November 30, 2012


'మీకోసం వస్తున్నా' పాదయాత్ర మొత్తం 117 రోజులు! నేటికి దాదాపు సగం రోజులు పూర్తయ్యాయి! ఈ రెండు నెలల్లో ఎన్నో అనుభవాలు! ఎందరివో కష్టాలను కళ్లారా చూశాను. యాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచి నేను కూడా వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నా. అనంతపురంలోనే మడమ దగ్గర సమస్య! గద్వాలలో వేదిక కూలి ఇబ్బంది! ఎడమ కాలి చిటికెన వేలు సలిపేస్తోంది. ఇటీవలే షుగర్ కూడా వచ్చింది. ఇబ్బందిగానే ఉన్నా ప్రజలతో మమేకమవుతూ వాటిని మర్చిపోతున్నా!

నేను కూడా చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థానానికి వచ్చాను. క్రమశిక్షణను, కష్టాన్నే నమ్ముకున్నాను. ప్రజాసేవలో ఉన్నప్పుడు పది మందికీ ఆదర్శంగా ఉండాలని అనుకుంటాను. ఏదైనా అనుకుంటే దానిని సాధించే వరకు పోరాడే తత్వం నాది. ఇప్పుడు కూడా రకరకాల ప్రలోభాలు, విమర్శలూ వస్తున్నాయి. వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నా!!

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా! తొమ్మిదేళ్లుగా ప్రతిపక్ష నేతను! పదేళ్ల తర్వాత కూడా ప్రజలు నా పాలనను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో రోడ్లు బాగున్నాయి. విద్యుత్తు సరఫరా బాగుండేది. వరుస కరువుల్లోనూ మంచి పాలన అందించారని నాతోనే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టి నమ్మక ద్రోహం చేసిందని మండిపడుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, వారికి అండగా నిలవాలనే ఎంతమంది వద్దని వారించినా సొంతంగా నిర్ణయం తీసుకుని పాదయాత్రకు బయలుదేరాను. క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు! కష్టాలు.. కన్నీళ్లు! అన్నిటినీ సావధానంగా వింటూ.. నా అనుభవాన్ని జోడించి వాటిని ఎలా పరిష్కరించాలని ఆలోచన చేస్తూనే ముందుకు కదులుతున్నా!

బాబు డైరీ.. సమస్యలను పరిష్కరిస్తా!

ఎప్పుడో అప్పుడు కాంగ్రెస్‌లో కలిసేవాడే
గిరిజన మహిళ నిజాయితీ కూడా వైఎస్‌కు లేదు
కొడుకుకు లక్ష కోట్లు దోచి పెట్టాడు
నిజామాబాద్ పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు

నిజామాబాద్, నవంబర్ 30 (ఆంధ్రజ్యోతి): "కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు. చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా పుట్టెడు మాటలు చెబుతాడు. కేసీఆర్ మన వెంట ఉన్నవాడే. 6 నెలలు కుంభ కర్ణుడిలా నిద్రపోతాడు. ఒకరోజు లేచి మాటల గారడీ చేస్తాడు. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్‌లో కలిసే పార్టే. కలుపుతానని కేసీఆరే స్వయంగా చెప్పాడు'' అంటూ టీఆర్ఎస్ అధినేతపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చండ్రనిప్పులు కక్కారు. "మాయగాళ్ల మాటలు నమ్మకండి. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇకనైనా ఆలోచించండి'' అని ప్రజలను కోరారు.

నిజామాబాద్ జిల్లాలో ఒకప్పటి టీడీపీ స్థానం, ప్రస్తుతం టీఆర్ఎస్ ఇలాకా అయిన బాన్సువాడలో శుక్రవారం చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పట్టారు. అంతకుముందు పిట్లం మండలం బొల్లక్‌పల్లి గ్రామం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సమయంలో ఆయనను డ్వాక్రా మహిళలు వచ్చి కలిశారు. "డ్వాక్రా మహిళలకు నాటి విలువ ఇప్పుడు లేదు. మీరు ఊతమిచ్చి జీవితాలు నిలబెట్టారు. కానీ ఇప్పుడు పావలా వడ్డీ అని పరిహాసం చేస్తున్నార''ని భూదవ్వ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాన్సువాడ మండలం తాడ్కోల్, సోమేశ్వర్‌ల్లో కూడా మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

అనంతరం బాన్సువాడ పట్టణంలో జరిగిన సభలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బాబ్లీ ప్రాజెక్టుకు నిరసనగా తాను జైలుకు వెళ్లానని, ఆ పోరాటం సమయంలో టీఆర్ఎస్ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు."తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశాను. నాతో పాటు కుటుంబ సభ్యులందరి ఆస్తులు ప్రకటించాను. ఆ దమ్ము కేసీఆర్‌కు, జగన్‌కు ఉన్నాయా?'' అని ప్రశ్నించారు. వైఎస్ సీఎంగా ఉండగా తన కొడుకుకు లక్ష కోట్లు దోచిపెట్టాడని, ఒక మామూలు గిరిజన వృద్ధురాలికి ఉండే నిజాయితీ సైతం వైఎస్‌కు లేకుండా పోయిందని దుయ్య బట్టారు. వైఎస్ తనకొడుకును అదుపుచేసి ఉంటే నేడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఈ క ష్టాలు వచ్చి ఉండేవికావని చెప్పారు.

కేసులు ఎత్తేస్తే జగన్ పార్టీ కూడా కాంగ్రెస్‌లో కలుస్తుందన్నారు. "పార్టీల పనితీరును బట్టి ప్రజలు ఆలోచించాలి. నేను చెప్పింది వాస్తవం అయితేనే సహకరించాలి. ప్రలోభాలకు లొంగకూడదు'' అని కోరారు. తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని మరో సారి స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు 8 లక్షల కోట్లు దోచుకుతిన్నారని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు పదివేల కోట్ల ప్యాకేజీతోపాటు వంద సీట్లు ఇస్తామని చెప్పారు. గీత కార్మికులకు శాశ్వత లైసెన్సు ఇస్తామని ప్రకటించారు.

ఎస్టీల వివాహాలతో పాటు మైనార్టీ వివాహాలకు కూడా రూ.50వేల సహాయం అందిస్తామని చెప్పారు. 1.65 కోట్ల మందికి సబ్సిడీ సిలిండర్లు ఇస్తామని చెప్పారు."పల్లకీ మోయడం కాదు.. పల్లకీ ఎక్కడం నేర్చుకోవాల''ని బీసీలను కోరారు. ఎస్సీ సబ్ ప్ల్లాన్‌లో మాదిగలకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు! చెప్పిన మాట చెప్పకుండా గారడీ చేస్తాడు

గులాబీ ఇలాకాలో పసుపు పతాక

నిజామాబాద్, నవంబర్ 30 (ఆంధ్రజ్యోతి) : టీఆర్ఎస్ ఇలాకాలో శుక్రవారం బాబుకు బ్రహ్మరథం పట్టారు. ఆయన పాదయాత్రకూ, సభలకూ జనం నుంచి అనూహ్య స్పందన వెల్లివిరిసింది. వేల సంఖ్యలో గిరిజన మహిళలు చంద్రబాబు వెంట నడిచారు. అన్ని వర్గాల ప్రజలు కూడా బాబుకు మద్దతు ప్రకటించడం కనిపించింది. అనేక చోట్ల ప్రజలు కూడా తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకొన్నారు.

చంద్రబాబు ప్రసంగానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా రుణ మాఫీ చేస్తామనే హామీ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. యాత్ర ఆసాంతం బీసీలు దన్నుగా నిలిచారు. బాబు చెప్పిన ప్రతీ మాటను చప్పట్లతో స్వాగతించారు. ఈ క్రమంలో ఎక్కడా చిన్న నిరసన స్వరం సైతం వినిపించకపోవడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది.

వాస్తవానికి 2009ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీయే గెలుచుకుంది. తెలంగాణ వాదం నేపథ్యంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి 2011, అక్టోబర్‌లో టీఆర్ఎస్‌లో చేరి.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గెలిచారు. స్థానిక వ్యతిరేకత కారణంగా ఆసమయంలో టీడీపీ తన అభ్యర్థిని కూడా పెట్టలేకపోయింది. పార్టీ ఎమ్మెల్యేలు కనీసం నియోజకవర్గంలో పర్యటించలేకపోయారు.

కాగా, చంద్రబాబు పాదయాత్రను అడ్డుకొనే విషయమై స్థానిక ఎమ్మెల్యే పోచారం పెద్ద ఆసక్తి చూపలేదని సమాచారం. చంద్రబాబు కూడా పోచారంపై విమర్శలు చేయకపోవడం ఒక విశేషమైతే.. కేసీఆర్‌పై మరింతగా చెలరేగి చంద్రబాబు విమర్శలు చేయడం మరో విశేషం.

బాన్సువాడలో చంద్రబాబుకు బ్రహ్మరథం


60వ రోజు శుక్రవారం పాదయాత్ర పోటోలు.. 30.11.2012


60వ రోజు శుక్రవారం పాదయాత్ర పోటోలు..(eenadu) 30.11.2012

November 29, 2012

శ్రమ + ప్రతిభ = విజయం! కానీ, కష్టపడే ప్రతిభావంతులందరూ విజయం సాధించ లేకపోతున్నారు! ఇందుకు కారణం.. వారికి అవకాశాలు కల్పించకపోవడమే! సరైన దారిలో వారిని నడిపించకపోవడమే! కాయ తొడిమను గురి చూసి కొట్టగల విలుకాళ్లు మన తండాల్లో ఎందరో!? సరైన శిక్షణ ఇస్తే వారంతా ఒలింపిక్స్ హీరోలే! కానీ, ఆ చొరవ ఏదీ!? ఈ రోజంతా నా పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలోని లంబాడా తండాల్లోనే సాగింది. వారంతా కష్టజీవులు! నిజాయతీపరులు! వారిలో చాలామందికి సెంటు భూమి కూడా లేదు! సొంత ఇల్లు లేదు! ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు! ప్రతి తండాలోనూ సంప్రదాయ ఆలయాలున్నాయి. భక్తి కూడా ఎక్కువే. నన్ను తీసుకెళ్లి పూజలు జరిపించారు కూడా!

తండాలోనే లక్కీబాయి అనే 65 ఏళ్ల మహిళను పలకరించాను. సొంతంగా పశువులు లేకపోవడంతో ఆమె వేరేవాళ్ల పశువులను కాస్తోంది. వృద్ధాశ్రమంలో చేర్పిస్తా. చక్కగా అక్కడికి వెళ్లి ఉంటావా!? అని అడిగితే ఆమె ససేమిరా వెళ్లనని చెప్పింది. నేను 'ఎందుకు?' అని అడిగినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు నన్ను ముగ్ధుడిని చేసింది. "ఊరికే తిని కూర్చుంటే అందరూ ఎగతాళి చేస్తారు. అందుకే కష్టపడి పని చేసుకుంటాను'' అని ఆమె జవాబు ఇచ్చింది. గిరిజనులు ఎంత కష్టజీవులో చెప్పేందుకు ఇదే నిదర్శనం. కేవలం వారు కష్టజీవులు మాత్రమే కాదు. గిరిజనుల్లో ప్రతిభావంతులు కూడా ఉన్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారు కూడా!

అందుకే గిరిజనులకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. వారి అభివృద్ధికి, సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రకటించాం. గిరిజన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని స్పష్టం చేశాం. కొంత చేయూత అందిస్తే వారు త్వరగా పైకి వస్తారు. మా ఎస్టీ డిక్లరేషన్ వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా!!

అడవుల్లో ఆణిముత్యాలు:చంద్రబాబు

హైదరాబాద్, నవంబర్ 29 : ఆరోగ్య సమస్యలెలా ఉన్నా పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. బాబు ఆరోగ్యంపై 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురితమైన వార్త పార్టీ వర్గాల్లో కలకలం కలిగించింది. గురువారం కొందరు నేతలు ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రకు విరామం ఇవ్వాలన్నారు. కానీ వారి సూచనను ఆయన కొట్టిపారేశారు. 'ఆరు నూరైనా పాదయాత్ర ఆపేది లేదు. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత వెనకడుగు ఉండకూడదు. బయట తిరిగేటప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. తట్టుకోవాలి. పాదయాత్రను జనవరి 26తో ముగించాలనుకొన్నాం.

కానీ అప్పటికి అనుకున్న చోటుకు (ఇచ్ఛాపురం) చేరడం సాధ్యమయ్యేలా లేదు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత కూడా పాదయాత్ర కొనసాగుతుంది. దానికి సిద్ధంగా ఉన్నాను' అని ఆయన వారితో చెప్పారు. ఇప్పుడు చేస్తోంది మొదటి విడత పాదయాత్ర మాత్రమేనని, దీని కొనసాగింపూ ఉండవచ్చని సూచనప్రాయంగా చెప్పారు. మరోపక్క వైద్యులు ఆయన ఆరోగ్య స్ధితిని పరిశీలిస్తున్నారు. గురువారం షుగర్ సాధారణ స్థితికి వచ్చినట్లు తెలిసింది. కాళ్లనొప్పులు తగ్గినా కాలి చిటికిన వేలు సమస్య మాత్రం చంద్రబాబును బాధిస్తూనే ఉంది. ప్రత్యేకసాక్సు వేసుకోవాలని వైద్యులు సూచించారు

యాత్ర ఆగదు అవసరమైతే.. జనవరి 26 తరువాతా నడుస్తా

తండాలకు ఎన్టీఆర్ సుజల జలం
గిరిజన విద్యార్థులకు ప్రత్యేక డీఎస్సీ
నిజామాబాద్‌లో రెండో రోజు చంద్రబాబు పాదయాత్ర
బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బధ్యానాయక్

నిజామాబాద్, నవంబర్ 29 : అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దేశంలో మరికొంత కాలం రిజర్వేషన్లు అవసరమని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం పిట్లం మండలం బ్రహ్మంగారి దేవాలయం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కాలికి గాయం కావడంతో రోజు మీద గంటన్నర ఆలస్యంగా మధ్యాహ్నం 12:30కు నడక ప్రారంభించారు.

అనంతరం సమీపంలో ఉన్న విద్యార్థులతో ముచ్చటించారు. టీచర్ అవతారం ఎత్తి 40 నిమిషాల పాటు విద్యార్థులను ఉత్సాహపరిచారు. విద్యార్థుల ప్రశ్నలకు హుషారుగా సమాధానమిచ్చారు. అమెరికా విద్యార్థుల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోని మన విద్యార్థులే మిన్న అని ప్రశంసించారు. అనంతరం జనాలను కలుసుకుంటూ నడక సాగించారు. ఈ క్రమంలో వికలాంగులను కలుసుకున్నారు. వారిలో ఒకరికి రూ.2వేలు సాయం చేశారు.

నాగంపల్లి రోడ్డును పరిశీలించి, తర్వాత గిరిజనుల ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రతిచోటా సంప్రదాయ నృత్యాలతో ఆయనకు గిరిజనులు నీరాజనం పట్టారు. "రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గిరిజనులు అధికంగా ఉన్నారు. ఆయా జిల్లాల్లో 15-20శాతం వరకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. 'టెట్'తో సంబంధం లేకుండా గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. గిరిజనుల ఆరాధ్య దైవాలు జగదాంబ, సేవాలాల్ ఆలయాల్లో పూజారులకు ఐదు వేల వరకు జీతాలు అందిస్తాం.

ఎన్టీఆర్ సుజల పథకం కింద తండాలకు శుద్ధ తాగునీటిని సరఫరా చేస్తాం'' అని హామీ ఇచ్చారు. తర్వాత వృద్ధులు, రైతులు, మహిళలు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల అప్పులను, బెల్టుషాపులనూ రద్దు చేస్తామని చెప్పారు. దారిలో పశువులు కాస్తున్న ఓ మహిళకు రూ.2వేల ఆర్థిక సహాయం అందించారు. ఆవులను ఇప్పిస్తే పని చేసుకుంటావా? అని చంద్రబాబు ప్రశ్నించగా, ఆమె సంతోషంగా ఆయనకు పాదాభివందనం చేశారు. అర్సిబాయి, కీరాబాయి అనే రైతు కూలీలను ఆయన పలకరించారు.

కేస్రీబాయి అనే వృద్ధురాలిని ఆరోగ్యపరిస్థితులు ఆరా తీశారు. మూడు కిలోమీటర్ల అనంతరం గుడితండా సమీపంలో బాబు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. గంట తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. దేశంలో ఆర్థిక సమానత్వం, సమాన అవకాశాలు లేని పరిస్థితుల్లో రిజర్వేషన్లను మరికొంతకాలం కొనసాగించాల్సి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు లేకపోతే పేదలు పేదలుగానే మిగిలిపోతారని వివరించారు. ఎఫ్‌డీఐల వల్ల 4కోట్ల ఉద్యోగులకు ఎసరు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.

బధ్యానాయక్‌కు బాన్సువాడ సీటు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థిగా బధ్యానాయక్ పేరును చంద్రబాబు ప్రకటించారు. పిట్లం మండలం గౌరారం తండాలో గురువారం రాత్రి ఆయన బధ్యానాయక్ పేరును ఖరారుచేశారు. బాన్సువాడ సెగ్మెంట్‌లో గిరిజనుల ఓటు బ్యాంకు కీలకం కావడంతో బధ్యానాయక్‌ను ఎంపిక చేశారు.

పట్టుబట్టి వచ్చిన మూగబాలుడు
బాన్సువాడ: 15 ఏళ్ల వయసు. ఇంట్లో గొడవ చేసి సినిమాలకు పోయే వయసు. సాయితేజ కూడా ఇంట్లో అలిగాడు. ముద్ద ముట్టకుండా భీష్మించాడు. కానీ, సినిమా కోసం కాదు.. చంద్రబాబును చూసేందుకు. పుట్టుమూగ అయిన ఈ బాలుడు పాదయాత్రలో పాల్గొనాలని, చంద్రబాబును దగ్గరనుంచి చూడాలని ఆశపడ్డాడు. ఇంట్లో చెబితే ఎవరూ పట్టించుకోలేదు. వారిని ఒప్పించేందుకు మూడు రోజులు పస్తు ఉన్నాడు. చేసేది లేక ఆయన మేనమామ సాయితేజను వెంటబెట్టుకొని వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు.

అగ్రవర్ణ పేదలకూ కోటా! మరికొంత కాలం రిజర్వేషన్లు అవసరమే

59వ రోజు గురువారం పాదయాత్ర పోటోలు.. 29.11.2012

59వ రోజు గురువారం పాదయాత్ర పోటోలు..(eenadu) 29.11.2012

58వ రోజు బుదవారం పాదయాత్ర పోటోలు..(andhrajyothi) 28.11.2012

November 28, 2012

నిజామాబాద్ చేరిన పాదయాత్ర

సంగారెడ్డి, నిజామాబాద్, నవంబర్ 28 : అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలు నమ్మితే మోసపోతారని టీడీపీ అ«ధినేత చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తెలుగుదేశమే అని... ఈ విషయంలో చర్చకు రావాలని టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు సవాల్ విసిరారు. చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం పాదయాత్ర' బుధవారం మెదక్ జిల్లాలో ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో అడుగుపెట్టింది. మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని కృష్ణాపూర్ గ్రామంలో బాబు ప్రసంగిస్తుండగా... టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

దీంతో టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తర్వాత చంద్రబాబు తన ప్రసంగంలో కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "కేసీఆర్‌ను తామేమీ ఢిల్లీకి పిలవలేదని కేంద్ర మంత్రి వయలార్ రవి చెబుతున్నారు. తెలంగాణను అడ్డం పెట్టుకొని సొంత పనులు చేసుకోవడానికే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారా? ఢిల్లీలో రహస్యంగా ఎవరిని కలిశారు?' అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ ఏమీ చెప్పకుండా మన పరువును ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు.

పాదయాత్రలో తన మెదడు దెబ్బతిందన్న విమర్శలపై "నాతో కలిసి కేసీఆర్ వారం రోజులు నడిస్తే... అలా నడిచాక ఆయన బయటకు వస్తే చూస్తాను! అప్పుడు ఆయన కాళ్లు, తల, శరీరం ఏవీ పనిచేయవు. కేసీఆర్ కుంభకర్ణుడిలా ఆరు నెలలు పడుకుంటారు. ఆ తర్వాత ఒకరోజు నిద్రలేచి మాటల గారడీ చేస్తారు'' అంటూ మండిపడ్డారు.

అందరికీ ఉద్యోగాలు వస్తాయని, కాలు అడ్డం పెడితే నీళ్లు వస్తాయన్న కేసీఆర్... ఎన్ని వేల మంది తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ హయాంలో సైబరాబాద్, హైటెక్ సిటీని ఏర్పాటు చేసి రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించామని... 12సార్లు డీఎస్సీలు పెట్టి వేల సంఖ్యలో టీచర్ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. ఈ విషయంలో చర్చకు తాను సిద్ధమని ఆయన గుర్తు చేశారు.

అన్నీ కలిసిపోయేవే!
సామాజిక న్యాయం నినాదంతో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి ఒక్క మంత్రి పదవి ఇవ్వగానే తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కేసులు మాఫీ చేస్తే కాంగ్రెస్‌లో కలిపేందుకు పిల్ల కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఏదో ఒక రోజు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేసేందుకు కేసీఆర్ కూడా సిద్ధమని తెలిపారు. ఇలాంటి వారి మాటలు నమ్మితే అథోగతే అని ప్రజలను హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించే బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని చంద్రబాబు ప్రకటించారు.

అయితే, ఇందులో కొన్ని సవరణలు ప్రతిపాదించాలనుకుంటున్నామన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆదర్శ రైతులను తొలగిస్తామని అలీఖాన్‌పల్లి సభలో చంద్రబాబు తెలిపారు. తాము 7500ల మంది సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని రైతులకు సహాయకారులుగా నియమించగా... బెల్టు షాపులలో మందు విక్రయించే 50వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలను ఆదర్శ రైతులుగా వైఎస్ నియమించారన్నారు.

నిజామాబాద్ జిల్లా తిమ్మానగర్‌లో చంద్రబాబుకు జిల్లా టీడీపీ నేతలు, వేలాది మంది కార్యకర్తలు, రైతులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, రైతులకు 9 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ అమరవీరులకు నివాళి
తెలంగాణ అమరవీరులకు చంద్రబాబు బుధవారం నివాళులర్పించారు. కల్హేర్ మండలం ఫత్తేపూర్ చౌరస్తాలో టీడీపీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబును పక్కనే ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తీసుకెళ్లారు. అక్కడ చంద్రబాబు పూలు చల్లి నివాళులు అర్పించారు. తెలంగాణ అమరుల స్థూపం వద్ద చంద్రబాబు నివాళులు అర్పించడం ఇదే మొదటిసారి.

కేసీఆర్‌ను నమ్మితే అథోగతే! మన పరువును ఢిల్లీలో తాకట్టు పెట్టారు

58వ రోజు బుదవారం పాదయాత్ర పోటోలు.. 28.11.2012

58వ రోజు బుదవారం పాదయాత్ర పోటోలు..(eenadu) 28.11.2012

November 27, 2012

ఏం కొనేటట్టు లేదు!

ఆ గ్రామాల గుండా వస్తున్నప్పుడు పొలాల్లో పనిచేసుకునే మహిళా కూలీలంతా గుంపుగా కదలివచ్చారు. నా చుట్టూ గుమిగూడి తమ కష్టాలు ఏకరవు పెట్టారు. కూలి చేసుకుంటుంటే వచ్చిన డబ్బులతో నెల గడిచే పరిస్థితి లేదని ఆవేదన చెందారు. అదీ ఇదీ అని లేకుండా నిత్యావసరాల నుంచి కూరగాయల వరకు మండిపోతున్నాయని పెద్దశంకరంపేటలో ఎదురొచ్చిన జనం వాపోయారు. వాళ్ల ఆవేదనలో నిజం ఉందనిపించింది. ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్నవాళ్లే అగ్నిగుండంలోకి తోస్తున్నారనిపించింది.

ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల ఆదాయాన్ని, ఖర్చును సమన్వయం చేస్తూ పాలసీలు తయారుచేయాలి. కానీ ఆ ముందుచూపు లోపించింది. ఆ దెబ్బ సామాన్యుడిపై పడుతోంది. మండే ఎండలకు పక్షులు, జీవాలు రాలిపోయినట్టే మండే ధరలకు సగటు ప్రజలు కూలిపోతున్నారు.

విద్య కోసమో, వైద్యం కోసమో అప్పు చేశారంటే అనుకోవచ్చు. కారపు మెతుకులు తినేందుకు కూడా తల తాకట్టు పెట్టాల్సిన పరిస్థితికి పేదలు నెట్టేయబడుతున్నారు. చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఉప్పూ పప్పులు నిప్పుల్లా కాలుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో వాత పెడుతున్నారు. గ్యాస్ ధరలు వంటిళ్లను మండిస్తున్నాయి. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, ముందు ఆలోచన ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. వీళ్లకు ఇన్ని కష్టాలూ లేకపోయేవి.

రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ ఏటా ఏ సరుకు ఎంత ఉత్పత్తి అవుతోంది, ఎంత వినియోగం అవుతున్నదనే అంచనా ఉండాలి. ఎగుమతులూ దిగుమతులపై కూడా కచ్చితమైన ప్రణాళికతో పనిచేయాలి. టీడీపీ హయాంలో అయితే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి ఎప్పటికప్పుడు ధరల నియంత్రణను పరిశీలించేవాడిని. దాంతో ధరలెప్పుడూ గీత దాటేవి కాదు. కానీ, ఇప్పుడు పాలించేవాళ్లలాగే ధరలూ కట్టుతప్పాయి. వాటిని కట్టడి చేయకుండా ప్రగతిబాటలో కాలు ముందుకేయడం కష్టమనిపిస్తోంది.

ఏం కొనేటట్టు లేదు! చంద్రబాబు

బాబుకు మధుమేహం
రక్తంలో పెరిగిన చక్కెర శాతం..
అలసటే కారణం: వైద్యులు
యాత్రలో ఇక షుగర్ మాత్రలు!

హైదరాబాద్, నవంబర్ 27 : పాదయాత్రలో ఉండగా మంగళవారం ఉదయం టీడీపీ అధినేతకు షుగర్ లెవల్స్ పెరిగాయి. హైదరాబాద్‌కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం చంద్రబాబును పరీక్షించింది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు మందులు వాడడం తప్పనిసరి అని నాగేశ్వర్‌రెడ్డి సూచించారు.

యోగా, ఇతర దారుఢ్య సాధనాల వల్ల చంద్రబాబు ఇప్పటి వరకు మాత్రలు వాడకుండానే షుగర్‌ను అదుపులో ఉంచుకున్నారు. అయితే ఒత్తిడి వల్ల షుగర్ స్థాయి పెరిగిందని నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. మందులు వాడడం అత్యవసరం కానప్పటికీ వయసు దృష్ట్యా వాడాలని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు.

బాబుకు మధుమేహం

కేసీఆర్‌ను మంత్రిని చేసి ఉంటే.. నేడు
నా వ్యాన్‌లో ఉండేవాడు
నాడు నా కన్నా బాగా 'దేశం' గురించి మాట్లాడేవాడు
వైఎస్ తెలంగాణను దోస్తున్నా పట్టించుకోలేదు
టీఆర్ఎస్ అధినేతపై చంద్రబాబు నిప్పులు
రాష్ట్రమంతటా ఓటేస్తేనే అధికారంలోకి వస్తా
తెలంగాణ అభివృద్ధిపై చర్చకు ఎప్పుడూ సిద్ధమే
మెదక్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు
మీరు సహకరిస్తే కాంగెస్ర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా

సంగారెడ్డి, నవంబర్ 27 : రాష్ట్రమంతటా ఓట్లు వస్తేనే టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అలా కాకుండా ఒక ప్రాంతంలో పార్టీ దెబ్బతింటే భూస్వాములు, పెత్తందార్లు అధికారంలోకి వస్తారంటూ.. తెలంగాణలో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని పరోక్షంగా పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నాడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇప్పుడు తనవెంటే వ్యాన్‌లో ఉండేవారని విమర్శించారు.

మెదక్‌జిల్లాలో పదోరోజైన మంగళవారం పెద్దశంకరంపేట, కల్హేర్ మండలాల్లో చంద్రబాబు పాదయాత్ర సాగించారు. ప్రజలను కలుసుకుంటూ, వివిధ సభల్లో మాట్లాడుతూ 15.2 కి.మీ.ల దూరం నడిచారు. టీడీపీ లాంటి పేదలపార్టీని దెబ్బతీసేందుకు ఒక ప్రాంతంలో అవినీతిపరులు, ఉద్యమం పేరిట మరో ప్రాంతంలో కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.

"నా పరిస్థితిని అర్థం చేసుకుని మీరంతా సహకరించాలి. పాదయాత్రకు సంఘీభావంగా మీరు కూడా నాతో పాటు ఒకటో రెండో కిలోమీటర్లు నడవండి. అలా మీరు సహకరిస్తే కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాను'' అని విజ్ఞప్తి చేశారు. సీఎం సీటు కోసమే చంద్రబాబు నడుస్తున్నారనే విమర్శలను తిప్పికొట్టారు "తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాను. నేను చూడని అధికారం లేదు. ఢిల్లీలో చక్రం తిప్పాను. అప్పట్లో ప్రధానమంత్రిని సైతం నేనే నిర్ణయించాను. దానివల్ల రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్రం నుంచి సాధించగలిగాను.

పల్లెటూరుగా ఉండే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టాను. సైబరాబాద్‌కు, హైటెక్ సిటీకి రూపకల్పన చేశాను'' అని చెప్పుకొచ్చారు. వాన్‌పిక్ వ్యవహారంలో సీఎం కిరణ్ దొంగలకు కాపలా కాస్తున్నారని ధ్వజమెత్తారు. సీబీఐ చార్జిషీట్‌లో ఐదో ముద్దాయిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు జైలుకెళ్లకుండా కాపాడుతున్నారన్నారు. పైగా ధర్మాన తప్పేమీ లేదని కిరణ్ నిస్సిగ్గుగా చెబుతున్నారని మండిపడ్డారు. దొంగ కంపెనీలతో విదేశాలలో సైతం ఆస్తులు కూడబెట్టినందున జగన్ కేసు దర్యాప్తునకు మరో మూడు నెలలు కావాలని కోర్టును సీబీఐ కోరిందంటే జగన్ అవినీతి తతంగం ఎలా ఉన్నదో తెలుస్తున్నదని వ్యాఖ్యానించారు.

తన రాజకీయ జీవితంలో తెలంగాణలోనే ఎక్కువ అభివృద్ధి చేశానని, కాదని ఎవరైనా అంటే నిరూపించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు, పాఠశాల, కళాశాల భవనాలు, రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని గుర్తుచేశారు. "ఉద్యమంలో ఇప్పటికే పదేళ్లు పోయింది.

ఇంకా పదేళ్లలో ఉద్యోగాలు రాకపోతే మీరు ముసలి వాళ్లవుతారు. జీవితంపై నిరాశ కలుగుతుంది'' అని యువతను ఉద్దేశించి ఆవేదనతో అన్నారు. అయితే, తెలంగాణ అంశాన్ని తేల్చడం తన చేతుల్లో లేదని చెప్పారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర, రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని దుయ్యబట్టారు. మరోవైపు కేంద్రాన్ని నిలదీయాల్సిన కేసీఆర్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ది ఇదే జిల్లా అని చెప్పారు.

టీడీపీలోనే పని చేసినప్పుడు అందరికన్నా ఎక్కువగా పార్టీని గురించి బాగా మాట్లాడేవారని చెప్పారు. వైఎస్ అవినీతి గురించి ఆయన, టీఆర్ఎస్ ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 8 వేల ఎకరాలను అమ్మితే పట్టించుకోలేదని, కూతురికి వరకట్నంగా బయ్యారం ఖనిజ సంపదను లీజుకు ఇచ్చినా, జలయజ్ఞం పేరిట ధనయజ్ఞానికి పాల్పడినా టీఆర్ఎస్ స్పందించలేదని విమర్శించారు.

కాగా, తాము అధికారంలోకి వస్తే పేదవృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేసి, మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. మైనారిటీలలో ఎక్కువగా పేదలున్నారని వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థలు, చట్టసభల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. వచ్చే ఎన్నికలలో మైనారిటీలకు పార్టీ నుంచి 15 స్థానాలలో అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు.

కేసీఆర్‌ను మంత్రిని చేసి ఉంటే.. నేడు నా వ్యాన్‌లో ఉండేవాడు:చంద్రబాబు

57వ రోజు మంగళవారం పాదయాత్ర పోటోలు.. 27.11.2012

57వ రోజు మంగళవారం పాదయాత్ర పోటోలు..(eenadu) 27.11.2012

57వ రోజు మంగళవారం పాదయాత్ర పోటోలు..(andhrajyothi)) 27.11.2012

పామర్రు, నవంబర్ 27 : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ఈ నెల 28న విడుదల చేయకపోతే చంచల్‌గూడ జైలు గోడలు బద్దలకొట్టి బయటకు తీసుకురావాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో మంగళవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ జగన్ విడుదలపై ఈనెల 28న సీబీఐ కోర్టులో బెయిల్‌పై తీర్పు వెలువడనుండగా ఉదయభాను పైవిధంగా వ్యాఖ్యానించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు.

సుప్రీం కోర్టు 2013 మార్చి వరకు జగన్ బెయిల్ పిటిషన్ వేయడానికి వీలులేదని సూచించినా సామినేని కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేయడం చట్టాన్ని అగౌరవ పర్చడమేనన్నారు. ఉదయభాను బెదిరింపులు ఎవరిపై అనేది కూడా దర్యాప్తు చేయాలన్నారు. మితిమీరిన ఆర్థిక నేరాలు చేసి జైల్‌లో ఉన్న జగన్ బృందం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోందని, ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదనే విషయం ఆపార్టీ నేతలు గమనిస్తే మంచిదన్నారు.

సామినేని వ్యాఖ్యలను బట్టి ఆయనపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని, చంచల్‌గూడ జైల్‌లో ఉన్న జగన్మోహనరెడ్డిని కలిసేవారిపై కూడా నిఘా పెట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం జగన్ వ్యవహారంపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, ఫలితంగా జగన్ జైల్‌లో నుంచే రాష్ట్రవ్యాప్తంగా తన బృందాలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ఆదేశాలిస్తున్నట్లు ఉదయభాను వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

భాను పిచ్చి ప్రేలాపనలు: ఉమా
మైలవరం, నవంబర్ 27 : జైలు గోడలు బద్దలుకొట్టి జగన్‌ను బయటకు తీసుకువస్తామని భాను చేసిన వ్యాఖ్యలు పిచ్చి ప్రేలాపనలని మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం టీడీపీ కార్యాలయంలో మంగళవారం స్థానిక విలేకర్లతో ఉమా మాట్లాడారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను జైలు గోడలు పగులగొడతామని అనడం అప్రజాస్వామికమన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జగన్‌పై సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు.

ఈ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని ఉమా డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలన్నారు. ఇలాంటి ఆరాచక శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఇలాంటివారు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తుల్ని సైతం కొల్లగొడతారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌కు సకల సదుపాయాలు అందుతున్నాయన్నారు. శాటిలైట్ ఫోన్‌తో సహా రాచ మర్యాదలు చేస్తూ తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ఆదేశాలు -వర్ల రామయ్య

అవినీతిపై పోరాటం చేసిన పార్టీ టీడీపీయే : చంద్రబాబు

మెదక్, నవంబర్ 27 : మాదిక వర్గీకరణ చేసి మీ రుణం తీర్చుకుంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇమామ్‌లకు గౌరవ వేతనం పెంచి ఆదుకంటామని అన్నారు. డీఎస్సీలో బిఈడీ అభ్యర్ధులకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ టీడీపీయేనని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించిన వస్తున్నా...మీకోసం పాదయాత్ర మంగళవారం నాటికి 53వ రోజుకు చేరుకుంది. కాగా మెదక్ జిల్లాలో పదవరోజు కొనసాగుతోంది. ఈ ఉదయం పెద్దశంకరం నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజాంపేటలో ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. జలయజ్ఞానాన్ని ధన యజ్ఞం చేస్తే టీఆర్ఎస్ మాట్లాడలేదని బాబు ఆరోపించారు.

ఆరు నెలలు పడుకోని లెచి ప్రజల మధ్యకు వచ్చి కేసీఆర్ ఏవోవే వాగ్ధానాలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాటం చేసింది ఒక్క టీడీపీయేని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు చాలా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.

అంతకు ముందు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెద్దశంకరంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆయన జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాలలోని సమస్యలను విద్యార్థులు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. కళాశాలకు మంచినీళ్లు, లైబ్రరీ ఇతర సౌకర్యాల కోసం ఎంపీ లాడ్స్ నుండి రూ.2 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా యాత్ర ప్రారంభించే ముందు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈరోజు మొత్తం 15 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది.

వర్గీకరణ చేసి మీ రుణం తీర్చుకుంటా, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్

November 26, 2012

  ఆదరణ ఏదీ..!

ఇప్పుడు నేత దుస్తులకు ఆదరణ ఎక్కడుంది!? అలా వెళ్లడం.. ఇలా రెడీమేడ్ దుస్తులు కొనుక్కు రావడం! దీంతో, నేతన్నలూ నష్టపోతున్నారు. దర్జీలకూ ఉపాధి కరువైంది!

పేదవాడి ఫ్రిజ్జు అయిన కుండకు ఆదరణ ఏదీ!? దీపావళికి ప్రతి ఇంటా మట్టి దీపాలు కళకళలాడేవి. అనారోగ్యకారకమని తెలిసినా.. ఇప్పుడన్నీ ప్లాస్టిక్ బిందెలు. రెడీమేడ్ దీపాలే! ఇళ్ల నిర్మాణంలో.. ఇంట్లో విడిచిన దుస్తులను భద్రపరచడం సహా పలు పనులకు బుట్టలు, గంపలు వాడేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ గంపలు, టబ్‌లు వచ్చేశాయి!

ప్రపంచీకరణ ఫలితంగా చేతి వృత్తులు, కుల వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటువంటి ప్రమాదాన్ని ముందుగా ఊహించే టీడీపీ హయాంలో చేతి వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు ఇచ్చి కొంతవరకు ఆదుకున్నాం. కానీ, ఈ ప్రభుత్వానికి ముందు చూపు ఏదీ!? సోమవారంనాటి పాదయాత్రలో బుట్టలు అల్లేవారు, నేతన్నలు, కుమ్మర్లు, చేతివృత్తిదారులు వచ్చి కలిశారు. తమ ఉత్పత్తులకు గిరాకీ లేకుండాపోయిందని, ఉపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం బాధ్యత కలిగినది అయితే వారికి పునరావాసం కల్పించడమో.. మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి చేయూత ఇవ్వడమో చేయాలి! కానీ, తన విధానాలతో వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో, చేతివృత్తిదారుల సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందనే దానిపై దృష్టిసారించా. చైనా అనుభవం ఆసక్తికరంగా ఉంది. చేతివృత్తిదారులు కుటీర పరిశ్రమల్లో పనిచేస్తారు. అక్కడే అన్నిటినీ తయారు చేస్తారు. వాటిని ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తారు. రాష్ట్రంలోనూ అటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని నిర్ణయించాను.

ఆదరణ ఏదీ..! చంద్రబాబు

కేసీఆర్.. నీ బిడ్డలకేనా కొలువులు?
తెలంగాణ ప్రజలకు ఉపాధి అక్కర్లేదా?
కేంద్ర మంత్రిగా ఎన్ని ఉద్యోగాలు తెచ్చావు?
చంద్రబాబు చండ్ర నిప్పులు

సంగారెడ్డి, నవంబర్ 26 : "ఆయన కొడుకు, కూతురు, అల్లుడికి ఉద్యోగాలు ఉంటే చాలు. మరెవరి ఉపాధి, ఉద్యోగంతో కేసీఆర్‌కు పని లేదు'' అంటూ గులాబీ అధిపతిపై టీడీపీ అధ్యక్షుడు నిప్పులు చెరిగారు. సూర్యాపేట వేదికగా కేసీఆర్ తనపై చేసిన ప్రతి విమర్శనూ మెదక్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు సమర్థంగా తిప్పికొట్టారు. మోకాళ్లపై నడిచినా చంద్రబాబును ఎవరూ నమ్మరన్న కేసీఆర్ వ్యాఖ్యలను.. "నీ మాటల గారడీని నమ్ముతారా'' అంటూ ధీటుగా జవాబిచ్చారు.

తన హయాంలో రిటైర్మెంట్లే గానీ రిక్రూట్‌మెంట్లు లేవన్న విమర్శపై.."కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో చెప్పా''లంటూ సూటి ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో సోమవారం నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలా లలో చంద్రబాబు పాదయాత్ర సాగించారు. నారాయణఖేడ్ నుంచి పెద్దశంకరంపేట వరకు 15.1 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ సందర్భంగా జరిగిన పలు సభల్లో టీఆర్ఎస్ మాటల పార్టీ అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు, ఆయన కొడుకు, కూతురుకు ఉద్యోగాలు ఉంటే చాలని, మీకు రాకపోయినా ఆయనకేమీ పట్టదన్నారు.

ఉద్యమంలో ఇప్పటికే పదేళ్లు నష్టపోయారని, ఒక తరం పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. "ఇంకో పదేళ్లు ఇలాగే కొనసాగితే జీవితాలపైనే ఆశ పోతుంది'' అని గుమిగూడిన యువకులను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మోకాళ్ల మీద నడిచినా ప్రజలు నమ్మరన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన మాటల గారడీని ప్రజలు నమ్మాలా అని ప్రశ్నించారు. నీతి, నిజాయతీకి కట్టుబడి ఉన్నానని, అందుకే ప్రజలసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు.

ఆర్నెల్లు కుంభకర్ణునిలా ఫాంహౌస్‌లో పడుకునే కేసీఆర్.. ఆ తర్వాత ఒక్క రోజు లేచి మాయమాటలు, రెచ్చగొట్టే మాటలతో ప్రజల బతుకులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీలు అవినీతి పార్టీలని చంద్రబాబు విమర్శించారు. సామాజిక న్యాయమన్న చిరంజీవి.. కేంద్రంలో ఒక్క పదవి రాగానే తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని మండిపడ్డారు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన పార్టీ టీడీపీయేనన్నారు.

కాగా, నారాయణఖేడ్ మండలం హన్మంతరావు పేటలో చంద్రబాబు చేనేత కార్మికులను కలుసుకొని సమస్యలపై ఆరాతీశారు. "వెయ్యి కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా బడ్జెట్ ప్రవేశపెడతాం. నూలు, రంగును సబ్సిడీ ధరపై ఇప్పిస్తాం. ఎటువంటి ష్యూరిటీ లేకుండా రూ.50 వేల వరకు రుణాలు ఇప్పిస్తాం. ప్రతి కార్మికుడికి ఇల్లు, షెడ్ నిర్మించి ఇస్తాం. బీమా సౌకర్యం కల్పిస్తాం. జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం'' అని వారికి హామీ ఇచ్చారు.

ధర్మానపై ప్రాసిక్యూషన్‌కు ఆదేశించండి.. గవర్నర్‌కు వినతి

రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని టీడీపీ అధినేత చంద్రబాబు..గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ప్రాసి క్యూషన్ అవసరం లేదన్న కేబినెట్ తీర్మానాన్ని తిర స్కరించాలని విజ్ఞప్తి చేశారు. సిగ్గులేకుండా మంత్రి ధర్మానకు సీఎం కిరణ్ అండగా నిలవడం శోచనీయమన్నారు.

ఆయనతీరు చూస్తే ఎంత దోచుకున్నా ఫరవాలేదన్నట్టు ఉన్నదని దుయ్యబట్టారు. అవినీతిపరులను రక్షించవద్దని, ఇలాంటివారిపై కఠినచర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. దోచుకున్న డబ్బును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులకో రూలు దొంగలకోరూలు ఉండరాదని, చట్టం అందరికీ ఒకటేలాగా ఉండాలని గుర్తుచేశారు.


తెలంగాణ ప్రజలకు ఉపాధి అక్కర్లేదా?చంద్రబాబు

56వ రోజు సోమవారం పాదయాత్ర పోటోలు.. 26.11.2012

56వ రోజు సోమవారం పాదయాత్ర పోటోలు..(andhrajyothi) 26.11.2012

56వ రోజు సోమవారం పాదయాత్ర పోటోలు..(eenadu) 26.11.2012

ఉపాధిహామీ పథకం కుంభకోణాల మయం
కాంగ్రెస్ హయాంలో మూడుపుటాలా తిండి లేదు
టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కారం : బాబు

మెదక్, నవంబర్ 26 : జాతీయ ఉపాధిహామీ పథకం కుంభకోణాల మయంగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఐదు వందల జనాభా ఉన్న తండాల్ని పంచాయతీలుగా గుర్తించడంతోపాటు సేవాలాల్, మహరాజ్ ఆలయాల్ని నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

'వస్తున్నా....మీకోసం' కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర మెదక్ జిల్లాలో 56వ రోజైన సోమవారం కొనసాగుతోంది. ఈ ఉదయం నారాయణఖేడ్ నుంచి వెంకట్‌రావు తండా మీదుగా యాత్ర ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ తండాలకు ఇదివరకు ప్రకటించిన తీర్మానాలను మరొక్కసారి ఈరోజు తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మానాల మొదలు, విద్యా, ఉద్యోగాలు, ఆడపిల్లల పెళ్లిల్లు అన్ని కరాల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హయాంలో మూడు పూటలా తిండి కూడా తినలేదని దుస్థితి దాపురించిందని చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ అధిరంలోకి వస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దక్కుతుందని ఆయన అన్నారు. బాబు యాత్ర హన్మంతరావుపేట, భుజరాంపల్లి శంకర్‌పేట మీదుగా పెద్ద శంకరం పేటవరకూ సాగుతుంది. బాబు వెంట పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ రోజు మొత్తం 15 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది.

ఉపాధిహామీ పథకం కుంభకోణాల మయం

November 25, 2012

55వ రోజు ఆదివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (fb) 25.11.2012

  ఆదుకోండి బాబూ..!

మనది ప్రజాస్వామ్యం! ఇక్కడ ప్రజలదే అధికారం! కానీ, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి!? కనీసం ఒక్కరంటే ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా!? అధికారం కాదు కదా.. కనీసం ప్రశాంతంగా, కనీసం ఒక్క పూటయినా కడుపు నిండా తినే పరిస్థితి ఉందా!? ప్రజలతో ఎన్నికైన ఈ ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోంది!! ఈరోజు ఉదయం గిరిజన తండాల్లో పర్యటించా. వాస్తవ పరిస్థితి చూసి కళ్లు బైర్లు కమ్మాయి. తండాల్లోని వారంతా పేద లంబాడాలు. కొండ కోనల్లో కష్టపడి నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. సొంత డబ్బులతో ఇళ్లు కట్టుకున్నారు. కానీ, ఇందిరమ్మ పథకం కింద కట్టామని చెప్పుకొని వాటికి కూడా బిల్లులు చేసుకుని కాంగ్రెస్ నాయకులు మింగేశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?

జగన్నాథ్‌పూర్‌లో అమాయక రైతులు. వారికి చదువు రాదు. వారి పొలాలను కొంతమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు కౌలుకు తీసుకున్నారు. వాటిలో గంజాయి పండిస్తున్నారు. పంట సొమ్మును వారు జేబుల్లో వేసుకుంటున్నారు. పోలీసులు వచ్చి కేసులు పెడితే అసలు రైతును బుక్ చేయిస్తున్నారు. ఏ పాపం చేయకుండానే రైతులు జైలుకు వెళ్లాల్సి వస్తోంది.

ఉపాధి హామీ పథకంలోనూ కూలీల పేరిట డబ్బులను మింగేస్తున్నారు. దారిలో కలుపు తీసుకుంటున్న ఉల్లి రైతును చూశాను. కన్నీళ్లు ఒక్కటే తక్కువ. బొల్లారం నుంచి కొంతమంది కార్మిక సోదరులు వచ్చి సంఘీభావం తెలిపారు. విద్యుత్తు కోతలతో తాము రోడ్డున పడ్డామని కన్నీరు మున్నీరయ్యారు. ప్రతి ఒక్కరూ గుండెల నిండా ఆవేదనతో చెప్పేది ఒకటే మాట.. ఆదుకోండి అని!!

ఆదుకోండి బాబూ..!

నమ్మితేనే నాతో రండి: చంద్రబాబు
సీటుపైనే సీఎం ధ్యాస
అధికారమిస్తే మీ ఇంట పెద్ద కొడుకునవుతా..
ఎన్ని కిరికిరిలు పెట్టినా రైతు రుణమాఫీ చేస్తా
చంద్రబాబు వెల్లడి
టీఆర్ఎస్‌తో పోకుంటే గెలిచేవాళ్లం
రాష్ట్రాన్ని దోచుకున్న తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్
కిరణ్‌ది రాక్షస ప్రభుత్వం
రైతుల కోసం కనీసం సమీక్షల్లేవు
మెదక్ జిల్లా పాదయాత్రలో ధ్వజం

సంగారెడ్డి, నవంబర్ 25 (ఆంధ్రజ్యోతి) : టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోకపోతే గత ఎన్నికల్లో తామే గెలిచేవారమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను చెప్పిన విషయాలపై ఆలోచించి,వాస్తవమని నమ్మితే తనకు సహకరించాలని ప్రజలను కోరారు. "తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంటికి పెద్దకొడుకులా మీ జీవితాల్లో ఆనందం నింపుతా''నని చంద్రబాబు హామీ ఇచ్చారు. మెదక్ జిల్లాలో ఎనిమిదో రోజైన ఆదివారం ఆయన మనూర్ నుంచి నారాయణఖేడ్ వరకు 9 కిలోమీటర్లు నడిచారు.

శనివారం రాత్రి మనూర్‌లో బస చేసిన చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం వరకు కొంత విరామం తీసుకున్నారు. ప్రతి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు సమయమిస్తున్నారు. అందులో భాగంగా సతీమణి భువనేశ్వరితో మధ్యాహ్నం వరకు గడిపారు. అనంతరం ఎంపీ దేవేందర్‌గౌడ్‌తో మాట్లాడి 2.30 గంటల సమయంలో నడక ప్రారంభించారు. పాదయా।త మొదట్లోనే వికలాంగులు ఎదురై సమస్యలు చెప్పుకున్నారు. అక్కడే ఉన్న వృద్దురాలు రత్నమ్మను పలకరించగా, పింఛను రావడం లేదని వాపోయింది.

మనూర్ తాండాకు వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్లు కట్టుకున్నా బిల్లులు చెల్లించడం లేదని వారు వాపోయారు. టీఎన్‌టీయుసి ఆధ్వర్యంలో జిన్నారం మండలం నుంచి సుమారు వంద మంది కార్మికులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. జగన్నాథపూర్ సమీపంలో రాణాపూర్‌కు చెందిన రైతు సంగారెడ్డిని కలవగా, పంట నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదర్శరైతుల ద్వారా కాంగ్రెస్ నాయకులే ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులను స్వాహా చేస్తున్నారని సంగారెడ్డి ఫిర్యాదు చేయగా, న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

ఈ క్రమంలో పిప్రీ గ్రామ శివారులో పోమ్యానాయక్‌కు చెందిన ఉల్లిగడ్డ పంటను చూశారు. ఈ సమయంలో కార్యకర్తలు, మీడియా కొంత హడావుడిచేయడంతో పంట కొంత దెబ్బతింది. దీనికిగాను పోమ్యానాయన్‌కు చంద్రబాబు రెండు వేల రూపాయలు పరిహారంగా ఇచ్చారు. ఈ సందర్భంగా పిప్రి, నారాయణఖేడ్‌లలో జరిగిన సభలలో చంద్రబాబు ప్రసంగించారు. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

ఆయన పార్టీతో పొత్తు వల్ల నష్టపోయామని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. సినీనటుడు చిరంజీవి.. పార్టీ పెట్టక పోయినా అధికారంలోకి వచ్చే వారమన్నారు. తెలంగాణకు ఎప్పుడూ తమ పార్టీ వ్యతిరేకం కాదని, అలాగెప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. తెలంగాణ గురించి మహానాడులో తమ వైఖరి చెప్పామని, అఖిలపక్షం పెట్టాలని కేంద్రానికి లేఖ రాశామని గుర్తుచేశారు.

దీనిపై కేంద్రం నాటకాలాడుతున్నదని విమర్శించారు. అసలు కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే బయటకు పోయేవారా? పార్టీ పెట్టేవారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సీటును కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర రాక, కరెంట్ సరఫరా కాక, విత్తనాలు, ఎరువులు దొరకక రైతులు అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం కనీస స్పందన కనబరచడం లేదన్నారు.

వ్యవసాయ ధరలపై కనీసం సమీక్షలు కూడా నిర్వహించడం లేదని విమర్శించారు. నిత్యావసర సరకుల ధరలు పెరిగి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. 30 రూపాయలకు కిలో ఉన్న మంచినూనే 110 రూపాయలైందని, ఆ స్థాయిలో ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదన్నారు. "ఇది రాక్షస ప్రభుత్వం. అవినీతి, అసమర్థ, పేదల వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక్క రోజు కూడా సాగడానికి వీల్లేదు'' అని మండిపడ్డారు.

రైతులకు రుణ మాఫీ చేస్తానంటే సీఎం కిరణ్ కిరికిరి పెడుతున్నారని విమర్శించారు. రైతులకు ఎప్పుడూ కాంగ్రెస్ వ్యతిరేకమేనన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు దొంగల్లా దోచుకుని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లుగా విడిపోయారని చెప్పారు. ఆ నాయకులు ఇలా రెండు పార్టీలుగా ఎందుకు విడిపోయారో చెప్పాలన్నారు. అక్రమంగా దోచుకున్న డబ్బులను కాపాడుకోవడానికే పిల్ల కాంగ్రెస్ ఏర్పాటయిందని పేర్కొన్నారు. బీసీలకు సామాజిక న్యాయం కల్పించేందుకే బీసీ డిక్లరేషన్ ప్రకటించామన్నారు.

నమ్మితేనే నాతో రండి: చంద్రబాబు

55వ రోజు ఆదివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (abn) 25.11.2012

55వ రోజు ఆదివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (eenadu) 25.11.2012

November 24, 2012

రైతు బాగుండొద్దా..?: చంద్రబాబు

టీడీపీ హయాంలో వరుణుడు శీతకన్నేయడం వల్ల వర్షానికి కరువొచ్చింది. కానీ.. ఎన్నడూ ఎరువుకు కరువు లేదు. పురుగు మందులకు కరువు లేదు. విత్తనాలకు కరువు లేదు. విద్యుత్తుకూ కరువు లేదు. ఇప్పట్లా చుక్కల్లో కాకుండా వాటి ధరలూ నేలమీదే ఉండేవి. పంట ఉత్పత్తుల మద్దతు ధరకూ కరువు ఉండేది కాదు! కానీ, ఇప్పుడు ఇదేం దౌర్భాగ్యం!? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని చందంగా.. విత్తనాల ధర పెంచేశారు. ఎరువులు, పురుగు మందుల ధరలను చుక్కల్లో కలిపేశారు.

విద్యుత్తు మాటే లేదు. అయినా, అసలు, కొసరు అంటూ చార్జీలతో బాదేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకూ మద్దతు ధర లేదు. ఈ ప్రభుత్వ విధానాల కారణంగానే రైతులు అప్పుల పాలయ్యారు. ఫలితంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారాన్ని చలాయించడమే కాదు.. బాధ్యతనూ తీసుకోవాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. ప్రభుత్వం తనకు ఉన్న విస్తృత అధికారాలను రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఉపయోగించాలి. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. రైతుల దుస్థితిని చూసే వారి రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ఒక్క హామీతోనే వారు గట్టెక్కుతారని కూడా భావించడం లేదు. ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలి. ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి.

ఇలాంటి ఆలోచనలను నేను చేస్తుంటే, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. వాళ్లకు వాళ్ల కుటుంబాలు బాగుంటే చాలు. వాళ్లు దోచుకుని బాగుపడితే చాలు. రైతులకు మేలు జరిగే నిర్ణయాలను భరించలేకపోతున్నారు. ఆత్మస్థైర్యం కోల్పోయిన వారిలో మరిన్ని అనుమానాలను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దారుణం!

రైతు బాగుండొద్దా..?: చంద్రబాబు

ఈ సీఎంని జైల్లో పెట్టాలి
అవినీతి మంత్రి ధర్మానను కాపాడుకున్నాడు
దొంగలను వెనకేసుకున్నాడు
జీవో మంత్రులకూ అండగా నిలుస్తున్నాడు
మెదక్ జిల్లా పాదయాత్రలో
కిరణ్‌పై బాబు నిప్పులు
ఏమి చేశారని రెండేళ్ల సంబరాలని ప్రశ్న
బ్రిటీషర్ల కన్నా వైఎస్సే ఎక్కువ దోచాడని ధ్వజం
రుణ మాఫీపై చర్చకు కాంగ్రెస్, వైసీపీలకి సవాల్
ఆ రెండు పార్టీలు వస్తే ఇళ్లపై కప్పులూ ఉండవని వ్యాఖ్య

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత మరోసారి చెలరేగి విమర్శలు చేశారు. రుణ మాఫీకి 'కిరికిరి' పెడుతున్న కిరణ్...అవినీతి మంత్రులను మాత్రం బాగా వెనకేసుకువస్తున్నారని చంద్రబాబు కన్నెర్ర చేశారు. వాన్‌పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ చార్జిషీట్ వేయగా.. సీఎం క్లీన్‌చిట్ ఇస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి సీఎం పాలనకు పనికిరాడని, తక్షణం జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లలో ఏమి చేశారని సంబరాలు జరుపుకొంటారని మెదక్‌జిల్లా పాదయాత్రలో నేరుగా కిరణ్‌ను నిలదీశారు. రైతుల రుణమాఫీపై బహి రంగ చర్చకు రావాలని కాంగ్రెస్, వైసీపీ నేతలనూ సవాల్ చేశారు. ఆ రెండు పార్టీలను గెలిపిస్తే ఇళ్ల కప్పులూ మిగలనివ్వరని హెచ్చరించారు. జగన్ దోచుకున్న లక్ష కోట్లను స్వాధీనం చేసుకొంటే ఒకటి కాదు.. మూడు సార్లు రుణమాఫీ చేయొచ్చునని స్పష్టం చేశారు. దొంగలూ దోపిడీలూ పోయి రాష్ట్రమూ ప్రజలూ అభివృద్ధి చెందేందుకు టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అలాచేస్తే.. బీఎడ్ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టుల్లో భర్తీ చేస్తామని, 'టెట్' రద్దు చేసి ఏటా డీఎస్సీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ముస్లింల కోసం ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంకును పెట్టి వడ్డీ లేని రుణం అందిస్తామని, ప్రత్యేక డీఎస్సీల ద్వారా ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, ఇమామ్‌లకు రూ. ఐదు వేలు, మౌజమ్‌లకు రూ. మూడు వేల చొప్పున వేతనాలు అందిస్తామని వాగ్దానం చేశారు. బీసీల కోసం పది వేల కోట్లతో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని, గొల్లకురుమల కోసం రూ. 500 కోట్లతో బడ్జెట్ రూపొందిస్తామని భరోసా ఇచ్చారు.

సంగారెడ్డి , నవంబర్ 24 (ఆంధ్రజ్యోతి) : అవినీతి మంత్రి ధర్మాన ప్రసాదరావును కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని జైలులో పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. దొంగలను కాపాడే ముఖ్యమంత్రిని ఏమనాలని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. చార్జిషీట్‌లో మంత్రి పేరును సీబీఐ ప్రస్తావించినా "ధర్మాన తప్పు ఏమీ లేద''ని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడం విడ్డూరమని ధ్వజమెత్తారు. తెల్లదొరల పాలనలో జరిగిన దోపిడీకన్నా వైఎస్ ఎక్కువగా దోచుకున్నారని ఘాటుగా విమర్శించారు.

మెదక్ జిల్లాలో ఏడో రోజయిన శనివారం న్యాల్‌కల్, మనూర్ మండలాల్లో చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. పలు ప్రాంతాలలో జరిగిన సభల్లో కిరణ్, కాంగ్రెస్, వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. వాన్‌పిక్ భూముల కేటాయింపులో ధర్మాన ప్రసాద్‌రావు డబ్బులు తిని సంతకాలు చేశారని విమర్శించారు. 26 జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులిస్తే వారికీ ముఖ్యమంత్రి అండగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. " ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్నానని గొప్పగా చెప్పుకుంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ కాలమంతా ఏమి సాధించారు? మద్యం సిండికేట్‌ల వ్యవహారంలో 1100 మంది ఉద్యోగులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.

మరి ఈ కేసులో మంత్రుల మాటేమిటి?. సిండికేట్లలో దోచుకున్న వారంతా హాయిగా ఉన్నారు. బొత్స మాఫియా లిక్కర్ డాన్ అని ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ అ«ధిష్ఠానానికి లేఖ రాశారు'' అని గుర్తుచేశారు. రైతులకు రుణాలను మాఫీ చేస్తానని తాను ప్రకటిస్తే ఎలా చేస్తారో చెప్పాలని కాంగ్రెస్, వైసీపీ ప్రశ్నించడం అర్ధరహితమన్నారు. జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటే ఒక్కసారి కాదు మూడుసార్లు రైతుల రుణాలను మాఫీ చేయవచ్చన్నారు. దీనిపై ఆ పార్టీలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రుణమాఫీ ఎలా సాధ్యమో నిరూపిస్తామని స్పష్టం చేశారు. కాగా, తెలుగుదేశం అధికారంలోకి రాగానే 'టెట్'రద్దు చేసి ఏటా డీఎస్పీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు తెలిపారు.

బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూపాయి కిలో బియ్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి 'నగదు బదిలీ' చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మైనారిటీల కోసం ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మైనారిటీలకు ఈ బ్యాంక్ ద్వారానే మార్జిన్‌మనీ, రుణాలు అందిస్తామన్నారు. బడ్జెట్‌లో 2,500 కోట్ల రూపాయలను కేటాయించి ఆర్థికాభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇమామ్‌లకు, మౌజమ్‌లకు రూ.5 వేలు, రూ. 3 వేల చొప్పున వేతనాలు ఇస్తామని ప్రకటించారు.

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉంటే ఇప్పటికే ఎన్నికలు నిర్వహించే వారమన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, వారికోసం పది వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. గొల్లకురుమల కోసం 500 కోట్లతో బడ్జెట్ రూపొందించి, వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు.

కాంగ్రెస్, వైసీపీలు అధికారంలోకి వస్తే మన ఇళ్లపై కప్పులు ఉండవని, బతుకు అధోగతేనన్నారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, తెలుగుదేశం అధికారంలోకి రావాలని చెప్పారు.

ఇషాంత్‌రెడ్డి తండ్రికి పరామర్శ
తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న బసంత్ పూర్‌కు చెందిన ఇషాంత్‌రెడ్డి తండ్రి ఇంద్రసేనారెడ్డి శనివారం చంద్రబాబును కలిశారు. ఇబ్రహీంపూర్-చాల్కి చౌరస్తాల మధ్య కొద్దిసేపు బాబుతో కలిసి నడిచారు. కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఇంద్రసేనారెడ్డిని ఈ సందర్భంగా చంద్రబాబు ఓదార్చారు. అధికారంలోకి వస్తే ఇషాంత్‌రెడ్డి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ సీఎంని జైల్లో పెట్టాలి :చంద్రబాబు

54వ రోజు శనివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (fb) 24.11.2012

54వ రోజు శనివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (abn) 24.11.2012



Chandrababu naidu"vastunnameekosam" padayatra (sunday Eenadu paper)25.11.2012

ఎవరు విమర్శించినా రుణమాఫీ చేసి తీరుతాం
జగన్ దోచుకున్న డబ్బు రికవరీ చేస్తే,
మూడుసార్లు రుణ మాఫీ చేయవచ్చు
విత్తనాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం : చంద్రబాబు

మెదక్, నవంబర్ 24 : ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణ మాఫీపైనే చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రుణ మాఫీ ఎలా చేస్తారో చెప్పాలని వైఎస్పార్‌సీపీ నేత విజయమ్మ ప్రశ్నించారని, రుణ మాఫీ ఎలా చేస్తానో చేసిచూపిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర 50 రోజుకు, మెదక్ జిల్లాలో ఏడవ రోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం జిల్లాలోని న్యాల్‌కల్ నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఇబ్రహీంపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన దోచుకున్న సోమ్ము రికవరి చేస్తే రాష్ట్రంలోని రైతుల రుణాలను మూడు సార్లు మాఫీ చేయవచ్చునని అన్నారు.

రాష్ట్రంలోని రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో గ్రామసభల ద్వారా అనేక సమస్యలు పరిష్కరించామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న రుణాలన్నీ మాపీ చేస్తామని మరోమారు ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు మొత్తం 16 కిలోమీటర్ల మేర బాబు పాదయాత్ర సాగనుంది.

జగన్ దోచుకున్న డబ్బు రికవరీ చేస్తే, మూడుసార్లు రుణ మాఫీ చేయవచ్చు

హైదరాబాద్, నవంబర్ 24 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడ్ని విమర్శించే స్థాయి లేదని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీతో కుమ్మక్కయి, రహస్య ఒప్పందాలు చేసుకుని గేమ్ ఆడుతున్న వైఎస్సార్ సీపీ కాంగ్రెస్‌లో భవిష్యత్‌లో కలవబోమని చెప్పగలరా అని కేశవ్ ప్రశ్నించారు. యుపీఏ ఛైరపర్సన్ సోనియా గాంధీని విమర్శిస్తూ ఒక్క మాటగూడా మాట్లాడడంలేదని ఆయన మండిపడ్డారు.

మొదటి నుంచి కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ, అవినీతిపై పోరాటం చేస్తుంది ఒక్క టీడీపీయేనని, అలాంటి కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం చేసుకుంది టీడీపీయా, వైఎస్సార్‌సీపీయా అన్నది భారతి తెలుసుకోవాలని కేశవ్ సూచించారు. చంద్రబాబు అనుభవం అంతలేదు మీ వయస్సు, ఆయనను విమర్శించే స్థాయికూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎదుట వారిని వేలెత్తి చేపించే ముందు మీ తప్పులను తెలుసుకోవాలని కేశవ్ అన్నారు. కార్పొరేట్ రంగాన్ని శాసించే స్థాయి టీడీపీకి ఉందని చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండేళ్ల పాలన విఫలమైందని ఆయన విమర్శించారు. తాను మారబోనని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలే మార్చేస్తారని ఆయన అన్నారు. పదేళ్లనాటి తెలుగుదేశం పాలనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.

భారతి! చంద్రబాబు అనుభవం అంతలేదు నీ వయస్సు -పయ్యావుల కేశవ్

ఏలూరుకార్పొరేషన్, నవంబర్ 24 : అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ను చంచల్‌గూడ జైలులో ఉంచినప్పటికీ ఆయనకు అన్ని సౌకర్యాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వాలే కల్పిస్తున్నాయని మాజీ హోమంత్రి కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఏలూరులో విలేకర్లతో మాట్లాడారు. చంచల్‌గూడ జైలు జైలులా లేదని ఫైవ్‌స్టార్ హోటల్‌లా ఉందని అన్నారు.

ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని, పదవులను కాపాడుకోవడానికి ఎటువంటి పనికైనా పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా అభివృద్ధి తిరోగమనంలో ఉందని, సంక్షేమ పథకాలు కరువయ్యాయని అన్నారు. ప్రజలపై మోయలేని భారాలు మోపడంతో అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని, సామాన్యుడు జీవించే స్థ్ధాయిని కోల్పోయాడని, పేదల పరిస్థ్ధితి మరీ ఘోరంగా ఉందని అన్నారు.

చంచల్‌గూడ జైలా...ఫైవ్‌స్టార్ హోటలా..?

54వ రోజు శనివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (eenadu) 24.11.2012

November 23, 2012


వచ్చె ఎన్నికలలో తెదేపా దే విజయం - జూనియర్ ఎన్టీఆర్

రుణ మాఫీ ఎందుకొద్దు?
తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు కావాలనే వ్యతిరేకిస్తున్నాయి
కిరికిరి పెడుతున్న కిరణ్ ప్రభుత్వం
నాడే వ్యతిరేకించిన వైఎస్
దివాలా తీస్తామంటూ కేంద్రానికి లేఖ
జగన్ కొల్లగొట్టిన లక్షకోట్లు రికవరీ చేస్తే మాఫీ
ఎంత పని?: బాబు స్పష్టీకరణ

" వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను రికవరీ చేస్తే రైతు రుణాలను మాఫీ చేయొచ్చు. అంతేకాదు, రాష్ట్రంలోని ప్రతి రైతుకూ రెండు లక్షల రూపాయలు చొప్పున పంచొచ్చు. నిజానికి, రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని 2009కి ముందు నేనూ, ఎస్పీ నేత ములాయంసింగ్, అన్నాడీఏంకే అధినేత్రి జయలలిత కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమించాం. అప్పట్లో నా ప్రయత్నాలను వైఎస్ గట్టిగా వ్యతిరేకించారు. రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయంటూ ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారు. దానికి బదులు రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుందని సూచించారు. అయితే మా ఒత్తిడికి కేంద్రం దిగి వచ్చి రుణమాఫీ ప్రకటించింది. పంచాయతీ సర్పంచ్‌గా కూడా ఎన్నిక కాలేని వారూ అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారా రుణ మాఫీపై నన్ను ప్రశ్నించేది?''
- సంగారెడ్డి సభలో చంద్రబాబు


సంగారెడ్డి, నవంబర్ 23 (ఆంధ్రజ్యోతి): రైతుల రుణాలను మాఫీ చేసేందుకు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) వ్యతిరేకమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను రికవరీ చేస్తే రైతు రుణ మాఫీ పెద్ద విషయమేమీ కాదని తెగేసి చెప్పారు. అంతేకాదు, ఆర్ఆర్ చట్టం కింద ఆ డబ్బునంతా వెలికితీస్తే, రాష్ట్రంలోని ప్రతి రైతుకూ రెండు లక్షలు చొప్పున సాయం చేయొచ్చుననీ సూచించారు.

"చంద్రబాబూ.. ఏ ప్రభుత్వాన్ని అడిగి రైతు రుణ మాఫీ చేస్తావో చెప్పు..''అని వైసీపీ నాయకురాలు విజయలక్ష్మి చేసిన సవాల్‌కు చంద్రబాబు దీటుగా ప్రతిస్పందించారు. రైతు రుణం విషయమై కాంగ్రెస్ ఫ్రభుత్వం, వైఎస్ చేసిన ద్రోహాన్ని వివరిస్తూ మెదక్ జిల్లాలో ఆరో రోజు పాదయాత్రను చంద్రబాబు కొనసాగించారు. ఆయన శుక్రవారం ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాలలో పలు సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పదేపదే రైతు రుణ మాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్‌పైనా కేంద్ర ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. '2009కి ముందు మేం ఉద్యమిస్తే.. రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని అప్పటి సీఎం వైఎస్ అడ్డుతగిలారు.

అదే విషయం ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారు. దానికి బదులు రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుందని సూచించారు. అయితే మా ఒత్తిడికి కేంద్రం దిగి వచ్చి రుణమాఫీ ప్రకటించింది'' అని వివరించారు. రుణ మాఫీ ఎలా చేస్తారని విజయలక్ష్మి ప్రశ్నించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 'పంచాయతీ సర్పంచ్‌గా కూడా ఎన్నిక కాలేని వారూ.. అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారా నన్ను అడిగేది?' అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తనకు రైతుల రుణాలను ఎలా మాఫీ చేయాలో తెలుసన్నారు.

అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కాగా, ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేశానని సంబరాలు చేసుకుంటున్న కిరణ్ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతీ ప్రజాసంక్షేమ పనికి ఏదో అడ్డంకి సృష్టించి కిరికిరి రెడ్డిగా మారారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ సంక్షోభానికి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలే కారణమని చంద్రబాబు విమర్శించారు. కిరణ్ ప్రజల సీఎం కాదని, సీల్డ్‌కవర్ సీఎం అని విమర్శించారు. మరోవైపు స్థానిక మంత్రి గీతారెడ్డి అభివృద్ధి పనులు ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

అవినీతికి పాల్పడే కాంగ్రెస్ నాయకులను చిత్తుచిత్తు చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని పిలుపునిచ్చారు. చిరుధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించాలని తుల్జమ్మ కోరగా, అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర కల్పిస్తానని హామీనిచ్చారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి రోగాలు రావని ఆయన సూచించారు. తాము అధికారంలోకి వస్తే బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీతో పాటుగా నిరుద్యోగ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తానని హామీనిచ్చారు.

అది ఆరు పేజీల ముచ్చట
'మీపై కొన్ని పత్రికలలో వ్యతిరేక వార్తలు వెల్లువెత్తుతున్నాయ'ని యువకులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దానిపై ఆయన తేలిగ్గా స్పందించారు. 'నాపై రాయడానికి ఒకే ఒక్క అవినీతి మీడియా సాక్షి ఉంది. నా గురించి మూడు పేజీలు రాస్తారు. వారి గురించి మూడు పేజీలు రాసుకుంటారు అంతే' అని వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరాడడమే కాకుండా అవినీతి నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు. కడపలో పార్టీ ఉపాధ్యక్షుడు శశికుమార్ వాహనాన్ని దగ్ధం చేసిన సంఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని, దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

దూకుడు పెంచిన బాబు!
తెలంగాణపై ఆచితూచి మాట్లాడే చంద్రబాబు అనూహ్య దూకుడు ప్రదర్శిస్తున్నారు. 'అభివృద్ధి' చర్చ నుంచి పక్కకు పోకుండానే ఎదురుదాడిని పెంచేశారు. తెలంగాణ ఉద్యమ సారథి సొంత గడ్డపైనే ఆయననూ ఆయన పార్టీనీ చంద్రబాబు తూర్పారపడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లాలో ఆరు రోజులుగా పాదయాత్రలో ఉన్న చంద్రబాబు తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని పదేపదే నొక్కిచెప్పారు.

భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించబోదని రెట్టించిన స్వరంతో చెప్పడం పార్టీ వర్గాలకు ఊరటనిచ్చింది. 'ఆరు నెలలు నిద్ర.. ఒక రోజు గారడీ మాటలు'గా కేసీఆర్ ఉద్యమిస్తున్నారని కూడా బాబే ఎద్దేవా చేశారు. దీన్నిబట్టి ఆ పార్టీనీ, కేసీఆర్‌నూ చంద్రబాబు లక్ష్యం చేసుకొని ముందుకు వెళుతున్నట్టు జిల్లాలోని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు ఇస్తున్న ఊపుతో ఇక తమకు తెలంగాణలో ఇబ్బందులు తొలగినట్టేనని పార్టీవర్గాలు అంటున్నాయి. మరోవైపు నడిపించే నాయకుడు నడుస్తుంటే..అనుసరించాల్సిన అనుచరులు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

వయస్సునూ లెక్కచేయకుండా అధినేత ముందుకు దూసుకెళుతుంటే అనుయాయులు మాత్రం కార్లపై అనుసరిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఆరు రోజులుగా కొనసాగుతున్న చంద్రబాబు పాదయాత్రలో కనిపిస్తున్న దృశ్యమిది. సెక్యూరిటీ భారీ స్థాయిలో ఉండడం, వారికి తోడు రోప్‌పార్టీ దూకుడు వల్ల.. చంద్రబాబుతో కలిసి పాదయాత్ర చేయడం అందరికీ సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే తామంతా ఏదో వాహనంలో వెళ్లాల్సి వస్తున్నదని స్థానిక నేతలు చెబుతున్నారు.

రుణ మాఫీ ఎందుకొద్దు? చంద్రబాబు

53వ రోజు శుక్రవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (fb) 23.11.2012

53వ రోజు శుక్రవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (abn) 23.11.2012

న్యూఢిల్లీ, నవంబర్ 23 : నీలం తుపాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్ర మంత్రులు ఉన్నా బాధితులకు న్యాయం చేయలేకపోయారని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం పార్లమెంట్ వద్ద ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు ధర్నా చేస్తుంటే మంత్రులు నవ్వుతూ వెళ్లడం రైతులను హేళన చేసినట్లేనని ఆయన అన్నారు. ఎఫ్‌డీఐల ద్వారా రైతులకు జరిగే మేలేంటో ప్రభుత్వం చెప్పాలని నామా డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల పొట్ట కొట్టేందుకే ఎఫ్‌డీఐలకు అనుమతి అని ఎంపీ నామా మండిపడ్డారు.

ఎఫ్‌డీఐల ద్వారా రైతులకు జరిగే మేలేంటో ప్రభుత్వం చెప్పాలి...నామా నాగేశ్వరరావు



ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
పార్టీలు మారేవారంతా అవకాశవాదులు
వలసలవల్ల టీడీపీకి నష్టం లేదు

హైదరాబాద్, నవంబర్ 23 : సాధారణ ఎన్నికల్లో పోటీ అంశంపై టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ స్పష్టత ఇచ్చారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారాన్ని బాలయ్య తోసిపుచ్చారు. పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. పార్టీలు మారేవారంతా అవకాశవాదులని, కొందరు స్వార్థం కోసమే వలసలు వెళ్తున్నారని ఆయన తెలిపారు. వలసల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదని బాలకృష్ణ పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ లోకసభకు పోటీ చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని బాలకృష్ణ అన్నారు. తాను శాసనసభకే పోటీ చేస్తానని, ఎక్కుడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. పార్టీని వీడేవారంతా అవకాశవాదులేనని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు పార్టీని వీడినా నష్టం లేదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు వలసలు సాధారణమేనని ఆయన అన్నారు. స్వార్థంతోనే ఇతర పార్టీలకు కొంత మంది వలసలు పోతున్నారని ఆయన విమర్శించారు.

ప్రజల బలం తమ పార్టీకి ఉందని, ఎక్కుడి నుంచి పోటీ చేయాలని తాను అనుకుంటున్నానో పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత తెలియజేస్తానని బాలయ్య తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి కూడా వలసలను ప్రోత్సహించారని ఆయన విమర్శించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బాలకృష్ణ పేర్కొన్నారు.

పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా -నందమూరి బాలకృష్ణ



రుణ మాఫీకి కాంగ్రెస్ వ్యతిరేకం
ప్రభుత్వం ఏర్పాటు చేసి మాఫీ చేస్తా
అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారు అడగడమా?
కరెంట్ కష్టాలకు రోశయ్య, కిరణ్‌లే బాధ్యులు : చంద్రబాబు
సంగారెడ్డి, నవంబర్ 23 : రైతుల రుణాలను మాఫీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని 2009కి ముందు తాను, ములాయంసింగ్, జయలలిత కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమిస్తే కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. మెదక్ జిల్లాలో జరుపుతున్న పాదయాత్రలో భాగంగా ఆరో రోజయిన శుక్రవారం ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాలలో జరిగిన సభలలో ప్రసంగించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కూడా రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని, అందువల్లరుణాల మాఫీ అవసరం లేదని కేంద్రానికి లేఖ కూడా రాశారని చెప్పారు. రుణ మాఫీకి బదులుగా రైతులకు అయిదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుందని వైఎస్ సూచించారన్నారు. అయితే తామందరం చేసిన ఒత్తిడి వల్ల కేంద్రం రుణ మాఫీకి అంగీకరించిందన్నారు.

రుణ మాఫీ ఎలా చేస్తారని, ఏ ప్రభుత్వాన్ని అడిగి చేయిస్తారని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి అడగడాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 'పంచాయతీ సర్పంచ్‌గా కూడా ఎన్నిక కాలేని వారు, అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారు నన్ను అడగడమా?' అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తనకు రైతుల రుణాలను ఎలా మాఫీ చేయాలో తెలుసన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వైఎస్ అధికారంలోకి రాగానే రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయన్నారని, కాని ప్రతి రోజు నలుగురైదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరెంట్ కష్టాలకు రోశయ్య, కిరణ్‌లే బాధ్యులు

రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ సంక్షోభానికి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలే కారణమని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో కరవు వచ్చినా రైతులకు తొమ్మిది గంటల కరెంట్ సరఫరా చేశామని చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక కరెంట్‌ను నిర్లక్ష్యం చేశారన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు వందరూపాయల ఆదాయం వస్తే 8 రూపాయలు కరెంట్ కోసం ఖర్చు చేశామని, వైఎస్ సీఎం అయ్యాక 4 రూపాయలే ఖర్చుపెట్టారని చెప్పారు.

ముఖ్యమంత్రి, మంత్రులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబితే మంత్రులు, ఎమ్మెల్యేలు వినడం లేదని, అధికారులు కూడా వినరన్నారు. అసమర్థ సీఎం వల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందన్నారు. కాంగ్రెస్ అసమర్థ, అవినీతి వల్లే మనం కష్టాల్లో బతకాల్సి వస్తున్నదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల సీఎం కాదని, సీల్డ్‌కవర్ సీఎం అని విమర్శించారు. ఢిల్లీ నుంచి సోనియాగాంధీ సీల్డ్‌కవర్‌లో పంపిస్తే ఈయన సీఎం అయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేల చేత ఎన్నికైన వ్యక్తి కాదని, అందుకే ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేశానని సంబరాలు చేసుకుంటున్న కిరణ్ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతీ ప్రజాసంక్షేమ పనికి ఏదో అడ్డంకి సృష్టించి కిరికిరి రెడ్డిగా మారారన్నారు. రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారందరికీ అదనంగా మూడు సిలిండర్లు ఇవ్వాలని సోనియాగాంధీ చెబితే దీపం పథకం వారికే ఇస్తామంటూ కిరణ్ కిరికిరి పెట్టారని చంద్రబాబు విమర్శించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసి మాఫీ చేస్తా, అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారు అడగడమా?