July 19, 2013
షర్మిల,బొత్స వ్యాఖ్యలపై విచారణ చేయాలి
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వైస్సార్సీపీ నాయకురాలు షర్మిల గత రెండు, మూడు రోజులుగా ఒకరిపై ఒ రు చేసుకుంటున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయ కుడు, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్రెడ్డి డిమాం డ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దో చుకున్న, దాచుకున్న సొమ్ము ఎవరి వద్ద ఎంత ఉందో బయటకు తీసేందుకు కృ షి చేయాలన్నారు. శుక్రవారం ఎన్టీఆర్భవన్లో రావుల చంద్రశేఖర్రెడ్డి విలే కరుల సమావేశంలో మాట్లాడుతూ షర్మిల భర్త చేసిన తప్పులేమిటో బొత్స బ యపెట్టాలని డిమాండ్ చేశారు. జగన్న్ని కాపాడానని గతంలో ముఖ్యమంత్రి కిరణ్ పేర్కొంటే, వైఎస్ కుటుంబాన్ని కాపాడానని ప్రస్తుతం మంత్రి బొత్స చెబుతున్నారన్నారు. ఎవర్ని ఎవరు కాపాడి రాష్ట్ర సంపదను ఎంత కొల్లగొట్టారో ప్రజలకు తెలియాలన్నారు. దోచుకున్నది, దాచుకోవడానికే జగన్ పార్టీ పెట్టా రంటున్న బొత్స వైఎస్ మంత్రివర్గంలో కొనసాగినప్పుడు ఎందుకు మంత్రి వర్గంలో చర్చించలేదో చెప్పాలన్నారు. వైఎస్ హయాంలో దోపిడీ జరిగిందని ఆయన మంత్రివర్గంలో కొనసాగినవారే చెబుతున్నరన్నారు.
Posted by
arjun
at
7:50 PM