July 25, 2013



- పంచాయతీలో ఫలించని సిఎం కిరణ్‌ వ్యూహం!
- 'సైకిల్‌' దూకుడు
రాష్ట్రంలో తొలి విడత పంచాయతి ఎన్నికల్లో అధికార పార్టీ బోల్తా పడినట్లుగా స్పష్టమైంది. మంగళవారం అర్ధరాత్రి వరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి 1890 సర్పంచ్‌ స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీకి 1670, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 1260, తెలంగాణ రాష్ట్ర సమితికి 453 సర్పంచ్‌ పదవులు లభించాయి.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పంచాయతి ఎన్నికలకు వేసిన వ్యూహం బెడిసికొట్టింది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ పదవుల్లో అధికార పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయని సంబరపడినప్పటికీ, ప్రజా క్షేత్రంలో మాత్రం అందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓటింగ్‌ పద్ధతిలో జరిగిన పంచాయతి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన స్థానాల కంటే అత్యధికంగా రావడంతో పార్టీ వర్గాలు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

బోల్తాపడిన కాంగ్రెస్‌

రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగింఒది. ఏకగ్రీవాలు మినహా మంగళవారం జరిగిన తొలి విడత ఎన్నికల్లో 1944 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్‌ మద్దతుదారులు1,686, వైకాపా మద్దతుదారులు 1297, టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 456, వామపక్షాల మద్దతుదారులు 64 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. తొలివిడతలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో టీడీపీ సత్తా చాటింది. కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు, నెల్లూరు, నల్గొండ, విజయనగరం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో ఆదిక్యం కనబర్చింది. కడప, విశాఖ జిల్లాల్లో వైకాపా మద్దతుదారులు పైచేయి సాధించారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ముందంజ

సైకిల్ స్పీడ్

రాష్ర్టంలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆనందర వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దాదాపు రెండు వేల పంచాయతీల్లో సైకిల్ హవా కొనసాగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కు, టిడిపికి పెద్దగా తేడా లేకుండా రెండు పార్టీలు సమా నంగానే పంచాయతీలను పంచుకోవడంతో టిడిపి గ్రామ స్థాయిలో ఇంకా పట్టు కోల్పేలేదన్న భావన ఆ ఆ పార్టీకి ఎంతో ఉత్సాహానిస్తోంది. పార్టీ నేతలు కొందరు టిడిపి పని అయిపోయినట్టేనని భావించి టిఆర్‌ఎస్, వైకాపాలలోకి మారుతున్నా పార్టీ అధినేత అవేమీ పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తుండడంతోపాటు గ్రామాల్లో జనం వద్దేక వెళ్ళి తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ర్ట వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం పార్టీని గ్రామస్థాయిలో మరోసారి విజయావకాశావైపు మరల్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభావం బలంగా ఉంటుం దని భావించి ఆ పార్టీ నేతలు ఇటీవల వరసగా టిఆర్‌ఎస్‌లో చేరుతున్న తరుణంలో తెలంగాణలో రెండు జిల్లాల్లో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టిడిపి తన ప్రతాపాన్ని చూపడంతో టిఆర్‌ఎస్ వెవెలబోయిం ది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా హరీశ్వర్‌రెడ్డి, ఆదిలా బాద్ జిల్లా వేణుగోపాలాచారిలు ఇటీవలే టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరారు. అదే విధంగా వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, కరీంనగర్ జిల్లా గంగుల కరుణాకర్, నిజామబాద్ జిల్లా గంప గోవర్ధన్ తదిత రులు టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరినా పార్టీ గ్రామస్థాయి క్యాడర్ పార్టీని వీడిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేతెల్లం చేశాయి. 

అలాగే రాష్ర్టంలో ఇప్పటికే ఏకగ్రీవాలతో కలుపుకొని దాదాపు 2100 పంచాయతీలలో టిడిపి జెండా ఎగురవేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, రంగారెడ్డితోపాటు రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురంతోపాటు ఆంధ్రాప్రాంతానికి చెందిన గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో విజయేక తనం ఎగురవేసింది. సి.ఎం, చంద్రబాబుల సొంత జిల్లా అయిన చిత్తూరులో టిడిపి ఎక్కువ స్థానాలు గెలవడంతో బాబుకు కొత్త ఉత్సాహం వచ్చింది. అంతేకాకుండా వైకాపా చాల బలంగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కడప మినహాయిస్తే తూర్పు గోదావరి, విశాఖలలో మాత్రమే జగన్ పార్టీ బలం చూపడంతో ఆ పార్టీతో భవిష్యత్తులో పెద్దగా ప్రభావం ఉండదని టిడిపి అంచనా వేస్తోంది. మొత్తం గా గ్రామాల్లో మంచి పార్టీ క్యాడర్ ఉన్న టిడిపికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ క్యాడర్‌ను కోల్పో లేదన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంతో రాబోయే ఎన్నికలలో కూడా తాము తక్కువకాదన్న భావన ఆ పార్టీని ఎంతో ఉత్సాహంలో పడేసింది. దీంతో భవిష్యత్తు ఎన్నికలపైటిడిపికి ఆశలు ఎక్కువవయ్యాయి. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి క్యాడర్ మరింత కష్టపడి పనిచేస్తే రాబోయే అధికారం మనదేనని చంద్రబాబు అనడంతో ఆ పార్టీకి ఎంతటి బలాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరో రెండు విడతల ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విధంగా కొనసాగితే చంద్రబాబు వ్యూహాలు ఫలించినట్టేనని...పాదయాత్రకు స్పందన వచ్చినట్టుగా భావించొచ్చు...


రాష్ర్టంలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆనందర వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దాదాపు రెండు వేల పంచాయతీల్లో సైకిల్ హవా కొనసాగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కు, టిడిపికి పెద్దగా తేడా లేకుండా రెండు పార్టీలు సమా నంగానే పంచాయతీలను పంచుకోవడంతో టిడిపి గ్రామ స్థాయిలో ఇంకా పట్టు కోల్పేలేదన్న భావన ఆ ఆ పార్టీకి ఎంతో ఉత్సాహానిస్తోంది. పార్టీ నేతలు కొందరు టిడిపి పని అయిపోయినట్టేనని భావించి టిఆర్‌ఎస్, వైకాపాలలోకి మారుతున్నా పార్టీ అధినేత అవేమీ పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తుండడంతోపాటు గ్రామాల్లో జనం వద్దేక వెళ్ళి తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ర్ట వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం పార్టీని గ్రామస్థాయిలో మరోసారి విజయావకాశావైపు మరల్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభావం బలంగా ఉంటుం దని భావించి ఆ పార్టీ నేతలు ఇటీవల వరసగా టిఆర్‌ఎస్‌లో చేరుతున్న తరుణంలో తెలంగాణలో రెండు జిల్లాల్లో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టిడిపి తన ప్రతాపాన్ని చూపడంతో టిఆర్‌ఎస్ వెవెలబోయిం ది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా హరీశ్వర్‌రెడ్డి, ఆదిలా బాద్ జిల్లా వేణుగోపాలాచారిలు ఇటీవలే టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరారు. అదే విధంగా వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, కరీంనగర్ జిల్లా గంగుల కరుణాకర్, నిజామబాద్ జిల్లా గంప గోవర్ధన్ తదిత రులు టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరినా పార్టీ గ్రామస్థాయి క్యాడర్ పార్టీని వీడిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేతెల్లం చేశాయి.

అలాగే రాష్ర్టంలో ఇప్పటికే ఏకగ్రీవాలతో కలుపుకొని దాదాపు 2100 పంచాయతీలలో టిడిపి జెండా ఎగురవేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, రంగారెడ్డితోపాటు రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురంతోపాటు ఆంధ్రాప్రాంతానికి చెందిన గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో విజయేక తనం ఎగురవేసింది. సి.ఎం, చంద్రబాబుల సొంత జిల్లా అయిన చిత్తూరులో టిడిపి ఎక్కువ స్థానాలు గెలవడంతో బాబుకు కొత్త ఉత్సాహం వచ్చింది. అంతేకాకుండా వైకాపా చాల బలంగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కడప మినహాయిస్తే తూర్పు గోదావరి, విశాఖలలో మాత్రమే జగన్ పార్టీ బలం చూపడంతో ఆ పార్టీతో భవిష్యత్తులో పెద్దగా ప్రభావం ఉండదని టిడిపి అంచనా వేస్తోంది. మొత్తం గా గ్రామాల్లో మంచి పార్టీ క్యాడర్ ఉన్న టిడిపికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ క్యాడర్‌ను కోల్పో లేదన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంతో రాబోయే ఎన్నికలలో కూడా తాము తక్కువకాదన్న భావన ఆ పార్టీని ఎంతో ఉత్సాహంలో పడేసింది. దీంతో భవిష్యత్తు ఎన్నికలపైటిడిపికి ఆశలు ఎక్కువవయ్యాయి. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి క్యాడర్ మరింత కష్టపడి పనిచేస్తే రాబోయే అధికారం మనదేనని చంద్రబాబు అనడంతో ఆ పార్టీకి ఎంతటి బలాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరో రెండు విడతల ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విధంగా కొనసాగితే చంద్రబాబు వ్యూహాలు ఫలించినట్టేనని...పాదయాత్రకు స్పందన వచ్చినట్టుగా భావించొచ్చు...

సైకిల్ స్పీడ్

హైదరాబాద్‌ : తొమ్మిదేళ్ల కాంగ్రెస్‌ పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలు ఎన్నికల్లో చూపించారని టీడీపీ నేత, ఎంపీ నందమూరి హరికృష్ణ అన్నారు. స్వార్థ రాజకీయాలు చేద్దామనుకున్న పార్టీలకు ఫలితాలు చెంపపెట్టని ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో టీడీపీని గెలించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్‌ పాలనపై వ్యతిరేకత స్పష్టమైంది : హరికృష్ణ

అనంతపురం జిల్లా బెళగప్ప పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి ఎమ్మెల్యే
పయ్యావుల కేశవ్ ధర్నాకు దిగారు. అకారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకరర్తలనుపోలీసులు అరెస్టు చేస్తున్నారంటూ.. పయ్యావుల ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పయ్యావులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో.. కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లె ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి దర్నా