July 14, 2013

-టెలికాన్ఫన్స్‌లో నేతలకు బాబు సూచన
పంచాయతీరాజ్ ఎన్నికల నామినేషన్లకు శనివారం ఆఖరి రోజు కావడంతో చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ నాయకులకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో శనివారం ఆయన టెలికాన్ఫన్స్‌లో మాట్లాడారు. పార్టీలకతీతంగా జరుగుతున్న ఎన్నికలైనప్పటికీ టీడీపీని బలపరిచే వారు ఒకరిపై ఒకరు పోటీకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో టీడీపీ బలపరిచే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత నియోజకవర్గాల ఇన్‌చార్జీలదేనని, పనితీరు సరిగ్గా లేని ఇన్‌చార్జీలను ఎన్నికల తరువాత మారుస్తానని బాబు హెచ్చరించినట్లు సమాచారం. గోద్రా అల్లర్లలోఅనేక మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనను ‘కుక్క పిల్ల కారుకింద పడి చనిపోవడం’ కింద జమకట్టడాన్ని గుజరాత్ సీఎం నరేంవూదమోడీ వ్యాఖ్యల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటనలో ఖండించారు.

‘పంచాయతీ’లో జాగ్రత్తగా వ్యవహరించండి