హైదరాబాద్
: తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలు ఎన్నికల్లో
చూపించారని టీడీపీ నేత, ఎంపీ నందమూరి హరికృష్ణ అన్నారు. స్వార్థ రాజకీయాలు
చేద్దామనుకున్న పార్టీలకు ఫలితాలు చెంపపెట్టని ఆయన వ్యాఖ్యానించారు.
పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో టీడీపీని గెలించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు
తెలిపారు.