July 19, 2013

 పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వైస్సార్సీపీ నాయకురాలు షర్మిల గత రెండు, మూడు రోజులుగా ఒకరిపై ఒ రు చేసుకుంటున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయ కుడు, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాం డ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దో చుకున్న, దాచుకున్న సొమ్ము ఎవరి వద్ద ఎంత ఉందో బయటకు తీసేందుకు కృ షి చేయాలన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌భవన్‌లో రావుల చంద్రశేఖర్‌రెడ్డి విలే కరుల సమావేశంలో మాట్లాడుతూ షర్మిల భర్త చేసిన తప్పులేమిటో బొత్స బ యపెట్టాలని డిమాండ్‌ చేశారు. జగన్‌న్ని కాపాడానని గతంలో ముఖ్యమంత్రి కిరణ్‌ పేర్కొంటే, వైఎస్‌ కుటుంబాన్ని కాపాడానని ప్రస్తుతం మంత్రి బొత్స చెబుతున్నారన్నారు. ఎవర్ని ఎవరు కాపాడి రాష్ట్ర సంపదను ఎంత కొల్లగొట్టారో ప్రజలకు తెలియాలన్నారు. దోచుకున్నది, దాచుకోవడానికే జగన్‌ పార్టీ పెట్టా రంటున్న బొత్స వైఎస్‌ మంత్రివర్గంలో కొనసాగినప్పుడు ఎందుకు మంత్రి వర్గంలో చర్చించలేదో చెప్పాలన్నారు. వైఎస్‌ హయాంలో దోపిడీ జరిగిందని ఆయన మంత్రివర్గంలో కొనసాగినవారే చెబుతున్నరన్నారు.

షర్మిల,బొత్స వ్యాఖ్యలపై విచారణ చేయాలి


పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనను ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది.పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బొత్స తాను బ్రదర్ అనిల్ తప్పు చేస్తే రక్షించానని చెబుతున్నారని,ఆ విషయం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రిగా ఆయన బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ముఖ్యమంత్రి తాను గతంలో జగన్ ను రక్షించానని అన్నారని, అలాగే ఇప్పుడు బొత్స తాను అనిల్ ను రక్షించారని అంటారని, వీరందరిని వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాపాడారని ఆయన మద్దతుదారులు చెబుతారని,కాంగ్రెస్ లో ఇదంతా ఒక చిత్రమైన పరిస్థితి అని ఇవన్ని బయటకు రావలసిన అవసరం ఉందని రావుల వ్యాఖ్యానించారు.

బొత్స ..వాస్తవాలు బయటపెట్టాలి-రావుల

పంచాయితీ ఎన్నికల్లో ఏకగీవ్రాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు జిల్లాలో వైసీపీకి ఒక్క ఏకగ్రీవం కూడా రాలేదని తెలిపారు. పంచాయితీలను భ్రష్టుపట్టించిన తల్లి, పిల్ల కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఏకగ్రీవంపై వైసీపీ తప్పుడు ప్రచారం : రాజేంద్రప్రసాద్

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ ఏం తప్పు చేశారో పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బహిర్గతం చేయాలని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరెంత తాగారో కాంగ్రెస్, వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఖద్దర్‌మాటున కాంగ్రెస్ నేతలు గాంధీ వారసులమని చెప్పుకోవడం మానుకోవాలని వర్లరామయ్య హితవు పలికారు.

అనిల్ ఏం తప్పు చేశారో బొత్స బహిర్గం చేయాలి : వర్ల

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం అన్నారు. పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ప్రజలకు కృతజ్ఞతలు : హరికృష్ణ

'బీసీ విద్యార్థులు చదువుకోవడానికి డబ్బుల్లేక ప్రయోగశాలలకు రక్తం అమ్ముకొని ఆ డబ్బుతో ఫీజులు కట్టుకొంటున్నారని 2005లో 'ఆంధ్రజ్యోతి'లో పతాక శీర్షికలో వార్తా కథనం వచ్చింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ దానిపై కనీసం స్పందించలేదు. ఆనాడు ఈ దీక్షలు...ఈ స్పందన ఏమయ్యాయి? అధికారం మత్తులో కనిపించలేదా''అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2003లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారని, వైఎస్ అధికారంలోకి రాగా నే బీసీ విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు కూడా ఇవ్వకుండా వేధించారని విమర్శించారు.

'రక్తం' దారపోసినప్పుడు ఏం చేశారు? : ఆంజనేయ గౌడ్

వైసీపీకి ప్రజారాజ్యం పార్టీ గతే పడుతుందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం టీడీపీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలను పరిశీలిస్తే ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయిందన్నారు.

వైసీపీకి పీఆర్‌పీ గతే : ఎంపీ సీఎం రమేష్