February 25, 2013

కేసులు పెట్టండి పర్వాలేదు : చంద్రబాబు నాయుడు

  ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ప్రజలకు పిలుపు ఇస్తే తమపై కాంగ్రెస్ నేతలు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే రైతులకు నీళ్లు ఇచ్చి, తమపై కేసులు పెట్టాలని చంద్రబాబు అన్నారు. కత్తులు, కొడవళ్లు రైతుల జీవితంలో భాగమని ఆయన పేర్కొన్నారు.