October 9, 2013


Sri N Chandrababu Naidu Nirahara Deeksha Live from Delhi

రాష్ట్ర విభజనకు సంబంధించి జాతీయస్థాయిలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని అన్నా. ఇరు ప్రాంతాల జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చించాలని ఆయన సూచించారు. టీడీపీని కించపరిచే విధంగా దిగ్విజయ్ మాట్లాడుతున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీని దెబ్బతీయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తుందని తెలిపారు. తన సొంత రాష్ట్రంలో గెలవలేని దిగ్విజయ్ ఏపీ భవిష్యత్‌ను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.

సొంత రాష్ట్రంలో గెలవలేని దిగ్విజయ్ ఏపీ భవిష్యత్‌ను ఎలా నిర్ణయిస్తారు.........


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చిం చేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన నేపథ్యంలో సమన్యాయం పేరుతో ఢిల్లీలో నిరాహారదీక్ష చేపట్టిన చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు తన మద్దతుదారులతో మాట్లా డుతూ, అత్యంత క్లిష్టమైన ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన సంయుక్త కార్యాచరణ కమిటీలు (జెఎసిలు)తో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ''కేవలం ఆరు మాసాల్లో యుపిఎ ప్రభుత్వం వెళ్లిపోతుంది. ఆ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఈ పార్టీలు ఏం చేస్తాయి. ఆ పార్టీల నిబద్ధత ఏమిటి? జాతీయస్థాయిలో అఖిల పక్ష సమావేశాన్ని ఎందుకు పిలవలేక పోతున్నారు. ప్రతి ఒక్కరితో ఎందుకు చర్చించలేక పోతున్నారు? మా డిమాండ్‌ అదే. తక్షణం అఖిల పక్షం ఏర్పాటు చేయాలి'' అని చంద్రబాబు అన్నారు. రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్‌ పార్టీ ఏక పక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. ''కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నదేమిటంటే, ఇరు ప్రాంతాల జెఎసిలను కూడా పిలిచి మాట్లాడాలి. సరైన పరిష్కారంతో వస్తే మేం కూడా హర్షిస్తాం'' అని బాబు అన్నారు. ప్రభుత్వం ఎలాంటి తప్పుడు వాగ్దానాలు ఇవ్వకుండా ఏం చేయబోతున్నదో స్పష్టం గా చెప్పాలని కోరారు. ఎలాంటి విధివిధానాలను పాటించకుండానే తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకు న్నారని, ఇది కేవలం ఓట్లు,

సీట్ల కోసమేనని దుయ్యబట్టారు. పాలక కాంగ్రెస్‌ పార్టీకి, జగన్మోహన్‌రెడ్డికి మధ్య 'మ్యాచ్‌ఫిక్సింగ్‌' జరిగిందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జైల్లో దీక్ష చేపట్టిన జగన్‌పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఉదయం, సాయంత్రం హెల్త్‌బులిటెన్లు ఇచ్చారని విమర్శించారు. 'ఇది దేనిని సూచిస్తుంది? ఇది కచ్చితంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌. ఒకప్రక్క టిఆర్‌ఎస్‌, మరోప్రక్క వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌. తన కుమారుడిని ప్రధానమంత్రి చేయాలని సోనియాగాంధీ కోరుకుంటున్నారు. ఇది సహేతుకమేనా? సమంజమేనా? దీనినే నేను ప్రశ్నిస్తున్నాను' అని చంద్రబాబు అన్నారు. అనైతిక రాజకీయాలను ప్రజలు ఆమోదించరని అన్నారు. దిగ్విజరుసింగ్‌ చేసిన విమర్శలపై స్పందిస్తూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తన సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నందున ఆయన టిడిపి లక్ష్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. 'వాళ్ళ సొంత ముఖ్యమంత్రే వ్యతిరేకిస్తున్నారు. సిఎం, కేబినెట్‌, కేంద్రమంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపీలు, ప్రతిఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. మీ సొంత పార్టీ వారిని నువ్వు బుజ్జగించలేవా అని నేను దిగ్విజరును అడుగుతున్నాను. అలాంటప్పుడు మమ్ములను విమర్శించే హక్కు మీకెక్కడిది?' అని సూటిగా ప్రశ్నించారు. దేశ రాజధానిని దీక్షకు వేదికగా తాను ఎందుకు ఎంచుకున్నారో వివరణ ఇస్తూ తెలంగాణపై నిర్ణయం ఇక్కడే జరిగింది...పరిష్కారం కూడా ఇక్కడే లభించాలని అన్నారు.

''కేవలం ఆరు మాసాల్లో యుపిఎ ప్రభుత్వం వెళ్లిపోతుంది. ఆ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.

October 7, 2013

సీమాంద్ర ప్రజల సమస్యలు, విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ మాత్రమే తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం డిల్లీ లో ఆయన చేపట్టనున్న దీక్ష సందర్భంగా మొదట హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ … కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానం వల్ల ఒక బాధ్యత కలిగిన పార్టీ నాయకుడిగా కలత చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇష్టానుసారం కాక స్వంత నిర్ణయాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్ర్య విలువలు కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. సీమాంద్ర లో ప్రజలు స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నారని, అక్కడి ప్రజల ఆవేదన యావత్ దేశానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య కు పరిష్కారం దొరికే వరకు శక్తి వంచన లేకుండా పోరాడతానని తెలిపారు. మీ దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నారా ? అన్న ప్రశ్నకు, బ్రిటీషు వారు దిగిరారు అనుకుంటే బాపూజీ దీక్షలు చేసేవారు కాదని, మానవత్వం, ప్రజాస్వామ్య విలువలు ఉన్న ఏ ప్రభుతవమైనా దిగి వస్తుందని అన్నారు.

మీ దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నారా ?

సీమాంధ్ర ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడం లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీని కేంద్రంగా చేసుకుని దీక్ష చేపడుతున్నారు. ప్రజా ప్రయోజనాలకంటే కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో గెలిచి రాహుల్ ను ప్రధాని చేయాలనే లక్ష్యంతో పని చేస్తోందంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు బాబు. అంతేకాదు స్వయంగా నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను జాతీయ స్థాయిలో నేతల దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను బహిర్గతం చేయడానికి చంద్రబాబు పూనుకున్నట్లు కనిపిస్తోంది. దేశ ప్రయోజనాలు, ఇటు తెలంగాణ అటు సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను అవగాహన చేసుకోకుండా, అంచనాకు రాకుండా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బాబు మండిపడుతున్నారు.అవసరమైతే ఎజెండాలను, జెండాలను పక్కనబెట్టి తిరిగి ఢిల్లీ వీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి అన్నివర్గాలను కలుపుకుపోతూ కాంగ్రెస్ ఒంటెద్దు పోకడకు తగిన గుణపాఠం చెప్పడానికి సమీకరణాలు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ నెల 7 నుంచి ప్రకాశం జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర బాబు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలమధ్యకు వెళ్లడంకంటే ఢిల్లీ పీఠంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని బాబు భావిస్తున్నారు. సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతున్నారు. సీమాంధ్రలో ఇప్పుడు సమైక్య సెగలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల్లోకి వెళ్లడంకంటే తన లాంటి నేత ఢిల్లీలో దీక్ష చేస్తే ఈ సమస్య జాతీయ స్థాయి నేతల్లో కదలిక తీసుకువస్తుందని బాబు భావిస్తున్నారు.అంతే కాదు జగన్ హైదరాబాద్ లో తన నివాసం లోటస్ పాండ్ వద్దే దీక్ష చేస్తుండగా బాబు మాత్రం నేరుగా సోనియా గాంధీతోనే ఈ అంశంపై పోరాటం చేయడానికి ఢిల్లీని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

ఇక జాతీయ స్థాయిలో బాబు పోరు!


పిసిసి అధ్యక్షుడు బొత్స సత ్యనారాయణ ఆస్తులపై మీకున్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేదా? అని దిగ్విజయ్‌ను... తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమో హన్‌రెడ్డి ప్రశ్నించారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బెల్టుషాపులు, మద్యం షాపులు, కబ్జాలు, మాఫియాలు నడుపుతున్న బొత్స, ఆయన కుటుంబీకుల ఆగడాలకు, ఆరాచకాలకు విసిగిన ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారన్నారు. అయితే ఈ దాడులను తాము సమర్థించడం లేదని, కానీ దిగ్విజయ్‌సింగ్‌కు మాత్రం బొత్స ఆస్తులపై ఉన్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేనట్లుగా ఉందన్నారు. 65 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నా.. ఒక్క కాంగ్రెస్ నేత కూడా సానుకూలంగా వ్యవహరించలేదన్నారు. దిగ్విజయ్‌కి కూడా ఇక్కడి ప్రజలు గుర్తుకు ఉరాలేదా? అని ప్రశ్నించారు. ఇంతటి తాగ్యాల ఉద్యమం చరిత్రలో మరొకటి లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దీక్షపై దిగ్విజయ్ ప్రశ్నించడంపైనా ఆయన స్పందించారు. విభజన ప్రక్రియ అసంబద్ధంగా ఉందనే చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు. అయినా చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నారో మీ ముఖ్యమంత్రి(కిరణ్), మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను అడుగు అంటూ.. దిగ్విజయ్‌కు... సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు.

ఆస్తులపై మీకున్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేదా?

October 5, 2013


రాష్ట్ర విభజన అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నడుంబిగించారు. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్దికోసం ఏకపక్ష నిర్ణయం తీసుకున్న వైనాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను జాతీయ పార్టీల దృష్టికి తీసుకురావాలని ఆయన సంకల్పించారు. రాష్ట్రాన్ని విభజించి తద్వారా తెలుగు ప్రజల మధ్య చిచ్చు రగిల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యత్నించిందని, అందులో భాగంగానే విభజన నిర్ణయాన్ని ప్రకటించిందన్న అంశాన్ని జాతీయ స్థాయి నేతలకు వివరించి తద్వారా వారి మద్దతును కూడా కూడగట్టాలని చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు విభజన ప్రతిపాదనను కాంగ్రెస్‌ అధినాయకత్వం తెరపైకి తెచ్చిన కుట్రను దేశ ప్రజలకు వివరించాలని ఆయన ప్రతిపాదించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం విభజన నిర్ణయం తీసుకున్న విధానాన్ని ఎండగట్టేందుకే దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రజల సమస్యలు, డిమాండ్లను దేశ ప్రజలకు వివరించేందుకే దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్రకు తాను అనుకూలమనే రీతిలో సీమాంధ్ర ప్రజలకు సంకేతాలిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. సీమాంధ్ర ప్రజలకు తాను అండగా ఉంటానన్న రీతిలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి, ఉద్యమంలో తమ పార్టీ కార్యకర్తలు భాగస్వాములు అయ్యేందుకు అవకాశం దక్కించుకునేందుకు ఈ దీక్ష దోహదపడుతోందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం ఇరు ప్రాంతాల పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

తమ పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే తెరాస, వైకాపాలతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారాన్ని కూడా జాతీయ పార్టీలకు వివరించాలని నిర్ణయించారు. ఈ దీక్షలో జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీల నేతల సంఘీభావాన్ని కూడగట్టాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌ నిర్లక్ష్య వైఖరి, ప్రజల మధ్య ఏర్పడిన విభేదాలను జాతీయ స్థాయిలో వెలుగెత్తేందుకు ఈ దీక్షా వేదికను వాడుకోవాలని ఆశిస్తున్నారు. రాష్ట్ర విభజనలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేసే అంశంపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిసారించకపోవడం, రాజకీయ లబ్ధికోసం తీసుకున్న విభజన నిర్ణయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఈ దీక్షకు పూనుకుంటున్నారు. విభజనపై సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తెలుసుకున్న భాజపా అగ్రనేత అద్వానీ కూడా కాంగ్రెస్‌ నిర్ణయంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రజల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేసిన దాఖలాలు గతంలో లేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల డిమాండ్ల పరిష్కారానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలన్న విషయంలో చంద్రబాబు దీక్ష చేపడుతున్నారు. విభజన ప్రక్రియలో సీమాంధ్ర ప్రజలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఎత్తిచూపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్న యోచనలో తెదేపా ఈ దీక్షకు పథకం వేసింది. అయితే తెలంగాణకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, కేవలం సీమాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యతనిచ్చి ఆ కోణంలోనే దీక్షకు వ్యూహరచన చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తెలుగు ప్రజల మధ్య చిచ్చు రగిల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యత్నించింది


కాంగ్రెస్, వైసిపి ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినందువల్లే జగన్ కు బెయిల్ వచ్చిందని చర్చలో పాల్గొన్న టిడిపి ఎంపి శివ ప్రసాద్ విమర్శించారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందించుకుందని చెప్పారు. దాని ప్రకారమే అటు తెలంగాణలో టిఆర్ఎస్ ను, ఇటు సీమాంధ్రలో వైసిపి ని కలుపుకునే పనిలో పడిందిని చెప్పారు. గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ సీమాంధ్రలో తన అస్తిత్వం కోల్పోయిందని తెలుస్తుందని అన్నారు. ఢిల్లీలో తమ పార్టీ అధినేత చంద్రబాబు బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలవడం వెనుక రాజకీయకారణాలేమీ లేవని చెప్పారు. వక్రమార్గాల ద్వారా జగన్ బెయిల్ పై బయటికి వచ్చారని విమర్శించారు. ఇప్పుడు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వైసిపి స్టాండ్ తీసుకోగలదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, వైసిపి ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినందువల్లే జగన్ కు బెయిల్ వచ్చింది

October 3, 2013


అన్నీ వై.కాంగ్రెస్ కు ముందే తెలుసు-కేశవ్

సీమాంద్ర కేంద్ర మంత్రులు తక్షణమే రాజీనామా చేసి బయటకు రావాలని, క్యాబినెట్ లో నోట్ చించివేసి బయటకు రావాలని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.లగడపాటి రాజగోపాల్ కొద్ది రోజుల క్రితం కూడా ఇప్పట్లో విభజన జరగదని అన్నారని, ఆయన ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని అన్నారు.సీమాంధ్ర మంత్రులు వైదొలగకపోతే ద్రోహం చేసినట్లేనని ఆయన అన్నారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,టిఆర్ఎస్ లతో ఒప్పందం కుదుర్చుకుని విబజన చేస్తున్నదని ఆయన ఆరోపించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కి ముందుగానే తెలిసి ఈ రోజు దీక్షలకు దిగారని కేశవ్ ఆరోపించారు.ప్రతి అడుగు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ముందుగానే తెలుస్తున్నాయని, టెన్ జనపధ్ నుంచే ఈ పార్టీ ప్రధాన కార్యాలయం ఉందని ఆయన అన్నారు.సిబిఐ డైరెక్టర్ ఎందుకు దిగ్విజయ్ సింగ్ ను కలిశారో వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు.

సిబిఐ డైరెక్టర్ ఎందుకు దిగ్విజయ్ సింగ్ ను కలిశారు.

సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్ ను ఎందుకు కలిశారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దిగ్విజయ్ సింగ్ ఏ హోదాలో కలిశారని ఆయన అన్నారు. సిబిఐ ద్వారా ఎవరిపై కేసులు పెట్టదలిచారు?లేదా ఎవరిని వదలిపెట్టదలిచారు? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్ధులను వేధించడానికి,సిబిఐని, ఆదాయపన్ను శాఖ అదికారులను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఆంద్రప్రదేశ్ లో జగన్ కేసులో పది ఛార్జీషీట్ లు వేయాలని చెప్పిన సిబిఐ,బెయిల్ ఇవ్వాలనుకున్న వెంటనే ఒక మెమో ఫైల్ చేయడం,కొన్ని కంపెనీలకు సంబందించి మొదట తప్పు ఉందని చెప్పినా, ఆ తర్వాత లేవని అనడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. చార్జీషీట్ లలో రాసిన విషయాలకు విరుద్దంగా ఇలా చెబుతారా అని అన్నారు. ఏ కోర్టులో కూడా దర్యాప్తు పూర్తి అయిందని ఎక్కడా చెప్పరని, అలాంటిది కేసును నిర్వీర్యం చేసే విదంగా దర్యాప్తు పూర్తి చేశారని చంద్రబాబు అన్నారు.అందువల్లనే జగన్ డి.ఎన్..ఎ ,మాది ఒకటేనని దిగ్విజయ్ సింగ్ అన్నారని,వీరప్ప మొయిలీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని అన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

సిబిఐ ద్వారా ఎవరిపై కేసులు పెట్టదలిచారు?

October 2, 2013

చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ దేశానికి రోల్ మోడల్సని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అభివృద్దికి వారిద్దరూ ప్రతీకలని, తమ హయాంలో తమ రాష్ట్రాలను వారు అభివృద్దిలో అగ్రగామిగా నిలిపారని ఆయన అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాజకీయం జడ పదార్ధం కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలు మారాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

గతంలో బిజెపిపైనా...మోడీపైనా టిడిపి చేసిన విమర్శలను ప్రస్తావించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలన దేశాన్ని నాశనం చేసిందని, ఆ పార్టీని దించడం కోసం ప్రత్యర్ధులైనా చేతులు కలపక తప్పదని ఆయన అన్నారు. అమెరికాను షట్ డౌన్ చేసినట్లు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని షట్ డౌన్ చేస్తేనే విభజన నిర్ణయం ఆగుతుందని, లేకపోతే వారి భవిష్యత్తు షట్ డౌన్ అవుతుందని కేశవ్ వ్యాఖ్యానించారు.

బాబు, మోడీ దేశానికి రోల్ మోడల్స్......................

ఎన్డీయే కన్వీనర్ గా చంద్రబాబు ?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మరోసారి జాతీయ రాజకీయాలలో ప్రధాన భూమిక ను పోషించే రోజులు సమీపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీయేలో చక్రం తిప్పబోయేది ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. కీలకమైన ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక ప్రాంతంలో తెరాస, మరో ప్రాంతంలో వైసీపీలతో అవగాహన కుదుర్చుకుని కాంగ్రెస్ తన మ్యాజిక్ ఫిగర్‌ను కాపాడుకునేందుకు వ్యూహాలు అమలుచేస్తుండగా... దాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పాత మిత్రులతో కొత్త స్నేహానికి నాందీ పలుకుతోంది. గత నెలలో న్యూఢిల్లీ పర్యటనలోనే ఎన్డీయేలో చేరికపై బాబు సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారని తెలుస్తున్నది.

మంగళవారం హైదరాబాద్‌లో ముస్లింనేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమై భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిక అంశంపై అభిప్రాయాలు తెలుసుకున్న పరిణామం కీలకమైన ముందడుగుగా పేర్కొన వచ్చు. చంద్రబాబు బుధవారం న్యూఢిల్లీ వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలాకాలంగా భాజపాతో ముందుకెళ్ళే అంశంపై చర్చ నడుస్తోంది. గతంలో ఎన్డీయేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు కలిసొచ్చిన సెంటిమెంట్, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువతరం, విద్యావంతుల్లో పెరిగిన ఆదరణ, యూపీయేకి పరిస్థితులు రోజురోజకు దిగజారిపోతుండటం ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నేతలు కొందరు చంద్రబాబుపై ఎన్డీయేలో చేరడం ఒక్కటే రాజకీయంగా ఉత్తమమైన మార్గమని, అది రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిది ఖాయమని దాదాపు తేలిపోయింది. అందులో చంద్రబాబు నిర్వహించాల్సిన పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్వీనర్ బాధ్యతలను అప్పగించే విషయంలో భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సుముఖంగానే వున్నారు. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. అయితే ఏపీలో పార్టీ బలాబలాలు, సమీకరణలు ఎప్పుడు ఎలా మారిపోతాయో, టిడిపి, వైసీపీలలో ఏ పార్టీ ముందుంటుందో, ఎక్కువ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్న మోడీ ఒకవైపు బాబు పాత్రకు ఒకే చెబుతూనే మరోవైపు వైసీపీ అంశానికి కూడా తలుపులు మూసివేయడం లేదని తెలుస్తోంది. గతంలో యుఎఫ్ కన్వీనర్‌గా దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్ సర్కార్ల హయాంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు అనుభవాల దృష్ట్యా ఎన్డీయే కన్వీనర్ పదవిని అప్పగించేందుకు ముందుకొస్తోంది. 

తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం టిడిపి అధినేత గతంలోలాగ కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారని, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, గతంలో ఎన్టీఆర్ తరహాలో యూపీయేను గద్దెదించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ మరోసారి జాతీయ రాజకీయాలలో ప్రధాన భూమిక ను పోషించే రోజులు సమీపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీయేలో చక్రం తిప్పబోయేది ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. కీలకమైన ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక ప్రాంతంలో తెరాస, మరో ప్రాంతంలో వైసీపీలతో అవగాహన కుదుర్చుకుని కాంగ్రెస్ తన మ్యాజిక్ ఫిగర్‌ను కాపాడుకునేందుకు వ్యూహాలు అమలుచేస్తుండగా... దాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పాత మిత్రులతో కొత్త స్నేహానికి నాందీ పలుకుతోంది. గత నెలలో న్యూఢిల్లీ పర్యటనలోనే ఎన్డీయేలో చేరికపై బాబు సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారని తెలుస్తున్నది.

మంగళవారం హైదరాబాద్‌లో ముస్లింనేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమై భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిక అంశంపై అభిప్రాయాలు తెలుసుకున్న పరిణామం కీలకమైన ముందడుగుగా పేర్కొన వచ్చు. చంద్రబాబు బుధవారం న్యూఢిల్లీ వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలాకాలంగా భాజపాతో ముందుకెళ్ళే అంశంపై చర్చ నడుస్తోంది. గతంలో ఎన్డీయేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు కలిసొచ్చిన సెంటిమెంట్, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువతరం, విద్యావంతుల్లో పెరిగిన ఆదరణ, యూపీయేకి పరిస్థితులు రోజురోజకు దిగజారిపోతుండటం ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నేతలు కొందరు చంద్రబాబుపై ఎన్డీయేలో చేరడం ఒక్కటే రాజకీయంగా ఉత్తమమైన మార్గమని, అది రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిది ఖాయమని దాదాపు తేలిపోయింది. అందులో చంద్రబాబు నిర్వహించాల్సిన పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్వీనర్ బాధ్యతలను అప్పగించే విషయంలో భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సుముఖంగానే వున్నారు. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. అయితే ఏపీలో పార్టీ బలాబలాలు, సమీకరణలు ఎప్పుడు ఎలా మారిపోతాయో, టిడిపి, వైసీపీలలో ఏ పార్టీ ముందుంటుందో, ఎక్కువ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్న మోడీ ఒకవైపు బాబు పాత్రకు ఒకే చెబుతూనే మరోవైపు వైసీపీ అంశానికి కూడా తలుపులు మూసివేయడం లేదని తెలుస్తోంది. గతంలో యుఎఫ్ కన్వీనర్‌గా దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్ సర్కార్ల హయాంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు అనుభవాల దృష్ట్యా ఎన్డీయే కన్వీనర్ పదవిని అప్పగించేందుకు ముందుకొస్తోంది.

తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం టిడిపి అధినేత గతంలోలాగ కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారని, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, గతంలో ఎన్టీఆర్ తరహాలో యూపీయేను గద్దెదించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్డీయే కన్వీనర్ గా చంద్రబాబు ?

ఢిల్లీలోని త్యాగరాజు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్’ సదస్సులో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులు పుట్టిన రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం సూపర్ పవర్ గా అవతరించే రోజు దగ్గర్లోనే ఉందని బాబు అన్నారు. అయితే, ఈ సదస్సులో చంద్రబాబు, బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో వేదిక పంచుకోవడం విశేషం.

గుజరాత్ ను అభివృద్ధి పథంలో ముందుంచి, ఇటీవలే భాజపా ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీపై ప్రసంశల వర్షం కురిపించారు. మోడీ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. గాంధీ, మోడీ ఇద్దరూ గుజరాత్ కు చెందినవారు కావడం కాకతాళీయం అని ఆయన అన్నారు. ఎన్డీఏ హయాంలోనే సంస్కరణలు ఊపందుకున్నాయని… దేశం అభివృద్ధి దిశగా పయనించిందని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు సంస్కరణలను యూపీఏ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

గతంలో అందరూ హైదరాబాద్ గురించి మాట్లాడేవారన్న బాబు… ఇప్పుడు అందరూ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారని మోడీకి కితాబిచ్చారు. తెలుగుదేశం హయాంలో విద్యుత్ ఉత్పాదనలో రాష్ట్రం అగ్రశ్రేణిలో నిలిచేందుకు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టామని వెల్లడించారు. దేశంలోనే అగ్రశ్రేణి విమానాశ్రయం, కన్వెన్షన్ సెంటర్ ను తాము నిర్మించామని చంద్రబాబు తెలిపారు. దీంతో పాటు… ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, న్యాయ విశ్వవిద్యాలయం, బిజినెస్ స్కూలు ఏర్పాటుచేశామని అన్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని బాబు పిలుపునిచ్చారు. నేడు రాజకీయాల పట్ల 71 శాతం యువత ఆకర్షితులవుతున్నారని… ఇది 100 శాతానికి పెరగాలని అభిప్రాయపడ్డారు.

మోడీ విజన్ ఉన్న నాయకుడు


ఇండియా సూపర్ పవర్‌గా అవతరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధ వారం ఉదయం ఢిల్లీలో జరిగిన సిటిజన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ఆర్థిక సంక్షోభానికి కేంద్రమే కారణమని విమర్శించారు.

ఉత్తరాఖండ్ బాధితులకు సాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కంటే తానే ముందున్నానన్నారు. గాంధీ, మోదీ ఇద్దరూ గుజరాత్‌లో పుట్టడం కాకతాళీయమే అని ఆయన అన్నారు. ప్రధానిగా పీవీ ఎన్నో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. ఈ సదస్సులో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు పరస్పరం పలకరించుకున్నారు.

ఇండియా సూపర్ పవర్‌గా అవతరిస్తోంది : చంద్రబాబు


జగన్ వ్యవహరణ తీరు, జరుగుతున్న పరిణామాలు, వస్తున్న పుకార్లు దీనికి ఆధారాలు అని విశ్లేషకులు అంటున్నారు. నిప్పులేనిదే పొగ రాదు..అన్నట్టుగా భూమా ఫ్యామిలీలో అసంతృప్తి లేనిదే ఈ పుకార్లు మొదలవ్వవు.
ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడంతో.. ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న భూమానాగిరెడ్డి ఆశలకు అడ్డుకట్ట పడింది. గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యమున్న నాగిరెడ్డి ఇప్పుడు కూడా ఇక్కడ నుంచే అయితే సులభంగా గెలవొచ్చని ఆశించాడు. అయితే ఇప్పుడు ఆయనను నంద్యాల అసెంబ్లీకి ఇన్ చార్జ్ గా ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ! మరి ఎంపీగా పోటీ చేయాలనుకున్న వ్యక్తిని ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేయడం కచ్చితంగా ఆయనలో అసంతృప్తిని రగిల్చే విషయమే!
అదిగాక.. వైకాపాలో ఉన్నందున మొత్తం కర్నూలు జిల్లాపైనే ఆధిపత్యాన్ని కోరుకొంది భూమా ఫ్యామిలీ. దీనికి జగన్ సమ్మతించడు. ఎవరికీ సోలోగా ఒక జిల్లా బాధ్యతలను అప్పజెప్పడానికి జగన్ సిద్ధంగా లేడు. దీంతో భూమా ఫ్యామిలీకి అన్ని విధాలుగానే నిరాశే కలుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో.. ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. జరిగిన పరిణామాలు.. ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. దీంతో భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు వైకాపాకు విడ్కోలు చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయం కలుగుతోంది.

TDP గూటికి భూమా దంపతులు ?

October 1, 2013


మిత్రులందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు...............................

అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయినాథ్ గౌడ్ హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. సాయినాథ్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గుత్తి నియోజక వర్గ అభివృద్ధికి, పార్టీ పటిష్టతకు సాయినాథ్ చేసిన సేవలను బాబు కొనియాడారు.

తెదేపా గుత్తి మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ మృతి


తెలంగాణ రాష్ట్రా ఏర్పాటు కెసిఆర్ కు పిడుగులాంటి వార్త!: రేవంత్

  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు పార్టీ చెప్పడం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పిడుగులాంటి వార్త అని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు.

2014 వరకు తెలంగాణ రాకుంటే వచ్చే ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుచుకుందామని ఆయన కలలు కన్నారని అవి కల్లలు కావడంతో ఆయన రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి చెప్పాల్సింది చెప్పారన్నారు. తెలంగాణకు తమ పార్టీ అనుకూలంగా ఉండటం, తెలంగాణ రావడం కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఆదివారం జరిగిన సకల జన భేరీ సభను కెసిఆర్ కబ్జా చేశారని ఎద్దేవా చేశారు. సీమాంధ్రులను రెచ్చగొట్టేలా మాట్లాడావద్దన్నారు. విజయం సాధించిన వారు ఒదిగి ఉండాలని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవద్దన్నారు.

కెసిఆర్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ ఇద్దరు దురాశపరులన్నారు. వారిద్దరు ఏైసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో పని చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రకటనతో ఆయన కలలు పేకమేడల్లా కుప్పకూలాయన్నారు. తెలంగాణకు కెసిఆర్, సీమాంధ్రకు వైయస్ జగన్, దేశానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు నాయకత్వం వహించలేరన్నారు. తెలంగాణపై సిడబ్ల్యూసి ప్రకటన వచ్చి అరవై రోజులైనా బిల్లు ఎందుకు పెట్టలేదని ఆయన కాంగ్రెసును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారు ఆందోళనలను నివృత్తి చేయాల్సి ఉందని చెప్పారు. తెలంగాణపై పార్లమెంటులో నిలదీయాల్సిన కెసిఆర్ తన ఫాంహౌస్‌లో పడుకున్నారని నిప్పులు చెరిగారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహి అని, ఆయనకు తెలంగాణ రావడం ఇష్టం లేదని మరో నేత దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడలో అన్నారు.

తెలంగాణకు కెసిఆర్, సీమాంధ్రకు వైయస్ జగన్, దేశానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు నాయకత్వం వహించరు.

 కాంగ్రెస్‌కు జగన్ తోక ...జగన్‌కు కాంగ్రెస్ తోక అని టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సోనియా వల్లే జరుగతోందని సామాన్యులు సైతం భావిస్తున్నారన్నారు. సోనియాపై జగన్ ఒక్క మాట మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత చంద్రబాబే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీతో పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు.

కాంగ్రెస్‌కు జగన్ తోక ...జగన్‌కు కాంగ్రెస్ తోక