January 27, 2013

నేడూ విరామమే!
నేడు మరోసారి పరీక్షలు చేయాలని నిర్ణయం
అంగీకరించిన చంద్రబాబు.. ఒక్కరోజు వాయిదా
పరీక్షల తరువాత యాత్రపై
నిర్ణయం తీసుకుంటాం: ఉమా, గరికపాటి

కాలినొప్పితో తీవ్రంగా బాధపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో రోజు విశ్రాంతి అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సోమవారం కూడా ఆయనకు పరీక్షలు కొనసాగించాల్సి ఉంటుందని బృందం అభిప్రాయపడటంతో మరోరోజు పాదయాత్రను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఆ తరువాతే పాదయాత్ర కొనసాగింపు గురించి నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారమిక్కడ ప్రకటించారు.

ప్రస్తుతం పరిటాలలోని జాతీయ రహదారి పక్కన గల స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోని 'గ్రీన్‌వే'లో ఆయన బస చేశారు. ఆయనకు ప్రత్యేకించిన బస్సులో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాకేశ్, డయాబెటిక్ డాక్టర్ సురేశ్, న్యూరాలజిస్ట్ డాక్టర్ మధులిక వైద్య పరీక్షలు నిర్వహించారు. నొప్పులతో పాటు షుగర్ లెవల్స్ పెరగటంతో వారం పది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇప్పటికిప్పుడు ఆయన ఆరోగ్యానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ పాదయాత్ర వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు చెప్పారు.

కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉండడంతో పాదయాత్ర కొనసాగిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వైద్యులు హెచ్చరిస్తున్నారని, విశ్రాంతి తీసుకోవాలని కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారని చెప్పారు. అయినా, పాదయాత్రకు విరామం ప్రకటించేందుకు బాబు అంగీకరించటం లేదని గరికపాటి మోహనరావు, దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజల కోసం శక్తి ఉన్నంత వరకు పాదయాత్ర కొనసాగించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారన్నారు. సోమవారం వరకు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్టు పేర్కొన్నారు.

బాబుకు ప్రత్యేక వైద్యబృందం పరీక్షలు


లలా సందడిగా ఉండే చంద్రబాబు పాదయాత్ర శిబిరం ఆదివారం బోసిపోతూ కనిపించింది. శిబిరం వద్దకు ఎవరూ రావద్దని చంద్రబాబు ఆదేశించటంతో నాయకులు గాని, పార్టీ కార్యకర్తలు గాని శిబిరం వైపు తొంగి చూడలేదు. బాబు కూడా రోజంతా బస్సులోనే గడిపారు. శిబిరం బయట పోలీసులు, లోపల మీడియా హడావుడి తప్పితే అంతటా నిశబ్ద వాతావరణం నెలకొన్నది. వస్తున్నా మీకోసం అంటూ అక్టోబర్ రెండు నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 117వ రోజుకు జిల్లాలో కంచికచర్ల మండలం పరిటాల చేరుకున్న సంగతి విదితమే. ఎడమ కాలు చిటికెన వేలు పుండు మానకపోవటం, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, గొంతు నొప్పితో బాధపడుతున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల ఒత్తిడి మేరకు ఆదివారం పాదయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించి, ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జాతీయ రహదారి పక్కన గ్రీన్‌వేలో శనివారం రాత్రి బస చేశారు.

బోసిపోయిన శిబిరం ఒక యజ్ఞంలా సాగుతున్న పాదయాత్రలో ప్రారంభం నుంచి ఐదు వందల మంది పాల్గొంటున్నారు. మొత్తం 25కు పైగా వాహనాలు ఉంటున్నాయి. సాధారణంగా రాత్రి బస చేసే శిబిరం వద్ద తెల్లారి పాదయాత్ర మొదలు పెట్టే వరకు చంద్రబాబును కలిసేందుకు వచ్చే పార్టీ నాయకులు, చూసేందుకు వచ్చే కార్యకర్తలతో కోలాహలంగా ఉంటుం ది. అలాంటిది గ్రీన్‌వేలో ఏర్పాటు చేసిన శిబిరం ఆదివారం ఉదయం బోసిపోతూ కనిపించింది. ఏ మా త్రం సందడి లేదు. అక్కడి వాతావరణం నిశబ్దంగా ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, స్థానిక విలేకరులు, పోలీసులు తప్పితే పార్టీ నాయకులు గాని, ఇతరులు గాని శిబిరంలోకి అడుగుపెట్టలేదు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యక్ష ప్రసారాలకు మాట్లాడేందుకు కూడా ఎవరూ దొరకలేదు.

పార్టీ నాయకులు ఎవరూ రావద్దని చంద్రబాబు ఆదేశించటంతో ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాలేదు. ఇక బాబు కూడా బస్సులో నుంచి బయటకు రాలేదు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఉన్నారు. దీనికితోడు చంద్రబాబును చూసేందుకు కంచికచర్ల, పరిటాలకు చెందిన పలువురు కార్యకర్తలు వచ్చినప్పటికీ పోలీసులు శిబిరంలోకి అనుమతించ లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా రత్నం శిబిరం వద్దకు వచ్చినప్పటికీ చంద్రబాబును కలవలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు ఒక్కరే చంద్రబాబును కల్సి మాట్లాడారు.

బస్సులోనే వైద్య పరీక్షలు హైదరాబాదు నుంచి వచ్చిన వైద్యులు డాక్టర్ రాకేష్, డాక్టర్ సురేష్, డాక్టర్ ముధులిక బస్సులోనే చంద్రబాబుకు బీపీ, సుగర్, ఈసీజీ ఇతర వైద్యపరీక్షలు నిర్వహించారు. పాదయాత్ర చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని, వారం పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రజల కోసం పాదయాత్ర చేయాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించేందుకు ససేమిరా అంటున్నారు. కనీసం మూడు రోజులైనా విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

నేడూ విరామం బాబుకు సోమవారం మరి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నందున పాదయాత్రకు మరొక రోజు విరామం ప్రకటించినట్టు గరికపాటి మోహనరావు, దేవినేని ఉమా మీడియాకు వెల్లడించారు. పాదయాత్ర కొనసాగించేది, లేదా విరా మం ఇచ్చేది సోమవారం సాయంత్రం ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీంతో సోమవారం కూడా బాబు గ్రీన్‌వేలోనే బస చేయనున్నారు. చంద్రబాబును పరామర్శించేందుకు సోమవారం హరికృష్ణ గాని బాలకృష్ణ గాని వస్తారని ప్రచారం సాగుతుండగా, సాయంత్రం వరకు తమకు ఏలాంటి సమాచారం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

బోసిపోయిన శిబిరం

ఈ రెండు రోజులకు ఈ దేశంలో ఒక ప్రత్యేకత ఉంది. కుల మతాలు, జాతి వర్ణాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ పవిత్రంగా భావించే రోజులివి. అందుకే ఈ రెండు రోజులను దృష్టిలో పెట్టుకొని 117 రోజులపాటు ప్రజల్లో మమేకం కావాలని, వాళ్ల కష్టాల్లో పాలుపంచుకోవాలని నేనీ పాదయాత్ర ప్రారంభించాను. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలన చూశాక ఈ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని కాపాడుకోవాల్సిన తరుణం ఇదేనని అడుగు ముందుకేశాను. ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చింది. అయితే, అది రాజకీయ స్వాతంత్య్రమే. పేదలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇంకా రాలేదనే విషయం పాదయాత్రలో మరోసారి అర్థమయింది.

ఇప్పటికి కొన్ని వందల గ్రామాలు తిరిగాను. కొన్ని లక్షలమంది గుండెచప్పుళ్లు విన్నాను. ఎవరినీ కదిలించినా కష్టాలూకన్నీళ్లే. ఎవరి జీవితాలు చూసినా అధఃపాతాళాల్లోనే. రాష్ట్రంలో అసలేమి జరుగుతుందో తెలియనివారు కొందరు.. తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయతలో మరికొందరు ఉన్నారనిపించింది. వారంతా చేయూత కోసం కళ్లలో వత్తులు వేసుకొని చూడటం గమనించాను. రైతులు, మహిళల నుంచి యువత, ఉద్యోగుల దాకా, ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. ప్రశాంతంగా లేదు. కులవృత్తులు, చేతివృత్తులు చితికిపోయాయి.

ఎవరిని కదిలించినా కన్నీళ్లే తప్ప ముఖంలో కళ లేదు. దీన్నంతా చూసిన తరువాతే 30 ఏళ్లు ప్రజల ఆదరణ పొందిన ఒక సీనియర్ నేతగా వాళ్లకు అండగా నిలవాల్సిన బాధ్యత నాపై ఉందనిపించింది. ఈ క్రమంలో ఎన్ని కష్టనష్టాలొచ్చినా నడక ఆపొద్దని ఆనాడే నిశ్చయించుకున్నాను. కాలి చిటికెనవేలు నుంచి గొంతు సమస్య వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలకు దగ్గరగా ఉండాలనేదే నా సంకల్పం. ఇన్నాళ్లు తిరిగిన తరువాత ప్రజల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రతి పల్లెని, పట్టణాన్ని పాఠశాలగా భావించాను. ఇకముందూ ఈ అభ్యాసం, అధ్యయనం కొనసాగుతాయి. అది ఎంతవరకు అనేది కాలమే చెప్పాలి.

అడుగు మునుముందుకే..