February 28, 2013

కృష్ణాజిల్లాను రెండోసారి సందర్శిస్తున్నాను. అయినా అదే ఆదరణ, అదే ఉత్సాహం.. ఊళ్లకు ఊళ్లు ఊగిపోవడం చూస్తున్నాను. పనులు మానుకొని రోడ్డు పక్కన బారులు తీరిన జనాలను పలకరించాను. వాళ్లను చూడ్డం కోసం నేను.. నన్ను చూడ్డం కోసం వాళ్లు.. ఒకరికొకరం ఎదురయ్యాం. చిరపరిచితుల్లా నన్ను అల్లుకుపోయారు. నా కాళ్ల నొప్పులు, కీళ్ల తీపుల గురించి అడిగి కళ్లు వత్తుకున్నారు. నా కోసం పరితపించే ఇన్ని హృదయాల తోడు లేకుండా ఇంత దూరం నడవగలనా? కొండంత అండను జెండాలా వీళ్లు ఎత్తిపట్టకుండా పాదయాత్రపై రేగిన విమర్శలకు సమాధానం చెప్పగలిగేవాడినా? చుట్టుముట్టిన సందేహాలను విరామం లేని నడకతో ఎదుర్కోగలిగేవాడినా?.. మోపిదేవిలో అడుగులు వేస్తున్నప్పుడు మెదిలిన ఆలోచనలివి.

చల్లపల్లికి పోతున్నప్పుడు సాయంత్రం కొంతమంది ఎదురయ్యారు. వారిలో చాలామంది ఆడపడుచులే. మోపిదేవి నుంచి వస్తున్నామని చెప్పారు. పని చేసుకొని వస్తుంటే నా రాక విషయం తెలిసి ఆగిపోయారట. వాళ్లతో మాట్లాడుతుండగానే మరికొందరు కలిశారు. కోడూరు, మందపాకల నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని చల్లపల్లికి వస్తున్నామని చెప్పుకొచ్చారు. ఊళ్లు వేరయినా వాళ్లంతా నీళ్ల సమస్యనే నా దృష్టికి తెచ్చారు. ఊరి బావుల్లో ఉప్పు చేరిందట. పశువులు కూడా ముట్టడం లేదట. చేసేది లేక నీళ్లు కొనుక్కొని తాగుతున్నారట. కొన్ని ఊళ్లలోనయితే కొంతమంది దాతలు ముందుకొచ్చి రోజూ ట్యాంకర్లతో నీళ్లు పోయిస్తున్నారట. లేదంటే.. రోజుంతా పనిచేసి నడుములు విరిగిపోతున్నా, బిందె పట్టుకొని మైళ్ల దూరం పోయి నీళ్లు తెచ్చుకోక తప్పదట. ఇప్పుడు సరే.. ఎండాకాలం ముదిరితే ఏం చేస్తారో..! తలుచుకుంటేనే గుండె నీరయ్యే విషయమిది.

ఆ ఆశీస్సులతోనే అడుగులేస్తున్నా!

మదర్, అంబేద్కర్‌ల సరసన వారి ఫొటోలా?
గజదొంగలను పోషించిన వైఎస్: చంద్రబాబు

  కాంగ్రెస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అవినీతిపరులను మదర్ థెరెస్సా, అంబేద్కర్, గాంధీవంటి మహాత్ముల ఫొటోలతో జతచేయడం విచారకరమని చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పెదప్రోలు, కప్టాన్ పాలెం, కాసానగర్, చల్లపల్లి, వక్కలగడ్డ, చిట్టూర్పు మీదుగా 15,1 కిలోమీటర్లు నడిచి వేములపల్లి చేరుకున్నారు. అంతకుముందు..మోపిదేవి ప్రధాన సెంటరులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. బీసీలను ఆదుకోవడం కోసం టీడీపీ ఇప్పటికే డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తుచేశారు.

50 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామన్నారు. పది వేల కోట్లతో ఉపప్రణాళిక అమలుచేసి బహుజనులందరినీ అభివృద్ధి చేస్తామన్నారు. ఎస్సీలలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని పూడ ్చడానికే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. టీడీపీ పాలనలోనే మైనారీటీలకు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. నాలుగు శాతం రిజర్వేషన్‌తో కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నదని విమర్శించారు. టీడీపీ పాలనలో సంస్కరణలు బలంగా అమలు జరిగాయని చెప్పుకొచ్చారు. తమ హయాంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయనే విషయం ఇప్పుడిప్పుడే జనం గ్రహిస్తున్నారని వివరించారు.

అవినీతిరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ప్రజలపై భారాన్ని మోపడం మాత్రమే నేర్చుకున్న ఈ ప్రభుత్వాలు 29 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలుపెంచి ఘనత వహించాయని దుయ్యబట్టారు. దేశంలో గజదొంగలుపడ్డారని, వైఎస్ తన కొడుక్కి లక్ష కోట్లు దోచిపెట్టారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని చంద్రబాబు చెప్పారు. చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి మహిళలను వేధించిన వారందరినీ జైలులోనే ఉంచుతామని హామీ ఇచ్చారు.

మహాత్ముల పక్కన అవినీతి నేతలా?

పేదరికం పెంచే బడ్జెట్
నల్లధనం, అవినీతి మాటే లేదు: బాబు
మాది ప్రజారంజక బడ్జెట్: బొత్స

కేంద్ర మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో పేదరికాన్ని మరింత పెంచే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. కృష్ణాజిల్లా పాదయాత్రలో ఉన్న చంద్రబాబు.. చిదంబరం బడ్జెట్ ప్రతిపాదనలను తూర్పారబట్టారు. "అవినీతి అంశాన్ని కనీసంగానూ పట్టించుకోలేదు. మూడు ప్రాధాన్యాల్లో మహిళలు ఒకరని చెబుతూనే, వారి సంక్షేమంపై మొండి చెయ్యి చూపించారు. నిరుద్యోగితను తగ్గించే చిన్న పరిశ్రమల రంగాన్ని పట్టించుకోలేదు. పేదరికం నిర్మూలనకు కీలకమైన ఆహార భద్రత బిల్లుపై ప్రకటనే లేదు'' అని విమర్శించారు. వ్యవసాయ రంగానికి.. రూ. 27 వేల కోట్లు ముష్టిలా పడేశారని దుయ్యబట్టారు.

ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కేటాయించిన 1400 కోట్లు ఒక్క నల్గొండ జిల్లాకే సరిపోదని పెదవి విరిచారు. కోతల బడ్జెట్‌ను సమర్పించారని ఆ పార్టీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, చేనేత, పారిశ్రామిక రంగాలకు మొండి చెయ్యి చూపించారని ఎంపీలు ఎంపీలు గుండు సుధారాణి, శివప్రసాద్, మోదుగుల విమర్శించారు. అయితే.. గ్రామీణాభివృద్ధికి, మహిళా శిశు సంక్షేమానికి, మైనారిటీల పురోభివృద్ధికి బడ్జెట్ పెద్ద పీట వేసినట్టు పీసీసీ చీఫ్ బొత్స కొనియాడారు. మళ్లీ అధికారం తమదేనని తేలిపోయిందని చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్ రుద్రరాజు పద్మరాజు ధీమా వ్యక్తం చేశారు.

మధ్యతరగతి, పేదలపై భారం పడకుండా బడ్జెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని కేంద్ర మంత్రి చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్ తీరు ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీని కనీసం ప్రస్తావించి ఉంటే ఆత్మహత్యలు ఆగేవని అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ప్రమాదకర చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. అన్నివర్గాలనూ సంతృప్తి పరచాలనే ఆత్రుత వల్ల బడ్జెట్ కిచిడిలా తయారైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు.

బడ్జెట్ వల్ల దేశంలోని 80 శాతం ప్రజలకు ఏ ఉపయోగమూ లేదని వైసీపీ నేత సోమయాజులు విమర్శించారు. బడ్జెట్ బడుగు, బలహీనవర్గాలను విస్మరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అంకెల గారడీ తప్ప ప్రజాప్రయోజనమే పట్టలేదని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించగల గొప్ప అవకాశాన్ని చిదంబరం చేజార్చుకున్నారని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు, శాసనసభ్యుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్‌నారాయణ (జేపీ) అన్నారు.

ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్: కేటీఆర్

పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
అధినేత ముందుకు విజ్ఞాపనల వెల్లువ

ఎమ్మెల్సీ పదవుల కోసమ పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య తెలుగుదేశం పార్టీలో రోజురోజుకూ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు అధినేత చంద్రబాబును కలిసి తమ అర్హతలను వివరిస్తూ ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి పీ చంద్రశేఖర్ తాజాగా రేసులోకి ప్రవేశించారు. తెలంగాణలో మిగిలిన బీసీ కులాలకు తగినంత ప్రాతినిధ్యం ఉన్నా ముదిరాజ్ కులానికి మాత్రం తగినంత లేదని, ఆ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కొద్ది రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడిని కలిసి తన పేరును ఎమ్మెల్సీకి పరిశీలించాలని కోరారు. తన నియోజకవర్గం రిజర్వు అయిందని, తనకు ఏదైనా పదవి ఉంటే జిల్లాలో పార్టీని సమన్వయపర్చే బాధ్యతను మరింత మెరుగ్గా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని ఆయన పార్టీ అధ్యక్షుడికి చెప్పారు. అదే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత గంగాధర చౌదరి కూడా తన పేరును పరిశీలించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడికి లేఖ పంపారు.

చంద్రబాబు పాదయాత్రలో మొదటి రోజు నుంచి తన వాహనంతోపాటు పాల్గొంటున్న వికలాంగుల విభాగం నేత జి. కోటేశ్వరరావు కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధినేతను కోరారు. వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన పార్టీ అధినేత.. ఈ పదవుల్లో కూడా ఒక వికలాంగుడికి అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్తిని వెంకటయ్య కూడా తన అభ్యర్థిత్వంపై పార్టీ అధ్యక్షుడికి విజ్ఞాపన పంపారు. గతంలో తనకు ఎంపీ టికెట్, జడ్పీ చైౖర్మన్ అవకాశం చేరువలోకి వచ్చి చేజారిపోయాయని, పార్టీకి దీర్ఘకాలంగా అంటిపెట్టుకొని ఉన్న తన అంకిత భావాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

టీడీపీలో 'ఎమ్మెల్సీ' పోటీ

ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఘోరమైన అన్యాయం జరిగిందని, దీన్ని సరిదిద్దకపోతే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ ఉపాధ్యక్షుడు ఇ.పెద్దిరెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. తమను ఇబ్బంది పెట్టవద్దని ఢిల్లీ పెద్దలు చెప్పగానే ముఖ్యమంత్రి కిరణ్ మిన్నకుండిపోయారని విమర్శించారు. దక్షిణమధ్య రైల్వేద్వారా భారీగా ఆదాయం వస్తున్నా, అందులో ఎనిమిదో వంతు కూడా రాష్ట్రానికి కేటాయించకపోవడం దారుణమన్నారు. 'పోయినేడాది రూ.3 వేల కోట్లు కేటాయించారు. ఈసారి వెయ్యి కోట్లు తగ్గించేశారు. రూ.1.90 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్‌లో ఇంతపెద్ద రాష్ట్రానికి కేటాయించేది రూ.2 వేల కోట్లేనా? రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కర్నూలుకు వ్యాగన్ రిపేర్ షాపు తెచ్చుకున్నారు.

కొండంత రాగం తీసి తుమ్మదియ్యలో అన్నట్లు అదొక్కటే రాష్ట్రానికి ఒరిగింది. రాష్ట్రంలో 11 ప్రాజెక్టులకు భూమి ఇస్తామని, సగం ఖర్చు భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా పోయినేడాది పైసా కూడా కేటాయించలేదన్నారు. కాజీపేట వద్ద ఓ చిన్న స్థల వివాదాన్ని కూడా పరిష్కరించలేక వదిలేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నిధుల సాధనకు మన అధికార పార్టీ ఎంపీలు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, రైల్వే బడ్జెట్ కొంత ప్రోత్సాహం-కొంత నిరుత్సాహం కలిగించిందని యూపీఏ భాగస్వామి డీఎంకే అధినేత కరుణానిధి వ్యాఖ్యానించారు.

ప్రయాణ చార్జీలను పెంచకపోవడం సంతోషమే అయినా, వాటిపై రుసుములు, రవాణా చార్జీల పెంపుతో భారం పడుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేరళకు చెందిన కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశిథరూర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై ప్రజల అసంతృప్తిని పంచుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఇది అత్యంత నిరుత్సాహకరంగా ఉందని పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు: టీడీపీ

ఆంధ్రా అగస్టాపైనా విచారణ..: రాజ్యసభలో టీడీపీ

అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్ పాత్రపైనా విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్ష నాయకుడు దేవేందర్‌గౌడ్, ఎంపీ సీఎం రమేశ్ డిమాండ్ చేశారు. అగస్టా కుంభకోణంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వారు ప్రసంగించారు. దేశంలో ఏ కుంభకోణం వెలుగుచూసినా దాని మూ లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నాయని సీఎం రమేశ్ విమర్శించారు.

ఎమార్-ఎంజీఎఫ్ డైరెక్టర్ హష్కే ప్రారంభించిన ట్రస్టుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 800 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించింద ని, ఆ ట్రస్టుకు వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ట్రస్టీగా ఉన్నారని వెల్లడించారు. దేశంలో అగస్టా హెలికాప్టర్‌ను ముందుగా కొనుగోలు చేసింది వైఎస్ హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని.. ఆ హెలికాప్టర్ ఈ మధ్యనే కాలిపోయిందని, ఈ వ్యవహారంపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలోనే ఈ కుంభకోణానికి అంకురార్పణ జరిగిందని దేవేందర్‌గౌడ్ ఆరోపించారు. దీంతో.. అప్పుడు సభలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్ ఆయన వ్యాఖ్యలను ఖండించారు.

బ్రదర్ అనిల్ సంగతేంటి?

కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ఆదుకునే పరిస్థితి కేంద్రానికి లేదన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులను ఆదుకోవడానికి బడ్జెట్‌లో చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు.

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం : నామా

టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్వేగానికి గురయ్యారు. 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర పెనుమూడి వారధిపై గుంటూరు జిల్లా సరిహద్దును దాటి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సమయంలో ఘనంగా వీడ్కోలు పలికేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను చూసి గుంటూరును వీడుతుండటం కొంత బాధగా ఉందని వ్యాఖ్యానించారు. తన వెంట అడుగులో అడుగేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పోలీసు శాఖ పరంగా అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన పోలీసులనూ అభినందించారు.

'పాదయాత్ర చేపట్టిన తర్వాత ఏ జిల్లాలోనూ 22 రోజులు ఉండలేదు. గుంటూరు జిల్లాలోనే ఇన్ని రోజులు ఉండి 201 కిలోమీటర్లు ప్రజల సమస్యలు తెలుసుకొంటూ నడిచాను. ఎనిమిది నియోజకవర్గాల్లో ఒక కార్పొరేషన్, నాలుగు మునిసిపాలిటీలు, 167 గ్రామాల ప్రజలను పలకరించాను. వారి కష్టాలను అతి దగ్గర నుంచి చూశాను. జిల్లా ప్రజల కష్టాలు నాకు పలుమార్లు కళ్ళ నీళ్లు తెప్పించాయి. నా పాదయాత్ర ద్వారా మీకు గుండె ధైర్యం కల్పించాను. మూడు వారాలు ఎలా గడిచిపోయాయనేది వెనక్కు తిరిగి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. నా తపన అంతా గాడి తప్పిన ర్రాష్టాన్ని బాగు చేయాలి. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తాను. కృష్ణా జిల్లాకు వెళ్ళాలంటే బాధగా ఉంది. అయినా తప్పదంటూ..' చంద్రబాబు చేసిన ఉద్వేగభరిత ప్రసంగం అక్కడికి వచ్చిన ప్రజలను కూడా ఆవేదనకు గురి చేసింది. కొంతమంది కార్యకర్తలు 'బాబు గారు... మీ ఆరోగ్యం జాగ్రత్త' అని ఆత్మీయతను వ్యక్తం చేయగా చంద్రబాబు స్పందిస్తూ నాకు ఏమి కాదు. మీ అందరి ఆశీస్సులతో పాటు భగవంతుడి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎండ ల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని గురువారం నుంచి సాయంత్రం పూటే పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నాను. శ్రీకాకుళం వరకు నడిచి తీరుతానని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఆయనకు వీడ్కోలు చెబుతూ రేపల్లె నియోజకవర్గంలోని పెనుమూడి వారధి వరకు ఆయన వెంట నడిచారు. అప్పటికే అక్కడికి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు రాక కోసం భారీ సంఖ్యలో ఎదురు చూస్తుండటంతో వారికి బాధ్యతలు అప్పగించి వెనుదిరిగారు. చంద్రబాబు అందరికి అభివాదం చేస్తూ గుంటూరు జిల్లాను వీడి కృష్ణా జిల్లాలోకి పులిగడ్డ వద్ద అడుగు పెట్టారు.

కృష్ణా పశ్చిమ డెల్టాకూ...

సాగునీరు ఇవ్వాలి


తన పోరాటం, హెచ్చరికలతో ప్రభుత్వం దిగి వచ్చి నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తానని చేసిన ప్రకటనపై చంద్రబాబు స్పందించారు. 'కృష్ణా పశ్చిమ డెల్టాలోనూ సాగునీటి ఎద్దడి సమస్య ఉంది. డెల్టాకు కూడా నీరివ్వాలి. ఇవ్వకపోతే కబడ్దార్... జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వాన్ని స్తంభింప చేసి అయినా మీకు నీళ్లు ఇప్పించే బాధ్యత నాది అని' చంద్రబాబు డెల్టా రైతుల గుండెల్లో ధైర్యం నింపారు.

కార్యకర్తలు విజృంభించాలి... నాయకులు ప్రజల్లో ఉండాలి

ప్రజలు కాంగ్రెస్‌తో విసిగి వేసారిపోయి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. పాదయాత్రలో నేను ఎక్కడికెళ్లినా భారీగా తరలివచ్చి నా వెంట నడిచారు. పార్టీ కార్యకర్తలంతా విజృంభించాలి. నాయకులు ప్రజల్లో ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా కష్టపడి పని చేసి టీడీపీని గెలిపించాలన్నారు. యువత విజృంభించి అవినీతిపై పోరాటం చేసి అంతమొందించాలని చంద్రబాబు స్ఫూర్తిని రగిల్చారు.

జన వారధి

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటంతోపాటు గుంటూరు, తెనాలి, విజయవాడ నగరాలను కలుపుతూ ట్రై సిటీగా ఏర్పాటు చేసి పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించటంతోపాటు మెగా సిటీగా రూపొందించేలా గుంటూరు జిల్లా డిక్లరేషన్‌ను రూపొందించామని అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో 22 రోజులపాటు 201 కి.మీల దూరం పాదయాత్ర పూర్తి చేసుకుని బుధవారం సాయంత్రం కృష్ణాజిల్లాకు వెళుతూ, పులిగడ్డ-పెనుమూడి వారధిపై వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడారు.

అధికారంలోకి తీసుకువస్తే, సత్వరమే పులిచింతల ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి డెల్టా రైతాంగానికి సాగునీటి కొరతను తీరుస్తామన్నారు. పోతార్లంక సాగునీటి పథకాన్ని పూర్తి చేసి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీనిచ్చారు. ప్రజా సమస్యలపై నాలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాడుతూనే వుంటానని, ప్రజల హర్షద్వానాల మధ్య తెలిపారు. గుంటూరు ఛానల్, పశ్చిమడెల్టా కాల్వల అభివృద్ధికి చర్యలు చేపట్టి పనులు పూర్తి చేస్తామన్నారు. నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్ నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా జిల్లా ప్రజానీకానికి తాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. నిజాంపట్నం, భట్టిప్రోలు, అమరావతి, కొండవీడు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పులిగడ్డ-పెనుమూడి వారధిని తెలుగుదేశం హయాంలో నిర్మిస్తే, ఆరునెలల ముందు వచ్చిన కాంగ్రెస్ పేరు పెట్టుకోవటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో 32 మంది ఎంపీలు, 11 మంది మంత్రులున్నా రైల్వే బడ్జెట్‌పై నోరు మెదపలేని దద్దమ్మల్లా వున్నారని విమర్శించారు. వేమూరు నియోజకవర్గంలో మూతపడిన జంపని షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఉద్యోగులకు ఉపాధిని కల్పించటంతోపాటు రైతులను ఆదుకుంటామన్నారు.

గుంటూరు-తెనాలి-విజయవాడ ట్రైసిటీగా అభివృద్ది

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు కష్టాలే తప్ప ఒరిగేదేమీలేదని జగన్ సోదరి షర్మిల అన్నారు.జూలకల్లులో బుధవారం సాయంత్రం వైఎస్ ఆర్ విగ్రహావిష్కరణ అనంతరం ఆమె మాట్లాడారు. పంటలు పండించుకునేందుకు సాగునీరు అందదు. ఇంటికి వస్తే కరెంట్ ఉండదు. రైతులకు ఇబ్బందులు కాక సుఖం ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. మరో ఆరునెలలు,ఏడాదిలోపు జరిగే ఎన్నికల్లో జగన్ విజయం సాధించటం తథ్యమని, అప్పుడు ప్రజాసమస్యలు తీరుతాయని అన్నారు.వైఎస్ఆర్ చేసిన రుణమాఫీతో జూలకల్లు రైతులకు రూ.3కోట్లు లబ్ధిచేకూరిందని చెప్పారు. పలువురు మహిళల, విద్యార్థుల సమస్యలను తెలుసుకొన్నారు.

పరీక్షల సమయంలో విద్యుత్‌లేక చదువుకు ఆటంకం కలుతుతున్నదని, కాలనీలో మంచినీటి సమస్య ఎదురైనా పట్టించుకోనేవారేలేరని పేర్కొన్నారు. బ్యాంక్ రుణాలు అందటంలేదని పలువురు మహిళలు షర్మిలకు తెలిపారు.జూలకల్లు ఎస్సీకాలనీకి షర్మిల 11గంటలకు చేరుకుంది. ఆ సమయానికి ప్రత్యేక బస్సులో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ చేరుకొంది. షర్మిల కూడా బస్సులో తల్లి విజయమ్మతో 20నిమిషాలు, భోజన విరామ సమయంలో మరో అర్థగంట పాటు చర్చించారు. అనంతరం పందిటివారిపాలెంలో పాదయాత్ర నిర్వహించి బస చేసే ప్రదేశానికి ఆమె చేరుకొంది.

కార్యక్రమంలో మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, యనుముల మురళీధర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, కట్టా వెంకటేశ్వరరెడ్డి, గండికోట కోటేశ్వరరావు, చిట్టా విజయభాస్కరరెడ్డి, వుగ్గు నాగేశ్వరరావు, సజ్జల చంద్రయ్య, వై హెచ్ కె మోహనరావు, అల్లు పిచ్చిరెడ్డి, చల్లా పిచ్చిరెడ్డి, వి.కె.విశ్వనాథ్‌బాబు, తాడికొండ చిన ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ హయాంలో ప్రజలకు కష్టాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒత్తిళ్లకు ప్రభుత్వం దిగి వచ్చింది. నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలో ఆయకట్టుకు మూడు తడులు ఇచ్చామని, ఇక నీరు ఇచ్చేది లేదని చెబుతూ వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాగార్జునసాగర్, కలెక్టరేట్ ముట్టడి హెచ్చరికతో ఒక మెట్టు దిగింది. ఆరుతడి పంటలను కాపాడేందుకు మార్చి 1, 2 తేదీల్లో సాగునీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. డెల్టాలోనూ పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని, లేకుంటే ఆందోళన తప్పదని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి.

చంద్రబాబు జిల్లాల్లోకి అడుగు పెట్టిన రోజే పల్నాడు ప్రాంత రైతులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ నేతృత్వంలో రైతులు ఆయన్ని కలిశారు. ఆరుతడికి నీళ్లు ఇవ్వకపోవడంతో మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయని, తక్షణం నీరు విడుదల చేయించాలని కోరారు. ఆ రోజునే చంద్రబాబు స్పందించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రైతుల కష్టాలను వివరిస్తూ సాగునీటిని విడుదల చేయాలని కోరారు. సాగర్‌లో 490 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు తాము నీళ్లు ఇచ్చి చివరి భూముల పంటలను కూడా కాపాడామని, ఇప్పుడు 515 అడుగుల నీటిమట్టం ఉంటే ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సీఎంకు నీటి యాజమాన్యం, వ్యవసాయం గురించి తెలియదని వ్యాఖ్యానించారు. డెల్టా ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసిన రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతుండటాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఒక దశలో మహాధర్నాకు దిగాలని నిర్ణయించగా అదే రోజున భారీ వర్షం పడటంతో విరమించుకున్నారు. కొద్ది రోజులుగా ఎండలు పెరిగిన నేపథ్యంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతుల కడుపుమంటపై చంద్రబాబు కసిగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తనతో రావాలని సాగర్, కలెక్టరేట్‌ను ముట్టడిద్దామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సాగర్‌లో పంటలు కాపాడేందుకు మార్చి 1, 2 తేదీల్లో నీటిని విడుదల చేయించేందుకు ఒప్పించారు. డెల్టాలో పంటలకు నీటి విడుదల విషయంలో వారం తర్వాత నిర్ణయం తీసుకొంటామన్నారు. ప్రభుత్వంలో చంద్రబాబు చలనం తీసుకురావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు వత్తిళ్లకు దిగావచ్చిన ప్రభుత్వం


గుం'టూరు'ను వీడటం బాధగా ఉందని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. పాదయాత్ర చేపట్టిన తర్వాత ఏ జిల్లాలోనూ 22 రోజులు ఉండలేదు. గుంటూరు జిల్లాలోనే ఇన్ని రోజులు ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 201 కిలోమీటర్లు నడిచానని అన్నారు. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు. చంద్రబాబు పాదయాత్ర బుధవారం సాయంత్రం గుంటూరు జిల్లాలో ముగిసింది. ఈ నెల ఆరో తేదీన జిల్లాలోకి ప్రవేశించిన ఆయన 22 రోజుల పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 126 గ్రామాల్లో 201 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర కొనసాగించారు. రేపల్లె నియోజకవర్గంలోని పెనుమూడి వారధిపై కృష్ణానదిని దాటి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు.

బాధగా ఉంది

February 27, 2013

రెండు మనస్సులను, రెండు ప్రాంతాలను కలిపేది వారధి. కృష్ణా-గుంటూరు జిల్లాల సరిహద్దులోని గ్రామాలు.. అటోఇటో పోయి పనులు చేసుకునేవి. వరదో, మరో ప్రకృతి ఉపద్రవమో ముంచెత్తితే ఆ గ్రామాలన్నీ నీళ్లలో.. పనులు లేక జనమంతా కన్నీళ్లలో నానిపోవాల్సి వచ్చేది. అప్పట్లో నా దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారు. ఈ ప్రాంతాల మధ్య 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పులిగడ్డ-పెనుమూడి వారధి విషయం చెప్పుకొచ్చారు.
 

వరదల నుంచి ఆ ఊళ్లను కాపాడటమే కాదు.. కూలీనాలీ చేసుకొని బతికే ఆ ప్రజలకు ఒక్క పూట కూడా పూటగడవని పరిస్థితి రాకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. నేనిప్పుడు ఆ వారధిపైనే నిలబడి ఉన్నాను. గుంటూరు జిల్లాలో యాత్ర ముగించుకొన్న నన్ను కృష్ణా జిల్లాలోకి తోడ్కొనిపోయింది ఈ వారధే. అప్పుడు (1999) ఆరు నెలల కాలంలోనే నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ వంతెనపై అడుగులు వేస్తుంటే కాస్తంత ఉద్వేగానికి గురయ్యాను. అభివృద్ధికి చిహ్నమైన ఈ వారధి ఇప్పుడు మార్పుకూ సంకేతమే!

రేపల్లె నుంచి చాలామంది వారధి దాటి పనుల కోసం అవనిగడ్డకు వచ్చారు. వాళ్లంతా తిరిగి వెళుతూ నాకు ఎదురయ్యారు. ఎవరిని పలకరించినా వారధి కట్టి తమకు చేసిన మేలును పదేపదే ప్రస్తావించారు. వాళ్ల కళ్లలో ఆ సమయంలో గొప్ప సంతృప్తిని చూశాను. కూలి పనులు చేసుకునే తమను డ్వాక్రా సంఘాల్లో చేర్చిన వైనాన్ని వారిలో కొందరు ఆడపడుచులు గుర్తుచేశారు. ఆ సంఘాలు ఇప్పుడేమి చేస్తున్నాయని ఉత్సాహంగా ఆరా తీశాను.

కానీ, ఆ ప్రశ్నకు వాళ్ల ముఖాలు వెలవెలబోయాయి. 'ఏముంది సార్.. అప్పుడు నువ్వు మా ఆకలి చూశావు. ఇప్పుడు వీళ్లు మా అంతం చూస్తున్నారు. చదువుకోలేదని మాలో చాలామందికి బ్యాంకులు అప్పులివ్వడం లేదు. ఇదేమి చోద్యం సార్.. ఈ వయస్సులో మమ్మల్నెక్కడ చదువుకోమంటారు?'' అని ఓ మహిళ అమాయకంగా ముఖం పెట్టింది. రౌతు మెత్తనైతే బ్యాంకులూ బారెడు పొడవున కాళ్లు అడ్డుపెడతాయి మరి!

అభివృద్ధికి అది 'వారధి'!

'ముందస్తు' రావొచ్చు!
తాపీగా కూర్చుంటామంటే కుదరదు
పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

ముందస్తు ఎన్నికలు వచ్చినా రావొచ్చునని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తం చేశారు. గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న ఆయన.. అన్ని జిల్లాల నేతలతోజరిపిన టెలి కాన్ఫరెన్స్‌లోనూ, నల్లగొండ జిల్లా నేతలతో నిర్వహించిన సమీక్షలోనూ 'ముందస్తు' హెచ్చరికలను చేశారు. "ముందస్తు ఎన్నికలు రావచ్చునని అంటున్నారు. దేనికైనా సిద్ధంగా ఉండాలి. మీరు ఇలాగే తాపీగా ఉంటానంటే కుదరదు. ఇకనైనా కదలండి'' అని పార్టీ నేతలకు నిర్దేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోడానికి మండల స్థాయిలో పార్టీ యంత్రాంగం సమాయత్తం కావాలని కోరారు. పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు వచ్చేనెల 1, 2 తేదీల్లో అన్ని జిల్లాల్లో జిల్లా సమన్వయ కమిటీల సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొనసాగింపుగా మార్చి 4, 5,6, 7 తేదీల్లో అన్ని మండలాల్లో విస్తృత సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ చార్జీల పెంపుదల, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, విద్యార్థులకు ఉపకార వేతనాల విడుదలలో జాప్యం వంటి అంశాలపై పార్టీపరంగా ఉద్యమానికి సన్నద్ధం కావాలని ఉత్సాహపరిచారు.

"మనం కదలాల్సిన సమయం వచ్చింది. ఇంకా సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. మీరు ప్రజలకు దూరంగా ఉంటే ప్రజలు మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. వెనకబడిపోయిన వారి విషయంలో నేను కఠినంగా ఉండాల్సి వస్తుంది' అని హెచ్చరించారు. అంతకుముందు.. సహకార సంఘాల ఎన్నికల ఫలితాలపై నల్లగొండ జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సహకార ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

ప్రజల్లో వెనకబడితే సహించను

కాంగ్రెస్ అంటేనే కష్టాలు
అవగాహన లేని కిరణ్‌తో అధోగతే
సర్కారు తీరుతో డెల్టా రైతు ఆశలు ఉల్టా
జైల్లో జగన్‌కు దొంగ పూజలు: చంద్రబాబు ధ్వజం

కాంగ్రెస్ అంటేనే కష్టాలని, ప్రజాక్షేమం ఆ పార్టీకి ఏమాత్రం పట్టదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్..దొంగ పూజలు అందుకుంటున్నారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలో యాత్ర ముగించుకొని పులిగడ్డ- పెనుమూడి వారధి వద్ద ఆయన మలి విడత కృష్ణా జిల్లా యాత్రకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో వారధి మీదుగా ఆయన జిల్లాలో ప్రవేశించారు. వారధికి ఇరువైపులా మహిళలు బారులు తీరి ఉండటం కనిపించింది. ఆయనతో కరచాలనం చేసేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. ఎస్సీ వర్గీకరణ వద్దని మాలమహానాడు నేత గుంటూరు నాంచారయ్య నేతృత్వంలో కొంతమంది ఆ ప్రాంతానికి రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని పంపించివేశారు.

అనంతరం అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఆయన తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనను తూర్పారబట్టారు. "అవినీతి, అసమర్థ, దోపిడీ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిదర్శనం. ఆ పార్టీ నేతలకు ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టదు. కనీస అవగాహన లేని కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. వైఎస్ సీఎం అయిన తరువాత రాష్ట్రం అవినీతి మయం కాగా, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో అసమర్థత రాజ్యమేలుతోంది'' అని దుయ్యబట్టారు. 1994కి ముందు లోటు బడ్జెట్, కరెంటు కోత ఉండగా, 2004 నాటికి మిగులు కరెంటు, మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించామని గుర్తుచేశారు. తన హయాంలో 420 ఉన్న డీఏపీ బస్తా 1270కు పెరిగిందని చెప్పుకొచ్చారు.

డెల్టా ఆధునికీకరణ పనుల పేరుతో రెండో పంటకు నీళ్లివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటుందని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం జలయజ్ఞం పథకాన్ని ధనయజ్ఞంగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులకే దక్కిందన్నారు. స్వార్థం కోసం కాదు.. ప్రజా సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చారు. " తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశాను. రెండు పర్యాయాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. నా రికార్డు బ్రేక్ చేయాలంటే మరో ఇరవై ఏళ్లయినా పడుతుంది'' అని వివరించారు.

ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో ఉందని, పాలన సరిగా ఉంటే చైనాను అధిగమించే శక్తి మనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా, తీవ్రవాదులూ, మత కలహాలురేపేవారూ, రౌడీలూ సరిహద్దులు దాటిపోయారని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, అసమర్థ మంత్రుల వైఖరే దీనికి కారణమని దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, మచిలీపట్నం - రేపల్లె నడుమ కేరిడార్ ఏర్పాటు చేసి పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని చెప్పారు.

వైఎస్ పాలనంతా అవినీతే

జిల్లా రాజకీయ చరిత్రలో ఇదో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ రోజు. రాష్ట్ర రాజకీయాల్లో దిగ్గజమైన నాయకుడు 22 రోజుల పాటు అలుపెరగకుండా ప్రజాసమస్యలు తెలుసుకొనేందుకు జరిగిన సుదీర్ఘ పాదయాత్ర ముగియనున్న రోజు ఇది. ఇంతకుముందెన్నడూ మరే నాయకుడు నడకతోనే ఇన్ని రోజులు 201 కిలోమీటర్లకు పైగా దూరాన్ని జిల్లాలో చుట్టేసిన దాఖలాలు లేవు. మరుపురాని ఘట్టం ముగింపు గడియలకు చేరుకొన్న నేపథ్యంలో జిల్లా ప్రజానీకం ఆయనకు ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు సంసిద్ధమైంది. నేడు జిల్లాలోని రేపల్లె వద్ద పెనుమూడి వారధి మీదగా కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టనున్న ఆ అలుపెరగని పాదచారే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.

చంద్రబాబు కొనసాగిస్తోన్న 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర జిల్లా ప్రస్థానం బుధవారంతో ముగియనుంది.

ఈ నెల ఆరో తేదీన ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీతానగరం వద్ద జిల్లాలో అడుగుపెట్టిన ఆయన మండుటెండల్లో పాదయాత్ర కొనసాగించారు. తొలి రోజున ఏకబికిన విజయవాడ బస్టాండ్ సెంటర్ నుంచి చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల వరకు ఇంచుమించు 16.5 కిలోమీటర్లు నడిచి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ రోజున అర్ధరాత్రి ఒంటి గంట వరకు పాదయాత్ర కొనసాగింది. అదే సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రాత్రి 10 గంటల సమయానికి పాదయాత్ర ముగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో చంద్రబాబు వాటిని తూచ తప్పకుండా పాటిస్తూ వచ్చారు. పాదయాత్రలో ప్రధానంగా ప్రజల వద్దకు వెళ్లి వారిని 'ఏవమ్మా... బాగున్నారా... తమ్ముళ్లు మీరు హుషారుగా ఉన్నారంటూ' అప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకొన్నారు.

జిల్లాలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సాగునీరు, ఎరువుల అధిక ధరలు, పత్తి, మిర్చి, మినుముకు గిట్టుబాటు లేకపోవడం తదితర సమస్యలను ఆయన అధ్యయనం చేశారు. అలానే కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు లేకపోవడాన్ని గుర్తించారు. డ్వాక్రా మహిళలకు పావలావడ్డీ అందకపోతుండటం, వంటగ్యాస్, బియ్యం, కందిపప్పు వంటి నిత్యవసర సరుకుల ధరలతో వేగలేకపోతుండటాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యుత్ సర్‌చార్జీల భారాన్ని మోయలేకపోతుండటాన్ని గమనించిన ఆయన ప్రజలను పూర్తిస్థాయిలో చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు అర్థమయ్యేలా పొడుపుకథలు చెప్పి జగన్, వైఎస్, కాంగ్రెస్ నాయకులు దోపిడీలను ఎండగట్టారు.

మంగళగిరి, గుంటూరు పశ్చిమ, పెదకాకాని, తెనాలి, వేమూరు, కొల్లూరు, రేపల్లెలో చంద్రబాబు వెంట వేల సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో నడవడం విశేషం. ఎనిమిది నియోజకవర్గాలు, ఒక కార్పొరేషన్, నాలుగు మునిసిపాలిటీలు, 126కు పైగా గ్రామాల్లో పాదయాత్ర సుదీర్ఘంగా జరిగింది. చంద్రబాబు జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత యాత్రలో కొన్ని మార్పులు చోటు చేసుకొన్నాయి. వైద్యుల సూచన మేరకు ప్రతి ఆదివారం సెలవు తీసుకోవాలని నిర్ణయించి తొలి వారం దానిని పాటించారు. అయితే మరుసటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కారణంగా 48 గంటల పాటు విశ్రాంతికి పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో ఆయన గడిచిన రెండు ఆదివారాలు విశ్రాంతి తీసుకోలేదు. హైదరాబాద్ బాంబుపేలుళ్ల సంఘటనతో చలించిపోయిన ఆయన దిల్‌షుక్‌నగర్ వెళ్లి పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించి వచ్చి మళ్లీ అదేరోజున పాదయాత్రను కొనసాగించారు.

కొలకలూరులో చంద్రబాబు ప్రసంగిస్తున్న స్టేజ్ మెట్లు కూలిన సంఘటనలో ఆయన కుడికాలి మడమ ఒత్తిడికి గురికాగా కేవలం 15 గంటల విశ్రాంతి మాత్రమే తీసుకొని మరలా రోడ్డెక్కి ప్రజల వద్దకు వచ్చారు. వైద్యులు, పార్టీ సీనియర్ నేతలు పాదయాత్రను ముగించాలని చెప్పినా ఆయన ఆలకించలేదు. 'తాను చేస్తున్నది పవిత్రమైన పాదయాత్ర అని' చెబుతూ తాను శ్రీకాకుళం వరకు నడవాలని నిర్ణయం తీసుకొన్నానని, గమ్యం చేరేవరకు విరమించబోనని మొండిగా ముందుకెళుతున్నారు. చంద్రబాబు ప్రతి రోజు ఉదయం 11 గంటలకు పాదయాత్రను ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత భోజన విరామానికి ఆగి ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులతో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలు కాగానే రోడ్డు మీదకు వచ్చేసి ఆ రోజున ఎక్కడైతే శిబిరం ఏర్పాటు చేస్తారో ఎంత సమయమైనా అక్కడి వరకు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 22 రోజుల పాదయాత్రలో ఆయన ఏరోజూ రాత్రి 12 గంటల సమయం దాటనిదే శిబిరానికి చేరుకోలేదు.

టీడీపీ జిల్లా శ్రేణుల్లో సమరోత్సాహం

చంద్రబాబు జిల్లాలో అడుగు పెట్టకముందు పార్టీ శ్రేణులు స్తబ్ధతగా ఉన్నాయి. అధినేత రాక తో నాయకులంతా ఒక్కటయ్యారు. కార్యకర్తల్లో చైతన్యం నింపారు. జనస్పందన అనూహ్యంగా ఉందని, కీపిటప్ అంటూ నేతలను అధినేత భుజంతట్టి ప్రోత్సహించారు. నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు బుధవారం ఉదయం సమావేశమై పార్టీ పటిష్ఠతకు చేపట్టాల్సి చర్యలపై ప్రసంగిస్తారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు శ్రావణ్‌కుమార్, కే వీరయ్య, రాజనారాయణ, సత్యప్రసాద్, జియావుద్దీన్, యాగంటి దుర్గారావు, గోవర్ధన్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, కోవెలమూడి రవీంద్ర, వైవీ ఆంజనేయులు, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ముత్తినేని రాజేష్, వజీర్, మానుకొండ శివప్రసాద్, సుకవాసి శ్రీనివాసరావు, ములకా సత్యవాణి, పానకాల వెంకటమహాలక్ష్మి, రాణి తదితరులు పాదయాత్రలో ముందుండి ప్రజలను చైతన్యవంతులను చేశారు.

అలుపెరుగని పాదచారి

శ్రీకాకుళం వరకు వస్తున్నా... మీకోసం పాదయాత్రను కొనసాగించి తీరుతానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా పార్టీ నాయకులు గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తోన్న చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు మం డుతున్న ఎండలు, ఆరోగ్యం దృష్ట్యా పాదయాత్రను విరమించాలని కోరా రు. అందుకు చంద్రబాబు సున్నితం గా తిరస్కరిస్తూ తాను ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు కష్టమైనా పాదయాత్ర కొనసాగిస్తున్నానని చెప్పారు. శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగించాలన్న నిర్ణయం తీసుకొన్నానని, ఎన్ని కష్టాలు ఎదురైనా మే ఒకటో తేదీ లోగా గమ్యస్థానానికి చేరుకొంటానని స్పష్టం చేశారు. అనంతరం వరంగల్ జిల్లాలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు వారితో సమీక్షించారు. ఇటీవల వెలువడిన సహకార ఎన్నికల ఫలితాలను సమీక్షించారు. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ పని అయిపోయిందని, ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేకపోయాయన్నారు. వైసీపీ నిలబడలేదని, అది తల్లి కాం గ్రెస్‌లో కలసిపోవడం ఖాయమన్నా రు. సమష్ఠిగా పని చేసి పార్టీని పటిష్ఠవంతం చేయాలని ఆదేశించారు. చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో వరంగల్ జిల్లా టీడీపీ నాయకులు రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, బసవారెడ్డి, సత్యవతి రాథోడ్, వెంకటేశ్వర్లు, ధర్మారెడ్డి, ఈగం మల్లేష్, అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కేసు పెడితే బుద్ధి చెబుతాం

రైతుల కడుపుమంటపై తమ అధినేత చంద్రబాబు మాట్లాడితే కేసులు పెడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరికలు చేస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రైతులకు నీళ్లివ్వడం చేతకాని కాంగ్రెస్ నాయకులు తప్పుడు కేసులు పెట్టడంలో మాత్రం ముందుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగిస్తా

February 26, 2013

పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. కులవృత్తులు కునారిల్లుతున్నాయి. నూలుతాళ్లు నేతన్నల పాలిట ఉరితాళ్లవుతున్నాయి. గీత కార్మికుల కష్టాలు ఆ తాడిచెట్టంత ఎత్తున తిష్టవేసి ఏడిపిస్తున్నాయి. మంగళగిరిలో చేనేతల నుంచి రేపల్లెలో కల్లు గీత కార్మికుల దాకా, గుంటూరు పట్టణంలో వస్త్ర వ్యాపారుల నుంచి తెనాలిలో ముస్లిం యువకుల దాకా.. అందరూ ఏదోరకంగా ఈ చేతగాని సర్కారుకు బాధితులేననిపించింది.

గుంటూరు జిల్లా ఆ కొస నుంచి ఈ కొసకు రావడానికి ఇరవై రోజులుపైనే పట్టింది. ఈ మధ్యకాలంలో కలిసిన ఏ సామాజికవర్గంగానీ, ఏ చేతివృత్తిదారుగానీ ఏకరువు పెట్టిన సమస్యల సారాంశం ఒక్కటే. ప్రభుత్వం పనిచేయడం లేదనే కసిని, కన్నీటిని వాళ్లలో ఏకకాలంలో చూశాను. అభివృద్ధి చెందడానికి అన్ని అర్హతలున్నా కేవలం రాజకీయ కారణాలతో కావాలని దూరం పెడుతున్న ఊళ్లనెన్నింటినో ఊరడించాను. ఇందిరమ్మ ఇళ్ల నుంచి రక్షిత జల పథకాలదాకా, ఏదీ అందని గ్రామాలెన్నింటినో పలకరించాను.సమస్త వర్గాల, జనుల బాధలకు ఈ జిల్లాయే ఖిల్లా!

వనరులున్నాయి. వాటిని ఉత్పత్తులుగా మలచగల మందిబలం ఉంది. ఇక్కడ లేనిదల్లా మంచి సంకల్పం కొరవడిన పాలకులే! జిల్లాలో వెయ్యికి పైగా జౌళి మిల్లులున్నాయి. అందులో 80 శాతం మూతబడ్డాయి. పెట్టుబడి లేకనో, శ్రమశక్తులు లేవనో కాదు..సకాలంలో కరెంటు ఇవ్వకపోవడంతో ఊపిరి ఆగింది. ఒక పరిశ్రమ పోతే.. ఎన్ని చేతులు ఖాళీ అవుతాయో, ఎన్ని కడుపులు మాడతాయో, ఎంతమంది కుటుంబాలకు దూరమై వలసబాట పడతారో..ఎంత చెప్పినా ఎందుకు అర్ధం కాదో! పల్లెలను ముంచితే ఆ పాపం పది జన్మలెత్తినా పోదు!

నూలు తాళ్లే ఉరితాళ్లవుతున్నాయి!

ఇంటికొకరొస్తే నీళ్లిప్పిస్తా!

కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ఆరుతడి పంటలకు సాగునీరు ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని తెలుగుదేశం పా ర్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. డెల్టా పరిధిలో ఇంటికొకరు తన వెంట వస్తే, గుంటూరు కలెక్టరేట్ ఎదు ట మహాధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. "ముందు రై తులకు నీరు విడుదల చేయండి. మొక్కజొన్న, మిను ము, పెసర పంటలను కాపాడండి. ఆ తర్వాత నాపై కేసులు పెట్టుకోండి'' అని ఆయన ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం విశ్వేశ్వరపురంవద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మోర్తో ట, మైనేనివారిపాలెం, నల్లూరు, రుద్రవరం మీదుగా పెనుమూడి-పులిగడ్డ వారధి వరకు 13.5 కిలోమీటర్లు నడిచారు. ఈ క్రమంలో సాగునీరు లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆయన వద్ద వాపోయారు. "డెల్టాకు సాగునీరు విడుదల చేయాల్సిందిగా పదేపదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాను. సీఎంకు అనేక లేఖలు రాసినా కదలిక లేదు'' అని చంద్రబాబు మండిపడ్డారు.

పోలీసులు, రెవెన్యూ, ఎమ్మెల్యేలను కాలువలపై పెట్టి చివరి భూములకు కూడా సాగర్ నీళ్లిచ్చిన ఘనత తమదని గుర్తుచేశారు. అనంతరం తనను కలిసిన కల్లుగీత కార్మికుల వెతలు ఆలకించారు. "పట్టణ ప్రాంతాల్లో చుట్టూ 60 కిలోమీటర్ల వరకు కల్లు విక్రయించరాదన్న జీవో దుర్మార్గం. గీత కార్మికుల కడుపు కొట్టారు'' అని మండిపడ్డారు.

జిల్లాలో నేటితో యాత్ర ముగింపు: గుంటూరు జిల్లా లో బుధవారం మధ్యాహ్నం పాదయాత్ర ముగియనుం ది. ఈనెల 6న విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఆయన గుంటూరులో ప్రవేశించారు.

మహాధర్నాతో సర్కారును కదిలిద్దాం: బాబు

32 మంది ఎంపీలుండీ దండగ
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం: చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి రైల్వే బడ్జెట్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రం నుంచి 10 మంది కేంద్ర మంత్రులు, 32 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండీ ఒరగబెట్టిందేం లేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిదేళ్లుగా రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యే ఎదురవుతోందని ధ్వజమెత్తారు. ప్రస్తుత బడ్జెట్‌లో చార్జీలు పెంచబోమని చెబుతూనే.. రిజర్వేషన్, తత్కాల్, టిక్కెట్ రద్దు చార్జీల రూపంలో ప్రయాణికులపై దొడ్డిదారిన భారం మోపారని విరుచుకుపడ్డారు.

రైల్వే శాఖ సహాయ మంత్రిగా రాష్ట్రానికి చెందిన ఎంపీ ఉన్నా.. ప్రయోజనం చేకూర్చలేకపోయారని విమర్శించారు. ఇంకా.. ఆ పార్టీ నేతలు ముద్దుకృష్ణమనాయుడు, దాడి వీరభద్రరావు, మోత్కుపల్లి నర్సింహులు, రాజేంద్ర ప్రసాద్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్, రమేశ్ రాథోడ్, సుధారాణి, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప కూడా రైల్వే బడ్జెట్‌పై నిప్పులు చెరిగారు. కాగా.. హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలని పార్టీ ఎంపీ సుజనా చౌదరి రాజ్యసభలో కోరారు.

కాంగ్రెస్‌కు ఇదే చివరి రైల్వే బడ్జెట్


పేద ప్రజలకు కూడు, గూడు, నీడ తన ఎజెండాలోని ప్రధాన అంశాలుగా చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు, వీధిలైట్లు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు చేపడతానని తన విజన్‌ను చెబుతున్నారు. ఆడబిడ్డల మాన, ప్రాణాలకు రక్షణ కల్పిస్తానని, రైతులకు వ్యవసాయం లాభసాటి చేస్తానంటూ హామీలు ఇస్తూ చంద్రబాబు తన పాదయాత్రను జిల్లా లో ముగింపు గడియలకు తీసుకొస్తున్నారు.

రేపల్లె నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలైన అరవపల్లి, నల్లూరుపాలెం, సింగుపాలెం, విశ్వేశ్వరపా లెం, బొబ్బర్లంక తదితర గ్రామాల్లో పాదయాత్రను కొనసాగించిన చం ద్రబాబు మంగళవారం మరి కొన్నింటి లో కొనసాగించి బుధవారం కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టే దిశగా ముం దుకు సాగుతున్నారు. చంద్రబాబు ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలకు ఇప్పటివరకు 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి గురించి చెబుతూ తాను అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను పూస గుచ్చినట్లు వివరిస్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారు. ప్రధానంగా తాగునీరు, వ్యక్తిగత మ రుగుదొడ్ల సమస్యలను ప్రస్తావిస్తున్నా రు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తా ను కూడు, గుడ్డ, నీడ ప్రాధాన్యాంశాలుగా అమలు చేస్తానని హామి ఇస్తున్నారు.

కాంగ్రెస్, వైసీపీలపై చంద్రబాబు తన ఆరోపణల పరంపరను కొనసాగించారు.

కాంగ్రెస్ నాయకులు దు ర్మార్గులని, సేవాభావం లేకుండా ప్రజలను దోపిడీ చేయడమే పనిగా పెట్టుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నీతిని ప్రభోదించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొన్ని సంఘటనలను ఉదహరిస్తున్నారు. రేపల్లెలో ఓటమిపాలైన టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ సేవాభావంతో ముందుకెళుతూ ప్రజల మధ్యన ఉంటే గెలిచిన మోపిదేవి జైలు పాలయ్యాడని చెబు తూ ఎవరు నీతిమంతులో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి పీఏ అలీఖాన్ ఖా తా నుంచి జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో ఓబుళాపురం గనుల అవినీతి పారింది. అలాంటి గాలితో స్నేహం చేసిన వీళ్లు అధికారంలోకి వస్తే ఇంటి పైకప్పు కూడా ఉండకుండా చేస్తారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

రైతుల కడుపుమంట చూసి నేను ప్రభుత్వంపై తిరుబాటు చేయాలని చెప్పాను. కృష్ణా పశ్చిమ డెల్టాకు రెండో తడి ఇవ్వమని 20 రోజులుగా గొంతెత్తి డిమాండ్ చేస్తున్నాను. అయినా స్పందించకపోవడంతో రైతు లు పొలం పనికి ఉపయోగించే కత్తి, కొడవలితో రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిస్తే నాపై కేసులు పెడతానికి సిద్ధమయ్యారు. వాళ్ల బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు నేను భయపడేది లేదు. ముందు సాగునీరు ఇచ్చి ఆ తర్వాత కేసులు పెట్టుకోండి. రైతుల కోసం నేను ఎలాంటి కేసులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉ న్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.

వైఎస్ ఒక పులిలాంటి వాడు అడవిలో ఉన్న ఒక పులి మనుషులను తినడం మరిగింది. ఆ పులి మ నుషులను తేలిగ్గా తినేయాలని తన కాలికి ఒక బంగారు కంకణం కట్టుకొంటుంది. తన వద్దకు వస్తే అది ఇస్తానని చెప్పి మనిషి రాగానే అతన్ని చంపేసి తినేస్తుంది. వైఎస్ కూడా అదే పని చేశాడు. కేజీ రూ.2 బియ్యం, ఆరోగ్యశ్రీ ఆశ చూపించి రాష్ట్ర ప్రజలను మింగేశాడు. శుష్క వాగ్దానాలు చేసి రూ. లక్ష కోట్లు వెనకేసుకొన్నాడు. ఈ విషయంలో ప్రజలకు ఒక స్పష్టత రావాల్సి ఉందని చంద్రబాబు పొడు పు కథ ద్వారా రేపల్లె శివారు గ్రామా ల ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

ప్రధాని మీనమేషాలు లెక్కిస్తున్నారు కాంగ్రెస్ హయాంలో తీవ్రవాదు లు పేట్రేగిపోతున్నారు. హైదరాబాద్‌లో మక్కామసీదు, గోకుల్‌చాట్, లుంబినీపార్కు, దిల్‌షుక్‌నగర్‌లో బాంబులను పేల్చి వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకొన్న ఉదంతాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి వచ్చి కూడా మరలా బాంబు పేలుళ్లు జరగకుండా గట్టి చర్యలు చేపడతామని చెప్పలేకపోతున్నారంటే ప్రజల రక్షణకు ఈ ప్రభుత్వం ఏపాటి ప్రాధాన్యం ఇస్తుం దో గమనించాలని చంద్రబాబు చెబుతున్నారు.

మహిళల నీరాజనాలు చంద్రబాబు పాదయాత్ర సాగిన అరవపల్లి, ఊరుపాలెం, నల్లూరుపాలెం, సింగుపాలెం, విశ్వేశ్వరపాలెం, బొబ్బర్లంక, కనగాలవారిపాలెంలో మహిళలు నీరాజనాలు పలికారు. ది ష్టి గుమ్మడికాయతో ఎదురొచ్చి చంద్రబాబుకు దిష్టి తీసి కర్పూరంతో హారతిచ్చి నుదుటిన తిలకం అద్ది దీవించారు. చంటిపాపలను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చి నామకరణం చే యించారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ, తెలుగు మహిళలు ము లకా సత్యవాణి, కేసనశెట్టి రామశాంతాదేవి తదితరులు చంద్రబాబు పాదయాత్ర జరిగే గ్రామాలకు ముందుగానే వెళ్లి మహిళల్లో చైతన్యం నింపుతున్నారు. ఇదేవిధంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, నగర నేతలు ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్ యువతను చైతన్యవంతం చేస్తున్నారు.

పేదలకు కూడు.. గూడు..

February 25, 2013

సొంత లాభం కొంత మానుకొని పరుల మేల్ తలపెట్టవోయ్.. అన్నారు గురజాడ. ఆ మహాకవి స్ఫూర్తిని అందిపుచ్చుకున్నదా అన్నట్టు ఉంది ఆ గ్రామం. సంపాదనలోనే కాదు.. సంస్కారంలోనూ ముందుగా నల్లూరిపాలెం పేరు చెప్పాల్సిందే. తింటే నేల పాలు.. పంచితే పరుల పాలు అన్నట్టు..తమకు ఉన్నంతలో ఊరి బాగు కోసం గ్రామస్తులు ఆలోచిస్తున్నారు. వాళ్ల ఆలోచన వికసించడానికి దోహదపడిన అనేకానేక విషయాల్లో నాకూ భాగం ఉండటం సంతృప్తినిచ్చింది. ఇప్పుడు ఇది ఆదర్శగ్రామం.

ఆ విషయం ఊళ్లో అడుగుపెట్టగానే అర్థమయిపోతుంది. డ్రైనేజీ వ్యవస్థ నుంచి కొళాయి సదుపాయం దాకా.. ప్రతిదాన్నీ సొంత చైతన్యంతో సమకూర్చుకున్నారు. మెజారిటీ ఉన్నత విద్యావంతులే. అంతేకాదు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పెద్ద హోదాల్లో ఉన్నారు. ఏనాడూ మాకిది కావాలని చెయ్యి చాపిన చరిత్ర కనిపించదు. కుటుంబ సమస్యల నుంచి ఊరి సమస్యల వరకు, తలా చెయ్యి వేయడమే వారికి తెలుసు. అలాంటి ఊరికి ఊతం ఇవ్వడానికి సర్కారుకు చేతులెందుకు రావో!

ఎంత విచిత్రం..! నల్లూరిపాలేన్ని చూసిన కళ్లతో అరవపల్లిని చూసినప్పుడు కలిగిన భావన ఇది. ఊరూవాడా సమస్యల్లోనే ఉంది. మాదిగవాడలో రోడ్డు కొట్టుకుపోయి రాళ్లుపైకి తేలితే.. కాపుల బజారులో డ్రైనేజీ లీకయి ఇళ్ల ముందుదాకా మురుగు కాలువ ప్రవాహాలే. చిన్నపాటి వర్షాలకు కూడా గ్రామాలు గోదారులవుతున్నాయట.. అదేసమయంలో మంచినీళ్ల కోసం బిందెల పోరూ తప్పడం లేదట. ఎంత విచిత్రమిది! ఊళ్లో పడిన చినుకుని వడిచి పట్టుకొనే సమగ్ర వ్యవస్థ, వ్యూహమేది? ఇంకుడుగుంతల వ్యవస్థ గురించి ఊరిజనం గుర్తు చేశారు. ఈ మాత్రం జ్ఞానం, జ్ఞాపకం హైదరాబాద్‌లో కూర్చున్న మహానుభావులకుంటే పల్లెలిలా వెల్లకిలా పడేవి కావు కదా!

పరుల మేలు కోసం తలో చేయి!

కేసులకు భయపడం
బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?
నేను రెచ్చగొట్టడం లేదు..
రైతుల కడుపుమంట చెబుతున్నా
ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలి
పాదయాత్రలో కాంగ్రెస్‌పై చంద్రబాబు ఫైర్

కాంగ్రెస్ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి భగ్గుమన్నారు. రైతుల కడుపుమంటపై మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? బ్లాక్‌మెయిల్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి బెదిరింపులకు భయపడేది లేదని, రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం జైలుకెళ్లేందుకూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ముందు రైతులకు సాగునీరు అందించి ఆ తర్వాత మాట్లాడాలని ఎద్దేవా చేశారు. రేపల్లె నియోజకవర్గంలోని అరవపల్లి నుంచి చంద్రబాబు తన 146వ రోజు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రను సోమవారం కొనసాగించారు.

నల్లూరుపాలెంలో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించిన చంద్రబాబు తనపై కేసులు పెడతామని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు దీటుగా జవాబిచ్చారు. "రేపల్లె నియోజకవర్గంలోని మోర్లవారిపాలెంలో గీత కార్మికులు పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పించాయి. మొక్కజొన్న, మినుము, పెసర పంటలకు ఒక తడి నీళ్లు ఇవ్వకపోతే అవి ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాటవరసకు రైతులు వ్యవసాయానికి ఉపయోగించే కొడవలితో రోడ్డెక్కి నిరసన తెలియజేయమన్నాను. దానికి నేనేదో రెచ్చగొడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు గొంతు చించుకుంటున్నారు'' అని చంద్రబాబు ఆక్షేపించారు.

తొమ్మిదేళ్ల కాంగ్రెస్ రాక్షస పాలనలో కరెంటు లేక, సాగునీరు విడుదల కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో ఒక్క తడి నీళ్లు ఇస్తే ఆరుతడి పంటలు చేతికొచ్చి రైతులు గట్టెక్కే పరిస్థితి ఉంటుందన్నారు. సాగునీటి కోసం ప్రజలు తిరుగుబాటు చేయాలని తాను పిలుపునిస్తే రైతులకు మేలు చేయడం చేతగాని కాంగ్రెస్ పార్టీ తాను రెచ్చగొడుతున్నట్లు పేర్కొంటోందన్నారు. ఇది రెచ్చగొట్టడం కాదని, రైతు కడుపు మంట చెబుతున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా తాను భయపడబోనని, రైతుల కోసం తాను ఏమైపోయినా ఫర్వాలేదని తేల్చిచెప్పారు. ఉగ్ర దాడిపై హెచ్చరికలు వచ్చినా నిర్లక్ష్యం చేసిన సీఎం కిరణ్‌పై ఏ కేసు పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు.

బసవతారకం స్వగ్రామంలో...
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ సతీమణి బసవతారకం స్వగ్రామం లో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా అందులో పాల్గొంటారని సమాచారం. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని కొమరవోలు గ్రామం చంద్రబాబు రెండో విడత యాత్రా మార్గంలో వస్తోంది. పామర్రు నుంచి గుడివాడ వెళ్లే దారిలో ఈ గ్రామం ఉంది. షెడ్యూలులో మార్పులేమీ లేకపోతే మార్చి 4న ఈ గ్రామం మీదుగా ఆయన వెళ్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

బాబు వ్యాఖ్యలపై ఫిర్యాదు

హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పీసీసీ మీడియా అధికార ప్రతినిధి ఎండీ హిదాయత్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా పేటేరు సభలో చంద్రబాబు "రైతులు, కత్తులు, కొడవళ్లతో... గీత కార్మికులు మోకులతో రోడ్డెక్కి తిరగబడాలి. రైతులను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను చంపాలి'' అంటూ హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.


రైతు ప్రయోజనాల కోసం జైలుకైనా వెళతా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర 146వ రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం రేపల్లె మండలం అరవమల్లి నుంచి బాబు పాద యాత్రను ప్రారంభించారు. ఆయన వెంట భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు నడుస్తున్నారు.

146వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

రైతులు, గీత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలపై చంద్రబాబు కన్నెర్ర చేశారు. డెల్టా రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోన్న ప్రభుత్వాన్ని కబడ్దార్... అంటూ హెచ్చరించారు. రైతు, చేనేత, గీత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..ఈ పరిస్థితికి కారణమైన కాంగ్రెస్‌పై తిరగబడాలని పిలుపునిచ్చారు. రేపల్లె నియోజకవర్గంలోని పేటేరు, మోర్లవారిపాలెం, బేతపూడిలో చేనేత, గీత కార్మికుల కష్టాలను చూసి చలించిన చంద్రబాబు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆపార్టీని భూస్థాపితం చేయాలంటూ పిలుపిచ్చారు.

రేపల్లె నియోజకవర్గంలోని పేటేరు నుంచి చంద్రబాబు ఆదివారం పాదయాత్రను కొనసాగించారు. పేటేరు, మోర్లవారిపాలెంలో నేత, కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను విని చలించిపోయారు. కాంగ్రెస్ నాయకులు దుర్మార్గులని, ఎవడబ్బ సొమ్మని వైఎస్ తన కుమారుడు జగన్‌కు రూ. లక్ష కోట్లు దోచి పెట్టాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాన్‌పిక్ పేరుతో పేదల భూములను కారుచౌకగా ఎకరం రూ. లక్షకు బలవంతంగా లాక్కొని అవే భూములను నేడు రూ. 30 లక్షలకు విక్రయించే పరిస్థితికి వచ్చారన్నారు. రేపటి రోజున వాటి ధర రూ. కోటికి చేరుతుందన్నారు.

కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ దొంగలు బాధితులకు వచ్చిన సాయాన్ని దోచేశారని ఆరోపించారు. ప్రజలు చైతన్యవంతులు కాకపోతే ఆడబిడ్డల నెత్తిన ఉన్న శిరోజాలు కూడా లేకుండా చేస్తారని హెచ్చరించారు. మీరు మోపిదేవి వెంకటరమణను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన మంత్రి అయి వాన్‌పిక్‌లో అక్రమాలకు పాల్పడి చంచల్‌గూడ జైలుకు వెళ్ళాడని, అదే తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ అనగాని సత్యప్రసాద్ ప్రజల మధ్యన ఉన్నాడు. రెండు పార్టీల మధ్యన తేడాని గమనించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు

పేదలకు కిలో రూపాయి బియ్యం అమలు చేయాలని, అలా కాకుండా నగదు బదిలీ పథకం కింద రూ. 13 ఇస్తామంటే కుదరదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేషన్‌కార్డుదారులందరికీ బియ్యమే ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ 'కసాయి' నమ్మారు 'గొర్రె ఎప్పుడూ కసాయి వాడినే నమ్ముతుంది. వాడే తన ప్రాణాలను బలిగొంటాడని దానికి ఏమాత్రం తెలియదు. అలానే మీరు తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్మి బలైపోతున్నారని' చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు దొంగల చేతికి తాళాలిచ్చారు. నా చేతిలో ఏమి లేదు. ఎన్నికల ఒక్క రోజున నన్ను గుర్తు పెట్టుకొంటే ఐదేళ్లు మీ బాగోగులు చూసుకొంటానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ స్తంభింప చేస్తాం రబీలో ఆరుతడి పంటలు వేసిన రైతాంగానికి భగవంతుడు దయతలచి అకాలవర్షం రూపంలో ఒక తడి ఇచ్చాడు. ఇప్పుడు మరో తడి కావాలి. అది కనక ప్రభుత్వం ఇవ్వకపోతే కబడ్దార్..అంటూ హెచ్చరించారు. లేకుంటే ఎక్కడికక్కడ పరిపాలనను స్తంభింప చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

బాబుతో స్వరం కలిపిన ప్రజలు ప్రభుత్వం పెడుతోన్న కష్టాలతో విసిగి వేసారిపోయామని పేటేరు, మోర్లవారిపాలెంలో పలువురు చంద్రబాబు స్వరానికి జత కలిపారు. 'పావలావడ్డీ, వడ్డీలేని రుణాలు అంటూ ప్రభుత్వం మమ్మల్ని నిలువునా మోసం చేసింది. రూ. లక్ష అప్పు తీసుకొంటే రూ. మూడు లక్షలు కట్టాల్సి వస్తోంది. ఇదేనా వడ్డీ లేని రుణాలంటూ' ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగారం తిరిగి ఇప్పిస్తామన్న హామీకి విశేష స్పందన వ్యవసాయం కోసం బ్యాంకుల్లో ఆడబిడ్డల బంగారాన్ని తాకట్టు పెట్టిన వాళ్ల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు ఇస్తోన్న హామీకి జిల్లా ప్రజానీకం నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. చాలామంది మహిళలు బంగారు నానుతాడు, గొలుసు వంటి ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకొన్నారు. దాంతో వారు మెడలో పసుపుతాడు, కొమ్ము ధరిస్తున్నారు. పాదయాత్రలో ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఒక అన్నగా, తమ్ముడిగా ఆడవాళ్ల మెడలను తిరిగి బంగారు నగలతో నింపుతానని ఇస్తోన్న హామీకి మహిళలు నీరాజనాలు పడుతున్నారు.

చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జేఆర్ పుష్పరాజ్, రేపల్లె ఇన్‌చార్జ్ అనగాని సత్యప్రసాద్, పార్టీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, తెనాలి శ్రావణ్‌కుమార్, నిమ్మకాయల రాజనారాయణ, కందుకూరి వీరయ్య, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ముత్తినేని రాజేష్, ములకా సత్యవాణి తదితరులు నడిచారు.

ఖబడ్దార్..


రాష్ట్రంలోని అత్యంత సంపన్నుల్లో ఆ యన ఒకరు... అనేక పరిశ్రమలకు అధిప తి... ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఆ యన ఒకరి మాటకు కట్టుబడి ఉంటారు. ఆయనే గరికపాటి మోహనరావు... తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... చంద్రబాబే శ్వాసగా.. ధ్యాసగా ఆయన వెన్నంటే ఉంటూ వస్తున్నా మీకోసం పాదయాత్రకు సారధ్యం వహిస్తున్నారు. బాబు పాదయాత్ర 145 రోజులుగా ప్రశాంతం గా, ఇబ్బందులు లేకుండా ఓ ప్రణాళిక ప్రకారం సాగిపోవటానికి కారణమైన వ్యక్తుల్లో గరికపాటి ఒకరు.

చంద్రబాబు పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ఎక్కడికక్క డ టీమ్ మొత్తం బస చేస్తుంది. ఆ శిబిరం నిర్వహణను గరికపాటి మోహనరావు చూసుకుంటారు. అక్కడే చంద్రబాబు ఒక బస్సులో నిద్రిస్తే, ఆ పక్కనే మరో బస్సులో గరికపాటి నివాసం ఉంటుంది. బాబు ఉదయం రెడీ అయ్యేలోగా గరికపాటి సిద్ధంగా ఉంటారు. ఈలోగా చంద్రబాబు రాష్ట్ర పార్టీ నేతలతో మాట్లాడాల్సిన పనులు కూడా మోహనరావుకు చెబుతుంటారు. వారితో మాట్లాడి ఆ సమాచారాన్ని తిరిగి చంద్రబాబుకు చెబుతారు.

30 ఏళ్లుగా బాబు వెంటే... ముప్పై ఏళ్లుగా పార్టీలో ఉండి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా గరికపాటి మాత్రం సింపుల్‌గా ఉంటారు. పార్టీలో ఎన్ని పనులు చేస్తున్నా తెరపై కనిపించే వ్యక్తి కాదు. టీడీపీ నిర్వహించిన యువగర్జన, మహానాడు, బాబ్లీ ఉద్యమంలోనూ గరికపాటి కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉండే ఆయన ఏనాడూ పదవుల కోసం ఆశించలేదు. అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీలో ఏ పని అప్పగిస్తే ఆ పనికి నూరుశాతం న్యాయం చేసేందుకు ఆరాటపడతారు. గతంలో బాబు గొంతు సమస్యతో బాధ పడుతున్న సమయంలోనూ గరికపాటి మోహనరావే బాబు తరపున టెలికాన్ఫరెన్స్ నిర్వహించా రు. 2004లో చంద్రబాబు ఓటమి పాలై గవర్నర్‌కు రా జీనామా పత్రం అందజేసిన సమయంలో అరగంట క్రితం ఎ లా ఉన్నారో(సీఎం) అలా చూసే వరకు మీ వెంటే ఉంటాన ని చంద్రబాబుతో చేసిన వాగ్ధానాన్ని మరచిపోలేదు.

ఆ లక్ష్యం కోసమే చంద్రబాబు చేపట్టిన ఏ కార్యక్రమంలోనైనా ముందంజన నిలుస్తారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆరంభం నుంచి బాబుతోనే కొనసాగుతున్నారు. వ్యాపారా లు కుటుంబీకులకు అప్పగించి తాను పాదయాత్రలో పా ల్గొంటున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన గరికపాటి, వ్యవహార శైలి సాధారణంగానే ఉంటుంది. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అందరితో ఇట్టే కలిసిపోతారు. పార్టీలో జూనియర్ల నుంచి సీనియర్ల వరకు గరికపాటి అంటే తెలియనివారు ఉండరు. పబ్లిసిటీకి ఆయన ఆమడ దూరంలో ఉంటారు. పార్టీ జెండా అంటే ఆయనకు ప్రాణం. నాయకుడి మాట శిరోధార్యం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భా వం నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు.

వేధింపులు ఎదురైనా... చంద్రబాబుకు గరికపాటి అత్యంత సన్నిహితుడని గ్రహించిన వైఎస్ అతనిని బాబు నుంచి తప్పించేందుకు సామ,దాన, బేధ దండోపాయాలు ఎన్నో ప్రయోగించారు. బాబు సన్నిహితుల్లో ఎంతోమందికి ఏదొక లబ్ధి చూపించి తమవైపు మార్చుకోగలిగారు. అందుకు గరికపాటి వ్యతిరేకత వ్యక్తంచేయటంతో వేధింపులు ఎదుర్కొన్నారు. ఒక దశలో ఆయనను అరెస్టు చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో గరికపాటి అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. తప్పు డు కేసుల్లో అరెస్టు చేయించే ప్రయత్నాలు జరిగినా, మోహనరావు తన పంథా మార్చుకోలేదు. తాను నమ్మిన పార్టీని, తనను నమ్మే నేతను వీడలేదు. .

జిల్లాల్లో ఎక్కడైనా వివాదా లు తలెత్తితో చంద్రబాబు మొదట గుర్తొచ్చే వ్యక్తుల్లో గరికపాటి ఒకరు. అందుకే వివాదరహితుడైన గరికపాటికి ఆయా కీలక బాధ్యతలు అప్పగిస్తుంటారు. రాజ్యసభకు వెళ్లేందుకు మూడు సార్లు అవకాశం వచ్చినా, సామాజిక కారణాల రీత్యా చంద్రబాబు వేరొకరికి కేటాయించినా గరికపాటి బాబు మాటే శిరోధార్యమన్నారు. పదవుల కోసం వెంపర్లాడే ప్రస్తుత తరుణంలో చంద్రబాబు ఆదేశాన్ని తూచా తప్పక పాటిస్తూ రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని వదులుకున్నారు. తనకు ఇది కావాలని ఏనాడు అడగని గరికపాటి, పార్టీలో ఏదీ ఆశించకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్రకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ బాబుతో పాటే ముందుకు సాగుతున్నారు. ఇంచుమించు చంద్రబాబు వయసే ఉన్నా ఎటువంటి అనారోగ్యం లేకుం డా ఉత్సాహంగా ముందుకు నడుస్తున్నారు.. పాదయాత్ర బృందాన్ని నడిపిస్తున్నారు.

పార్టీలోకి ఇలా వచ్చి అన్ని పదవులు, హోదాలు అనుభవించి తమను పైకి తెచ్చిన అధినేతనే తిట్టిపోసే నాయకులకు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పదవులు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం ముఖ్యమని నమ్మే గరికపాటి మోహనరావు లాంటి నేత స్ఫూర్తిదాత అనడంలో ఆశ్చర్యం లేదు.

బాబే శ్వాసగా.. ధ్యాసగా..

వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా రేపల్లె వచ్చిన చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఇసుకపల్లి నుండి రేపల్లెలో ఏర్పాటు చేసిన సభకు వరకు బారులు తీరి స్వాగతించారు. పోటెత్తిన జనానికి అభివాదం చేస్తూ రెండు కిలోమీటర్ల మేర ముందుకు సాగడానికి బాబుకు రెండు గంటల సమయం పట్టింది. పెద్ద సంఖ్యలో మహిళలు తమ అభిమాన నేతను తిలకించేందుకు, వారి కష్టాలు చెప్పుకునేందుకు, మనస్సును తేలిక పరుచుకునేందుకు, సాయం పొందేందుకు రహదారి వెంట వేచిచూశారు.

ఆయన రాక వారి కళ్లలో కొత్త వెలుగులు తెచ్చింది. వారిని పలకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ బాబు ముందుకు సాగారు. ఈ సమయంలో కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి కొందరు అమాంతం బాబు పాదాలపై పడి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. తమ కుటుంబంలో ఒక్కడు అనుకుంటూ వారి బాధలు వెళ్లబోసుకున్నారు. అలాంటి అభాగ్యులందరికీ అండగా తానున్నానని, భరోసా ఇస్తూ బాబు సభా స్థలికి చేరుకున్నారు.

నగరంలోని ప్రకాశం రోడ్డులో ఉన్న నెహ్రూ విగ్రహం వద్ద ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. వారి కష్టసుఖాలు గుర్తు చేస్తూ ఉపన్యసించారు. అసమర్థ కాంగ్రెస్ వల్ల, ఆ పార్టీ నాయకుల అవినీతి వల్ల ప్రజల జీవితాలు కష్టాల్లోకి నెట్టబడ్డాయని పేర్కొన్నారు. ప్రజలకు అండగా ఉండే నాయకులు, ప్రజల మనుషులు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారని అందుకు రేపల్లె టిడిపి ఇన్‌ఛార్జి అనగాని సత్యప్రసాదే నిదర్శనమన్నారు. ఆయన మీకు అండగా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడన్నారు. మీకు అండగా ఉంటానని మాట ఇచ్చి, ఎన్నికల్లో గెలిచి, మంత్రి పదవి పొంది, వాన్‌పిక్ భూముల కేటాయింపు ద్వారా ప్రజల సొమ్మును దిగమింగిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ అందరికీ తెలుసునని అన్నారు.

ప్రజలకు అండగా ఉంటూ సేవ చేసే మనిషిని గుర్తించి అలాంటి వారికి అధికారం కల్పించాలని కోరారు. తెలుగు దేశం హయాంలోనే పులిగడ్డపెనుమూడి వారథి నిర్మాణం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. దీని వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరించారు. ఇప్పుడు తాను ఆ వంతెన మీద గుండా కృష్ణాజిల్లాలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. ఇదో చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. అదే విధంగా రేపల్లె సైకిల్‌ను అసెంబ్లీకి పంపితే ఇప్పుడున్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలు విన్నవించిన తెనాలిరేపల్లె రోడ్ డబుల్ లైన్‌గా విస్తరణ, రైల్వే స్టేషన్ విద్యుతీకరణ, అర్హులైన వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం, 24 గంటల పాటు విద్యుత్, తాగు నీటి సౌకర్యాలు కల్పిస్తానన్నారు. అదే మాదిరి మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసరి నాగరాజు, పంతాని మురళీధర్, జీవి నాగేశ్వరరావు, కె.రమాశాంతాదేవి, దున్నా జయప్రద, మేకా పూర్ణచంద్రరావు, కేసన వాసు, మాగంటి సాంబశివరావు, జీపి రామారావు, మద్రాసు సాంబశివరావు, అనగాని శ్రీనివాసమూర్తి, వేములపల్లి సుబ్బారావు, డాక్టర్ పూర్ణానంద్, డాక్టర్ ప్రభాకర్‌రావు, ఆలూరి డానియేల్, గుర్రం మురహరిరావు, బెల్లంకొండ చిట్టిబాబు, మండవ తాతాజీ, వెంకటేశ్వరరావు, షేక్ ఖాదర్ బాషా, పరుచూరి రవిబాబు, తాతా ఏడుకొండలు, మాన్యం శివమ్మ, దాసరి కృష్ణకుమారి, గోగినేని శ్రీనివాసరావుపాల్గొన్నారు.

రేపల్లెలో బాబుకు నీరాజనం

రోజురోజుకు ఇనుమడించిన ఉ త్సాహంతో కొనసాగుతు న్న 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రపై ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారంతో పాదయాత్ర 13 జిల్లాలు, 58 నియోజక వర్గాలు, 961 గ్రామాలలో 146 రోజులు పూర్తయింది. పేరుపేరున పేదల కష్టాలు తెలుసుకుంటూ, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తూ, జిల్లాలో యాత్ర శరవేగంగా కొనసాగుతుందన్నారు. జనాభిమానాన్ని చూసి చంద్రబాబు మరింత ఉత్సాహంగా మాట్లాడుతున్నారన్నారు.

. అశేష జనవాహిని నడుమ సాగుతున్న ఈ యాత్రలో అధినేత తీరు అందరినీ ఆకర్షిస్తుందన్నారు. చంద్రబాబు అభాగ్యుల కన్నీరు తుడుస్తూ భవితపై భరోసా కల్పిస్తున్నారన్నారు. రాత్రి సమయాలలో గ్రామాలలో ప్రజలు తండోపతండాలుగా జననేతకు అభివాదాలు పలుకుతున్నారన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించి వారి యోగక్షేమాల గురించి ఆలోచించే ఏకైక పార్టీ టీడీపీయే అన్నారు. మొక్కవోని ఆత్మ విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ లక్ష్యసాధన కోసం కదంతొక్కుతున్న కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతున్నట్లు ప్రకటనలో తెలియజేశారు.

పాదయాత్రలో పూలవర్షం

  ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ప్రజలకు పిలుపు ఇస్తే తమపై కాంగ్రెస్ నేతలు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే రైతులకు నీళ్లు ఇచ్చి, తమపై కేసులు పెట్టాలని చంద్రబాబు అన్నారు. కత్తులు, కొడవళ్లు రైతుల జీవితంలో భాగమని ఆయన పేర్కొన్నారు.

కేసులు పెట్టండి పర్వాలేదు : చంద్రబాబు నాయుడు

February 24, 2013

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అంటారు. పల్లెలను చూసి దేశం గురించి చెప్పొచ్చునని కూడా చెబుతారు. కానీ, పల్లెలకు ఈ దేశంతో సంబంధం తెగిపోయిందా అనే అనుమా నం కలుగుతోంది. ఒకప్పుడు ఈ సీమలు జ్ఞానానికి, స్ఫూర్తికి నిలయాలు. ఐతే ఇప్పుడవి ఆకలికి ఆలవాలాలు. నిరుద్యోగానికి నిలువెత్తు నిదర్శనాలు. పేదరికానికి ప్రతిధ్వనులు. పేటేరునే కాదు.. ఏ పల్లెను చూసినా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి గుర్తులు తప్ప మరే దాఖలా కనిపించలేదు. సిమెంట్ రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, పాఠశాల భవనాలు తదితరాలన్నీ పల్లెల పట్ల అప్పటి నా ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు సూచికలు! పేటేరు.. పేదల, బడుగుల ఊరు..గీత కార్మికులు, నేతన్నల జనాభా ఎక్కువ.

ఒకరకంగా మాకు సంప్రదాయ ఓటుబ్యాంకు. పాలకులు వాళ్లపై కక్ష కట్టడానికి ఇంతకుమించిన కారణం ఏమి కావాలి? ఇందిరమ్మ ఇళ్ల నుంచి పెన్షన్ల వరకు మొండిచెయ్యి చూపారట. రాజకీయ వివక్ష చూపించారట. గీత కార్మికుల ఉపాధికి ఆధారం లేదట. కులవృత్తులు, చేతివృత్తులు అంతరించిపోయే దశకు వచ్చాయని చెప్పుకొని జనం వాపోయారు. భూములు తనఖాకు పోకుండా భార్యల తాళ్లను రైతులు అడ్డం వేస్తుంటే, మగ్గాలు ఆడించేందుకు నరాలనే నేతన్నలు దారాలు చేస్తున్నారు. వాళ్ల శ్రమశక్తులకు సలామ్!

బేతపూడి..వేములపల్లి శ్రీకృష్ణ పుట్టిన ఊరు. అక్కడకు వెళ్లాకే ఈ విషయం తెలిసింది. ఆయన ప్రసిద్ధ గీతం 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా..' ఎంతో స్ఫూర్తిదాయకం. ఎన్టీఆర్‌కు ఈ గీతం అంటే ఎంతో ఇష్టం. ఆ గ్రామంలో పర్యటించినంత సేపూ ఆ రోజు లు గుర్తుకొచ్చాయి. ఈ మొండిచేతుల పాలనపై చెయ్యెత్తి తిరగబడేది ఎప్పుడో!

చెయ్యెత్తి తిరగబడేది ఎప్పుడో!

కాంగ్రెస్‌ను చంపాలి!
కత్తులు, కొడవళ్లతో రైతులు రోడ్డెక్కాలి
బ్యాంకుల్లోని రైతుల బంగారమంతా విడిపిస్తా
గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

  "మీరు ఆత్మహత్య చేసుకోవడం కాదు. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను చంపాలి. రైతులు కత్తులు, కొడవళ్లతో...గీత కార్మికులు మోకులతో రోడ్డెక్కి తిరగబడాలి. అప్పుడే కాంగ్రెస్ కు బుద్ధివస్తుంది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చా రు. కల్లును నిషేధించి గీత కార్మికుల పాలిట వైఎస్ రాజశేఖరరెడ్డి రాక్షసుడిలా వ్యవహరించారని మండిపడ్డారు. "పేదవాళ్లు తెల్లచొక్కా వేసుకొంటే ఆయన సహించేవారు కాదు. పెత్తందారీ, భూస్వామ్య పోకడలతో వ్యవహరించేవారు'' అని గుర్తుచేశారు.

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం పేటేరు నుంచి ఆదివారం ఉదయం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మోర్లవారిపాలెం, బేతపూడి, రేపల్లె టౌన్, అరవపల్లి మీదుగా10 కిలోమీటర్లు నడిచారు. పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగిస్తోందని, విద్యుత్ చార్జీలు మొదలు నిత్యావసర సరుకుల ధరల దాకా..సమస్తం పెంచేసి ప్రజల నడ్డి విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను నరకయాతన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదని, దాన్ని ఎవరూ కాపాడలేరని జోస్యం పలికారు. "ఇప్పుడు ఆ పార్టీకి చావుతెలివి పుట్టుకొచ్చింది. రుణమాఫీ, బీసీలకు 100 సీట్లపై నేను పాదయాత్రలో ఇస్తున్న హామీలను తామూ అమలు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తోంది'' అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే గీత కార్మికులను ఎక్సైజ్ శాఖ నుంచి తొలగిం చి పౌరసరఫరాల పరిధిలోకి తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

"గీత కార్మికులు ఎక్కువగా నివసించే గ్రామాల్లో చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, నీరా నిల్వ చేసుకునేందుకు అవకాశమిస్తాం. కల్లుతోనే శీతల పానీయా లు, మిఠాయిలు, చాక్లెట్లు తయారు చేసే పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాం. వడ్డీలేని రుణాలు ఇస్తాం. భూములు కొనుగోలు చేసి తాటి చెట్ల పెంపకానికి, గొర్రెలను మేపుకోడానికి కేటాయిస్తాం''అని భరోసా ఇచ్చారు. వ్యవసాయం కోసం చాలామంది రైతులు ఇంట్లో ఆడవారి బంగారాన్ని తాకట్టు పెట్టారని, ఆ రుణాలన్నింటినీ మాఫీ చేసి ఆ బంగారమంతా విడిపిస్తామని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఒక అన్నగా, తమ్ముడిగా ఆ బంగారాన్ని ఆడబిడ్డలకు బహుమతిగా ఇప్పిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలకు ముఖ్యమంత్రి కిరణ్ రక్షణ కల్పించలేరని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు రోషం తెచ్చుకొని ఎన్నికల రోజున డబ్బు, మద్యానికి ప్రలోభపడకుండా తనను గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

2,100 కిలోమీటర్లు పూర్తి
చంద్రబాబు పాదయాత్ర ఆదివారం నాటికి 2,100 కిలోమీటర్లు పూర్తి చేసుకుం ది. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం ఇసుకపల్లి నె హ్రూ విగ్రహం వద్ద ఆయన ఈ దూరం అధిగమించారు. ఇప్పటివరకు చంద్రబాబు 13 జిల్లాలు 58 నియోజకవర్గాల పరిధిలోని 115 మండలాల్లో పాదయాత్ర జరిపారు. ఆయనకు పాదయాత్రలో బాసటగా నిలుస్తున్న వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, పేదలు, మహిళలు, యువతకు పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహన్ రావు ఒక ప్రకటనలో కృతఙ్ఞతలు తెలిపారు.

ప్రధాని ఎందుకొచ్చినట్టు?: బాబు
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ హైదరాబాద్‌కు ఎందుకొచ్చిందీ అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. ఇంత దూరం వచ్చి.. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులకు హెచ్చరిక జారీ చేయకపోవడం దారుణమని విమర్శించారు. కేవలం బాధితు ల పరామర్శకే ప్రధాని పర్యటన పరిమితం కావడం ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు.

పేదోడు తెల్లచొక్కా వేస్తే వైఎస్ సహించేవారు కాదు

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అసమర్థత వల్లే ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రను శనివారం 19వ రోజు భట్టిప్రోలు మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభించారు. పాదయాత్ర దుర్గా పిక్చర్ ప్యాలెస్ వద్దకు చేరుకున్న సమయలో పలువురు చేనేత కార్మికులు చంద్రబాబుకు వారి సమస్యలు విన్నవించారు. రోజంతా కష్టపడ్డా రూ. 100 ఆదాయం రావడం లేదని, కుటుంబాలు గడవక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

చేనేత సహకార సంఘాలు ఉన్నా వాటి వల్ల 20 శాతం మంది మాత్రమే లబ్ధిపొందుతున్నారని, మిగిలిన 80 శాతం మందికి ప్రభుత్వ సాయం అందడం లేదని కన్నీళ్లుపెట్టుకున్నారు. తమను ఆదుకోవాలని కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు ప్రతి పక్షంలో ఉన్నా చేనేత కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను చరఖా పట్టుకుని అసెంబ్లీకి వెళ్తే భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 312 కోట్ల నిధులు నేతన్నల కోసం కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొందన్నారు. ఇది జరిగి మూడేళ్లు గడిచినా వాటిలో మూడు రూపాయలు కూడా నేత కార్మికుల కోసం ఖర్చు చేయలేదన్నారు.

నేతన్నల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిన్న చూపుకు ఇది నిదర్శనమన్నారు. తాము అధికారంలోకి వస్తే నేత కార్మికుల కోసం రూ. లక్ష వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ఏడాదికి వెయ్యి కోట్ల వంతున ఐదేళ్లలో ఐదు వేల కోట్లు నేత కార్మికుల సంక్షేమం కోసం వెచ్చిస్తానని, రూ.1.50 లక్షలు వెచ్చించి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జనతా వ్రస్తాలు అందుబాటులోకి తెచ్చి నేత వృత్తిని ప్రోత్సహిస్తామన్నారు. దీనికి చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. తమ మద్దతు తెలుగు దేశానికే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బట్టీ చదువులొద్దు... లోకజ్ఞానం నేర్పండి.. పాదయాత్రలో చంద్రబాబు కేఎస్‌కే బాలికల కళాశాల వద్ద విద్యార్థినులతో ముచ్చటించారు. ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు బాలికల విద్యకు, మహిళల ఉద్యోగాల కల్పనకు అనేక చర్యలు తీసుకున్నానని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడి లక్ష కోట్లు దండుకుందని విమర్శించారు.

అవినీతి గురించి ఎంత మందికి తెలుసునని ఆయన విద్యార్థినులను ప్రశ్నించారు. దీనికి ఒక్కరి నుంచీ సమాధానం రాకపోవడంపై బాబు విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పుస్తకాల్లోని చదువులను బట్టీ కొట్టించడం కాకుండా లోకజ్ఞానం పెంపొందించేలా విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని విద్యార్థినులను వివరించారు.

వృద్ధులకు రూ. 600 పింఛను పాదయాత్రలో పలువురు వృద్ధులను చంద్రబాబు ఆప్యాయంగా పలుకరించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చాక పింఛన్‌ను రూ. 600కు పెంచుతానని వారికి భరోసా కల్పించారు.అలాగే గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు దళితులతో కొద్ది సేపు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పలువురు చంద్రబాబును కలసి కోరారు. దీనికి స్పందించిన ఆయన తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సమాన పనికి సమాన వేతనం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, దూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నక్కా ఆనందబాబు, మన్నవ సుబ్బారావు, గ్రేటర్ హైదరబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, కృష్ణాజిల్లా నాయకులు గరికపాటి మోహనరావు, కంటమనేని రవిశంకర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వస్తున్నా మీ కోసం సైడ్ లైట్స్ .. * పాదయాత్రలో పలు చోట్ల చంద్రబాబు వృద్ధులను పలుకరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

* నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని, వారి కోసం అవినీతి రహిత సమాజమే థ్యేయమంటూ చంద్రబాబు పలు చోట్ల ఉద్ఘాటించారు.

* వేమూరు పార్టీ నాయకులు దారిపొడవునా పూలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు.

* కొబ్బరి బొండాల విక్రేత, దర్జీ, ఇస్త్రీ, చేనేత కార్మికులతో చంద్రబాబు వారి సమస్యలు తెలుసుకున్నారు.

* పచారీ దుకాణానికి వెళ్లి నిత్యావసర వస్తువుల ధరలు అడిగి తెలుసుకున్నారు

* పలు చోట్ల చిన్నారులను దగ్గరకు తీసుకుని వారిని ముద్దాడారు.

అసమర్థ ప్రభుత్వం

చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర ఆదివారం రేపల్లె నియోజకవర్గంలో జరుగుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు తెలిపారు. ఈ యాత్ర పేటేరు గ్రామం నుంచి బయల్దేరి, మోర్లవారిపాలెం, బేతపూడి గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం విరామం అనంతరం బేతపూడి నుంచి బయల్దేరి ఇసుకపల్లి సెంటర్, రేపల్లె పట్టణంలోని నెహ్రూబొమ్మ సెంటర్, పాతపట్నం మీదుగా ఆరవపల్లి గ్రామానికి చేరుకుందని తెలిపారు. ఆరవపల్లిలో రాత్రికి బస చేస్తారని సుబ్బారావు తెలిపారు.

రేపల్లె నియోజకవర్గంలో వస్తున్నా.. మీకోసం

మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎంతో తెలివైన వాళ్లు. ఏ పని అప్పగించినా సమర్థవంతంగా చేయగల శక్తి, సామర్థ్యాలు వారి స్వంతం. అయినా మన సమాజంలో ఆడపిల్లలపై వివక్ష నేటికీ కొనసాగుతూనే ఉన్నది. మగపిల్లలను ్రపైవేటు పాఠశాలల్లో, ఆడపిల్లలను ప్రభుత్వ బడులకు పంపుతారు. ఆడబిడ్డలపై వివక్ష అనేది ఇక్కడి నుంచే మొదలౌతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భట్టిప్రోలు మండలంలో తన రాకకోసం గంటల తరబడి ముం డుటెండలో నిరీక్షించిన విద్యార్థులతో చంద్రబాబు కాసేపు సరదాగా గడిపారు.

'ఏమి గర్ల్స్ బావున్నారా... గుడ్ ఆఫ్టర్‌నూన్... ఏంటి డల్‌గా చెబుతున్నారు... బాగా చదువుకొంటున్నారా... టీచర్స్ బాగా పాఠాలు చెబుతున్నారా' అంటూ కులాస ప్రశ్నలు వేశా రు. అనంతరం చంద్రబాబు ఆడపిల్లలపై కొనసాగుతోన్న వివక్ష గురించి ప్రస్తావించారు. మగ పిల్లలతో పాటు ఆడపిల్లల్ని అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలని తాను విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేశానని గుర్తు చేశా రు. ఆ నాడు విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇప్పించాం. ఆ సైకిల్ ఇచ్చింది కళాశాలలకు వెళ్ళడానికే కాదు.

మగవాళ్లకు ధీటుగా తాము కూడా సైకిళ్లు తొక్కుతామని సమాజానికి చాటి చెప్పేందుకే తాను సైకిళ్లను పంపిణీ చేశానని చె ప్పారు. ఆడపిల్లలు ఎవరైనా ముందుకొస్తే ఆర్‌టీసీలో ్రడైవర్లు అయ్యే అవకాశం కూడా కల్పిస్తానని హామి ఇచ్చారు.

మీరు శారీరకంగా బలహీనులు కారు. మీకు అవకాశం ఇస్తే దూసుకెళతామని నిరూపిస్తారని చైతన్యం నింపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించి ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగేలా చేశానన్నారు. ఎవరైనా రౌడీలు తోక జాడితే వారికి ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్ ఇచ్చాం. నేడు విద్యార్థినులు ఇంటినుంచి బయటకు వెళితే భద్రంగా ఇంటికొస్తుందనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ బాంబుపేలుళ్ల దుర్ఘటనలో శాశ్వత విద్యార్థినులు వికలాంగులయ్యా రు.

పోలీసులు, సీఎం జాగ్రత్తగా ఉంటే బాం బుపేలుళ్లు జరిగి ఉండేవి కావని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల రక్షణ కోసం తాను పటిష్ఠమైన చట్టాలను రూపొందించి అమలులోకి తీసుకొస్తానని హామి ఇచ్చారు.

మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి దేశానికి స్వాత్రంత్యం తీసుకొచ్చిన గాంధీ జీ, రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్, తెలుగువారికి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి పేదోడికి కూడు, గూడు, గుడ్డ ఇచ్చిన ఎన్‌టీఆర్ వంటి మహనీయులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. అదే జైలుకు వెళ్లిన నాయకులను ఆదర్శంగా తీసుకొంటే విద్యార్థుల జీవితాలు అంధకారమౌతాయని హెచ్చరించారు.

వివక్ష పాఠశాల నుంచే...


వస్తున్నా మీకోసం పర్యటనలో భాగంగా భట్టిప్రోలు మండలంలో పర్యటిస్తున్న చంద్రబాబు సూరేపల్లిలో అంబేద్కర్ విగ్రహా న్ని, కోనేటిపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోనేటిపురంలో ఏర్పా టు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, వీరిని ఆదర్శం గా తీసుకోవాలన్నారు. బడుగు, బలహీనవర్గాలకు వీరిద్దరూ ఎంతో కృషి చేశారన్నారు. బీసీలకు రాజ్యాంగాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. ఆయన బాటలోనే పయనిస్తునానన్నారు.

బీసీల కోసం పదివేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయనున్నట్లు, రానున్న ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు రిజర్వు చేశామన్నారు. భట్టిప్రోలు మండలంలో చేనేత, గౌడ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అక్కడి నుం చి పాదయాత్ర పల్లెకోనకు చేరుకుంది. పల్లెకోన సెంటర్‌లో ప్రజలనుద్ధేశించి బాబు మాట్లాడుతూ గౌడ కార్మికుల పొ ట్టకొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. తాను అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను రద్దు చేయటంతోపాటు గౌడల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు శనివారం భట్టిప్రోలు మండలానికి తరలివచ్చారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన కాకతీయ యూత్ పది వాహనాల్లో భట్టిప్రోలు చేరుకుని చంద్రబాబుతో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు, మెదక్ జిల్లా సదాశివపేట మండలం నుంచి పార్టీ నాయకులు అబ్దుల్ ఖాదిర్, హైటెక్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు భట్టిప్రోలు తరలివచ్చి బాబు పాదయాత్రలో పాల్గొన్నారు.

వేమూరి ఆనందసూర్య ఆధ్వర్యంలో, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం ప్రముఖులు సుమారు 150 మంది బ్రాహ్మణ ప్రముఖులు మూడు బస్సుల్లో వచ్చి కోనేటిపురంలో చంద్రబాబుతో భేటీ అ య్యారు. కార్యక్రమంలో జిల్లా నా యకులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ళ నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, మన్నవ సుబ్బారావు, జియావుద్దీన్, శనక్కాయల అరుణ, చిట్టిబాబు, దానబోయిన శ్రీనివాస్‌యాదవ్, స్థానిక నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

స్ఫూర్తి ప్రదాతలు అంబేద్కర్, ఎన్టీఆర్

February 23, 2013

అర్ధాయుష్షు అంటే వీరిదే! యాభై ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోతాయి. కుర్ర ఈడుకే ఎముకలు అరిగిపోతాయి. నడిమి వయసు రాకముందే నడుం వంగిపోతుంది. తమ అర్ధాకలిలానే, అర్ధనగ్నంగా(లుంగీతో) ఉండే ఈ మనుషులు మన మధ్యనే తిరుగుతున్నారంటే నమ్మగలమా? శ్రమశక్తులను వెచ్చించి ఊపిరి నిలుపుకొంటూ ఉండే వీరి ఉనికిని విస్మరించగలమా? భట్టిప్రోలు ప్రాంతంలో తిరుగుతుండగా, ఎదురైన మనుషులూ, వాళ్లు వినిపించిన చేనేత వెతలూ విన్నప్పుడు కలిగిన భావమిది.

ఈ ప్రాంతంలోని నేతన్నలంతా ఒక సమావేశం పెట్టుకొని పిలిస్తే వెళ్లాను. చేనేత డిక్లరేషన్ ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే పాలకుల హామీలు అందని ద్రాక్షగా మారిన వైనాన్ని చెప్పుకొని వాపోయారు. చేనేతకు ఉన్న ఒకటీఅరా సంక్షేమ పథకాలూ మాస్టర్ వీవర్స్ పెరటి చెట్లుగా మారాయట. 'మా కన్నా ఉపాధి హామీ కూలీ బతుకే బెటర్‌గా ఉన్నది సార్..' అని అంటున్నప్పుడు వారి చీకటి కళ్లలో నైరాశ్యం కదలాడింది.

ఉపాధి కోసం కొందరు..ఉన్నదాన్ని నిలుపుకొనేందుకు మరికొందరు.. మొత్తంమీద యువకులంతా రోడ్డు మీదే ఉన్నారనిపించింది. సూరేపల్లిలో పంక్చర్ షాపులో పలకరించిన యువకుడు గానీ, ఆ పక్కనే ఉన్న వెల్డింగ్ షాపులో ముచ్చటించిన కుర్రాడు గానీ ఒకే గోడు వినిపించారు. "చేతులకు పని చూపకపోతే పోయారు.. కనీసం కరెంట్ అన్నా కరెక్టుగా ఇస్తే అదే మాకు పది వేలు.. లేదంటే మేమంతా రోడ్డున పడాల్సిందే సార్'' అని పంక్చర్ వేస్తూనే వెంకటేశ్వరరావు కళ్లు వత్తుకున్నాడు. పంక్చర్ వేయడం కాదు.. 'సర్కారు' చక్రాన్నే మార్చేయాలేమో!

పంక్చర్ కాదు.. చక్రమే మార్చాలి

చేనేతకు వైఎస్ చెల్లుచీటీ!
నేతలన్నల ఆత్మీయ భేటీలో చంద్రబాబు

చేనేతలకు రూ. 312 కోట్ల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి వైఎస్ రాజశేఖరరెడ్డి మాట తప్పారని.. ఆయన హయాంలో చేనేతకు చెల్లుచీటి ఇచ్చారంటూ చంద్రబాబు విమర్శించారు. 50 ఏళ్లు దాటిన వారికి రూ.1000 పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వేమవరం, సూరేపల్లి, కోనేటిపురం, పల్లెకోన, కారుమూరు, వరికుటేరు పాలెం క్రాస్ వరకు 16.5 కిలోమీటర్లు నడిచారు. ఈ క్రమంలో చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చేనేత వృత్తి దెబ్బతినడానికి ప్రపంచీకరణ ఒక కారణమైతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా మాత్రమే నేత కార్మికులను చూడటం మరో కారణమన్నారు.

చేనేత వర్గాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను తాము అందిస్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క ఎంపీని మాత్రమే చేసిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే, విద్యుత్‌లో రాయితీ ఇస్తామని, చనిపోయినవారి కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు. స్పిన్నింగ్, టెక్స్‌టైల్స్‌కు తోడు గార్మెంట్ మిల్లులను ఏర్పాటు చేసి చేనేతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రిగా పని చేసిన పనబాక లక్ష్మి కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని విమర్శించారు. తన అజెండాలో చేనేతలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

సీఎం, పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు జరిగేవి కావని విమర్శించారు. ప్రభుత్వం పటిష్ఠం గా లేకపోయినా, పరిపాలనా అనుభవం లేని సీఎం ఉన్నా ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయని చెప్పారు. కాగా, బ్రాహ్మణులను రాజకీయం గా పైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకొంటానని.. ఆ సామాజికవర్గం నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

హైదరాబాద్ నుంచి రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ నేత వేమూరి ఆనంద్‌సూర్య నేతృత్వం లో సంస్థ సభ్యులు తమ కుటుంబాలతో కలిసి చంద్రబాబు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు శనివారం సాయం త్రం గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లికి వచ్చారు. చంద్రబాబు వారితో ముఖాముఖీగా సమస్యలపై చర్చించారు. టికెట్లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అయితే అంతకంటే ముందు మీరు మంచి నెట్‌వర్కును ఏర్పాటు చేసుకొని నాయకులుగా ఎదగాలని సూచించారు. స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లు ఇచ్చి, వాటిల్లో పురోగతి ఆధారంగా ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

రుణమాఫీపై దొంగ మాటలు.. హామీలన్నీ హుళక్కే

స్థానిక ఎన్నికల పై గురి

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన తనయుడు లోకేష్ 'స్థానికఎన్నికల' బాధ్యతలు స్వీకరించనున్నారా? గాడి తప్పిన టీడీపీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారా? శుక్రవారం కుప్పంలో ఆ యన జరిపిన 'ప్రైవేటు' పర్యటన ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాన్నే ఇస్తున్నది. చి త్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో ఓ కార్యకర్త ఇంట్లో జరిగిన వివాహానికి లోకేష్ శుక్రవారం హాజరయ్యారు.

తాను మళ్లీ వారంరోజుల్లో కుప్పంలో పర్యటిస్తానని, అప్పుడు కార్యకర్తలతో తీరిగ్గా మాట్లాడతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ స్థానిక నాయకత్వంతో మాత్రం అంటీముట్టనట్లే వ్యవహరించారు. మందలింపు ధోరణిలో హెచ్చరికలూ చేశారు. డీసీఎంఎస్ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు ఆదేశాలను ఇక్కడి నాయకులు ధిక్కరించడమే దీనికి కారణం. డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలపడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ సహకారంతో వచ్చే డీసీఎంఎస్ పదవులు మనకొద్దని, ఆ ఎన్నికను బహిష్కరించాలని బాబు ఆదేశించారు. అయినా, చంద్రబాబు ఆదేశాల్ని ధిక్కరించి కుప్పం నియోజకవర్గానికే చెందిన డైరెక్టర్లు శ్యామరాజు, వరలక్ష్మమ్మ కాంగ్రెస్ సహకారంతో డీసీఎంస్ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు పొందారు. దీంతో పర్యటన ఆద్యంతం లోకేష్ స్థానిక నేతలతో ఆగ్రహంతో ఉన్నారు. 'ఇక్కడ పార్టీ ఎటువెళ్తోంది. మీరింతమంది ఉండి ఏం చేస్తున్నా రు? మూడునెలల కోసారి నాన్న పర్యటిస్తున్నా, ఈ ఐక్యతా లోపమేమిటి?' అంటూ ప్రశ్నించారు.

నాయకులతో అసహనంగా ఉన్న ఆయన.. తనను పలకరించిన సామాన్యులతో మాత్రం ఆప్యాయంగా మాట్లాడారు. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో 'నాన్నెలా ఉన్నారప్పా?' అని అడిగిన వృద్ధురాలికి.. కాళ్లనొప్పులతో ఉన్నారని, పాదయాత్ర పూర్తయిన తర్వాత మీ దగ్గరికి వస్తారని చెప్పారు. ప్రచారరథం ఎక్కి ముందుకు సాగాలని కోరిన స్థానిక నా యకులపై మాత్రం అసహనాన్ని ప్రదర్శించారు. తానొచ్చింది పెళ్లికే కానీ, పార్టీ కార్యక్రమాల కోసం కాదని మందలించారు. దీంతో స్థానిక నాయకులెవరూ ఆయన దరి చేరలేకపోయారు. మళ్లీ మార్చి నెల 7, 8, 9 తేదీల్లో ఆయన కుప్పంలో పర్యటించనున్నారు.

సింగిల్ విండో ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లతో వైసీపీ తన ఉనికి చాటింది. పార్టీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు బాబు ఆదేశాలను ధిక్కరించిన క్రమంలో.. నియోజకవర్గాన్ని ఇలాగే వదిలేస్తే పరిస్థితులు కట్టుతప్పుతాయని చంద్రబాబు భావించినట్టున్నారు. అందుకనే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని గాడినపెట్టి.. సంపూర్ణ విజయం చేజిక్కించుకునేందుకు తనయుడు లోకేష్‌కు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీవర్గాలు భావిస్తున్నాయి.

కుప్పం సైకిల్‌పై లోకేష్ సవారీ?

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర 144వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం జిల్లాలోని భట్టిప్రోలు నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు.

144వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం