November 26, 2012

ఉపాధిహామీ పథకం కుంభకోణాల మయం

ఉపాధిహామీ పథకం కుంభకోణాల మయం
కాంగ్రెస్ హయాంలో మూడుపుటాలా తిండి లేదు
టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కారం : బాబు

మెదక్, నవంబర్ 26 : జాతీయ ఉపాధిహామీ పథకం కుంభకోణాల మయంగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఐదు వందల జనాభా ఉన్న తండాల్ని పంచాయతీలుగా గుర్తించడంతోపాటు సేవాలాల్, మహరాజ్ ఆలయాల్ని నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

'వస్తున్నా....మీకోసం' కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర మెదక్ జిల్లాలో 56వ రోజైన సోమవారం కొనసాగుతోంది. ఈ ఉదయం నారాయణఖేడ్ నుంచి వెంకట్‌రావు తండా మీదుగా యాత్ర ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ తండాలకు ఇదివరకు ప్రకటించిన తీర్మానాలను మరొక్కసారి ఈరోజు తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మానాల మొదలు, విద్యా, ఉద్యోగాలు, ఆడపిల్లల పెళ్లిల్లు అన్ని కరాల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హయాంలో మూడు పూటలా తిండి కూడా తినలేదని దుస్థితి దాపురించిందని చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ అధిరంలోకి వస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దక్కుతుందని ఆయన అన్నారు. బాబు యాత్ర హన్మంతరావుపేట, భుజరాంపల్లి శంకర్‌పేట మీదుగా పెద్ద శంకరం పేటవరకూ సాగుతుంది. బాబు వెంట పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ రోజు మొత్తం 15 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది.