వైసీపీకి ప్రజారాజ్యం పార్టీ గతే పడుతుందని రాజ్యసభ
సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం టీడీపీ కార్యాలయంలో
గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో
ఏకగ్రీవాలను పరిశీలిస్తే ఆ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం అయిందన్నారు.