May 15, 2013

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ బహిషృత నేత రఘునందన్‌రావు తనను కలవలేదని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు తెలిపారు. తాను టీఆర్‌ఎస్‌ నేతల్లా రహస్యంగా కలవనని ఆయన చెప్పారు. ఎవరితోనైనా బహిరంగంగానే సమావేశమవుతానని ఆయన తెలిపారు. తాము గేట్లు తీయలేదన్నారు. తలుపులు మాత్రమే తీసినట్టు ఆయన వెల్లడించారు. టీడీపీ బలంగా ఉండబట్టే తమను టార్గెట్‌ చేస్తున్నారని ఆయన విమర్శించారు. పదవులు ఇచ్చినప్పుడు 30 ఏళ్లు శ్రీహరికి పరిశుద్ధంగా కనిపించిన తాను పదవులు ఇవ్వకపోతే చెడ్డవాడినయ్యానా అని ఆయన ప్రశ్నించారు. తనపై విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు ఆయన చెప్పారు.

మేము పార్టీలోకి గేట్లు తీయలేదు.. తలుపులు మాత్రమే తీశాము