February 25, 2013
పాదయాత్రలో పూలవర్షం
రోజురోజుకు ఇనుమడించిన ఉ త్సాహంతో కొనసాగుతు న్న 'వస్తున్నా...మీకోసం'
పాదయాత్రపై ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారంతో పాదయాత్ర
13 జిల్లాలు, 58 నియోజక వర్గాలు, 961 గ్రామాలలో 146 రోజులు పూర్తయింది.
పేరుపేరున పేదల కష్టాలు తెలుసుకుంటూ, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తూ,
జిల్లాలో యాత్ర శరవేగంగా కొనసాగుతుందన్నారు. జనాభిమానాన్ని చూసి చంద్రబాబు
మరింత ఉత్సాహంగా మాట్లాడుతున్నారన్నారు.
. అశేష జనవాహిని నడుమ సాగుతున్న ఈ యాత్రలో అధినేత తీరు అందరినీ ఆకర్షిస్తుందన్నారు. చంద్రబాబు అభాగ్యుల కన్నీరు తుడుస్తూ భవితపై భరోసా కల్పిస్తున్నారన్నారు. రాత్రి సమయాలలో గ్రామాలలో ప్రజలు తండోపతండాలుగా జననేతకు అభివాదాలు పలుకుతున్నారన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించి వారి యోగక్షేమాల గురించి ఆలోచించే ఏకైక పార్టీ టీడీపీయే అన్నారు. మొక్కవోని ఆత్మ విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ లక్ష్యసాధన కోసం కదంతొక్కుతున్న కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతున్నట్లు ప్రకటనలో తెలియజేశారు.
Posted by
arjun
at
5:29 AM