October 29, 2012

పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఉదయం 10.40 నిమిషాలకు మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలం చిన్నపాడు స్టేజీ నుంచి నడక ప్రారంభించారు. దారిలో రైతులను పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ ముందుకు సాగారు.

ధరూర్ మండలం పెద్దపాడు, ఎమినోనిపల్లి, చింతరేవుల గ్రామాలకు చెందిన రైతులు, కూలీలతో చంద్రబాబు మాట్లాడారు. ఎమినోనిపల్లి వద్ద పొలంలో పని చేస్తున్న కూలీలతో ముచ్చటించారు. చింతరేవుల గ్రామంలో రైతులు విద్యుత్, తాగునీరు, తదితర సమస్యలను మొరపెట్టుకున్నారు. పెద్దపాడు గ్రామానికి చెందిన ఆశన్నను చంద్రబాబు పలకరించారు.

చంద్రబాబు: ఎద్దులు ఎంతకు కొన్నావు?
ఆశన్న: రూ.50 వేలు సార్

చంద్రబాబు: పొలం పనులు చేయడానికి ట్రాక్టర్ కొనవచ్చుగా ...
ఆశన్న: పెరిగిన డీజీల్ ధరలకు ట్రాక్టర్ కొనాలంటేనే భయం వస్తోంది.

చంద్రబాబు: మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీజిల్, పెట్రోల్ ధరలపై తగ్గింపునకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.
ఆ సమయంలో అక్కడే ఉన్న కూలీలు, రైతులు ఆయన చుట్టూ చేరారు.

చంద్రబాబు: కూలీ ఎంత ఇస్తున్నారమ్మా?
సరోజమ్మ: రూ.100 ఇస్తున్నారు సారు.

చంద్రబాబు: ఉపాధి పనులకు వెళ్లడం లేదా?
మంజుల: ఆ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో, ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. చంద్రబాబు: అవినీతి ప్రభుత్వానికి స్వస్తి చెప్పి త్వరలోనే టీడీపీ అధికారంలోకి వస్తుంది. మీ సమస్యలన్నీ తీరుస్తాం.

ఆంజనేయులు: మేము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కరువైంది. రాత్రివేళల్లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు. అప్పుల పాలవుతున్నాం.

చంద్రబాబు: అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోంది. రైతుల కష్టాలు తొలగిస్తామన్న కాంగ్రెస్..తీరని మోసం చేశారు. విద్యుత్ సమస్యపై అధికారుల వద్ద మొరపెట్టుకుంటే, కేసులు బనాయిస్తారా? త్వరలోనే మంచిరోజులొస్తాయి. రైతులకు సాగునీటి కోసం తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తాం. రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.

తిమ్మక్క: మాకు పింఛన్లు అందడం లేదు.
చంద్రబాబు: మేము వచ్చాక వృద్ధుల పింఛన్‌ను రూ.600కు పెంచుతాము.

సాయన్న: తాగడానికి నీరు అందడం లేదు
చంద్రబాబు: పక్కనే జూరాల డ్యాం ఉన్నా కానీ "చూడటానికి మాత్రమే కానీ తాగడానికి పనికి రాదు'' అన్న విధంగా ఉంది. స్థానిక మంత్రి ఉన్నా, జనాలకు తాగునీరు అందించడం లేదు. మా ప్రభుత్వం రాగానే ఎన్టీఆర్ సుజల ద్వారా ప్రతి గ్రామానికి నీరు అందే విధంగా చూస్తాం.

దారిలో రైతులను పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ 28వ రోజు పాదయాత్ర సాగిందిలా..


  టీడీపీ అధినేత చంద్రబాబు 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బయలు దేరి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని ఆత్మకూర్‌కు చేరుకుంటారు. అనంతరం కానాపూర్, సింగంపేట క్రాస్, మస్తీపూర్ గేట్, అమరచింత, వీప్లనాయక్ తండా, చంద్రానాయక్ తండా ద్వారా మద్దూర్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే చంద్రబాబు బస చేస్తారు.

29వ రోజు చంద్రబాబు యాత్ర షెడ్యూల్

తెలంగాణకు న్యాయం చేసే బాధ్యత నాదే!

ఇప్పుడూ ఎప్పుడూ నేను వ్యతిరేకం కాదు

పేదల కష్టం తొలగేదాకా నిద్రపోనని ప్రతిన
వేగం అందుకున్న పాదయాత్ర
గంటకు రెండు కిలోమీటర్ల నడక
బాబుకు కరుణానిధి పరామర్శ లేఖ
చుక్కా రామయ్య, పొత్తూరి సంఘీభావం
 తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. పేదలు బతకడమే కష్టంగా మారిందని, వారి కష్టాలు తీర్చేదాకా నిద్రపోనని ప్రతీనబూనారు. కాంగ్రెస్ దొంగలను నమ్మితే మిగిలేది కష్టాలేనని హెచ్చరించారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా 27వ రోజు చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్, ఆత్మకూర్ మండలాల్లో పర్యటించారు.

రైతులు, మహిళలు, కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఊరి మొత్తానికి సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా కట్టని ఊళ్లు ఎన్నో చూశానని చెప్పుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు పెత్తందారిగా వ్యవహరిస్తుండగా ప్రజలు బానిసలుగా ఉండాల్సిన దుస్థితి కొనసాగుతోందంటూ మంత్రి డీకే అరుణపై పరోక్షంగా మండిపడ్డారు. గిరిజన నాయకుడు కొమురం భీం, వాల్మీకి స్ఫూర్తితో టీడీపీ పని చేస్తుందని చంద్రబాబు అన్నారు.

వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బోయలను కర్ణాటకలో ఎస్టీలుగా, తమిళనాడులో ఎస్సీలుగా గుర్తిస్తుండగా, మన రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలో మాత్రం బీసీలుగా గుర్తించడం శోయనీయమన్నారు. వారిని తక్షణం ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. కాగా, సోమవారం గంటకు రెండు కిలోమీటర్ల చొప్పున కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నం మెల్లిమెల్లిగా నడిచిన చంద్రబాబు సోమవారం కొంత వేగం పెంచే ప్రయత్నం చేశారు.

ఉదయం 10.40 గంటలకు బయలుదేరిన ఆయన.. ధరూర్ మండలం పెద్దపాడు చేరుకొన్నారు. వేరు శనగచేనులోకి వెళ్లి మహిళా కూలీల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. కలుపు తీసే పరికరంతో కొద్దిసేపు కలుపు తీశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చిన్నచింత రేవులకు చేరుకొని స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. సమీపంలోని కిరాణ షాపుకు వెళ్లి కూల్ డ్రింక్ తాగారు. మధ్యాహ్నం రెండున్నరకు జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. భోజనం చేసి కొద్దిసేపు విశ్రమించారు. 3.30లకు పాదయాత్ర కొనసాగించి ప్రాజెక్టు మీద నుంచి నందిమల్ల మీదుగా మూలమల్ల చేరుకున్నారు.

కరుణానిధి పరామర్శ: చంద్రబాబుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి లేఖ రాశారు. ' బాబూ.. ఆరోగ్యం జాగ్రత్త'' అంటూ పరామర్శించారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని బాబుకు సూచించారు. యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలో వేదిక కూలడంతో చంద్రబాబు వెన్నుకు దెబ్బతగిలిన విషయం తెలిసిందే. కాగా, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం చంద్రబాబు పాదయాత్ర వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించి, ఆయనను పరామర్శించారు.

పాదయాత్ర తెలంగాణ సమస్యకు పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని చుక్కా రామయ్య వ్యక్తం చేశారు. కాగా, అధినేతకు సంఘీభావంగా టీడీపీ మహిళా విభాగం సోమవారం సాయంత్రం పాదయాత్రలో పాల్గొంది. విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శోభాహైమావతి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తదితరులు ఆత్మకూర్ మండలం నందిమల్ల వద్ద పాదయాత్రలో పాల్గొన్నారు.

పేదల కష్టం తొలగేదాకా నిద్రపోనని ప్రతిన, వేగం అందుకున్న పాదయాత్ర (28వ రోజు )

కాంగ్రెస్‌ పాలకుల నిర్ల క్ష్యం వల్లే జూరాల నిర్మాణంలో జాప్యం జరిగిందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే ఎన్టీఆర్‌ హయాంలో పనులు వేగవంతం కాగా, తాను అధికారంలో ఉన్నప్పుడు రూ.600 కోట్లు వెచ్చించి పూర్తి చేయ డం జరిగిందన్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా సోమవారం ఆయన గద్వాల నియోజక వర్గంలో పాదయాత్ర ముగించుకుని జూరాల డ్యామ్‌ మీదుగా ఆత్మకూర్‌ మండలానికి చేరుకు న్నారు. ఈ సందర్బంగా డ్యామ్‌ను ఆయన పరిశీ లించారు. పలు చోట్ల ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి పాలన కొనసా గుతున్నదని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లు ప్రభుత్వ విఐపిలకు నిలయంగా మారాయని, కాంగ్రెస్‌ పాలనలో అవి నీతి ఏ స్థాయిలో జరుగుతున్నదో ప్రత్యేకంగా చెప్పా ల్సిన అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికార కాంగ్రెస్‌ లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలకు తెరలేపితే, రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నార ని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక జిల్లా విషయానికి వస్తే గద్వాల, ఆత్మకూర్‌ తదితర ప్రాంతాలకు జూరాల ప్రాజెక్టు అత్యంత చేరువలో ఉన్నా, జిల్లా ప్రజాప్రతినిధులు ప్రజలకు తాగునీటిని కూడా అందించే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. ఎంత సేపు టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు సమస్యలపై దృష్టిసారించి ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుందన్నారు. గద్వాల ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉన్నా, ఇక్కడి ప్రజలకు న్యాయం చేయడం లేదని, వ్యక్తిగత ఆస్తులను పెంచుకునేందుకు తపన పడుతున్నారని విమ ర్శించారు. అదే విధంగా రాష్ట్రంలో రైతాంగం నష్టాల ఉబిలో కురుకుపోయి ఆత్మహత్యల బాట పట్టారని, చేనేత పరిశ్రమ దెబ్బతినడంతో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని చంద్రబాబు ఆందోళన చెందారు. తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించ డంతో పాటు రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రుణాలను మాఫీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్‌ను అందించి వ్యవసాయానికి పెద్దపీఠ వేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు నిరుపేదలకు విద్యనందించి ఉన్నతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. భవిష్యత్‌లో ఈ అవినీతి పాలనను ప్రజలు అంతమొందిస్తారన్న ధీమాను టిడిపి అధినేత వ్యక్తపర్చారు. యాత్రలో ఆయన వెంట పలువురు ఎమ్మేల్యేలు, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు.

జూరాలను పూర్తి చేసిన ఘనత టిడిపిదే.......సోమవారం వస్తున్నా మీకోసం యాత్రలో చంద్రబాబునాయుడు 29.10.2012

'వస్తున్నా మీకోసం' యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా, గద్వాల్ పట్టణంలో వేదిక కూలడం ద్వారా వెన్నునొప్పితో బాధపడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ ్యక్షుడు కరుణానిధి లేఖ ద్వారా పరామర్శించారు.

'సమావేశంలో వేదిక మీద నుంచి పడటం వల్ల మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలిసింది. అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి'' అని ఆయన లేఖ రాశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరుణానిధి తమిళనాడు సీఎంగా ఉన్నారు. పొరుగు రాష్ట్రం కావడంతో ఇద్దరు సీఎంలు, ఆయా అంశాలపై చర్చించేవారు. ఆ సాన్నిహిత్యం వల్ల కరుణానిధి, చంద్రబాబును పరామర్శిస్తూ లేఖ రాసినట్లు తెదేపా పార్టీ వర్గాలు తెలిపాయి.

అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోండి చంద్రబాబుకు కరుణానిధి లేఖ 29.10.2012

పేదలకు ఉచితంగా ఇల్లు
అధికారంలోకి వస్తే బెల్టు షాపులు రద్దు
సుజల పథకం ద్వారా తాగునీరు

 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదవారికి లక్ష రూపాయలు ఖర్చుపెట్టి ఉచితంగా ఇల్లు నిర్మిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే పూర్తిగా బెల్టు షాపులు రద్దు చేస్తామని అన్నారు.

'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు జిల్లాలోని సోమవారం థరూర్ మండలం, చినపాడు నుంచి 27 వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి వేరు శెనగ, పత్తి పంటలను పరిశీలించిన బాబు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతరేపుపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆదరణ పథకం మళ్లీ అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా వృత్తిదారులకు పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.

గ్రామాస్తులు తాగునీటి సమస్య గురించి ప్రస్తావించగా ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళలు మరుగుదొడ్ల గురించి ప్రస్తావించగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు మక్తల్ నియోజక వర్గంలో ప్రవేశంచారు. అక్కడ చంద్రబాబుకు నేతలు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పెద్దన తరలవచ్చి స్వాగతం పలికారు.

పేదలకు ఉచితంగా ఇల్లు, అధికారంలోకి వస్తే బెల్టు షాపులు రద్దు 28వ రోజు పాదయాత్రలో చంద్రబాబు


"వస్తున్నా మీకోసం" 28వ రోజు పాదయాత్ర పోటోలు..(Part-2) 29.10.2012


"వస్తున్నా మీకోసం" 28వ రోజు పాదయాత్ర పోటోలు..29.10.2012

ప్రత్యర్ధులు
ఫ్యాక్షన్
అవినీతి రాజకీయాలు
ప్రభుత్వ ఆస్తులను దోచడంలోని
కళలలో ఆరితేరి
చట్టానికి దొరికినా
బొంకుడు నాటకాలతో
భువన బోంతరాలను
రంజింప జేస్తూ...
మధ్య మధ్యలో
మతప్రచారాలతో హోరెత్తిస్తూ
పల్లకిలో ఊరేగినన్నాల్లూ
ప్రజల ఆస్తులను దోచిన విషయాన్ని
ప్రక్క దోవ పట్టిస్తూ
కారాగారం లో వుంటూ సిగ్గుపడాల్సిన సమయంలో
ప్రజల సమస్యలకోసం అంటూ
ప్రతిపక్షాలను కళ్ళు తెరిపించడం కోసం అంటూ
తిమ్మిని బమ్మి చేసే నాటకాలతో
ఆస్కార్ అవార్డులు కు అర్హతవున్న కళతో
సినిమా కథలు వ్రాసే వాళ్ళకే
ముడిసరుకుగా ఉపయోగపడేంత
సామర్ధ్యాన్ని చాటుకొంటున్న
వీళ్ళ సామర్ధ్యం ముందు
బాబు కు డైరెక్షన్ ఇస్తున్న
సినిమా వాళ్ళ ప్రావీణ్యం ఎంత?

సేకరణ:
www.chaakirevu.wordpress.com

ప్రజల ఆస్తులను దోచిన విషయాన్ని ప్రక్క దోవ పట్టిస్తూ కారాగారం లో వుంటూ సిగ్గుపడాల్సిన సమయంలో


collection from Eenadu 44photos slideshow

27వ రోజు చంద్రబాబునాయుడి పాదయాత్ర పోటోలు...(Part-3) ....28.10.2012


collection from andhrajyothi 8 photos slideshow

27వ రోజు చంద్రబాబునాయుడి పాదయాత్ర పోటోలు...(Part-2) ....28.10.2012

  మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో సభా వేదిక కూలి నడుము, కండరాల నొప్పికి గురైన చంద్రబాబు కొద్ది రోజుల పాటు రోజూ 15 కిలో మీటర్ల దూరంలోపే పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌లో మార్పులు చేశారు. దీంతో ఆదివారం చంద్రబాబు నడకలో వేగం ముందుకంటే తగ్గింది. ప్రత్యేక బస్సు దిగిన ఆయన రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శెట్టి ఆత్మకూర్‌కు చేరుకునే సరికి సాయంత్రం 4 గంటలు అయ్యింది.

ఈ దూరం నడవడానికి ఆయనకు 1:15 గంటల సమయం పట్టింది. 8.8 కిలోమీటర్ల మేర నడిచి ధరూర్ మండలం భీంపురం వద్ద రాత్రి బస చేశారు. మట్టి రోడ్డుపైనే పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా బాబు అనంతపురం జిల్లాలో కొన్ని సందర్భాల్లో 20 నుంచి 24 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల తరువాత దూరాన్ని పెంచే అవకాశం ఉంటుందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రజ్యోతికి చెప్పారు.

చంద్రబాబు కొద్ది రోజుల పాటు రోజూ 15 కిలో మీటర్ల దూరంలోపే పాదయాత్ర