August 30, 2013

విభజించు-పాలించు సూత్రానికి కేంద్రం శ్రీకారం : పయ్యావుల

విభజించు - పాలించు సూత్రానికి కేంద్ర శ్రీకారం చుట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో మూడు ప్రధాన సామాజిక వర్గాలు కేంద్ర మంత్రులను ఒత్తిడికి గురి చేస్తున్నాయని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఆమోదించేలా చేసేందుకే కొత్త ఎత్తుగడవేస్తోందని మండిపడ్డారు.
అసెంబ్లీలో తీర్మానంపై ప్రజల పక్షాన నిలబడి ఓటేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు బస్సు యాత్ర చారిత్రక అవసరమన్నారు. యాత్రకు ఇప్పుడు సరైన సమయం కాదని బాబుకు చెప్పానని, కాంగ్రెస్, వైసీపీ అల్లర్లకు కాచుకుని కూర్చున్నారని పయ్యావుల తెలిపారు.