August 30, 2013

సస్పెన్షన్ పూర్తి -మళ్లీ లోక్ సభలో ఆందోళన

సస్పెన్షన్ కాలం పూర్తి చేసుకుని తిరిగి లోక్ సభకు హాజరైన సీమాంధ్ర ఎమ్.పిలు మళ్లీ లోక్ సభలో ఆందోళన నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ను రక్షించండి అంటూ నినాదాలు చేస్తూ వారంతా నినాదాలు చేశారు.వెల్ లోకి దూసుకువెళ్లి ఆందోళన సాగించడంతో సభను గంటసేపు వాయిదా వేశారు. కాంగ్రెస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్.పిలు, టిడిపికి చెందిన ఎమ్.పిలు ఆందోళన చేస్తుండడంతో ఐదు రోజులపాటు సస్పెండ్ చేయాలని స్పీకర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ఐదు రోజులు పూర్తి అయ్యాక తిరిగి యధా ప్రకారం వారు మళ్లీ సభకు ఆటంకం సృష్టించారు.