తారు. పేదల అభివృద్ధి, సంక్షేమం చూడాల్సిన వారు జలయజ్ఞం పేరుతో 30 వేల కోట్లు దోచారని ఆరోపించారు. పల్లెల్లో ఏ పనులు జరిగినా కాంగ్రెస్ దొంగలే బిల్లులు చేసుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతిని సమాజంలో సర్వ సాధారణం చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు.

కరువు, ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భాల్లో రైతులకు పంట పెట్టుబడులపై భరోసా ఇవ్వమని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిందని, అయితే దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కింది. మేము అధికారంలోకి వస్తే వ్యవసాయం లాభసాటి చేసే వరకు రైతులకు అండగా ఉంటానని చంద్రబాబు వాగ్ధానం చేశారు. గ్రామాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇచ్చితీరుతానన్నారు. 'రైతులు ఎదుర్కొంటున్న కష్టలు చూస్తుంటే ఆవేదన, ఆగ్రహం, ఆవేశం వస్తుందని, అదే సమయంలో సభ్యత అడ్డువస్తుందన్నారు.

ఏప్రిల్ ఒకటి నుంచి కరెంటు బాంబు వైఎస్ చనిపోకముందు చేసిన అప్పుల కారణంగా ఏప్రిల్ ఒకటి నుంచి ప్రజలపై మరో కరెంటు బాంబు పడబోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సర్‌చార్జ్‌పై విచారణ చేస్తున్నారని, ఏప్రిల్ ఒకటి నుంచి రూ.13 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపబోతున్నారని చెప్పారు. ఇదే విధంగా మరో మూడు వేల కోట్లు బాధితులపై కోర్టుల్లో విచారణ జరుగుతుందన్నారు. ఈ విధంగా మొత్తం రూ.32 వేల కోట్ల భారాన్ని ఒక్క విద్యుత్ చార్జీల రూపంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పలుచోట్ల ప్రసంగించిన అనంతరం చంద్రబాబు దోనెపూడికి చేరుకుని రాత్రికి బస చేశారు.

చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్, టీడీపీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, వేములపల్లి శ్రీరాంప్రసాద్, కోవెలమూడి రవీంద్ర, ముత్తినేని రాజేష్, రమాశాంతాదేవి, మానుకొండ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు చీరాల గోవర్ధనరెడ్డి, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, చిట్

జన ఉప్పెన

అదే ఉత్సాహం, అదే పట్టుదల, సడలని ఆత్మ విశ్వాసం... 48 గంటల విరామం అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం 5.15లకు పాదయాత్రను పునఃప్రారంభించారు. దారి పొడవున జయ,జయ థ్వానాలతో కార్యకర్తలు స్వాగతం పలుకుతూ ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. వేమూరులోని విశ్వచైతన్య పబ్లిక్ స్కూలు విద్యార్ధులు స్వాగతం పలుకుతూ ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు.

మొసలిపాడు, క్రాప, అనంతవరం తదితర ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ఉద్వేగ భరిత ప్రసంగం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుడు మరోసారి రుజువుచేసిందని ఆయన ధ్రిగ్భాంతి వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను గాలికొదిలిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

యువతలో ఉత్సాహం నింపుతూ... చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆద్యంతం యువతలో ఉత్సాహం నింపేవిధంగా సాగింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కిరికిరి కిరణ్‌కుమార్ రెడ్డి అంటూ ఎద్దేవా చేస్తూ ప్రసంగించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ కావని విమర్శించారు. మహిళలు, వృద్దులు, వికలాంగులు ఎవరికీ కూడా ఈ ప్రభుత్వంలో సుఖశాంతులు లేవని ఆవేదన చెందారు. వ్యవసాయం కుంటుపడటం, దేశానికి మంచిది కాదన్నారు. రైతుల పేరుతో అప్పులు తీసుకొని వారిని నట్టేట ముం చుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోని అం దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని, దీనికి అంతూ పొంతూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సన్నబియ్యం రూ.50కు చేరిందని, తెదేపా అధికారంలో ఉన్నప్పుడు రూ.15లకే సన్నబియ్యం అందించామని గుర్తుచేశారు. ఇలా అన్ని వర్గాలను దోచుకుంటూ కాంగ్రెస్ దొంగలు ర్రాష్టాన్ని దివాలా తీస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.పిట్టకథలతో ఆకట్టుకున్న బాబు... తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అనంతవరం, ముసలిపాడు, క్రాప క్రాస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో పిట్టకథలు చెప్తూ ప్రజలను ఉత్తేజపరిచారు. ఒక పేదవాడు రాజు వద్దకు వెళ్లి నాకు భూమి కావాలని అడిగాడు. ఉత్సాహంతోఉన్న ఆ రాజు పేదవానితో నీవు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంతదూరం పరిగెత్తితే అంతదూరం నీకే చెందుతుందని చెప్పాడు.

అత్యాశతో ఉన్న ఆ పేదవాడు కొద్ది దూరం మామూలుగానే పరిగెత్తి అనంతరం వేగం పెంచాడు. కనీసం నీరు, ఆహారం తీసుకోకుండా సూర్యాస్తమయం వరకు పరిగెత్తి, పరిగెత్తి గుండెపోటుతో మరిణించాడు. ఇలా అత్యాశకు పోయిన ఆ వ్యక్తి దుస్థితే కాంగ్రెస్ నేతలకు పట్టిందని, వేల కోట్లు దోచుకొని చంచల గూడ జైలులో ఊసలు లెక్కపెడుతున్నాడని బాబు తనదైన శైలిలో పిట్టకథలు చెప్తూ కాంగ్రెస్ అవినీతి, అక్రమాలను ఎండగట్టాడు.

బాబు యాత్రకు అపూర్వ ఆదరణ

పాదయాత్ర క్రాప క్రాస్‌లో ఉన్నప్పుడు విన్న వార్తతో నిశ్చేష్టుడినయ్యాను. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల విషయం తెలిసింది. ఆ దుర్ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ప్రజలకు రక్షణ, స్వేచ్ఛగా జీవించేందుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అక్కడి నుంచి ముసలిపాడు వద్దకి చేరేసరికి అక్కడి రైతులు తమ కష్టాలను ఏకరవుపెట్టారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అన్నదాతలవి ఒకే రకమైన కష్టాలు. ఇది పేరుకు కోస్తా ప్రాంతమే అయినా రైతుల సమస్యలకు మాత్రం కొదువ లేదు.

'వరి పంటకు నీరివ్వలేమని చెప్పడంతో మొక్క జొన్న వేసుకుందామని చూశాం. తక్కువ నీటితోనే పంట చేతికొచ్చే అవకాశం ఉన్నా దానికీ నీరివ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. పోనీ బోరుపై ఆధారపడదామంటే కరెంట్ రాదు. ఇక ఎలా సాగు చేసేది? జీవితం ఎలా సాగించేది?' అంటూ అన్నదాతలు చె ప్పిన మాటలు నా మనసును కదిలించాయి. మీరు అధికారంలోకి వస్తే పగటిపూటే 9గంటలు కరెంట్ వచ్చేలా చూడండి సార్! అంటూ వాళ్లు వేడుకుంటున్నారు.

కుప్ప కూలిపోయిన వ్యవస్థలను రాత్రికి రాత్రే మంత్రం వేసినట్టు బాగు చేయలేం. కానీ కష్టపడతా.. వారి కోరిక నెరవేర్చేందుకు రాత్రింబగళ్లు పనిచేస్తానని మాత్రం హామీ ఇచ్చాను. కొల్లూరు పొలిమేరల్లో యానాదిపాలెం చేరుకోగానే దారి పొడవునా పెద్ద ఎత్తున ఆడపడుచులు బారులు తీరి కనిపించారు. వారివి రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలే. అభిమానంతో నన్ను చూడాలని రోడ్లెక్కారు. తమ జీవితాలు దుర్భరంగా ఉన్నాయని నోరు తెరచి చెప్పకపోయినా వారి ముఖాలు చూస్తుంటేనే పరిస్థితి అర్థమవుతోంది. ఇలాంటి వారి జీవితాలు మార్చాలన్న సంకల్పంతోనే నేను ఈ పోరాటం చేస్తున్నాను.

జీవితానికి భరోసా కావాలి

ఎన్నికల నియమావళితో 48 గంటల విశ్రాంతికి పరిమితమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మలిసంధ్య వేళలో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే నేటి (గురువారం) సాయంత్రం ఐదు గంటలకు తన పాదయాత్రను వేమూరు నుంచి పునఃప్రారంభించనున్నారు. కోడ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పటివరకు రోజుకు 10 కిలోమీటర్ల లోపే నడక సాగిస్తోన్న ఆయన ఇకపై ఎక్కువ దూరం పాదయాత్ర చేయాలని నిర్ణయించుకొన్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఏకంగా 9 కిలోమీటర్లు నడిచి దోనెపూడిలో రాత్రికి బస చేయన్నుట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వేమూరు రైల్వేగేటు దాటిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో విశ్రాంతి తీసుకొంటున్న ఆయన నేడు మొసలిపాడు, క్రాప అడ్డరోడ్డు, కొల్లూరు మీదుగా దోనెపూడి వరకు నడక సాగిస్తారు. ఈ నేపథ్యంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నేతృత్వంలో ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

నాయకులకూ... విశ్రాంతి

చంద్రబాబు పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బుధవారం పూర్తిగా విశ్రాంతి తీసుకొన్నారు. 15 రోజుల నుంచి ఆయన వెంటే నడక సాగిస్తోన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులుతో పాటు ఇతర నాయకులు తమ నియోజకవర్గాల్లోనే విశ్రాంతి తీసుకొన్నారు. స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకొని పాదయాత్రకు లభిస్తోన్న స్పందనపై చర్చించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావుతో పాటు మరి కొంతమంది నాయకులు మంగళవారం డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

పాదయాత్ర కొనసాగే ప్రాంతాలు..

గురువారం రాత్రికి చంద్రబాబు దోనెపూడికి చేరుకొని అక్కడ బస చేసిన అనంతరం 22వ తేదీన ఉదయం అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభిస్తారు. కోటిపల్లి, వెల్లటూరు, భట్టిప్రోలు, వేమవరం, సూరేపల్లి, కోనేటిపురం మీదుగా పల్లెకోన చేరుకొన్న అనంతరం వేమూరు నియోజకవర్గ పర్యటన పూర్తి అవుతుంది. ఆ తర్వాత రేపల్లె నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. కారుమూరు, లంక అడ్డరోడ్డు, వరికూటివారిపాలెం క్రాస్, పేటేరు, బేతపూడి, ఇసుకపల్లి సెంటర్, పాతపట్టణం - అరవపల్లి రోడ్డు, అవరపల్లి, ఊళ్లపాలెం, నల్లూరుపాలెం, సింగుపాలెం అడ్డరోడ్డు, సింగుపాలెం, విశ్వేశ్వరం, బొబ్బర్లంక, మైనేనివారిపాలెం, చాట్రగడ్డ స్కూల్, చాట్రగడ్డ, రుద్రవరం, పెనుమూడి, పెనుమూడి వారధి మీదుగా కృష్ణాజిల్లాలోకి షెడ్యూల్‌ను రూపొందించారు. తొలుత ఈ నెల 27వ తేదీ వరకు పాదయాత్రను కొనసాగించాలని నాయకులు భావించారు. ఎన్నికల కోడ్ గురువారంతో ముగుస్తున్న నేపథ్యంలో రోజుకు 12 నుంచి 13 కిలోమీటర్లకు పాదయాత్ర షెడ్యూల్‌ను సవరించి 26వ తేదీ రాత్రికి పెనుమూడి వారధి దాటేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. దీనిపై పుల్లారావు ఆదేశాల మేరకు మన్నవ సుబ్బారావు తదితరులు బుధవారం మధ్యాహ్నం రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ అనగాని సత్యప్రసాద్‌తో ఫోన్‌లో చర్చించారు.

మలి సంధ్య వేళ.. వస్తున్నా... మీకోసం

యథేచ్ఛగా ప్రాణాలు బలిగొంటున్నారు
హైదరాబాద్ పేలుళ్లని ఖండిస్తున్నా
గుంటూరు పాదయాత్రలో చంద్రబాబు

రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో 48 గంటల పాటు పాదయాత్రకు విరామం ఇచ్చిన ఆయన గురువారం సాయంత్రం గుంటూరు జిల్లా వేమూరు నుంచి తన యాత్రను పునఃప్రారంభించారు. ముసలిపాడు, క్రాప అడ్డరోడ్డు, కొల్లూరు మీదుగా దోనేపూడి వరకు 8 కిలో మీటర్లు నడిచారు. ఈ సందర్భంగా పలు చోట్ల ప్రసంగించారు. యాత్ర రావికంపాడుకు చేరుకున్న సమయంలో హైదరాబాద్‌లో బాంబు పేలుడు ఘటన తెలుసుకున్న చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ హయాంలో శాంతి భద్రతలను పరిరక్షించామని, తీవ్రవాదులు, రౌడీలు గడగడలాడిపోయేవారని.. నేడు వారు యథేచ్ఛగా ప్రజల్లోకి వచ్చి ప్రాణాలను బలిగొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగాల్లో వైఎస్ జగన్ అవినీతిని కూడా ఎండగట్టారు. 'జగన్ రూ. 43వేల కోట్లు దోచాడని సీబీఐ నిర్ధారించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల జగన్ ఆస్తులను జప్తు చేయడాన్ని న్యాయస్థానం సమర్థించింది. జగన్ దోపిడీని కోర్టులు కూడా నమ్మి బెయిల్ ఇవ్వకుండా స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. తాము తప్పు చేయలేదని బుకాయిస్తున్న పిల్ల కాంగ్రెస్ నాయకులు ఈడీ, న్యాయస్థానం తీసుకుంటున్న చర్యలపై ఏం సమాధానం చెబుతారు' అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

యువతకు ఉద్యోగాలేవి?: 'ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకు నేడు ఉద్యోగాలు లేవు. దీనికి కారణం కాంగ్రెస్ అవినీతి పాలనే. రాష్ట్రంలో విద్యుత్ లేకుండా చేశారు. దీని వలన కొత్త పరిశ్రమలు రాక ఉపాధి కరువైంది. పెట్టుబడిదారులు చంచల్‌గూడా జైలులో ఉన్నారు. ఐదేళ్ల తరువాత విద్యార్థులు కూడా తమ చదువును మరిచిపోయి తల్లిదండ్రులకు భారంగా పరిణమించే ప్రమాదం ఉంది' అని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును అంధకారం చేసిన పాపం వైఎస్‌దేనని మండిపడ్డారు. పరిపాలనపై అనుభవం లేకుండా సీఎం కిరణ్ ర్రాష్టాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. 'కిరణ్‌కు వ్యవసాయం, నీటి యాజమాన్యం గురించి తెలియదు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. కిరణ్ ఓ జాక్‌పాట్ సీఎం' అని ఎద్దేవా చేశారు.

అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాలకు రైతులకు ఎకరానికి రూ. 10వేల పరిహారం ఇవ్వాలని తాను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నానని, ఇప్పుడు సీఎం కూడా అదే మాట చెబుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలు పడి వారం గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారిని కూడా క్షేత్రస్థాయికి పంపించి నష్టాన్ని అంచనా వేయించలేదని విమర్శించారు. నీలం తుఫాను వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహారం ఇప్పించలేకపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు, ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నా, పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, రాష్ట్రం గాలివాటంగా ముందుకు సాగిపోతుందే తప్ప ప్రజలకు సుఖం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు రక్షణేది?