October 29, 2012

అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోండి చంద్రబాబుకు కరుణానిధి లేఖ 29.10.2012

'వస్తున్నా మీకోసం' యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా, గద్వాల్ పట్టణంలో వేదిక కూలడం ద్వారా వెన్నునొప్పితో బాధపడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ ్యక్షుడు కరుణానిధి లేఖ ద్వారా పరామర్శించారు.

'సమావేశంలో వేదిక మీద నుంచి పడటం వల్ల మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలిసింది. అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి'' అని ఆయన లేఖ రాశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరుణానిధి తమిళనాడు సీఎంగా ఉన్నారు. పొరుగు రాష్ట్రం కావడంతో ఇద్దరు సీఎంలు, ఆయా అంశాలపై చర్చించేవారు. ఆ సాన్నిహిత్యం వల్ల కరుణానిధి, చంద్రబాబును పరామర్శిస్తూ లేఖ రాసినట్లు తెదేపా పార్టీ వర్గాలు తెలిపాయి.

No comments :

No comments :