October 3, 2013

సిబిఐ డైరెక్టర్ ఎందుకు దిగ్విజయ్ సింగ్ ను కలిశారు.


అన్నీ వై.కాంగ్రెస్ కు ముందే తెలుసు-కేశవ్

సీమాంద్ర కేంద్ర మంత్రులు తక్షణమే రాజీనామా చేసి బయటకు రావాలని, క్యాబినెట్ లో నోట్ చించివేసి బయటకు రావాలని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.లగడపాటి రాజగోపాల్ కొద్ది రోజుల క్రితం కూడా ఇప్పట్లో విభజన జరగదని అన్నారని, ఆయన ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని అన్నారు.సీమాంధ్ర మంత్రులు వైదొలగకపోతే ద్రోహం చేసినట్లేనని ఆయన అన్నారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,టిఆర్ఎస్ లతో ఒప్పందం కుదుర్చుకుని విబజన చేస్తున్నదని ఆయన ఆరోపించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కి ముందుగానే తెలిసి ఈ రోజు దీక్షలకు దిగారని కేశవ్ ఆరోపించారు.ప్రతి అడుగు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ముందుగానే తెలుస్తున్నాయని, టెన్ జనపధ్ నుంచే ఈ పార్టీ ప్రధాన కార్యాలయం ఉందని ఆయన అన్నారు.సిబిఐ డైరెక్టర్ ఎందుకు దిగ్విజయ్ సింగ్ ను కలిశారో వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు.