July 25, 2013
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ముందంజ
రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో
టీడీపీ హవా కొనసాగింఒది. ఏకగ్రీవాలు మినహా మంగళవారం జరిగిన తొలి విడత
ఎన్నికల్లో 1944 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్
మద్దతుదారులు1,686, వైకాపా మద్దతుదారులు 1297, టీఆర్ఎస్ మద్దతుదారులు
456, వామపక్షాల మద్దతుదారులు 64 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. తొలివిడతలో
శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం,
అనంతపురం, చిత్తూరు, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో టీడీపీ సత్తా
చాటింది. కాంగ్రెస్ పార్టీ కర్నూలు, నెల్లూరు, నల్గొండ, విజయనగరం,
కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్లలో ఆదిక్యం కనబర్చింది. కడప, విశాఖ
జిల్లాల్లో వైకాపా మద్దతుదారులు పైచేయి సాధించారు.
Posted by
arjun
at
2:18 AM