August 29, 2013

సోనియా చేతిలో పావు ప్రధాని-చంద్రబాబు

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకురాలి చేతిలో పావుగా మారారని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించడం లేదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తర్వాత కేంద్రం పూర్తి బాధ్యతారహితంగా , నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాక కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని , ఈ సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి జోక్యం చేసుకుని రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్ది అందరికి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్.ఆర్.కాంగ్రెస్,టిఆర్ఎస్ లతో కలిసి డ్రామా ఆడుతున్నట్లుగా ఉందంటూ ఆరోపణలు చేశారు.