July 19, 2013

వైసీపీకి పీఆర్‌పీ గతే : ఎంపీ సీఎం రమేష్

వైసీపీకి ప్రజారాజ్యం పార్టీ గతే పడుతుందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం టీడీపీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలను పరిశీలిస్తే ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయిందన్నారు.