October 29, 2012

చంద్రబాబు కొద్ది రోజుల పాటు రోజూ 15 కిలో మీటర్ల దూరంలోపే పాదయాత్ర

  మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో సభా వేదిక కూలి నడుము, కండరాల నొప్పికి గురైన చంద్రబాబు కొద్ది రోజుల పాటు రోజూ 15 కిలో మీటర్ల దూరంలోపే పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌లో మార్పులు చేశారు. దీంతో ఆదివారం చంద్రబాబు నడకలో వేగం ముందుకంటే తగ్గింది. ప్రత్యేక బస్సు దిగిన ఆయన రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శెట్టి ఆత్మకూర్‌కు చేరుకునే సరికి సాయంత్రం 4 గంటలు అయ్యింది.

ఈ దూరం నడవడానికి ఆయనకు 1:15 గంటల సమయం పట్టింది. 8.8 కిలోమీటర్ల మేర నడిచి ధరూర్ మండలం భీంపురం వద్ద రాత్రి బస చేశారు. మట్టి రోడ్డుపైనే పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా బాబు అనంతపురం జిల్లాలో కొన్ని సందర్భాల్లో 20 నుంచి 24 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల తరువాత దూరాన్ని పెంచే అవకాశం ఉంటుందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రజ్యోతికి చెప్పారు.
No comments :

No comments :