November 18, 2012
chandrababunaidu_vastunnameekosam.padayatra
48వ రోజు ఆదివారం పాదయాత్ర పోటోలు...(Part-2) 18.11.2012
కాంగ్రెస్, టీఆర్ఎస్లను బంగాళాఖాతంలో పడేయండి
కిరికిరి రెడ్డిగా మారుతున్న సీఎం కిరణ్
జైల్లో నుంచి పిల్ల కాంగ్రెస్ నేత రాజకీయం
అక్కడి నుంచే ఎమ్మెల్యేలను కొంటున్నారు
కాంగ్రెస్ దొంగలు 9 లక్షల కోట్లు దోచుకున్నారు
ఎన్నికల ఒక్క రోజు నాకు కేటాయించండి
ఆ రోజు పొరపాటు చేస్తే.. అగ్నిగుండంలోకే
మెదక్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు
సంగారెడ్డి, నవంబర్ 18 : ప్రజాసమస్యలను పట్టించుకోని కాంగ్రెస్,
టీఆర్ఎస్లను కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన 'వస్తున్నా.. మీ
కోసం' పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం మెదక్ జిల్లాలోకి చేరుకుంది. జిల్లా
సరిహద్దులోని భానూర్ గ్రామానికి చేరుకున్న ఆయన.. అక్కడ బహిరంగ సభలో
ప్రసంగించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగలు తొమ్మిది లక్షల కోట్ల
రూపాయలను దోచుకున్నారన్నారు. రాష్ట్రంలో 2004లో రూ. 25 వేల కోట్ల బడ్జెట్
ఉండగా ఇప్పుడు లక్షా 50 వేల కోట్లకు పెరిగిందని, కానీ పేదవాడి ఆరోగ్యం ఏ
మాత్రం బాగుపడలేదన్నారు.
ఈ డబ్బంతా కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకే పోయిందన్నారు. ప్రభుత్వ భూములను, ఖనిజ సంపదను అమ్ముకుని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసి మనం కట్టిన పన్నులను పందికొక్కుల్లా మింగేశారన్నారు. దోచుకున్నంత దోచుకుని రాష్ట్రాన్ని అడవి పందుల్లా నాశనం చేశారన్నారు. కాంగ్రెస్ నాయకుల అవినీతి వల్లే రాష్ట్రంలో కరెంట్ లేదని, ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు దోచుకుని తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్గా విడిపోయారన్నారు.
అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న పిల్ల కాంగ్రెస్ నేత అక్కడినుంచి రాజకీయం చేస్తూ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. తమపై ఉన్న కేసులను మాఫీ చేస్తే కాంగ్రెస్లో విలీనం చేసేందుకు రాయబారాలు నెరపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కిరికిరిరెడ్డిగా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని తాను ప్రకటిస్తే ఎలా చేస్తావో చెప్పాలంటూ ఆయన కిరికిరి పెడుతున్నారన్నారు. అయితే, తాను వారికి సమాధానం చెప్పనని.. ఎలా మాఫీ చేస్తానో అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తానన్నారు.
ఒక్క రోజు నాకు కేటాయించండి
ఎన్నికలు జరిగే ఒక్కరోజు తన కోసం కేటాయించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతి నిర్మూలనకు ధర్మాన్ని, విలువలను కాపాడటమే తన ధ్యేయమన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయకుండా నిజాయితీగా ఉంటున్నానన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులందరి ఆస్తుల వివరాలు ప్రకటించే నాయకుడిని దేశంలో తానొక్కడినేనని ఆయన అన్నారు. డబ్బులకు కక్కుర్తి పడి తమ పార్టీ నుంచి వైసీపీలో చేరినవారు.. 2009లో తమ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక ఎమ్మెల్యే, ఒక నాయకుడు డబ్బులకు అమ్ముడుపోతే 50 మందిని తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉందన్నారు. డబ్బుతో కంపు కొడుతున్న రాజకీయాలను ప్రక్షాళన చేసి విలువలు పెంపొందించాలనుకుంటున్నానన్నారు. అందుకే ఎన్నికలు జరిగే ఒక్కరోజు తనకు కేటాయించి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆ ఒక్క రోజు డబ్బులకు, దేనికీ లొంగిపోవద్దని ప్రజలను కోరారు.
ఏ మాత్రం పొరపాటు చేసినా ప్రస్తుతమున్న సమస్యల సుడిలో నుంచి అగ్నిగుండంలో పడతారని, మిమ్మల్ని కాపాడేవారెవరూ ఉండరన్నారు. పత్తిని వారం రోజుల్లో కొనుగోలు చేయకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే గిట్టుబాటు ధర ఇచ్చి పత్తిని కొనకపోతే ఖబడ్దార్ అంటూ ఆయన ముఖ్యమంత్రిని హెచ్చరించారు.
టీడీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుట్ర
తెలంగాణ ఇవ్వాలని తాను చెబితే ఆంధ్రాలో టీడీపీని బలహీనపర్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని చంద్రబాబు అన్నారు. అయితే, తెలంగాణను తానేనాడూ వ్యతిరేకించలేదని, వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్తులో కూడా వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది తామేనని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నాయకులు గతంలో టీడీపీలోనే ఉన్నవారేనన్నారు.
మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీపెట్టి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారని కేసీఆర్నుద్దేశించి విమర్శించారు. ఉద్యమం పేరిట రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ఆరు నెలలు పడుకుంటారని, ఆరు నెలలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీఆర్ఎస్లను బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు కోరారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నారు: లోకేష్
రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. ముఖ్యంగా కరెంట్ కష్టాలతో సతమతమవుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. పాదయాత్రకు వచ్చినవారంతా తమ సమస్యలను చెబుతుంటే బాధ కలుగుతోందన్నారు. పాదయాత్రలో పాల్గొన్న లోకేష్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే ఆయన తనను కలిసిన కొందరితో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కరెంట్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీనిపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
చెట్టు కింద భోజనం
చంద్రబాబుతో పాటు పాదయాత్ర చేసిన భువనేశ్వరి ఆదివారం మధ్యాహ్నం బీడీఎల్ సమీపంలో చెట్టుకిందే వనభోజనం చేశారు. సోదరి ఉమామహేశ్వరి, వదిన జయశ్రీ, ఇతర మహిళలతో కలిసి ఆమె చెట్టు కింద కుర్చొని భోజనం చేశారు. రంగారెడి ్డజిల్లా మహిళలు ఆమెకు బొట్టుపెట్టి శాలువా కప్పి చీరపెట్టారు.
ఈ డబ్బంతా కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకే పోయిందన్నారు. ప్రభుత్వ భూములను, ఖనిజ సంపదను అమ్ముకుని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసి మనం కట్టిన పన్నులను పందికొక్కుల్లా మింగేశారన్నారు. దోచుకున్నంత దోచుకుని రాష్ట్రాన్ని అడవి పందుల్లా నాశనం చేశారన్నారు. కాంగ్రెస్ నాయకుల అవినీతి వల్లే రాష్ట్రంలో కరెంట్ లేదని, ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు దోచుకుని తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్గా విడిపోయారన్నారు.
అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న పిల్ల కాంగ్రెస్ నేత అక్కడినుంచి రాజకీయం చేస్తూ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. తమపై ఉన్న కేసులను మాఫీ చేస్తే కాంగ్రెస్లో విలీనం చేసేందుకు రాయబారాలు నెరపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కిరికిరిరెడ్డిగా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని తాను ప్రకటిస్తే ఎలా చేస్తావో చెప్పాలంటూ ఆయన కిరికిరి పెడుతున్నారన్నారు. అయితే, తాను వారికి సమాధానం చెప్పనని.. ఎలా మాఫీ చేస్తానో అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తానన్నారు.
ఒక్క రోజు నాకు కేటాయించండి
ఎన్నికలు జరిగే ఒక్కరోజు తన కోసం కేటాయించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతి నిర్మూలనకు ధర్మాన్ని, విలువలను కాపాడటమే తన ధ్యేయమన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయకుండా నిజాయితీగా ఉంటున్నానన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులందరి ఆస్తుల వివరాలు ప్రకటించే నాయకుడిని దేశంలో తానొక్కడినేనని ఆయన అన్నారు. డబ్బులకు కక్కుర్తి పడి తమ పార్టీ నుంచి వైసీపీలో చేరినవారు.. 2009లో తమ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక ఎమ్మెల్యే, ఒక నాయకుడు డబ్బులకు అమ్ముడుపోతే 50 మందిని తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉందన్నారు. డబ్బుతో కంపు కొడుతున్న రాజకీయాలను ప్రక్షాళన చేసి విలువలు పెంపొందించాలనుకుంటున్నానన్నారు. అందుకే ఎన్నికలు జరిగే ఒక్కరోజు తనకు కేటాయించి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆ ఒక్క రోజు డబ్బులకు, దేనికీ లొంగిపోవద్దని ప్రజలను కోరారు.
ఏ మాత్రం పొరపాటు చేసినా ప్రస్తుతమున్న సమస్యల సుడిలో నుంచి అగ్నిగుండంలో పడతారని, మిమ్మల్ని కాపాడేవారెవరూ ఉండరన్నారు. పత్తిని వారం రోజుల్లో కొనుగోలు చేయకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే గిట్టుబాటు ధర ఇచ్చి పత్తిని కొనకపోతే ఖబడ్దార్ అంటూ ఆయన ముఖ్యమంత్రిని హెచ్చరించారు.
టీడీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుట్ర
తెలంగాణ ఇవ్వాలని తాను చెబితే ఆంధ్రాలో టీడీపీని బలహీనపర్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని చంద్రబాబు అన్నారు. అయితే, తెలంగాణను తానేనాడూ వ్యతిరేకించలేదని, వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్తులో కూడా వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది తామేనని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నాయకులు గతంలో టీడీపీలోనే ఉన్నవారేనన్నారు.
మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీపెట్టి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారని కేసీఆర్నుద్దేశించి విమర్శించారు. ఉద్యమం పేరిట రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ఆరు నెలలు పడుకుంటారని, ఆరు నెలలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీఆర్ఎస్లను బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు కోరారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నారు: లోకేష్
రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. ముఖ్యంగా కరెంట్ కష్టాలతో సతమతమవుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. పాదయాత్రకు వచ్చినవారంతా తమ సమస్యలను చెబుతుంటే బాధ కలుగుతోందన్నారు. పాదయాత్రలో పాల్గొన్న లోకేష్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే ఆయన తనను కలిసిన కొందరితో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కరెంట్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీనిపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
చెట్టు కింద భోజనం
చంద్రబాబుతో పాటు పాదయాత్ర చేసిన భువనేశ్వరి ఆదివారం మధ్యాహ్నం బీడీఎల్ సమీపంలో చెట్టుకిందే వనభోజనం చేశారు. సోదరి ఉమామహేశ్వరి, వదిన జయశ్రీ, ఇతర మహిళలతో కలిసి ఆమె చెట్టు కింద కుర్చొని భోజనం చేశారు. రంగారెడి ్డజిల్లా మహిళలు ఆమెకు బొట్టుపెట్టి శాలువా కప్పి చీరపెట్టారు.
ఆ రోజు పొరపాటు చేస్తే.. అగ్నిగుండంలోకే
పార్టీ జిల్లా అధ్యక్షులకు ఎలాంటి కార్యచరణా లేదని, వెంటనే కార్యచరణను సిద్ధం చేసుకుని కార్యరంగంలోకి దూకాలని సూచించారు. పని చేయని ఇన్ఛార్జీల స్థానంలో మరొక అభ్యర్థిని పెడితే తాను గెలుస్తానంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. దేశ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికలెప్పుడొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఏ క్షణంలో ఎన్నికలొచ్చినా నాయకులూ, కార్యకర్తలూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అజాగ్రత్త పనికిరాదని హెచ్చరించారు. అంతా అనుభవించి పార్టీ కోసం పని చేయకపోవడం సరైంది కాదన్నారు. పార్టీకి వస్తున్న కష్టనష్టాలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ప్రకటిస్తానని నియోజకవర్గ ఇన్ఛార్జిలను పరోక్షంగా హెచ్చరించారు. టిడిపిపై ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలకు ధీటైన జవాబివ్వడంలో వెనుకబడుతున్నామని చురకలంటించారు. విమర్శలకు తగిన సమాధానం చెప్పకపోతే టిడిపియే తప్పు చేసిందనే భావన ప్రజల్లోకి వెళ్తుందన్నారు. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కోకతప్పదని చెప్పారు. 'పాదయాత్ర సందర్భంగా వెన్నుపూస ఇబ్బందిపెట్టింది. కాళ్ళకు బొబ్బలొచ్చాయి. విపరీతంగా నొప్పి వచ్చింది. డాక్డర్లు, నాయకులు విశ్రాంతి తీసుకోవాలన్నారు. అయినా నేను దీక్షగా పాదయాత్ర కొనసాగిస్తున్నాను తప్ప ఎవరికీ చెప్పుకోలేదు. డాక్డర్ల సలహా మేరకు మట్టిరోడ్డుపై నడక సాగిస్తున్నాను' అని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకానికి తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వాస్పత్రుల్లో వసతులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు.
కష్టపడకపోతే రాక్షస పాలన నుంచి విముక్తి చేయలేం
చారిత్రాత్మక రోజు కోసం అందరూ కష్టపడాలని నాయకులకు చంద్రబాబునాయుడు సూచించారు. లేకపోతే రాక్షస కాంగ్రెస్ పాలన నుంచి ప్రజలను విముక్తి చేయలేమన్నారు. టన్నులకొద్దీ అవినీతి సొమ్ముతో ప్యాకేజీలు నిర్ణయించి ఎమ్మెల్యేలను కొంటున్నారని జగన్పై ధ్వజమెత్తారు. టిడిపి ఎంపీ, ఎమ్మెల్యేలను కొన్న నీచమైన చరిత్ర కాంగ్రెస్కుందని ఉదహరించారు. 2009 నుంచి పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కుల, మతాలతో నీచమైన రాజకీయాలు చేస్తున్నారని జగన్పై విరుచుకుపడ్డారు. 2014 మేలో ఎన్నికలు రావాల్సి ఉండగా ముందుస్తు, మధ్యంతరమంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, అందుకు మనమూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, టిఆర్ఎస్లు అధికారపార్టీని కాకుండా ప్రతిపక్ష పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణాలోని ఏ సమస్యపై స్వతంత్రంగా పోరాటం చేశారో టిఆర్ఎస్ నేతలు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న జగన్పై ఎందుకు మాట్లాడడం లేదని టిఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఆర్నెల్లు ఫామ్హౌస్లో పడుకుని మాటల గారడీతో ప్రజలను మాయచేయలేవని పరోక్షంగా కెసిఆర్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అవినీతి మంత్రులందరీపైనా విచారణ జరిపితే కేబినెట్లో సగంమందికి పైగా జైల్లో ఉంటారని చెప్పారు. అవినీతి మంత్రులను సిఎం వెనుకేసుకొస్తున్నారని, మరోపక్క ఆయన శిష్యులే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని విమర్శించారు.
మీరూ కష్టపడండి...........(ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో Sun, 18 Nov 2012)
chandrababunaidu_vastunnameekosam_padayatra_17photos_Rangareddy dist
48వ రోజు ఆదివారం పాదయాత్ర పోటోలు...18.11.2012
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలో ముగిసి.. మెదక్ జిల్లాలో ప్రవేశించింది. పటాన్చెరువు మండలంలోని బిడిఎల్ గేటు వద్ద బాబు యాత్ర మెదక్ జిల్లాలో ప్రవేశించింది. ఈ రోజు చంద్రబాబు పాదయాత్రలో ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, సోదరి హైమావతి, రామకృష్ణ భార్య జయశ్రీ, ఉమామహేశ్వరి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు 49వ రోజు. బాబు యాత్రలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొనడం గమనార్హం. అంతకుముందు బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో ఓ చెట్టు కింద భోజనం చేశారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఇలాగే చైతన్య రథంపై తిరిగారు. బాబు పాదయాత్రతో తెలుగుదేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. భువనేశ్వరి, లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు ఉదయం నుండే బాబుతో కలిసి పాల్గొన్నారు.
ఆదివారం పాదయాత్రలో పాల్గొన్న చంద్రబాబు కుటుంబ సభ్యులు
అవినీతిపై యువగళం
పాదయాత్రలో బాబు కొత్త ఒరవడి
సమస్యలు ఏకరువు పెట్టిన యువత
ఇంజనీర్లమైనా 300 కూలీకి పనిచేస్తున్నాం
రంగారెడ్డి జిల్లా, నవంబర్ 17 :
ప్రజాసమస్యలు తెలుసుకోడానికి ప్రారంభించిన పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రను చర్చావేదికగా మార్చారు.
రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిపై రాత్రి 9 గంటల తర్వాత
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో బహిరంగ చర్చ నిర్వహించారు.
గజగజలాడే చలిలో నిర్వహించిన ఈ చర్చకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర రాజధాని నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న పల్లెలో నిర్వహించిన ఈ చర్చా వేదిక ప్రజా చైతన్యానికి కరదీపికలా కనిపించింది. సమస్యలపై తమకున్న అవగాహనను యువతీ యువకులు కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. ప్రజల దుస్థితికి, ఈ అవినీతికి కారణం కాంగ్రెస్, వైఎస్సేనని గళమెత్తారు. చర్చ ఇలా సాగింది..
శ్రీనాథ్గౌడ్: వైఎస్ కుటుంబం కొడుకు, కూతురు, తల్లి తేడా లేకుండా దోచుకున్నారు. అవినీతి డబ్బుతో సాక్షి పేపర్, టీవీ పెట్టారు. ఇప్పుడు రోజుకో ఎమ్మెల్యేని కొంటున్నారు. ఎన్నికల్లో ప్రజలను కొనాలనుకుంటున్నారు. వారి సంగతి మేము చూసుకుంటాం. యువకులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎదగాలి.
మరో యువకుడు: మీరుండగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. దేశంలోనే మనం ముందుండేవాళ్లం. ఒకప్పుడు గుజరాత్ కంటే ముందున్న మనం కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలన వల్ల 20 - 30 ఏళ్లు వెనక్కి పోయాం. టీడీపీ అధికారంలోకి వచ్చిననాడే అసలైన దీపావళి.
మరో యువకుడు: సార్ నేను పెన్నార్ కంపెనీలో పనిచేస్తున్నా. రెండు గంటలు కరెంట్ ఉంటే 8 గంటలు జనరేటర్ మీద పనిచేస్తున్నాం. గతంలో నెలకు నాలుగు లక్షల కరెంట్ బిల్లు అయ్యేది.. ఇపుడు నెలకు రూ.40లక్షలు జనరేటర్ ఖర్చవుతోంది.
చంద్రబాబు: దీనికి ఎవరు కారణం తమ్ముళ్లూ..?
జనం: వైఎస్, కాంగ్రెస్సే
ఓ ఇంజనీర్: నేను ఇంజనీర్ను. కరెంట్ కష్టాల వల్ల ఇంజనీర్లు, పాలిటెక్నిక్, ఐటీఐ వాళ్లు, కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్నా లేబర్తో పాటే రోజు వారీ రూ. 300 కూలీకే పనిచేస్తున్నాం.
శ్రీకాంత్రెడ్డి: సార్ మాకు ఇల్లు లేదు. ఏ ఆఫీసుకు వెళ్లినా మీరు రెడ్డిలు ఇల్లు ఎలా వస్తుంది? ఐదువేలు లంచం ఇస్తే ఇల్లు మంజూరు చేస్తామంటున్నారు. కరెంట్ ఫ్యూజు పోతే బీరు, బిర్యానీ తినిపిస్తేనే వేస్తున్నారు. సింగాపూర్లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణంలో మీ భూములు పోతున్నాయని కాంగ్రెస్వాళ్లు భయపెట్టి వాటిని ల్యాంకో రాజగోపాల్కు లక్ష, రెండు లక్షలకు అమ్మించారు. తీరా ఈ భూములు కొనుగోలు చేసి వీటి పక్కనుంచి రోడ్డు వేశారు. ఇపుడు వీటి ధర రూ. 30లక్షలు. మోసం చేసి భూములు కొల్లగొట్టారు.
రాము: నేను ఎంఏ చదువుకుంటున్నా.. ఏ ఉద్యోగానికి వెళ్లినా లంచం అడుగుతున్నారు. ఇచ్చే స్థోమత లేక మా నాన్నకు సాయంగా వ్యవసాయం చేస్తున్నా.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ప్రజలందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అవినీతిపై గ్రామాలకు వెళ్లి ప్రజలకు వివరించాలని చెప్పారు.
గజగజలాడే చలిలో నిర్వహించిన ఈ చర్చకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర రాజధాని నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న పల్లెలో నిర్వహించిన ఈ చర్చా వేదిక ప్రజా చైతన్యానికి కరదీపికలా కనిపించింది. సమస్యలపై తమకున్న అవగాహనను యువతీ యువకులు కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. ప్రజల దుస్థితికి, ఈ అవినీతికి కారణం కాంగ్రెస్, వైఎస్సేనని గళమెత్తారు. చర్చ ఇలా సాగింది..
శ్రీనాథ్గౌడ్: వైఎస్ కుటుంబం కొడుకు, కూతురు, తల్లి తేడా లేకుండా దోచుకున్నారు. అవినీతి డబ్బుతో సాక్షి పేపర్, టీవీ పెట్టారు. ఇప్పుడు రోజుకో ఎమ్మెల్యేని కొంటున్నారు. ఎన్నికల్లో ప్రజలను కొనాలనుకుంటున్నారు. వారి సంగతి మేము చూసుకుంటాం. యువకులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎదగాలి.
మరో యువకుడు: మీరుండగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. దేశంలోనే మనం ముందుండేవాళ్లం. ఒకప్పుడు గుజరాత్ కంటే ముందున్న మనం కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలన వల్ల 20 - 30 ఏళ్లు వెనక్కి పోయాం. టీడీపీ అధికారంలోకి వచ్చిననాడే అసలైన దీపావళి.
మరో యువకుడు: సార్ నేను పెన్నార్ కంపెనీలో పనిచేస్తున్నా. రెండు గంటలు కరెంట్ ఉంటే 8 గంటలు జనరేటర్ మీద పనిచేస్తున్నాం. గతంలో నెలకు నాలుగు లక్షల కరెంట్ బిల్లు అయ్యేది.. ఇపుడు నెలకు రూ.40లక్షలు జనరేటర్ ఖర్చవుతోంది.
చంద్రబాబు: దీనికి ఎవరు కారణం తమ్ముళ్లూ..?
జనం: వైఎస్, కాంగ్రెస్సే
ఓ ఇంజనీర్: నేను ఇంజనీర్ను. కరెంట్ కష్టాల వల్ల ఇంజనీర్లు, పాలిటెక్నిక్, ఐటీఐ వాళ్లు, కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్నా లేబర్తో పాటే రోజు వారీ రూ. 300 కూలీకే పనిచేస్తున్నాం.
శ్రీకాంత్రెడ్డి: సార్ మాకు ఇల్లు లేదు. ఏ ఆఫీసుకు వెళ్లినా మీరు రెడ్డిలు ఇల్లు ఎలా వస్తుంది? ఐదువేలు లంచం ఇస్తే ఇల్లు మంజూరు చేస్తామంటున్నారు. కరెంట్ ఫ్యూజు పోతే బీరు, బిర్యానీ తినిపిస్తేనే వేస్తున్నారు. సింగాపూర్లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణంలో మీ భూములు పోతున్నాయని కాంగ్రెస్వాళ్లు భయపెట్టి వాటిని ల్యాంకో రాజగోపాల్కు లక్ష, రెండు లక్షలకు అమ్మించారు. తీరా ఈ భూములు కొనుగోలు చేసి వీటి పక్కనుంచి రోడ్డు వేశారు. ఇపుడు వీటి ధర రూ. 30లక్షలు. మోసం చేసి భూములు కొల్లగొట్టారు.
రాము: నేను ఎంఏ చదువుకుంటున్నా.. ఏ ఉద్యోగానికి వెళ్లినా లంచం అడుగుతున్నారు. ఇచ్చే స్థోమత లేక మా నాన్నకు సాయంగా వ్యవసాయం చేస్తున్నా.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ప్రజలందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అవినీతిపై గ్రామాలకు వెళ్లి ప్రజలకు వివరించాలని చెప్పారు.
పాదయాత్రలో బాబు కొత్త ఒరవడి,అవినీతిపై యువగళం
Subscribe to:
Posts
(
Atom
)