December 28, 2012


ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా .. మీకోసం'... పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో శుక్రవారం ముగిసింది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 14 రోజుల పాటు సాగిన పాదయాత్ర శుక్రవారం సాయంత్రం జమ్మికుంట మండలం నగరం మీదుగా వరంగల్ జిల్లాలో ప్రవేశించింది. 90 గ్రామాల మీదుగా 181 కిలోమీటర్లు మేరకు జిల్లాలో సాగిన చంద్రబాబు పాదయాత్రకు అడుగడుగునా విశేష స్పందన లభించింది. గత ఏడాది డిసెంబర్‌లో రైతులకు మద్దతుగా చేపట్టిన పోరు యాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన చంద్రబాబు సరిగ్గా ఏడాది తర్వాత జిల్లాకు వచ్చారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పాదయాత్ర ముగిసే సరికి కొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నది.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా 2008న ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖను మరోమారు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు ఇవ్వడం ద్వారా తెలంగాణకు అనుకూలమేనని మరోసారి టీడీపీ విస్పష్టంగా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణవాదం నేపథ్యంలో ఎటు తేల్చుకోలేక తంటాలు పడుతున్న టీడీపీ నేతలు, శ్రేణుల్లో సంతోషం అంబరాన్నంటింది. భవిష్యత్‌పై ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురించాయి.ప్రజలతో మమేకం... మారిన ఆహార్యం... రెండు వారాల పాటు పాదయాత్రలో భాగంగా గ్రామీణప్రాంతాలను సందర్శించిన చంద్రబాబు అక్కడి ప్రజలతో మమేక మయ్యారు. అట్టడుగు వర్గాల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. హైటెక్ విధానాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చంద్రబాబు నేడు ఆ విధానాలను పక్కనబెట్టి చేతివృత్తులు, కులవృత్తులు, మహిళలు, రైతులు, కార్మికులు తదితర వర్గాలు పడుతున్న ఇక్కట్లను గుర్తించారు.

వారి సమస్యలను సావధానంగా తెలుసుకొని పరిష్కారానికి మార్గం చూపేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. రైతుల రుణమాఫీ, చేనేత ప్యాకేజీ, బీసీ డిక్లరేషన్, ముస్లీంలకు రిజర్వేషన్లు, చేతివృత్తులు, కులవృత్తుల వారికి చేయూత, మగపిల్లలకూ సైకిళ్లు, ఉచితంగా పీజీ వరకు విద్య ... తదితర కార్యక్రమాలను ప్రకటిస్తూ ఆయా వర్గాల వారిని తనవైపునకు తిప్పుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు కొంతమేరకు ఫలించాయనే చెప్పవచ్చు. తెలంగాణవాదం బలంగా ఉన్న ఈ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర సాఫీగా ముగియడమే ఇందుకు కారణమని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజలు తమ కష్టాలను చంద్రబాబు దృష్టికి తీసుకురావడంతో పాటు ్‌మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తీరుతాయి...* అంటూ బాహాటంగా ప్రకటించడం గమనార్హం. తెలంగాణవాదం ఎంత బలంగా ఉన్నా అదే సమయంలో తాము పడుతున్న కష్టాలు కూడా తక్కువేమీ కాదంటూ సామాన్య ప్రజానీకం రోడ్లపైకి వచ్చి చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. అవినీతి ... అభివృద్ధి...కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిపోయిన అవినీతి, తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ చంద్రబాబు ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

దాదాపు అన్ని వర్గాల నుంచి ప్రభుత్వ పాలనపై పెదవి విరుపే వ్యక్తం కావడం ... చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదంటూ ప్రజలే చంద్రబాబు దృష్టికి తీసుకురావడంతో రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గణాంకాలతో ఏకరువు పెట్టి ప్రజలకు చేరువ కావడానికి యత్నించారు. గతంలో మాదిరిగా రొటీన్ ప్రసంగాలు కాకుండా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రసంగాలను కొనసాగించడం కార్యకర్తలకు కూడా ఉత్సాహాన్ని కలిగించింది. కాంగ్రెస్ నేతలు పందికొక్కులా దోచుకుంటున్నారు ... వేల కోట్లు గడించారు.. బాబ్లీని అడ్డుకునేందుకు తాము ఉద్యమం చేపట్టి జైలుకు వెడితే కేసీఆర్ ఎగతాళి చేశారు... బీడీ కట్టలపై పుర్రె గుర్తు కేసీఆర్ పుణ్యమే.. జగన్ లక్ష కోట్ల డబ్బు దోచుకొని జనాన్ని కష్టాలపాలు చేశారు... అవినీతిలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ ఒకటే...* అంటూ ప్రజలను సులభంగా ఆకర్షించే పదజాలాన్ని ప్రయోగిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్, జగన్ కాంగ్రెస్‌లను తూర్పారబట్టారు.

మూడున్నర ఏళ్ళ వివాదానికి తెర...మూడున్నర సంవత్సరాలుగా పార్టీని నానాతిప్పలు పెడుతున్న తెలంగాణ అంశం ఎట్టకేలకు పరిష్కారమైందన్న భావన వ్యక్తమవుతోంది. 2008లో తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడు 2009లో టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేశారు. తెలంగాణలో ఎక్కువ సీట్లు దక్కించుకున్నారు. అయితే 2009 డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూల ప్రకటన రాగా సీమాంధ్ర నేతల ఒత్తిడితో చంద్రబాబు భిన్నమైన ప్రకటన చేశారు. దీంతో చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో ఈ ప్రాంతంలో పర్యటించేందుకు వెనుకాడే పరిస్థితులు ఏర్పడ్డాయి.టీడీపీ కార్యకలాపాలు కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.

ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఈ కారణంగానే టీడీపీని వదిలవెళ్ళారు. ఇతర జిల్లాలతో పోల్చితే ఇక్కడ వలసలు తక్కువే అయినా పార్టీకి తెలంగాణ అంశం ఇబ్బందికరంగా మారింది. ఎట్టకేలకు ఏడాదిన్నర కాలంగా తెలంగాణ నేతల ఒత్తిడితో వాస్తవ పరిస్థితులను గుర్తించిన చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ తేల్చిచెబుతూ వచ్చారు. అయినా మరింత స్పష్టత ఇవ్వాలంటూ టీఆర్ఎస్, బీజేపీ, జేఎసీ తదితర పక్షాల నుంచి డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో 2008లో ప్రణబ్‌కు ఇచ్చిన లేఖను పునరుద్ఘాటిస్తూ శుక్రవారం సీల్డ్ కవర్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అందించడంతో తెలంగాణకు టీడీపీ అనుకూలమని స్పష్టంగా ప్రకటించినట్టయింది. దీంతో టీడీపీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కరీంనగర్ వేదికగా కీలక పరిణామాలు... కరీంనగర్ జిల్లా వేదికగా తెలుగుదేశం పార్టీలో మరోమారు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1995లో తెలుగుదేశం పార్టీ రెండుగా చీలడానికి ఈ జిల్లాయే కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడుకు ఇటు పార్టీ నేతలు, కార్యకర్తలు అటు ప్రజలు తెలంగాణవాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. తెలంగాణపై సానుకూలతను ప్రకటించాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. ఇతర పార్టీల నుంచి పెద్దగా నిరసనలు, ఆటంకాలు ఎదురుకాకపోయినా ప్రజలు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని మరోసారి గుర్తించిన చంద్రబాబు ప్రతీ రోజు తన పాదయాత్ర సందర్భంగా తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, భవిష్యత్‌లోనూ మాట్లాడబోనని స్పష్టత ఇస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు యత్నించారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ, సీమాంధ్ర నేతలతో వేర్వేరుగా సమావేశమైన చంద్రబాబు చివరకు పొలిట్‌బ్యూరో సమావేశంలో తెలంగాణ ఆకాంక్షపై వెనక్కి తగ్గడం వల్ల ఒరిగేదేమీ లేదని, గతంలో 2008లో ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖను మరోమారు అందజేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిద్దామని నచ్చజెప్పి ఒప్పించగలిగారు.తెలంగాణపై చంద్రబాబు మరోసారి రెండు కళ్ళ సిద్ధాంతమే అనుసరిస్తారని భావిస్తూ వచ్చిన ఇతర రాజకీయ పక్షాలు ఈ పరిణామాలతో ఖంగుతిన్నాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

దేశంలో జోష..!




కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. ఆరు నియోజకవర్గాల్లో సుమారు 200 కిలోమీటర్లు నడిచి బెల్లంపల్లి వద్ద వరంగల్ జిల్లాలోకి ప్రవేశించాను. కరీంనగర్ యాత్రలో నాకు లభించిన ఆదరణను జీవితంలో మరిచిపోలేను. ఏ గ్రామంలో అడుగుపెట్టినా ఇళ్లలో ఉన్న జనాలంతా రోడ్డుపైకి వచ్చి నిలబడ్డారు.

రోడ్డు పక్కన మహిళలు బారులు తీరి నిలబడి హారతులిచ్చి స్వాగతం పలికారు. ఇదంతా ఒక కోణం. మరోవైపు వాళ్ల కష్టాలూ కన్నీళ్లూ స్వయంగా చూడగలిగాను. మిగతా జిల్లాల్లో ఎలాంటి సమస్యలు చూశానో ఇక్కడా అవే ఎదురయ్యాయి. ఏ పల్లెను పలకరించినా అదే దైన్యం. రైతులకు గిట్టుబాటు ధర లేదు. కరెంటూ లేదు. మహిళల జీవితాలకు భరోసా లేదు. భద్రతా లేదు. పిల్లలు చదువుకునే వాతావరణం కనిపించలేదు.

ఎస్సారెస్పీ పాదాల చెంత ఉన్న జిల్లా ఇది. యాత్ర అంతటా 'బాబ్లీ' దుష్ప్రరిణామాలను కళ్లారా చూడగలిగాను. పత్తి, పసుపు, మొక్కజొన్న, వరి.. ఇలా ఏ పంట వేసిన రైతును కదిలించినా సంతోషం లేదు. రాత్రి కరెంటు కారణంగా రైతులు బావిలో పడి చనిపోయిన సంఘటనలు కలచివేశాయి. చితికిపోయిన చేనేత కుటుంబాలను కలిశాను. వాళ్ల అవస్థలు చూసి..ఉండబట్టలేక కాస్తయినా ఊరట కల్గించాలని జగిత్యాలలో చేనేత డిక్లరేషన్ ప్రకటించాను.

శ్రీరాంసాగర్ చివరి భూములకు నీళ్లు అందించాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో గనులున్నాయి. వాటిని ఉపయోగించుకొని ఆధారిత పరిశ్రమలు పెడితే యువతకు ఉపాధి లభిస్తుంది. సింగరేణి కార్మికుల కష్టాన్ని మరిచిపోలేం. బీడీ బాధితులు, గల్ఫ్ బాధితులు.. ఇలా ఎవరిని కదిలించినా కన్నీరే. ఇంత కష్టంలోనూ నన్ను చూడాలని, వాళ్ల కష్టాలు చెప్పుకొని నా సమక్షంలో గుండెబరువు దించుకోవాలన్న ఆశ వారిలో కనిపించింది. ముసలి, ముతక కూడా ఎముకలు కొరికే చలిలోనూ అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురుచూశారు. వీళ్లకెంత రుణపడి ఉన్నాను!

కరీంనగర్ కంట కన్నీరు చూశాను!



స్పష్టత ఇచ్చాం!
అందుకే గులాబీ నేతల గుండెల్లో రైళ్లు
తట్టుకోలేకనే కేసీఆర్ విమర్శలు
దీటుగా ఎదుర్కోవాలి: శ్రేణులకు బాబు పిలుపు

"తెలంగాణపై తేల్చిచెప్పాం. అందువల్లే తట్టుకోలేక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వి మర్శలు చేస్తున్నారు. వాటిని దీటుగా ఎదుర్కోవాలి. మనమిచ్చిన స్పష్టతతో టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 2008లోనే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాం. ఆ లేఖపై చర్య తీసుకోవాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశాం. ఎవరూ మమ్మల్ని విమర్శించే పరిస్థితి లేదు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెగేసి చెప్పారు. బ్లాక్ మెయిల్ చేస్తూ బతుకుతున్నపార్టీగా టీఆర్ఎస్‌ను దుయ్యబట్టారు.

పన్నెండేళ్లుగా ప్రజలకు ఏమి చేసిందీ ఆ పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గుంపుల వద్ద ఆయన శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు. చివరిరోజు యాత్రలో భాగంగా తనుగుల, పాపక్కపల్లి, వావిలాల, నగురం గ్రామాల వరకు 11.7 కిలోమీటర్లు నడిచారు. "మనది బడుగు, బలహీనవర్గాలకు చెందిన పార్టీ. అందుకే ఢిల్లీ అఖిలపక్ష సమావేశానికి బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన నాయకులను పంపాం. తెలంగాణని అభివృద్ధి చేసింది మనం. ప్రాంత సమస్యలు తీర్చింది మనమే. రేపటి తెలంగాణను అభివృద్ధి చేసేదీ మనమే. మనల్ని ఏ శక్తీ ఏమీ చేయలేద''ని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

అఖిలపక్షం అనంతర పరిణామాలపై వరంగల్ జిల్లా వెల్లంపల్లి బసలో ఆయన సమీక్ష జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కేసీఆర్ విమర్శలను దీటుగా ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు." తెలంగాణలో ఎక్కడ ఉనికిని కోల్పోతామోనన్న భయంతో కేసీఆర్ మనపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై దీటుగా స్పందించాలి. అఖిలపక్షంలో మన వైఖరిని మిగతా పార్టీలూ హర్షిస్తున్నాయి. నిర్ణయం చెప్పకుండా కాంగ్రెస్ మాత్రమే నాన్చుతోంది''అని వివరించారు. కాంగ్రెస్‌తో కలిసి పాలించినప్పుడు తెలంగాణకు టీఆర్ఎస్ ఏమి చేసిందో చెప్పాలని చివరిరోజు పాదయాత్రలో భాగంగా జరిగిన సభల్లో ఆయన డిమాండ్ చేశారు.

తన కుటుంబసభ్యులకు ఉద్యోగాలు రావడంతో ఆనందించారే గానీ, మరో తల్లి బిడ్డల ఉపాధి సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదంటూ కేసీఆర్‌ను విమర్శించారు. గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు సహా 14 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేసినా పట్టించుకోలేదని, గల్ఫ్ బాధితుల కోసమూ కేసీఆర్ ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. పిరికితనంతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, పాదయాత్ర చివరి రోజున కరీంనగర్ డిక్లరేషన్ విడుదల చేశారు. ఉత్తర తెలంగాణకు సాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ చివరి భూములకు నీరందేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని, ప్రాణహిత-చేవేళ్ల ప్రా జెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు పోరాడతామని ఆ ప్రక టనలో వెల్లడించారు.

కాగా, చంద్రబాబుకు హుజూరాబాద్ నియోజకవర్గంలో మహిళలు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. గ్రామాలలో ఆయనకు ఎదురేగి డప్పులు మోగిస్తూ, టపాసులు పేలుస్తూ సందడి చేశారు. శంభునిపల్లి గ్రామ మహిళా రైతులు దారిలో కలిసి పత్తి పంటకు ధర రావడం లేదని మొర పెట్టుకున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట ఐకేపీ గ్రామ దీపికలు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని వినతి పత్రం సమర్పించారు. గోపాలపురంలో పత్తి ఏరే మహిళలను కలిసి సమస్యలు ఆరా తీశారు. తాము అధికారంలోకి వస్తే పత్తికి క్వింటాలుకు 5 వేల రూపాయల ధర ఇప్పిస్తామని గోడు వెళ్లబోసుకున్న మహిళా రైతుకు భరోసా ఇచ్చారు.

కరీంనగర్‌లో ముగిసిన పాదయాత్ర
ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు 11 మండలాలు, 90 గ్రామాల మీదుగా 14 రోజుల పాటు 181 కిలోమీటర్ల దూరం కరీంనగర్‌లో చంద్రబాబు పాదయాత్ర సాగింది. శుక్రవారం సాయంత్రం జమ్మికుంట మండలం నగరం గ్రామం మీదుగా వరంగల్ జిల్లాలో పాదయాత్ర ప్రవేశించింది. జిల్లాలో సాగిన చంద్రబాబు పాదయాత్రకు అడుగడుగునా విశేష స్పందన లభించింది.

అదో బ్లాక్ మెయిలింగ్ పార్టీ

తెలుగుదేశం అభిమానులకు ఒక చిన్న విన్నపం .......ఈ బ్లాగ్ నేను మన అన్న ఎన్టీఆర్ మరియు చంద్రబాబు నాయుడుగారి మీద ఉన్న అభిమానంతో "వస్తున్నా మీకోసం" పాదయాత్ర మొదటి రోజు నుండి ఈ రోజు వరకు అప్ డెట్ చేస్తున్నా....కాని నాకెందుకో ఈ బ్లాగు మన నెటిజన్లందరికీ వెళ్ళటం లేదేమో అని నా అలోచన ...దయఉంచి ఈ  బ్లాగ్ ఎలా ప్రమోట్ చెయ్యలో మీకు తెలిసిన అలోచనలు నాతో చెప్పండి....



My Email ID : arjuntdp@gmail.com


my facebook acount :  arjuntdp  


మీరిచ్చే సలహాలతో మరి కొంత ముందుకు పోవడానికి నా ప్రయత్నం నేను చేస్తా....


దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో అవినీతిపరులను, నేర చరితులను అందలమెక్కించారని, కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో అవినీతికి చోటు ఇవ్వలేదని నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఎపిపిఎస్సీలో అవినీతిపరులు ఉండటంతో ప్రతిభావంతులకు ఉద్యోగాలు రాలేదని, డబ్బున్న వారికే దక్కాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రిపుంజయ రెడ్డి అవినీతికి పాల్పడి కోట్లు కొల్లగొట్టాడని చంద్రబాబు ఆరోపించారు. తన పిఏ సూరీడు రికమండేషన్‌తో రిపుంజయ రెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డి ఎపిపిఎస్సీ సభ్యునిగా నియమించగా 2008కి ముందు ఇల్లు కూడా లేని అతను ఇప్పుడు కోట్లు సంపాదించాడని విమర్శించారు. టిడిపి అవినీతిరహిత పాలన అందించిందని, తిరిగి అధికారంలోకి వచ్చినా అదే పాలన అందిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేసే బాధ్యతను తీసుకుంటుందని, 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడంతో పాటు కరెంట్ చార్జీలను కూడా తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు, ఉపాధి లభించేలా చూస్తుందని, అప్పటి వరకు నిరుద్యోగ భృతిని అందిస్తుందన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది టిడిపియేనని చంద్రబాబు చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని, భవిష్యత్తులో కూడా మాట్లాడేది లేదని స్పష్టం చేశారు. కాగా రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి వెళ్లి మిర్చి బజ్జీలు వేస్తున్న ఓ మహిళతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తాను కూడా బజ్జీలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు మిర్చి తినగా తెలంగాణ కారం ఎలా ఉందంటూ ఆ మహిళ ప్రశ్నించింది. ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఇదే కారం తింటున్నానని ఆయన జవాబిచ్చి అందరినీ నవ్వించారు.

ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఇదే కారం తింటున్నా .... చంద్రబాబు