August 29, 2013

జగన్ ఆస్తులు జప్తు చేయండి-టిడిపి

తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వద్దకు వెళ్లి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ఆస్తులను జప్తు చేయాలని కోరింది.వైఎస్ జగన్ చట్టాలను ఉల్లంఘించి అక్రమాల కు, ప్రజాధనం లూటీకి పాల్పడినప్పటికీ ఇంతవరకు ఆయనపై తగు చర్య తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీలు ఇడికి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీబీఐ ఇప్పటివరకూ తీవ్ర అభియోగాలతో ఐదు చార్జిషీట్లను దాఖలు చేసిందని, దాదాపు 43 వేల కోట్ల మేరకు అవినీతి జరిగిందని నిర్ధారిస్తే ఈడీ ఇంతవరకు కేవలం రూ.229 కోట్లమేరకే ఆస్తులను జప్తు చేసిందని వారు చెప్పారు.రాజకీయ జోక్యం వల్ల ఇడి దర్యాప్తు ఆగిపోయినట్లుందని వారు ఆరోపించారు. నామా నాగేశ్వరరావు. దేవేందర్ గౌడ్, వైఎస్ చౌదరి, కె.నారాయణ రావు, సీఎం రమేశ్‌లు లు ఇడిని కలిసినవారిలో ఉన్నారు.