July 19, 2013

'రక్తం' దారపోసినప్పుడు ఏం చేశారు? : ఆంజనేయ గౌడ్

'బీసీ విద్యార్థులు చదువుకోవడానికి డబ్బుల్లేక ప్రయోగశాలలకు రక్తం అమ్ముకొని ఆ డబ్బుతో ఫీజులు కట్టుకొంటున్నారని 2005లో 'ఆంధ్రజ్యోతి'లో పతాక శీర్షికలో వార్తా కథనం వచ్చింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ దానిపై కనీసం స్పందించలేదు. ఆనాడు ఈ దీక్షలు...ఈ స్పందన ఏమయ్యాయి? అధికారం మత్తులో కనిపించలేదా''అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2003లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారని, వైఎస్ అధికారంలోకి రాగా నే బీసీ విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు కూడా ఇవ్వకుండా వేధించారని విమర్శించారు.