July 25, 2013
సైకిల్ స్పీడ్
రాష్ర్టంలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ
విజయదుందుబి మోగించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆనందర వ్యక్తం
అవుతోంది. ఇప్పటికే దాదాపు రెండు వేల పంచాయతీల్లో సైకిల్ హవా కొనసాగినట్టు
స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్కు, టిడిపికి పెద్దగా తేడా లేకుండా రెండు
పార్టీలు సమా నంగానే పంచాయతీలను పంచుకోవడంతో టిడిపి గ్రామ స్థాయిలో ఇంకా
పట్టు కోల్పేలేదన్న భావన ఆ ఆ పార్టీకి ఎంతో ఉత్సాహానిస్తోంది. పార్టీ నేతలు
కొందరు టిడిపి పని అయిపోయినట్టేనని భావించి టిఆర్ఎస్, వైకాపాలలోకి
మారుతున్నా పార్టీ అధినేత అవేమీ పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఉద్యమాలు
చేస్తుండడంతోపాటు గ్రామాల్లో జనం వద్దేక వెళ్ళి తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతో
రాష్ర్ట వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం పార్టీని గ్రామస్థాయిలో మరోసారి
విజయావకాశావైపు మరల్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభావం
బలంగా ఉంటుం దని భావించి ఆ పార్టీ నేతలు ఇటీవల వరసగా టిఆర్ఎస్లో
చేరుతున్న తరుణంలో తెలంగాణలో రెండు జిల్లాల్లో ఆదిలాబాద్, రంగారెడ్డి
జిల్లాల్లో టిడిపి తన ప్రతాపాన్ని చూపడంతో టిఆర్ఎస్
వెవెలబోయిం ది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా హరీశ్వర్రెడ్డి, ఆదిలా బాద్
జిల్లా వేణుగోపాలాచారిలు ఇటీవలే టిడిపి నుంచి టిఆర్ఎస్లో చేరారు. అదే
విధంగా వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, కరీంనగర్ జిల్లా గంగుల
కరుణాకర్, నిజామబాద్ జిల్లా గంప గోవర్ధన్ తదిత రులు టిడిపి నుంచి
టిఆర్ఎస్లో చేరినా పార్టీ గ్రామస్థాయి క్యాడర్ పార్టీని వీడిపోలేదని
పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేతెల్లం చేశాయి.
అలాగే రాష్ర్టంలో
ఇప్పటికే ఏకగ్రీవాలతో కలుపుకొని దాదాపు 2100 పంచాయతీలలో టిడిపి జెండా
ఎగురవేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, రంగారెడ్డితోపాటు రాయలసీమ జిల్లాలైన
చిత్తూరు, అనంతపురంతోపాటు ఆంధ్రాప్రాంతానికి చెందిన గుంటూరు, ప్రకాశం,
కృష్ణా, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో విజయేక తనం ఎగురవేసింది.
సి.ఎం, చంద్రబాబుల సొంత జిల్లా అయిన చిత్తూరులో టిడిపి ఎక్కువ స్థానాలు
గెలవడంతో బాబుకు కొత్త ఉత్సాహం వచ్చింది. అంతేకాకుండా వైకాపా చాల బలంగా
ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కడప మినహాయిస్తే తూర్పు గోదావరి,
విశాఖలలో మాత్రమే జగన్ పార్టీ బలం చూపడంతో ఆ పార్టీతో భవిష్యత్తులో పెద్దగా
ప్రభావం ఉండదని టిడిపి అంచనా వేస్తోంది. మొత్తం గా గ్రామాల్లో మంచి పార్టీ
క్యాడర్ ఉన్న టిడిపికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ క్యాడర్ను కోల్పో
లేదన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంతో రాబోయే ఎన్నికలలో కూడా తాము
తక్కువకాదన్న భావన ఆ పార్టీని ఎంతో ఉత్సాహంలో పడేసింది. దీంతో భవిష్యత్తు
ఎన్నికలపైటిడిపికి ఆశలు ఎక్కువవయ్యాయి. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి క్యాడర్
మరింత కష్టపడి పనిచేస్తే రాబోయే అధికారం మనదేనని చంద్రబాబు అనడంతో ఆ
పార్టీకి ఎంతటి బలాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరో రెండు విడతల
ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విధంగా కొనసాగితే చంద్రబాబు వ్యూహాలు
ఫలించినట్టేనని...పాదయాత్రకు స్పందన వచ్చినట్టుగా భావించొచ్చు...
రాష్ర్టంలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆనందర వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దాదాపు రెండు వేల పంచాయతీల్లో సైకిల్ హవా కొనసాగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్కు, టిడిపికి పెద్దగా తేడా లేకుండా రెండు పార్టీలు సమా నంగానే పంచాయతీలను పంచుకోవడంతో టిడిపి గ్రామ స్థాయిలో ఇంకా పట్టు కోల్పేలేదన్న భావన ఆ ఆ పార్టీకి ఎంతో ఉత్సాహానిస్తోంది. పార్టీ నేతలు కొందరు టిడిపి పని అయిపోయినట్టేనని భావించి టిఆర్ఎస్, వైకాపాలలోకి మారుతున్నా పార్టీ అధినేత అవేమీ పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తుండడంతోపాటు గ్రామాల్లో జనం వద్దేక వెళ్ళి తేల్చుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ర్ట వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం పార్టీని గ్రామస్థాయిలో మరోసారి విజయావకాశావైపు మరల్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభావం బలంగా ఉంటుం దని భావించి ఆ పార్టీ నేతలు ఇటీవల వరసగా టిఆర్ఎస్లో చేరుతున్న తరుణంలో తెలంగాణలో రెండు జిల్లాల్లో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టిడిపి తన ప్రతాపాన్ని చూపడంతో టిఆర్ఎస్ వెవెలబోయిం ది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా హరీశ్వర్రెడ్డి, ఆదిలా బాద్ జిల్లా వేణుగోపాలాచారిలు ఇటీవలే టిడిపి నుంచి టిఆర్ఎస్లో చేరారు. అదే విధంగా వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, కరీంనగర్ జిల్లా గంగుల కరుణాకర్, నిజామబాద్ జిల్లా గంప గోవర్ధన్ తదిత రులు టిడిపి నుంచి టిఆర్ఎస్లో చేరినా పార్టీ గ్రామస్థాయి క్యాడర్ పార్టీని వీడిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేతెల్లం చేశాయి.
అలాగే రాష్ర్టంలో ఇప్పటికే ఏకగ్రీవాలతో కలుపుకొని దాదాపు 2100 పంచాయతీలలో టిడిపి జెండా ఎగురవేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, రంగారెడ్డితోపాటు రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురంతోపాటు ఆంధ్రాప్రాంతానికి చెందిన గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో విజయేక తనం ఎగురవేసింది. సి.ఎం, చంద్రబాబుల సొంత జిల్లా అయిన చిత్తూరులో టిడిపి ఎక్కువ స్థానాలు గెలవడంతో బాబుకు కొత్త ఉత్సాహం వచ్చింది. అంతేకాకుండా వైకాపా చాల బలంగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కడప మినహాయిస్తే తూర్పు గోదావరి, విశాఖలలో మాత్రమే జగన్ పార్టీ బలం చూపడంతో ఆ పార్టీతో భవిష్యత్తులో పెద్దగా ప్రభావం ఉండదని టిడిపి అంచనా వేస్తోంది. మొత్తం గా గ్రామాల్లో మంచి పార్టీ క్యాడర్ ఉన్న టిడిపికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ క్యాడర్ను కోల్పో లేదన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంతో రాబోయే ఎన్నికలలో కూడా తాము తక్కువకాదన్న భావన ఆ పార్టీని ఎంతో ఉత్సాహంలో పడేసింది. దీంతో భవిష్యత్తు ఎన్నికలపైటిడిపికి ఆశలు ఎక్కువవయ్యాయి. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి క్యాడర్ మరింత కష్టపడి పనిచేస్తే రాబోయే అధికారం మనదేనని చంద్రబాబు అనడంతో ఆ పార్టీకి ఎంతటి బలాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరో రెండు విడతల ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విధంగా కొనసాగితే చంద్రబాబు వ్యూహాలు ఫలించినట్టేనని...పాదయాత్రకు స్పందన వచ్చినట్టుగా భావించొచ్చు...
Posted by
arjun
at
2:02 AM