August 29, 2013

సమైక్యాంధ్ర కోసం టీడీపీ పది రోజుల ప్రణాళిక

సమైక్యాంధ్రకు మద్దతుగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో పది రోజులపాటు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఒక ప్రణాళికను ప్రకటించారు. పార్టీ నిర్ణయాల కంటే, ప్రజల మనోభావాలు, వారి అభిప్రాయాలకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమించక తప్పదని ఆయన అంటున్నారు. శుక్రవారం నర్సీపట్నంలో సుమారు ఐదువేల మందితో సమైక్యాంధ్ర సాధన ర్యాలీ నిర్వహిస్తారు. శనివారం ఎడ్లబళ్లతో నర్సీపట్నంలో మహాప్రదర్శన నిర్వహిస్తారు. అయ్యన్న జన్మదినం సందర్భంగా సెప్టెంమర్ నాలుగో తేదీన వందలాది రక్తదానం చేస్తారు.
సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రతి రోజూ ఏదో రూపంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, దీని కోసం శుక్రవారం సమావేశాన్ని నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకుడు సన్యాసిపాత్రుడు తెలిపారు. కాగా నర్సీపట్నంతోపాటు మిగతా మండల కేంద్రాల్లో కూడా సమైక్యాంధ్ర సాధన కోసం ఆందోళనలు జరుగుతాయని చెప్పారు.