August 31, 2013




 
'కాంగ్రెస్ దద్దమ్మ పాలనతో రూపాయి పతనమైంది. ఆంధ్ర ప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. పాలన చేతగాకపోతే నమస్కారం పెట్టి దిగిపోండి. ప్రజలు మాకు అవకాశం ఇస్తే ఏడాదిలో ఏ సమస్య అయినా పరిష్కరించి చూపిస్తా' అని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం ఉదయం 11గంటలకు గుంటూరు జిల్లా పొందుగల నుంచి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమస్య అయినా, ఆర్థికవ్యవస్థ పతనం అయినా ఏదైనా సరే పరిష్కరించి చూపిస్తానంటూ కాంగ్రెస్ పాలకులకు సవాల్ విసిరారు. 'వాళ్లేమీ వాళ్ల సీట్లు ఇవ్వక్కరలేదు. ఆ ముష్టి నాకు వద్దు. గద్దె దిగి ఎన్నికలు పెట్టండి.. ప్రజలే తీర్పు ఇస్తారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'సోనియా గాంధీ తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరించి రాష్ట్రంలో చిచ్చు పెట్టి కూర్చుంటే మేం చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోవాలా? అంత పనికిమాలిన వాళ్లలా కనిపిస్తున్నామా? ఎలాంటి రాష్ట్రాన్ని ఎలా చేశారు? నేను ఒంటి చేత్తో రాష్ట్రపతులు, ప్రధానులు, లోకసభ స్పీకర్లను ఎంపిక చేశాను. ఈ ఇంట్లో కూర్చుని అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసి అప్పటి ప్రధాని వాజ్‌పేయికి ఫోన్ చేసి చెప్పాను. నేను ఎంపిక చేస్తే బాలయోగి లోక్‌సభ స్పీకర్ అయ్యారు. దేవెగౌడ తర్వాత ప్రధాని బాధ్యతను జాతీయ నేతలంతా కలిసి నాకు అప్పగించారు. ఏపీ భవన్లో ఒక్కో నేతతో అరగంట మాట్లాడి గుజ్రాల్‌ను ఎంపిక చేశాను. దేవెగౌడను రాజీనామాకు ఒప్పించాను. దక్షిణ భారత దేశం నుంచి కామరాజ్ నాడార్, రాజగోపాలాచారి, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలు నడిపారు. వారి తర్వాత కాస్తో కూస్తో నేను నడిపాను' అని చంద్రబాబు పేర్కొన్నారు.

దావోస్‌లో ప్రపంచ దేశాధినేతల ఆర్థిక సదస్సు జరిగితే దానికి వెళ్లడానికి మన దేశ ప్రధానులు భయపడేవారని, అక్కడకు వెళ్తే ఓట్లు రావని దేవెగౌడ చెప్పడంతో వాజ్‌పేయి కూడా రానన్నారని, అయినా రాష్ట్రం కోసం తాను వరుసగా ఎనిమిదేళ్లు వెళ్లానని బాబు చెప్పారు. 'అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వస్తే ఆయనను మిస్టర్ క్లింటన్ అని పిలిచాను తప్ప క్లింటన్ సర్ అని పిలవలేదు. నేను తెలుగువారి ఆత్మ గౌరవం నిలిపాను. వారిలో ఆత్మ విశ్వాసం పెంచాను. తెలుగువాడి దమ్మేంటో చూపించా...మళ్లీ చూపిస్తా' అని ప్రకటించారు. 'ఇందిరా గాంధీకి ప్రజాగ్రహం రుచి చూపించి నట్లే సోనియా కు తెలుగు ప్రజలు రుచి చూపిస్తారు' అని ఆయన వ్యాఖ్యానించారు. 'ప్రజలు మోసగాళ్లు, దొంగలనే అర్థం చేసుకొంటారా... నాలాంటి వాళ్లను అర్థం చేసుకోరా? కోట్ల మంది ప్రజలు రోడ్లపై ఉంటే నేను ఇంట్లో పడుకోవాలా? నాకు స్వార్థం లేదు.

నేను చూడని అధికారం లేదు. ఇంకా నాకు ఏం కావాలి? మహా అయితే ఇంకోసారి అధికారం రాదు. అంతేగా? రాష్ట్ర ప్రజలకు ఏది మంచో అదే చెబుతాను. ప్రజలు నన్ను వద్దనుకొంటే నమస్కారం పెడతాను. నేను చెప్పేది ఒకటే. సమస్యల నుంచి దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదు. అవేంటో తెలుసుకోవాలి. వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయాలి. సీమాంధ్ర ప్రజల మనసుల్లో హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు, విద్యావకాశాలు, నదీ జలాలపై భయాందోళనలున్నాయి. తమ భవిష్యత్ అంధకారంలో పడుతుందన్న భయం ఉంది. అధికారంలో ఉన్నవారు ఇటు తెలంగాణ...అటు ఆంధ్ర ప్రజలందరితో చర్చించాలి. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరితో ఒకసారి కాకపోతే నాలుగుసార్లు చర్చించండి. అందరికీ విశ్వాసం కలిగేలా చేయండి. ఎవరూ విజేతలు... పరాజితులు ఉండకూడదని బుద్ధుడు చెప్పాడు.

శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో అదే పేర్కొంది. దానిని ఆచరణలో పెట్టండి. తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఇటువంటి అనిశ్చితి మంచిది కాదని అన్నాను. తెలంగాణను మూడేళ్లు తగలబెట్టారు. ఇప్పుడు సీమాంధ్రను మంటల్లోకి నెట్టారు. రాష్ట్రంలోని రాజకీయ నేతలందరిలోకి నేను సీనియర్‌ను. రాజకీయ కుట్రలు జరుగుతుంటే నేను నోరు మూసుకొని కూర్చోవాలా? నా అభిప్రాయాలు నేను చెబుతాను. ప్రజలు వారి నిర్ణయం వారు తీసుకొంటారు' అని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర తర్వాత తెలంగాణలో కూడా పర్యటిస్తానని, తనను ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు.

టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నప్పుడల్లా తమపైకి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుందని, ఇప్పుడూ అదే చేస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బయట మాట్లాడుతున్నవన్నీ తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా వద్ద ఎందుకు చెప్పలేదని చంద్రబాబు ప్రశ్నించారు. వినకపోతే అప్పుడే ప్రతిఘటించాల్సింది, లోపల ఒకటి...బయట ఒకటి మాట్లాడటం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమ సమస్యలపై పోరాడుతున్న ఎన్జీవోలను అభినందిస్తున్నానని, వాళ్లకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికే తాను వెళ్తున్నాను తప్ప తనకు ఇప్పుడు కొత్తగా కావాల్సిన రాజకీయ లబ్ధి ఏమీ లేదని చెప్పారు.

రాష్ట్ర విభజనైనా..రూపాయి పతనమైనా ఏడాదిలో పరిష్కరిస్

రాష్ట్రంలో పాలన స్థంభించిందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి,టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.సచివాలయంలోనే పోరాటాలు జరుగుతున్నాయని,సగటు మనిషి సమస్యలను పట్టించుకునేవాడే కరువయ్యాడని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే, ఎవరు సమర్ధవంతమైన నాయకుడే అతనినే ఎన్నుకుంటారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న టిడిపి

అధికారం ఇస్తే ఆరునెలల్లో రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించి చూపుతానని చంద్రబాబు అన్నారు. సోనియాగాంధీ చిచ్చు పెడితే చేతులు ముడుచుకుని కూర్చుంటామని అని ఆయన ప్రశ్నించారు. నాడు ఎన్.టి.ఆర్.ను దించితే ఇందిరాగాంధీ మెడలు వంచి మళ్లీ అదికారం ఎన్.టి.ఆర్.కు దక్కేలా చేశారని ఇప్పుడు కూడా సోనియాకు అదే చేస్తారని ఆయన అన్నారు. దొంగే, దొంగ, దొంగ అంటుంటే తాను ఇంటిలో కూర్చుంటానా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆరు నెలల్లో పరిష్కరిస్తా- చంద్రబాబు



ప్రధాని రూపాయి పతనం గురించి మాట్లాడితే సరిపోదు, ఆంధ్రప్రదేశ్ పతనం గురించి కూడా మాట్లాడాలి!

తెలుగుదేశం ఎమ్.పిలు ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ తేజాకు ఒక సలహా ఇస్తున్నారు.
కేంద్ర మంత్రి , చరణ్ తండ్రి అయిన చిరంజీవి తన మంత్రి పదవికి రాజీనామా చేసేలా, ఉద్యమంలోకి వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని రాంచరణ్‌ ను కోరుతున్నామని టిడిపి ఎమ్.పిలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కిష్టప్ప, కె.నారాయణరావు లు కోరారు. చిరంజీవితో సహా కేంద్ర మంత్రులంతా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాని రూపాయి పతనం గురించి మాట్లాడితే సరిపోదని, ఆంధ్రప్రదేశ్ పతనం గురించి కూడా మాట్లాడాలని కిష్టప్ప డిమాండ్ చేశారు.

చిరంజీవి కొడుక్కి టిడిపి ఎమ్.పి ల సూచన!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి ఆత్మగౌరవ యాత్రకు అంతా సహకరించాలని, ముఖ్యంగా ఎన్.జి.ఓలు సహకరించాలని గుంటూరు జిల్లా తెలుగుదేశం నతలు విజ్ఞప్తి చేస్తున్నారు.జిల్లా పార్టీ అద్యక్షుడు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రజల కోసం చంద్రబాబు బస్ యాత్ర చేస్తున్నారని అన్నారు.ఎన్.జి.లు తమ సమస్యలను చంద్రబాబుకు చెప్పుకోవచ్చని ఆయన అన్నారు.

చంద్రబాబుకు యాత్రకు సహకరించాలి: పత్తిపాటి

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అని, కేసీఆర్ కూడా ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని దీక్ష చేశారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకే కాంగ్రెస్, వైసీపీ కుమ్మక్కయారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కుట్రలను బహిర్గతం చేసుందుకే చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రను చేస్తున్నట్లు మోత్కుపల్లి తెలిపారు.

జగన్‌ది దొంగ దీక్ష : మోత్కుపల్లి

August 30, 2013




 
"టీఆర్ఎస్ పార్టీ నాది యు- టర్న్ అంటుంది. వైసీపీ నాది టీ-టర్న్ అంటుంది. నాది ఆ టర్నూ కాదు...ఈ టర్నూ కాదు. స్ట్రెయిట్ లైన్. పబ్లిక్ లైన్. ప్రజలకు న్యాయం జరగాలి. తెలుగువారికి ఎక్కడ సమస్యలు వచ్చినా నేను అక్కడ ఉంటాను. ఉత్తరాఖండ్‌లో తెలుగువారు చిక్కుకుపోతే నేను వెళ్లాను. బాబ్లీకి వెళ్లాను. తెలుగు వారి గౌ రవం పెంచడానికి ప్రపంచమంతా తిరిగాను. సీమాంధ్రకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. కాంగ్రెస్ దాన్ని పట్టించుకోవట్లేదు. ముప్పై రోజులుగా ప్రజ లు రోడ్లపై ఉంటే ఎందుకు ఉన్నారని కూడా అడగకపోవడం మరీ ఘోరం. దీన్ని ప్రశ్నించడానికే నేను వెళ్తున్నాను'' అని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం నుంచి గుంటూరు జిల్లాలో తలపెట్టిన తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ తన నివాసంలో "ఏబీఎన్-ఆంధ్రజ్యోతి'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని, ఎలాంటి రాష్ట్రం ఎలా అయిపోయిందన్న ఆవేదన మనసును పట్టి పీడిస్తోంది'' అన్నారు.

కేవలం తన రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్లజ్జగా వ్యవహరించిన తీరే రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ సంక్షోభంలోకి నెట్టిందని, నిర్ణయానికి ముందే అందరినీ విశ్వాసంలోకి తీసుకొని ఎవరి సమస్యలు ఏమిటో తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. "విభజన నిర్ణయం గురించి ప్రకటించిన నోటితోనే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడింది. దానిని టీఆర్ఎస్ «ద్రువీకరించింది. ఇది రాజకీయమా? ప్రజా కోణమా? టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కూర్చుని.. ఉద్యోగులు వెళ్లిపోవాలని, నాలుకలు కోస్తామని ప్రకటనలు చేశారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నాయకులు చెప్పగానే మాటమార్చి సంయమనం పాటించాలని హితోక్తులు చెబుతున్నారు. కాంగ్రెస్ స్క్రిప్ట్.. టీఆర్ఎస్ డైలాగులు. తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన నేను అడిగితే ప్రధాని సమయం ఇవ్వరు. విజయమ్మ అడగ్గానే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. వైఎస్ ఉంటే ఇలా జరిగేది కాదని సానుభూతి చూపిస్తారు. రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ కేసు మోపడంతో జైలులో ఉన్న వ్యక్తి గురించి రాష్ట్రపతి వాకబు చేస్తారు.

వీరి మధ్య బంధం ఎంత బలీయంగా ఉందో ఇదే ఉదాహరణ. ఇటు టీఆర్ఎస్‌ను, అటు వైసీపీని కలుపుకొని కాంగ్రెస్ రాజకీయ కుట్రలు చేస్తోంది. ఈ పార్టీల మద్దతుపై ధైర్యంతో ప్రజలను చిన్నచూపు చూస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది'' అని బాబు ధ్వజమెత్తారు. తన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటున్న ప్రత్యర్థి పార్టీల విమర్శలను చంద్రబాబు తోసిపుచ్చారు. "అమ్మ దయ.. అమ్మ వరం అంటూ హైదరాబాద్‌లో టి-కాంగ్రెస్ నేతలు సోనియా ఫొటోతో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు. నా వల్లే వచ్చి ఉంటే వాటిపై కనీసం నా పేరైనా వేసి ఉండాలి కదా. ఎక్కడా కనిపించట్లేదే'' అని వ్యాఖ్యానించారు. తెల్ల కాగితంపై సంతకం చేసి ఇచ్చిన మాదిరిగా కేంద్రానికి లేఖ ఇచ్చిన వైసీపీకి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. "రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి సర్వాధికారాలు ఉన్నాయని షిండేకు ఇచ్చిన లేఖలో వైసీపీ రాసింది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకొన్నా కట్టుబడి ఉంటామని చెప్పింది.

ఇక మీరు టీడీపీని ఎలా అంటారు? మమ్మల్ని ఓడించలేమన్న భయంతో 1999లో తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది వైఎస్. 2004లో తెలంగాణ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టారు. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొన్నారు. మంత్రి పదవులు ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి మాపై రాళ్లు వేస్తున్నారు. వీళ్లను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రెండు వైపులా ఓట్లూ సీట్లూ వస్తాయని కలలు కంటోంది'' అని ఆయన విమర్శించారు. తొమ్మిదేళ్లు గాడిద చాకిరీ చేసి ఒక స్థాయికి తెచ్చిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ తన అసమర్థ, అస్తవ్యస్త నిర్ణయాలతో నాశనం చేసి వదిలిపెట్టిందని బాబు దుయ్యబట్టారు. "మూడేళ్లు తెలంగాణలో ఉద్యమాలు, అనిశ్చితి. ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యమ జ్వాలలు. ఎలాంటి రాష్ట్రం ఎలా అయిందన్న బాధ కలుగుతోంది. ఎంతో కష్టపడి హైదరాబాద్‌ను ఈ స్థాయికి తెచ్చాం. దేశం అంతా మనవైపు చూసేలా చేశాం.

సమస్యలు మాకూ వచ్చాయి. ఆలమట్టి విషయంలో ప్రధానిగా ఉన్న దేవెగౌడతో తగాదా వస్తే.. ఐదుగురు సీఎంలతో కమిటీ వేయించి పరిష్కరించాం. ఇప్పుడు నేను కేవలం ప్రతిపక్ష నేతను. నా పాత్ర పరిమితం. సలహాలు ఇవ్వగలను. లేఖలు రాయగలను. పెద్దన్న పాత్రలో కాంగ్రెస్ ఉంది. కానీ ఆ పార్టీ తన బాధ్యతను విస్మరించింది. ప్రజల్లోకి వెళ్లి అదే చెబుతాను'' అని ఆయన వివరించారు. తాను మాట మారుస్తున్నానన్న టి-జేఏసీ చైర్మన్ కోదండరాం విమర ్శను బాబు తోసిపుచ్చారు. "ఆయన ఒక్క రోజు కూడా నన్ను అభినందించలేదు. మా గురించి ఇన్ని రోజులూ ఒక్క మంచి మాట చెప్పలేదు. ఇప్పుడు మాత్రం నేను మాట మార్చానంటున్నారు.

జేఏసీ నుంచి పనిగట్టుకొని మా పార్టీ వారిని వెళ్లగొట్టారు. నా పాదయాత్రకు అడ్డుపడే ప్రయత్నం చేశారు. వీళ్లందరూ కాంగ్రెస్ గూటి పక్షులు. టీడీపీని దెబ్బ తీయాలన్నది వీరి ఉమ్మడి లక్ష్యం'' అని మండిపడ్డారు. అటూ ఇటూ రెండు వైపులా తన యాత్రను అడ్డుకోవడానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. హరికృష్ణ యాత్ర గురించి ప్రశ్నించగా.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తాను వారి వెంట ఉంటున్నానని, మిగిలిన వారి గురించి తాను పట్టించుకోనని జవాబిచ్చారు.
రేపటి నుంచి చంద్రబాబు యాత్ర

'తెలుగువారి ఆత్మ గౌరవ యాత్ర' పేరుతో చంద్రబాబు తలపెట్టిన బస్సు యాత్ర ఆదివారం గుంటూరు జిల్లా నుంచి ప్రారంభం కానుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బాబు నిర్వహిస్తున్న యాత్రల్లో ఇది మూడోది. 2008లో ఆయన 'మీ కోసం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించారు. కొంతకాలం క్రితం ఏకబిగిన ఏడు నెలలపాటు పాదయాత్ర జరిపారు. రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లే నిమిత్తం ఆయన తాజా యాత్ర తలపెట్టారు. టీడీపీ విడుదల చేసిన కార్యక్రమం ప్రకారం గుంటూరు జిల్లా సరిహద్దులోని పొందుగుల గ్రామం నుంచి ఆయన పర్యటన మొదలవుతుంది. అక్కడ నుంచి శ్రీనగర్, గామాలపాడు, నడికుడి మీదుగా గురజాల చేరతారు. అక్కడ నుంచి దాచేపల్లిలో ఆయన యాత్ర ముగుస్తుంది. రెండో తేదీన దాచేపల్లిలో మొదలై వీరాపురం మీదుగా కొండమోదు, నెమలిపురి, నకిరికల్లు చేరుతుంది.

యూ టర్న్ కాదు..టీ టర్న్ కాదు.. నా దారి ప్రజల దారి

టీఆర్‌ఎస్ పుట్టకముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 41మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపింది మీ భర్త వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాదా అని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈ మేరకు వారు బహిరంగ లేఖ విడుదల చేశారు. అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంపై విమర్శలు చేయటం వైసీపీ లాలూచీకి నిదర్శనమని ఆ లేఖలో పేర్కొన్నారు. జగన్‌కు బెయిల్ కోసం రాష్ట్రపతితో రాయబారం నడుపుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రలో, పరకాల ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడింది గుర్తు లేదా అన్నారు.

మొదలు పెట్టింది మీ భర్త కాదా? : టీడీపీ

టిఆర్ఎస్ పార్టీ ఇంకా పుట్టక ముందే నలభై ఒక్క మంది తెలంగాణ ఎమ్మెల్యేలను తెలంగాణ కోసం ఢిల్లీ పంపి ఉద్యమ బీజం నాటిందే వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే అది గుర్తు లేనట్లుగా జగన్ పార్టీ నేతలు నటిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ టిడిపి ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, పల్లె రఘునాధరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి దేవి వైఎస్ విజయమ్మకు ఒక బహిరంగ లేఖ రాశారు. విజయలక్ష్మి, జగన్ కలిసి విడుదల చేసిన బహిరంగ లేఖ వారి పార్టీ కాంగ్రెస్‌కు తొత్తుగా మారిందని మరోసారి రుజువు చేసిందని, నెల రోజులుగా కోట్లాది మంది ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనకుండా టిడిపిపై దాడి చేయడం లాలూచీతనానికి నిదర్శనమని వారు విమర్శించారు.

'పోయిన డిసెంబర్లో కేంద్ర హోం మంత్రి షిండేకు ఇచ్చిన లేఖలో రాష్ట్ర విభజనకు కేంద్రానికి సర్వాధికారాలు ఉన్నాయని లిఖితపూర్వకంగా రాసిచ్చి రాష్ట్ర విభజన చేసుకోవచ్చని సోనియా చేతికి కత్తి ఇచ్చి వచ్చారు. ఈ సమావేశం తర్వాత సిపిఎం, ఎంఐఎం పార్టీలు మాత్రమే సమైక్యాన్ని కోరుకొన్నాయని షిండే చెప్పారు. మీరు సమైక్యవాదానికి కట్టుబడి ఉంటే అప్పుడే దానిని ఎందుకు ఖండించలేదు' అని వారు ప్రశ్నించారు. లక్ష కోట్లు దోచుకొని ఆ కేసుల మాఫీకి కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయడానికి జగన్ పార్టీ సిద్ధపడిందని, కాంగ్రెస్ ఆడిస్తున్న ఆటలో భాగస్వామిగా మారిందని వారు ధ్వజమెత్తారు. 'చంద్రబాబు ఏం మాట్లాడినా ఏం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది.

కొత్త రాజధానిని నిర్మించడానికి ఐదారు లక్షల కోట్లు కావాలని...ఎక్కడ నుంచి ఇస్తారని చంద్రబాబు అడిగితే తప్పా? ఎపి ఎన్జీవోలతో చంద్రబాబు కనికరం లేకుండా మాట్లాడారని మరో నింద వేస్తున్నారు. ఫ్యాక్షనిస్టు కుటుంబాల నుంచి వచ్చిన మీకు అసలు కనికరం అన్న పదానికి అర్ధం తెలుసా? మీకు ప్రజలకు మేలు చేయాలన్న సద్భుద్ది ఉంటే దోచుకొన్న డబ్బును వారికి అప్పగించండి. ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనం చేయండి. కాంగ్రెస్‌తో రహస్య అవగాహన లేకపోతే ఎన్నికల తర్వాతగాని...ముందుగాని కాంగ్రెస్‌తో చేతులు కలపబోమని ప్రమాణం చేసి చెప్పండి' అని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమ బీజమే మీది...గుర్తు లేదా?


కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు
వివరించేందుకే బస్సు యాత్ర :
ఏబీఎన్‌తో చంద్రబాబు
తెలుగువారికి గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని, ఆత్మ గౌరవంతో ప్రపంచాన్నే జయించవచ్చునని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరంగా ఉందని, విభజన రాజకీయ ప్రయోజనాలకోసమేనని, జాతి ప్రయోజనాలకు కాదని పేర్కొన్నారు. 30 రోజుల నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు.

అసలు విభజనకు బీజం వేసింది వైఎస్సేనని, 1999లో ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించారని, అప్పటి నుంచే ఈ కార్యక్రమం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. విభజన ప్రకటన రోజే టీఆర్ఎస్, వైసీపీలు తమతో వస్తాయని దిగ్విజయ్‌సింగ్ చెప్పారని అన్నారు. రాష్ట్ర పరిస్థితులను ప్రధాన మంత్రి పట్టించుకోవడంలేదని బాబు విమర్శించారు. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీ అవినీతి డబ్బుతో పేపర్, చానల్‌పెట్టి అదే పనిగా దుష్ప్రాచారం చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.

తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలనే కుట్రతో తెలుగు జాతినే దెబ్బతీయాలనే పరిస్థితికి వచ్చారని, కాంగ్రెస్ స్క్రిప్ట్‌ను టీఆర్ఎస్ చదువుతోందని, ఇక్కడ కేసీఆర్ సీమాంధ్ర ఉద్యోగస్తులు వెళ్లిపోవాలని అంటారు, టీఆర్ఎస్ నేతలు నాలుకలు కోస్తామని రెచ్చగొడతారని, ఢిల్లీ వెళ్లినప్పుడు మేం సంయమనం పాటిస్తున్నామని చెబుతారని, సీమాంధ్రలో రెచ్చగొట్టి లబ్ది పొందడానికి చూస్తున్నారని బాబు విమర్శించారు.

కాంగ్రెస్ కుట్రలను రాష్ట్ర ప్రజలకు వివరించేదుకే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి బస్సు యాత్ర చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నో సార్లు కలుస్తామని అపాయింట్‌మెంట్ ఇవ్వమంటే ప్రధాని ఇవ్వలేదని, అదే విజయమ్మ అయితే రెడ్ కార్పెట్ పరిచారని ఆయన మండిపడ్డారు. జగన్‌కు బెయిల్ ఇవ్వాలి, కేసులు మాఫీ చేయాలి, బయటకు వచ్చి రాహుల్‌ను ప్రధానిని చేయడానికి సహకరిస్తారని, ఇదంతా కాంగ్రెస్, జగన్ ఆడుతున్న నాటకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రూపాయి పతనానికి అవినీతే కారణమని అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం రవీంధ్రభారతిలో చేసిన వ్యాఖ్యలు నిర్ణయానికి ముందు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. త్వరలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తున్న మీడియా ప్రశ్నకు సమాధానంగా చాలా మంది పార్టీలు పెట్టారు చివరకు ఏమయ్యాయో చూశాంకదా అన్ని అన్నారు. జగన్ మాట తప్పను, మడమ తిప్పను అన్నారు. చివరకు సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితిలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ సుస్థిర పాలన జరగలేదని, వైఎస్ హయాంలో ఐదేళ్లు అవినీతి జరిగిందని, ఒక్క జగన్మోహన్‌రెడ్డి లక్ష కోట్లు సంపాదించారని దేశంలో ఎక్కడా జరగని అవినీతి ఇక్కడ జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రపంచమంతా పొగిడిందని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు జాతి కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని, సైబరాబాద్ సిటీని నిర్మించామని, తొమ్మిదేళ్ళ పాలనలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి చేసి చూపించామని, తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రపంచమంతా తిరిగామని ఆయన అన్నారు.

రాష్టంలోని పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంతో కాంగ్రెస్ భయపడి ఇలాంటి తొందపాటు నిర్ణయాలు తీసుకుందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెలుగుజాతికి సంబంధించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ సొంత వ్యవహారంలా చేసిందని ఆయన అన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, ఇబ్బందుల్లో ఉన్న వారి సమస్యల పరిష్కారమే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి సమస్యను జఠిలం చేశారని, ఏ రాజకీయ లబ్దికోసం సమస్యలు సృష్టించారో ప్రజలకు తెలియజేస్తానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి తన గురించి మాట్లాడే అర్హత లేదని, అడ్రస్ లేనివాళ్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అందరికీ న్యాయం జరగాలని, న్యాయం జరిగే వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

తెలుగువారికి గుర్తింపు తెచ్చింది టీడీపీ

విభజించు - పాలించు సూత్రానికి కేంద్ర శ్రీకారం చుట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో మూడు ప్రధాన సామాజిక వర్గాలు కేంద్ర మంత్రులను ఒత్తిడికి గురి చేస్తున్నాయని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఆమోదించేలా చేసేందుకే కొత్త ఎత్తుగడవేస్తోందని మండిపడ్డారు.
అసెంబ్లీలో తీర్మానంపై ప్రజల పక్షాన నిలబడి ఓటేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు బస్సు యాత్ర చారిత్రక అవసరమన్నారు. యాత్రకు ఇప్పుడు సరైన సమయం కాదని బాబుకు చెప్పానని, కాంగ్రెస్, వైసీపీ అల్లర్లకు కాచుకుని కూర్చున్నారని పయ్యావుల తెలిపారు.

విభజించు-పాలించు సూత్రానికి కేంద్రం శ్రీకారం : పయ్యావుల

సస్పెన్షన్ కాలం పూర్తి చేసుకుని తిరిగి లోక్ సభకు హాజరైన సీమాంధ్ర ఎమ్.పిలు మళ్లీ లోక్ సభలో ఆందోళన నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ను రక్షించండి అంటూ నినాదాలు చేస్తూ వారంతా నినాదాలు చేశారు.వెల్ లోకి దూసుకువెళ్లి ఆందోళన సాగించడంతో సభను గంటసేపు వాయిదా వేశారు. కాంగ్రెస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్.పిలు, టిడిపికి చెందిన ఎమ్.పిలు ఆందోళన చేస్తుండడంతో ఐదు రోజులపాటు సస్పెండ్ చేయాలని స్పీకర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ఐదు రోజులు పూర్తి అయ్యాక తిరిగి యధా ప్రకారం వారు మళ్లీ సభకు ఆటంకం సృష్టించారు.

సస్పెన్షన్ పూర్తి -మళ్లీ లోక్ సభలో ఆందోళన

August 29, 2013

సమైక్యాంధ్రకు మద్దతుగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో పది రోజులపాటు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఒక ప్రణాళికను ప్రకటించారు. పార్టీ నిర్ణయాల కంటే, ప్రజల మనోభావాలు, వారి అభిప్రాయాలకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమించక తప్పదని ఆయన అంటున్నారు. శుక్రవారం నర్సీపట్నంలో సుమారు ఐదువేల మందితో సమైక్యాంధ్ర సాధన ర్యాలీ నిర్వహిస్తారు. శనివారం ఎడ్లబళ్లతో నర్సీపట్నంలో మహాప్రదర్శన నిర్వహిస్తారు. అయ్యన్న జన్మదినం సందర్భంగా సెప్టెంమర్ నాలుగో తేదీన వందలాది రక్తదానం చేస్తారు.
సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రతి రోజూ ఏదో రూపంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, దీని కోసం శుక్రవారం సమావేశాన్ని నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకుడు సన్యాసిపాత్రుడు తెలిపారు. కాగా నర్సీపట్నంతోపాటు మిగతా మండల కేంద్రాల్లో కూడా సమైక్యాంధ్ర సాధన కోసం ఆందోళనలు జరుగుతాయని చెప్పారు.

సమైక్యాంధ్ర కోసం టీడీపీ పది రోజుల ప్రణాళిక

గ్రామ పెద్దలకున్న తెలివి లేదా!


 "ఒక కుటుంబంలో వచ్చే తగాదాల విషయంలో గ్రామ పెద్దలు ప్రదర్శించేపాటి తెలివి కూడా కాంగ్రెస్ చూపలేకపోయింది. విభజన నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే వర్గాల వారిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నదీ జలాలు, ఉపాధి అవకాశాలు, విద్యావకాశాలు, హైదరాబాద్ తదితర అంశాలపై ప్రజల్లో ఆందోళన ఉంది. వాటిపై చర్చించండి. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం అన్వేషించండి'' అని కాంగ్రెస్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు.

గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకొన్న తీరు రాజకీయ కుట్రను సూచిస్తోందని ఆరోపించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. "పంచాయితీ ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా చడీచప్పుడు లేదు. కాంగ్రెస్ గెలవదని సర్వేలు రావడం, పంచాయితీ ఎన్నికల్లో పది జిల్లాల్లో టీడీపీ గెలవడంతో చిచ్చు రగిల్చారు. ఇక్కడ టీఆర్ఎస్‌ను, అక్కడ వైసీపీని కలుపుకొన్నారు. ఇక్కడ విలీనం ప్యాకేజీ. అక్కడ బెయిల్ ప్యాకేజీ. కేసీఆర్ ఇక్కడ రెచ్చగొడతారు. ఢిల్లీ వెళ్లి వాళ్లు చెప్పగానే అందరూ సంయమనం పాటించాలని పిలుపు ఇస్తారు.

కడప పౌరుషానికి, ఢిల్లీ పెత్తనానికి పోటీ అని పిలుపులు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీ సౌజన్యంతో ఇంట్లో మాదిరిగా జైల్లో కూడా దీక్షలు జరుగుతున్నాయి. ఫోన్లలో చర్చలు, పార్టీ కార్యకలాపాలు జైల్లో కూడా సాగిపోతున్నాయి'' అని చంద్రబాబు ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎందుకు వేగం తగ్గించిందని ప్రశ్నించారు. ఇవన్నీ ఈ కుట్రలో కోణాలని, విభజన వల్ల తమకు సీట్లు వస్తున్నాయని, రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నామని దిగ్విజయ్ సింగ్ ఘనంగా బెంగుళూరులో చెప్పుకొన్నారని తెలిపారు.

"ప్రజల కోసం విభజన చేస్తే... వారిని ముందుగానే విశ్వాసంలోకి తీసుకొని అందరితో మాట్లాడి ఆమోదయోగ్య నిర్ణయం చేస్తే మేం తప్పుబట్టం. ఇవే విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వారికి వాస్తవాలు వివరిస్తాం'' అని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నుంచి తన యాత్ర మొదలవుతోందని ఆయన చెప్పారు. లగడపాటిని అడ్డుకున్నట్లుగా తన యాత్రను అడ్డుకుంటారనే ఆందోళన ఏదీ లేదన్నారు. రాష్ట్రం నాశనం చేసిన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ పరిస్ధితి ఎదురైందని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.


విభజన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇదేదో సొంత పార్టీ వ్యవహారంలా చూస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఏపీఎన్జీవోలను ఆంటోనీ కమిటీ వద్దకు వెళ్లాలని ప్రధాని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. 30 రోజుల నుంచి ప్రజలు రోడ్లపై ఉంటే ఎలా చేతులు దులుపుకొంటారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా రాష్ట్రాల విభజనపై ఆర్టికల్ 3 కింద నిర్ణయం తీసుకోవడానికి పూర్తి అధికారాలు ఉన్నాయని వైసీపీ లేఖ రాసిచ్చిందని... ఏ కత్తితో పొడవవచ్చో కూడా రాసిచ్చిన పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. తమ పార్టీ 2008లో చేసిన తీర్మానంలోనే సమన్యాయం గురించి ప్రస్తావించిందని ఆయన చెప్పారు. మూడేళ్లుగా తెలంగాణను అస్థిరత్వంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీమాంధ్రలో కూడా అదే పరిస్థితి సృష్టిస్తోందన్నారు. తమ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులున్నాయా అని ప్రశ్నించారు.

కూర్చోబెట్టి మాట్లాడితే సమస్యలకు పరిష్కారం కుట్ర కోణంలోనే విభజనపై నిర్ణయం

తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులపై విరుచుకుపడుతున్నారు.సమైక్యాంధ్ర కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమం చేస్తుంఏట సీమాంధ్ర కేంద్ర మంత్రులు మాత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంట్లో పాలేర్లులా ఊడిగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.వారు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.

సోనియా ఇంట్లో పాలేర్లు వారు : పయ్యావుల

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నడూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వమని చెప్పలేదని, 2004లో తెలుగుదేశం పార్టీ సమైక్య నినాదంతో పోటీ చేసినప్పుడు ప్రజలు ఓడించారని, దీంతో 2009 ఎన్నికల్లో తప్పని పరిస్థితులలో తాము తెలంగాణకు అడ్డంకాదని మాత్రమే చంద్రబాబు అన్నారని, తాము లేఖల ద్వారా కేంద్రాన్ని కోరింది రెండు ప్రాంతాలకు సమన్యాయం అని, ఇప్పుడు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ చంద్రబాబు లేఖ మూలంగానే రాష్ట్రం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు.

చంద్రబాబు ఇయ్యమనలే : ముద్దుకృష్ణమ

తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వద్దకు వెళ్లి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ఆస్తులను జప్తు చేయాలని కోరింది.వైఎస్ జగన్ చట్టాలను ఉల్లంఘించి అక్రమాల కు, ప్రజాధనం లూటీకి పాల్పడినప్పటికీ ఇంతవరకు ఆయనపై తగు చర్య తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీలు ఇడికి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీబీఐ ఇప్పటివరకూ తీవ్ర అభియోగాలతో ఐదు చార్జిషీట్లను దాఖలు చేసిందని, దాదాపు 43 వేల కోట్ల మేరకు అవినీతి జరిగిందని నిర్ధారిస్తే ఈడీ ఇంతవరకు కేవలం రూ.229 కోట్లమేరకే ఆస్తులను జప్తు చేసిందని వారు చెప్పారు.రాజకీయ జోక్యం వల్ల ఇడి దర్యాప్తు ఆగిపోయినట్లుందని వారు ఆరోపించారు. నామా నాగేశ్వరరావు. దేవేందర్ గౌడ్, వైఎస్ చౌదరి, కె.నారాయణ రావు, సీఎం రమేశ్‌లు లు ఇడిని కలిసినవారిలో ఉన్నారు.

జగన్ ఆస్తులు జప్తు చేయండి-టిడిపి

ఈడీ డైరెక్టర్‌తో టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణ గురువారం సమావేశమయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఈడీ కి నేతలు వినతి చేశారు.

ఈడీ డైరెక్టర్‌తో టీడీపీ నేతల భేటీ

సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లాలోని పశువుల ఆస్పత్రి వద్ద గురువారం మానవహారం నిర్వహించారు. టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గద్దె రామ్మోహన్, దేవినేని ఉమా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో మానవహారం

సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు గురువారం భగ్నం చేశారు. దీక్షా స్థలిని నుంచి ఆమెను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. కాగా దీక్ష శిబిరానికి మళ్లీ వెళ్లేందుకు శోభాహైమావతి యత్నిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం గత నాలుగు రోజులుగా శోభా హైమావతి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించిడంతో పోలీసులు దీక్ష భగ్నం చేశారు.

శోభాహైమావతి దీక్ష భగ్నం

  దేశానికి మేలు చేయవలసిన విధానాలను చిత్తశుధ్ధితో అమలు చేయవలసిన సమయంలో దేశాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తమైన విధానాలతో దేశాన్ని సర్వ నాశనం చేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ప్రధాని కీలుబొమ్మగా మారారని ఆక్షేపిస్తూ సోనియా చేతిలో అధికారం రిమోట్‌లా మారిపోయిందని ఆయన విమర్శించారు. సోనియా దేశాన్ని భ్రష్టు పట్టించారని ఆయన ఘాటుగా విమర్శించారు.
రోజురోజుకీ పతనమవుతున్న రూపాయి విలువను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు ఆర్థిక సంస్కరణలను సవ్యంగా అమలు చేయడంలో మన్మోహన్ ప్రభుత్వం నిస్సత్తువ ప్రదర్శించిందని ఆయన నిప్పులు చెరిగారు. గురువారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలకు ముందు నాటి పరిస్థితులు ఉత్పన్నం కావని చెప్పడం ద్వారా ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ 1991 నాటి ముందు పరిస్థితులు వస్తాయని పరోక్షంగానే చెబుతున్నారని విమర్శించారు. పరిస్థితులను చక్కదిద్దలేకపోతే ఆ పదవిలో ఉండడానికి అనర్హులని ఆయన ప్రధానిని ఉద్దేశించి నిష్కర్షగా వ్యాఖ్యానించారు.
అవినీతి ధనాన్ని హవాలా రూపంలో విదేశాలకు తరలించారని ఆయన నిప్పులు చెరుగుతూ మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచంలో నమ్మకం పోయిందని, ఈ పరిస్థితులలో పెద్ద ఎత్తున పెట్టుబడుల
ను ఎలా తీసుకువస్తారని, దేశం అస్తవ్యస్తంగా మారిపోతే ఎవరైనా ఎందుకు పెట్టుబడులు పెడతారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదని తీవ్రంగా విమర్శిస్తూ భవిష్యత్తులో ఉద్యోగాలు సృష్టించే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కుంభకోణాలు చోటుచేసుకుంటుంటే ఒక్క కేసు విషయంలోనైనా చర్యలు తీసుకున్నారా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలవల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని. ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

సోనియా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తింది: బాబు

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకురాలి చేతిలో పావుగా మారారని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించడం లేదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తర్వాత కేంద్రం పూర్తి బాధ్యతారహితంగా , నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాక కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని , ఈ సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి జోక్యం చేసుకుని రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్ది అందరికి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్.ఆర్.కాంగ్రెస్,టిఆర్ఎస్ లతో కలిసి డ్రామా ఆడుతున్నట్లుగా ఉందంటూ ఆరోపణలు చేశారు.

సోనియా చేతిలో పావు ప్రధాని-చంద్రబాబు

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని పలువురు అభినందిస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పలుమార్లు తలాతోకలేని ప్రకటనలు చేయడం.. మళ్లీ వెనక్కు తగ్గడం వంటివి చేస్తుందని ఆ పార్టీకి చెందిన నేతలే అంగీకరిస్తున్నారు. అయితే, చంద్రబాబు అలా కాదని.. విభజన విషయంలో బాబు ఒక స్టాండ్ పై నిల్చున్నారని నేతలు అంటున్నారు. బాబుకు గల స్పష్టతను ఇటు తెలంగాణ నేతలతో పాటుగా, సీమాంధ్ర నేతలు కూడా అభినందిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనాలే ముఖ్యమని బాబు పేర్కొనడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విభజన జరిగితే పార్టీకి నష్టం వాటిలుతోందని.. తెలంగాణపై స్టాండ్ మార్చుకోవాలని కొందమంది సూచించినప్పటికినీ.. బాబు తిరస్కరించారని తెలుస్తోంది.

తెలంగాణపై పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని ఇక వెనక్కు వెళ్లే పరిస్థితి లేదని బాబు స్పష్టం చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తాసుఖేందర్ రెడ్డి అభినందించారు. ప్రత్యేక తెలంగాణపై ప్రకటన చేసిన కాంగ్రెస్ అధిష్టానం మాటనే కాంగ్రెస్ నేతలు వినే పరిస్థితి లేదు.. అంతేకాకుండా కేంద్రం తాను చేసిన ప్రకటనను అమలు చేయడానికే ధైర్యం చేయలేకపోతుంది. ఇలాంటి క్లిష్టమైన సమస్యపై ఓ స్టాండ్ తీసుకోవడమే కాకుండా… ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ స్టాండ్ కట్టుబడి వుంటామని బాబు ప్రకటించడం నిజంగా అభినందించాల్సిన విషయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాబు బేష్..!

August 28, 2013

తెలుగుదేశం లేఖ ఆధారంగానే తెలంగాణ ఇచ్చామని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ చెబితే, తదుపరి ఏమి చేయాలో కూడా తాము చెబుతామని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు కలిసి నాటకం ఆడుతున్నాయని, సమ న్యాయం అంటే ఏమిటో విజయమ్మ చెప్పాలని ఆయన అన్నారు. జగన్ బెయిల్ కోసమే ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

సోనియాకు ముద్దుకృష్ణమ షరతు

ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఓ మైనపు బొమ్మని, సోనియాగాంధీ చేతిలో కీలు బొమ్మని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలతో దివంగత మాజీ సీఎం వైఎస్ ఆడుకుంటే, కేంద్రం రాష్ట్రంతో ఆడుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. అసలు రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలా? లేక కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? అనేది తెలియడం లేదని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనపై కేంద్రం ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంది. మరి ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలగా ఎందుకు విభజించలేదని మోదుగుల ప్రశ్నించారు. మొదటి నుంచి ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీయే పోరాటం చేస్తోందని, అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో మోదుగులతోపాటు ఎంపీలు సీఎం రమేష్, నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు.

ప్రధాని మన్మోహన్ ఓ మైనపు బొమ్మ : మోదుగుల

సీమాంధ్రలో ఇంత పెడ్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని టీడీపీ సీనిరయర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. సీమాంధ్ర కు న్యాయం జరగాలని కోరుతూ టీడీపీ ఎంపీలు చేపట్టిన దీక్షను ఒక్కరోజులోనే భగ్నం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జైల్లో జగన్మోహన్‌రెడ్డి దీక్ష చేస్తుంటే హెల్త్ బులెటిన్‌లు విడుదల చేస్తున్నారని, చంచల్‌గూడ జైలు వైసీపీ ఆఫీసులా మారిందని ఆయన దుయ్యబట్టారు.

పొత్తుల కోసం కాంగ్రెస్ వెంపర్లాడుతోందని, జైలు నిబంధనలు సడలించి వైసీపీకి రెండు గదులు కేటాయించిందని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మకు ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇస్తే ఇక జగన్‌పై విచారణ నిష్పాక్షికంగా ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నిర్ణయంలో ఏ-1 దివంగత వైఎస్ అయితే, ఏ-2 కాంగ్రెస్ అని సోమిరెడ్డి పేర్కొన్నారు. తెలుగు జాతిని నాశనం చేయడమే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆఖరి కోరికలా కనిపిస్తోందని సోమిరెడ్డి అన్నారు. జైళ్ల చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, జగన్‌కు వేరాలా ఉండకూడాదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, వైసీపీలను కలుపుకునేందుకు సోనియా ఆరాటపడుతున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.

చంచల్‌గూడ జైలు వైసీపీ ఆఫీస్‌లా మారింది : సోమిరెడ్డి

ఆహార భద్రత బిల్లు తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు మానస పుత్రిక అని మాజీ రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ మంగళవారం అన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఆహార భద్రత బిల్లు గురించి ప్రస్తావించారన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదల ఆకలి తీర్చిన ఘనత ఎన్టీఆరేనని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడుతానని కొందరు మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చిల్లర మాటలకు తాను స్పందించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని హరికృష్ణ అన్నారు

ఆహార భద్రత ఎన్టీఆర్ మానస పుత్రిక: హరికృష్ణ

తెలంగాణకు మద్దతుగా చంద్ర బాబు ఇచ్చిన లేఖ ఓ గడ్డిపరకతో సమానమని, ఆరుగురు ఎంపీలు కూడా లేని ఒక పార్టీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం విలువ ఇవ్వలేదని తెలుగు దేశం సీనియర్‌ నాయకులు కోడెల శివ ప్రసాద్‌, వర్లరామయ్య పేర్కొ న్నారు. సమైక్యాంధ్ర కోసం విజయమ్మ దీక్ష పేరుతో దొంగనాటకాలు ఆడారని, రాత్రి 9 గంటల వరకూ శిబిరంలోనూ, ఆ తర్వాత ఏసీ బస్సులోనూ దీక్ష చేశారని వారు విమర్శించారు. అటు తెలంగాణ లోనూ, ఇటు ఆంధ్రలోనూ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికే సోనియా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమానికి మద్దతు తెలపడానికి ఒంగోలు వచ్చిన సీనియర్‌ నాయకులు కోడెల శివ ప్రసాదరావు, వర్లరామయ్య, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు కరణం బలరాంతో సహా జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పార్టీతో సంబంధం లేకుండా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఎగిసి పడిందన్నారు. విభజన పాపం ఖచ్చితంగా దివంగత వైఎస్‌ రాజశేఖ రరెడ్డిదేనన్నారు. తాను అధికారంలో లేని సమయంలో తెలంగాణకు అనుకూలంగా ఎమ్మెల్యేల సంతకాలు సేకరించారని, ఇపుడు కేంద్రం కూడా నాడు రాజశేఖరరెడ్డితో ప్రారంభించి, ఇపుడు సోనియాగాంధీ ముగించిందని పేర్కొన్నారని గుర్తు చేశారు. వారి నాయకుడు పాపాన్ని తమకు అం టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిం చారు. ఇక జైలులో దీక్ష చేస్తున్న జగన్‌ ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఆరోగ్యం బాగో లక అన్నం తినకుండా ఉన్నారేమో ఎవరికి తెలుసంటూ వారు విమర్శించారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న జగన్‌, ముందు రాష్ట్రం నుండి తాను దోచుకున్న సొమ్మెంతో చెప్పాలని వారు విమర్శించారు.

సొసైటీ ఎన్నికల్లోనూ, పంచాయతీ ఎన్నికల్లోనూ అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో తెలుగుదేశం మంచి ఫలితాలు సాధించడంతో కక్ష కట్టిన సోనియా గాంధీ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విభజన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా ఈ విభజన నిర్ణయం లేదన్నారు. ఇరు ప్రాంతాలకు సమానన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే మేం డిమాండ్‌ చేస్తాం అన్నారు.

టీడీపీని దెబ్బతీసేందుకే!

August 26, 2013

చంచల్ గూడ జైలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారిందని టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు.తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ ఈ డ్రామా ఆడుతున్నారని అన్నారు. జైలు అధికారులు ఆయనను ఎందుకు అనుమతించారని రామయ్య ప్రశ్నించారు.మిగిలిన రిమాండ్ ఖైదీలకు కూడా ఇలాంటి అవకాశం ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

అవినీతి కప్పిపుచ్చుకునేందుకే జగన్ దీక్ష : వర్ల

సీమాంధ్రకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరవధిక నీరాహార దీక్షకు దిగిన టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నిమ్మల కిష్టప్పల దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఢిల్లీలో ఎండ ఎక్కువ ఉండడంతో ఎంపీలు నిరసించిపోయారని, ఇంకా ఎక్కువ సేపు ఉంటే వారు సొమ్మసిల్లిపడిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా నిమ్మల కిష్టప్ప మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు తమ దీక్ష కొనసాగుతుందని, విరమించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు కూడా వదులుకోడానికి సిద్ధమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు సీమాంధ్ర టీడీపీ ఎంపీలు చేపట్ట దలచిన నిరవధిక నిరాహార దీక్షకు స్పీకర్ మీరాకుమార్ అనుమతి నిరాకరించారు. కాగా ఎంపీలు తమ పట్టువీడలేదు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టేందుకు ఎంపీలు సిద్ధమయ్యారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

ఢిల్లీలో టీడీపీ ఎంపీల దీక్ష భగ్నానికి యత్నం

సీమాంద్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ టిడిపి ఎమ్.పిలు సుజనా చౌదరి, సి.ఎమ్.రమేష్ లు రాజ్యసభలో ఆందోళనకు దిగడం తో వారిని సభ నుంచి డిప్యూటి ఛైర్మన్ కురియన్ సస్పెండ్ చేశారు. లోక్ సభలో టిడిపి ఎమ్.పిలు సస్పెండ్ కావడంతో వీరిద్దరూ కూడా రాజ్యసభలో సస్పెండ్ అయ్యారు. వీరు కూడా దీక్షలో పాల్గొనే అవకాశం ఉంది.

టిడిపి రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్

పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న తెలుగుదేశం ఎమ్.పిలను కేంద్ర మంత్రి చిరంజీవి,కాంగ్రెస్ ఎమ్.పిలు కెవిపి రామచంద్రరావు,లగడపాటి రాజగోపాల్,అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పరామర్శించారు సీమాంధ్రకు న్యాయం చేయాలని అంటూ వారు దీక్ష చేస్తున్నారు.కొనకళ్ల నారాయణ,మోదుగుల వేణుగోపాలరెడ్డి, నిమ్మల కిష్టప్పలు మండుటెండలో దీక్ష చేశారు.అయితే వారు కొంచెం వయసు మీరినవారు కనుక ఆరోగ్య రీత్యా ఇబ్బంది వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఎందుకైనా మంచిదని అంబులెన్స్ కూడా సిద్దం చేశారు.

టిడిపి ఎమ్.పిలకు పరామర్శ

అన్నదమ్ముల మధ్య విద్వేషాలు రగిలి పరిస్ధితులు సున్నితంగా మారిన తరుణంలో కొన్ని పార్టీలు ప్రజలను మరింత రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేస్తూ కాంగ్రెస్, టిఆర్ఎస్, వైసీపీ పార్టీలు ఈ వికృత క్రీడలో భాగస్వాములు కావడం దురదృష్టకరమని, వాటి వ్యవహారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. 'రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుత నిరసన హక్కు కల్పించింది. కాని గత కొన్ని రోజులుగా సచివాలయం, విద్యుత్ సౌధ, జల సౌధ, ఇతర ప్రధాన కార్యాలయాల్లో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

రెచ్చగొట్టే వికృత క్రీడలకు ఇదేనా సమయం?: చంద్రబాబు

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర టీడీపీ ఎంపీలు చేపట్ట దలచిన నిరవధిక నిరాహార దీక్షకు స్పీకర్ మీరాకుమార్ అనుమతి నిరాకరించారు. కాగా ఎంపీలు తమ పట్టువీడలేదు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టేందుకు ఎంపీలు సన్నద్దమవుతున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

సీమాంధ్ర టీడీపీ ఎంపీల దీక్షకు అనుమతి నిరాకరణ

August 25, 2013


రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రభుత్వ కమిటీ వేస్తామని సోనియాగాంధీ పేర్కొనడంపై ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ హోదాలో కమిటీ వేస్తామని ఆమె చెబుతున్నారని ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరులో నన్నపనేని విలేకరులతో మాట్లాడుతూ కమిటీ ప్రకటన ద్వారా సోనియా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను అవమానపరిచారన్నారు. సోనియా కేవలం ఒక లోక్‌సభ సభ్యురాలన్న విషయం మరిచిపోవద్దన్నారు.

సోనియా, ఆమె తొట్టి గ్యాంగ్‌పై తమకు నమ్మకం లేదని, ఆ కమిటీని ఆమోదించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పదేపదే సోనియా చెబుతూ సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నా కేంద్ర మంత్రులు ఇంకా ఏ ముఖం పెట్టుకొని పదవులు పట్టుకొని వేలాడుతున్నారని ప్రశ్నించారు. పదవులు పట్టుకొని వేలాడే కన్నా ఎందులోనైనా దూకి చావడం మంచిదని సీమాంధ్ర కేంద్ర మంత్రులపై నన్నపనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రభుత్వ కమిటీ వేయడానికి సోనియా ఎవరు? : నన్నపనేని


ఉద్యమ ద్రోహులుగా ముద్రపడక ముందే పదవులకు రాజీనామా చేయండంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులకు టీడీపీ నేత కోడెల శివప్రసాద్ సూచించారు. వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆదివారం ఆయన చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్.శివప్రసాద్, చదలవాడ కృష్ణమూర్తి, తెలుగు యువత జిల్లా, నగర అధ్యక్షులు శ్రీధర్‌వర్మ, భాస్కర్‌యాదవ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. తెలుగు జాతి విడిపోకూడదన్న భావనతో సీమాంధ్రలోని ప్రజలు ఉద్యమవాణి వినిపిస్తున్నారన్నారు.

కీలకమైన ఈ తరుణంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోనియాకు భయపడి ఢిల్లీలో కాలం గడపడం ఉద్యమ ద్రోహమేనని ఆరోపించారు. రాష్ట్రం రావణకాష్టంలా మారుతున్నా ప్రధానమంత్రి నోరు మెదపకపోవటం దారుణమన్నారు. చంద్రబాబు లేఖ ఇచ్చినందున రాష్ట్ర విభజన జరిగిందని సోనియా చెప్పటం మసిపూసి మారేడుకాయ చేయడమేనని ఆయన ధ్వమజెత్తారు. విభజన ఆషామాషీ వ్యవహారం కాదన్న విషయం గతంలో జరిగిన మూడు రాష్ట్రాల విభజనలు నేర్పిన గుణపాఠాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు గుర్తించుకుంటే మంచిందని కోడెల సలహా ఇచ్చారు. కేంద్రం నియమించే కమిటీల వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. తమ సొంత రాష్ట్రాల్లో విభజనను వ్యతిరేకిస్తూ, అక్కడ నాయకులుగా చెలామణికాలేని చిదంబరం, ఆంటోని, అహ్మద్‌పటేల్, అజాద్‌లాంటి వారి మాటలకు సోనియా ప్రాధాన్యమివ్వడం సిగ్గుచేటన్నారు. రాహుల్‌గాంధీని ఇక్కడి నుంచి పోటీకి నిలిపి ప్రధానిని చేయాలన్న సోనియా అత్యాశే తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు కారణమని ఆయన ఆరోపించారు.

తెలుగు ప్రజల్లో 75 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని కేంద్ర కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. పార్లమెంటులో ఐదుగురు టీడీపీ ఎంపీలం చేసిన సమైక్య ఆందోళనల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లుగా ప్రకటన వెలువడిందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పేర్కొన్నారు. పార్లమెంటు సాగినంతకాలం తాము నిరసన చెబుతూనే ఉంటామన్నారు. ఈ నెలాఖరు నుంచి పార్లమెంటు ముందు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయడమంటే రాష్ట్రం బ్యూటీ పోయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సూరా సుధాకర్‌రెడ్డి, దశరథనాయుడు, మధు, బాలకృష్ణ, రవినాయుడు పాల్గొన్నారు.

సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయలి : కోడెల


రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీకి భస్మాసుర హస్తం కానుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాగంటి మురళీ మోహన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న దీక్షలకు సంఘీభావం తెలిపారు. కొడుకును ప్రధానిని చేయాలన్న రాజకీయ స్వార్థంతోనే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్నారని తూర్పారబట్టారు.

విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయాలకు అతీతమైన ప్రజాఉద్యమం ఉద్భవించిందని అన్నారు. దాంతో పునరాలోచనలో పడ్డ ఢిల్లీ పెద్దలు ఏంచేయాలనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారన్నారు. సమైక్య ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే రెండో స్థానానికి చేర్చిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు.

విభజన కాంగ్రెస్‌కు భస్మాసుర హస్తం : మురళీ మోహన్

దొంగే దొంగ అన్న చందాన వ్యవహరిస్తున్న కాంగ్రెస్, వైసీపీలను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. దుష్టత్రయం... కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, సర్వనాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్త చేశారు.

దుష్టత్రయం భ్రష్టు పట్టిస్తోంది: ముద్దు కృష్ణమ

August 24, 2013

రాష్ట్ర యోగాధ్యయన పరిషత్ కార్యదర్శి పదవిని అనర్హులకు అప్పగించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై అధ్యాపక సిబ్బంది, వైద్యుల్లో ఆందోళన నెలకొందని, అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎంకు లేఖ రాశారు. యోగా సూపర్‌వైజర్‌గా ఉన్న ఒక వ్యక్తిని ఈ పరిషత్‌కు కార్యదర్శిగా నియమించే ప్రయత్నాలు జరుగుతున్నా యని తన దృష్టికి వచ్చిందని, కొందరు అధ్యాపక సిబ్బంది, వైద్యులు అనేకసార్లు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా కార్యదర్శి పదవిని భర్తీ చే సేలా చూడాలని కోరారు.

అనరులకు యోగాధ్యయన పరిషత్ అప్పగించొద్దు......ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ

లోక్‌సభ నుండి సస్పెన్షన్‌కు గురైన తెలుగుదేశం ఎంపీలు సోమవారం నుండి పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాలని, రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతి రేకంగా నిరసనను వ్యక్తం చేస్తూ లోక్‌సభ కార్య క్రమాలను అడ్డుకోవడంతో నలుగురు టిడిపి ఎంపీలను, 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం తెలుగుదేశం ఎంపీలు సమా వేశమై సోమవారం నుండి నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవికి రాజీనామా చేసి పోరాటానికి సిద్ధం కావాలని సమావేశం అనంతరం కొనకళ్ల నారాయణ డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడు తూ విందు సమావేశాలతో కాలయాపన చేయకుండా సీమాంధ్ర ప్రజల కోసం పోరాడాలని మంత్రులు, ఎంపీలకు సూచించారు. లోక్‌సభ నుంచి సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్‌ చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. సస్పెన్షన్‌ను పున:పరి శీలించాలని స్పీకర్‌కు ఎంపీలు లేఖ ఇచ్చారన్నారు.

నేడు పార్లమెంట్‌లోగాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపీల నిరాహారదీక్ష

టీడీపీ నేతల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఎంపీ నామా నాగేశ్వరరావు శనివారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. సభ్యుల హక్కులను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో మాట్లాడేందుకు నామా ప్రయత్నించగా, అందుకు స్పీకర్ మీరాకుమార్ నిరాకరించారు. ఎంపీ నామాకు బీజేపీ, ఏడీఎమ్‌కే, ఎస్పీ పార్టీ నేతలు మద్దతు తెలిపారు.

లోక్‌సభ నుంచి నామా వాకౌట్

సీమాంధ్ర తెలుగుదేశం ఎమ్.పిలు పార్లమెంటు ప్రాంగణంలోనే నిరహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.టిడిపి ఎమ్.పిలను కాంగ్రెస్ ఎమ్.పిలతో పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పట్టికీ తాము పార్లమెంటు బయట కూడా ధర్నా చేపడతామని ప్రకటించారు.తదనుగుణంగా వారు గాందీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం నుంచి వారు ఈ ఆందోళన చేపడతారు

పార్లమెంటు ఆవరణలో టిడిపి ధర్నా

హెచ్‌పీసీఎల్ ప్రమాద ఘటనా స్థలాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శనివారం పరిశీలించారు. అనంతరం ప్రమాద బాధితులను బాబు పరామర్శించారు.

హెచ్‌పీసీఎల్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాబు

August 23, 2013

 రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ సీమాంధ్రలో ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్న ఉద్దేశంతోనే ఎంపీల సస్పెన్షన్, సీమాంధ్ర ఉద్యోగులపై దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెగబడుతున్నాయని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ దుర్మార్గమైనదని, బాధాకరమైన విషయమన్నారు. సీమాంధ్రలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కుతున్నారన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగినులను కించపరిచేలా, దుర్భాషాలాడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో హైదరాబాద్‌లో నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. కోదండరాం దీనికి ఏం సమాధానం చెబుతారని అన్నారు. కడుపులో పెట్టుకుంటామనే కేసీఆర్.. ఈ దాడులపై ఏం సమాధానాలు చెబుతారని ప్రశ్నించారు. సోనియా కళ్లు తెరిచి రాష్ట్ర విభజన ప్రకటన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ బెయిల్ కోసం ఎంపీ రాజమోహనరెడ్డి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్, అక్టోబర్‌లలో జగన్‌ను బయటకు తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ లో కేసీఆర్‌ను, సీమాంధ్రలో వైఎస్ జగన్‌ను కలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.

సీమాంధ్రలో ఉద్యమ అణచివేతే లక్ష్యం అందుకే ఎంపీల సస్పెన్షన్, సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు: దేవినేని ఉమా

సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యే రామకృష్ణ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించడంతో ఆయన అక్కడే దీక్షను కొనసాగిస్తున్నారు. ఆస్పత్రిలో రామకృష్ణను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరామర్శించారు. ప్రజాదరణ అధికంగా వస్తుందనే ప్రభుత్వం దీక్షను భగ్నం చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు.

ఎమ్మెల్యే రామకృష్ణను పరామర్శించిన సోమిరెడ్డి

సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు జాండీస్, బరువు తగ్గడం, చూపు మందగించడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. దీక్ష విరమించాలని వైద్యుల సూచించినప్పటికీ రామానాయుడు నిరాకరిస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయనను టీడీపీ నేతలు అయ్యన్యపాత్రుడు, వెలగపూడి, కళా వెంకట్రావు పరామర్శించారు.

మరింత క్షీణించిన రామానాయుడు ఆరోగ్యం

నా తండ్రి ఎన్టీఆర్ ఆశయసాధన కోసమే ఎంపీ పదవికి రాజీనామా చేశామని హరికృష్ణ పేర్కొన్నారు. తన రాజీనామా వెనుక ఎవరి హస్తం లేదని, ఆయన తెలిపారు. చైతన్యయాత్రపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శకుని పాత్ర పోషిస్తోందని, హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలవారి సమాహారం అని హరికృష్ణ తెలిపారు. అలనాడు మహాభారతంలో పాండవులు, కౌరవులు మధ్య శకుని పోషించిన పాత్రను ఈనాడు కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని చెప్పారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియాగాంధీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని హరికృష్ణ ఆరోపించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో రాహుల్ ను మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని హరికృష్ణ పేర్కొన్నారు. విభజనకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ హరికృష్ణ గురువారం తమ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తండ్రి ఆశయసాధనకే రాజీనామా : హరికృష్ణ

విశాఖలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

హెచ్‌పీసీఎల్ ప్రమాదంపై చంద్రబాబు విచారం

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని డిమాండ్ చేస్తూ.. పుట్టపర్తి తెదేపా ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పల్లె గత అయిదు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. రఘునాథ రెడ్డి దీక్ష భగ్నంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే, సమైక్యాంధ్ర కోసం చేస్తున్న దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా ఆయన సతీమణి ఉమ దీక్షకు దిగారు. ఉమ దీక్షకు భారీ ఎత్తున తెదేపా కార్యకర్తలు, సమైక్యవాదులు మద్దతు పలికారు. కాగా, ఎమ్మెల్యే ఆరోగ్యం క్షీణిస్తుండటం వల్లే దీక్షను భగ్నం చేశామని పోలీసులు చెబుతున్నారు. రఘునాథ రెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు.

పల్లె రఘునాథ రెడ్ది దీక్ష భగ్నం... నిరసనగా ఆయన సతీమణి ఉమ దీక్ష!


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మహబూబ్ నగర్ లో ఇల్లు లేదు..లోక్ సభలో నోరు లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ ఆవేదనతోనే రాజీనామా చేశాడని, విభజన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో కర్రీపాయింట్ పెట్టుకుంటే కేసీఆర్ కలెక్షన్ పాయింట్ పెట్టుకుంటారని, సీమాంధ్రలో సమైక్య ఉద్యమాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ కు లేదా అని టీడీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని, కేసీఆర్ రెచ్చగొట్టే వాఖ్యల మూలంగానే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎగిసి పడుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్లమెంటు నుండి మార్షల్స్ తో గెంటేయించారని, సస్పెన్షన్ చేసినా వారు సభ నుండి బయటకు వెళ్లలేదని, లోక్ సభలో తాము మాట్లాడే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు.

ఇక్కడ ఇల్లు లేదు.. అక్కడ నోరు లేదు : రేవంత్ రెడ్డి

August 22, 2013

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా



 
సమైక్యాంధ్రకు అనుకూలంగా తొలి రాజీనామా ఆమోదం పొందింది! రాష్ట్ర విభజనను నిరసిస్తూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఇచ్చిన రాజీనామా లేఖను చైర్మన్ హమీద్ అన్సారీ అప్పటికప్పుడే ఆమోదించారు! ఇప్పటి వరకు పలువురు రాజీనామా చేశారు. అయితే, అవి స్పీకర్ ఫార్మాట్‌లో లేకపోవడమో లేదా స్పీకర్‌కు ఫ్యాక్స్ చేయడమో చేశారు. కానీ, గురువారం ఉదయం సరిగ్గా 10:15 గంటలకు హరికృష్ణ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ గదికి వెళ్లారు. రాజీనామా లేఖను ఆయనకు అందజేశారు.

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు అందులో స్పష్టంచేశారు. 'నా రాజీనామాను వెంటనే ఆమోదించండి' అని పట్టుబట్టారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన అన్సారీ- 'మీరు స్వచ్ఛందంగానే రాజీనా మా చేస్తున్నారా!?' అని ప్రశ్నించారు. "ఔను. స్వచ్ఛందంగానే చేశాను. ఇప్పుడే ఆమోదించండి'' అని హరికృష్ణ పట్టుబట్టారు. దీంతో రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అన్సారీ అక్కడికక్కడే ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ దీనిపై ప్రకటన చేశారు. "ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు ఎన్.హరికృష్ణ రాజీనామా లేఖ చైర్మన్‌కు అందింది. ఆయన దాన్ని ఆమోదించారు. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది'' అని ప్రకటించారు.

కాగా, హరికృష్ణ రాజీనామాతో మిగతా సీమాంధ్ర ఎంపీలపై ఒత్తిడి పెరిగిందని రాజకీయవర్గాలు భావిస్తున్నా యి. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మిగిలిన ఎంపీలు 15 రోజుల కిందటే సెక్రటరీ జనరల్‌కు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. కానీ, హరికృష్ణ ఒకే రోజులో తన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం గమనార్హం.


రాజీనామా చేశాక టీడీపీపీ కార్యాలయంలో హరికృష్ణ చాలాసేపు మౌనంగా గడిపారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. "రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజనకు కేంద్రం నిర్ణయించింది. తద్వారా తెలుగుజాతి స్ఫూర్తిని చంపేసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంది'' అని ధ్వజమెత్తారు. తన తండ్రి ఎన్టీ రామారావు సమైక్యాంధ్ర కోసం గట్టిగా నిలబడ్డారని, ఇప్పుడు ఆయన కలలు చెదిరిపోయాయని, అందుకే ఎంపీగా కొనసాగరాదని అంతరాత్మ ప్రబోధించిందని ఆయన చెప్పారు.


హరికృష్ణ రాజీనామా తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్
ఎంపీ పాల్వాయి గోవర్ధన రెడ్డి కాసేపు హంగామా సృష్టించారు. డిప్యూటీ చైర్మన్ హరికృష్ణ రాజీనామా ఆమోదం ప్రకటన చేసిన సమయంలో "ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్'' అంటూ టీడీపీ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్ నినాదాలు చేశారు. దాంతో కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారివద్దకు దూసుకువెళ్లారు. "చేయండి.. మీరు కూడా రాజీనామా చేయండి'' అని వారిని సవాలు చేశారు. దీంతో వారు కూడా ఆయనవైపు రాగా, మంత్రి వయలార్ రవి ఆయనను వెనక్కు తీసుకువెళ్లారు. అదే సమయంలో సభలోకి ప్రవేశించిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.. పాల్వాయి వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. "వారంతా రాజీనామా చేసి హీరోలయిపోవాలనా మీ ఉద్దేశం? మీరెందుకు వారిని రెచ్చగొడుతున్నారు?'' అని ప్రశ్నించారు.

హరికృష్ణ పదవీ త్యాగం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో వైకాపా పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బహిరంగ ప్రకటన చేయాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నాలుగు రోజులుగా అమరణ దీక్షకు కూర్చున్న ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణకు ఆయన సంఘీభావం తెలిపారు. గాంధీ కుటుంబాన్ని సమాధిచేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. సిగ్గు, శరం ఉంటే కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రులను గ్రామాల్లోని ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఆయనతోపాటు సూళ్లూరిపేట ఎమ్మెల్యే పరసారత్నం ఎమ్మెల్యే దీక్షకు సంఘీభావం తెలిపారు

కేంద్రమంత్రులు రాజీనామా చేయాలి : పయ్యావుల

ఆయుధాలతో పోరాడిన వాడు ఆయుధాలతోనే పోతాడని… ఓ నానుడి ఉంది. వైఎస్ గానీ, ఆయన కుటుంబం గాని విశ్వసనీయత అనే ఆయుధంతో చంద్రబాబుపై దాడి చేశారు. చేస్తూనే ఉన్నారు. ఇపుడు అదే ఆయుధం వారి మెడకు చుట్టుకుంది. మాట తిప్పం, మడమ తిప్పమని వారు చెప్పేవన్నీ పచ్చి అపద్ధాలని టీడీపీ నేతలు ప్రకటించారు. దీనికి సాక్ష్యంగా.. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలంగాణకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలతో కూడిన సీడీని తెలుగుదేశం విడుదల చేసింది. తాము తెలంగాణకు అనుకూలమని విజయమ్మ, జగన్‌లు చాలా స్పష్టంగా చెప్పారన్నారు. ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే ఇదిగో వారు మాట్లాడిన మాటలు ఈ సీడీల్లో ఉన్నాయంటూ వాటిని మీడియాకు పంచారు. వైఎస్ తెలంగాణ ఉద్యమానికి రెండోసారి పునాది వేశారని విజయమ్మ చెప్పిన విషయాలు కూడా ఈ సీడీలో ఉన్నాయన్నారు. ఇంత పచ్చి అపద్ధాల కోరులు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద బురద జల్లుతున్నారని విమర్శించారు.

జగన్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో గల్లంతయిందని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రాను కూడా దోచుకోవడానికి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుంటున్న జగన్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తో కలవడం తథ్యమని, ఇది ప్రజలందరూ చూడబోతున్నారని అన్నారు. సీమాంధ్ర ప్రజలు జగన్ కు ఓటేస్తే ఆత్మహత్య చేసుకున్నట్లే అన్నారు. ఆయన సోనియా ముసుగు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ విశ్వసనీయతపై దెబ్బేసిన టీడీపీ


అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు వైసీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ తెలుగు ప్రజలతో ఆటలాడుకుంటున్నాయని టిడిపి అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ఆరోపించారు. గుంటూరులో టిడిపి నేతలు రాజకుమారి, యరపతినేని, డాక్టర్ శనక్కాయల అరుణ చేస్తున్న ఆమరణ దీక్షలకు సంఘీభావంగా గురువారం ఆయన జిల్లా టిడిపి అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రెండు పార్టీల నాటకాలు ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని, త్వరలోనే వారికి తగిన విధంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు.

కేవలం టిడిపిని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకొని తొమ్మిది కోట్ల తెలుగు ప్రజల గుండెల్లో చిచ్చు రేపిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం తెలుగు ప్రజలను ముక్కలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మంది విద్యార్థులు, యువకులు, వృద్ధులు ఆత్మ బలిదానాలు చేశారని, మరో వైపు అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు, కార్మికుడి నుంచి ఉద్యోగి వరకు అంతా నిరవదిక సమ్మె చేస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు తెలుసుకొని అందరితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఉండాలంటే ఉద్యోగాలు మానివేయాల్సిందే అంటూ కొంత మంది రాజకీయ నాయకులు ఉద్యోగులు, సీమాంధ్రులను హెచ్చరించటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తెలంగాణాలో సైతం మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్ర కోరుతున్నారన్నారు. తక్షణం కేంద్ర మంత్రులు, ఎంపీలు డ్రామాలు మాని రాజీనామాలు ఆమోదింప చేసుకొని ప్రజల్లోకి రాకుంటే జీరోలవుతారన్నారు.

కాంగ్రెస్, వైసీపీల కుమ్మక్కు రాజకీయాలు : కోడెల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మది దొంగ దీక్షని, కొంగ జపమని తెలుగుదేశం పార్టీ నేత రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అడిస్తున్న నాటకంలో భాగమే ఈ దీక్షని మండిపడ్డారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా వైసీపీ చేసిన వ్యాఖ్యల సీడీని టీడీపీ విడుదల చేసింది. తెలంగాణకు అనుకూలమని గతంలో దివంగత వైఎస్, విజయమ్మ , జగన్‌లు చెప్పారని, తెలంగాణకు మద్దతుగా వైఎస్ అధిష్టానం వద్దకు పంపిన వారిలో తాను కూడా ఉన్నానని కొండా సురేఖ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోసమే తెలుగు ప్రజలను బలి చేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. ఈరోజు పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేస్తామని ప్రకటన చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో అందరిమాటకు విలువ ఇవ్వాలని అన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో రెండు నెలలపాటు సభలో ఆందోళనలు జరిగాయని, ఎవరినీ సస్పెండ్ చేయలేదని, ఇప్పుడు న్యాయం కావాలని కోరుతూ ఆందోళన చేస్తే సస్పెండ్ చేస్తారా అని ఆయన ధ్వజమెత్తారు.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలుగు జాతి గుండె రగులుతోందని, తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగువారికి నాయకుడని రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయమన్నాం కానీ, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయమనలేదని తెలిపారు. రాజకీయ అనివార్యంతోనే లేఖ ఇవ్వాల్సి వచ్చిందని, ఇంతటి విపత్కార పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాటకు నిలబడిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని ఆయన పేర్కొన్నారు.
సీమాంధ్రప్రజలకు న్యాయం చేయాలని కోరడానికే చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర చేయనున్నారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. వైసీపీలా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

విజయమ్మది దొంగ దీక్ష, కొంగ జపం : రాజేంద్రప్రసాద్

సీమాంధ్రలో రాజకీయ సమీకరణలు , ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకు బలాబలాల్లో శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. విభజన నిర్ణయం తర్వాత కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలు జనంలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక పోతే కాంగ్రెస్‌తో రాజకీయ భవిష్యత్తు వుండదనే విధంగా మానసికంగా సిద్ధమయ్యారు. కొందరైతే కాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చోటుచేసుకున్న ఆగ్రహావేశాలు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భవిష్యత్తును ఆందోళనలో పడవేశాయి. సర్వేల విషయంలో పేరెన్నికగన్న ఒక సంస్థ ఈనెల 10,15 తేదీల మధ్య ఆరు రోజుల పాటు సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి వ్యతిరేకతతో వున్నట్టు అక్కడి ప్రజలు కుండబద్దలుకొట్టారు. మరి దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను అట్టిపెట్టుకున్న ఓటు బ్యాంకు ఎటువైపు మళ్ళనున్నది అనే అంశంపై జరిగిన అధ్యయనంలో మెజార్టీ ప్రజలు తెలుగుదేశం వైపే మొగ్గుచూపుతున్నట్టుగా తేలింది. కొన్ని జిల్లాల్లో దేశం, వైసీపీల మధ్య ెరాెరీగా పోరు సాగే అవకాశం వున్నట్టు, కొన్ని జిల్లాల్లో దేశం కంటే వైసీపీ ముందంజలో వుండగా, ఎక్కువ జిల్లాల్లో వైసీపీ కంటే తెలుగుదేశాన్ని ఎక్కువమంది ఆదరించేందుకు సిద్ధంగా వున్నట్టుగా అభిప్రాయం వెల్లడయింది. కోస్తా జిల్లాల్లో 2009 ఎన్నికల నాటికి 34.1 శాతం మేర కలిగివున్న దేశం ఓటు బ్యాంకు మారిన పరిస్థితిలో పెరిగింది. 12 శాతం మేర అదనంగా తెలుగుదేశం పార్టీ పట్ల ఓటర్లు ఆకర్షితు లవుతున్నట్టుగా సర్వేలో వెల్లడవుతోంది. 47 శాతం మేర ఓటు బ్యాంకును ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ కొల్లగొట్టే అవకాశం వున్నట్టు తేలింది. రాయలసీమలో 2009 ఎన్నికల సమయంలో 37.99 శాతం ఓటు పొందిన తెలుగుదేశం పార్టీ మరో 6 శాతం ఓటును పెంచుకుంది. అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, వెస్ట్‌గోదావరి, కృష్ణా, గుంటూరులలో అత్యధిక శాతం ఓటర్లు టిడిపివైపు మొగ్గు చూపుతున్నట్టు తేలింది. విశాఖ, నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో స్వల్ప ఆధిక్యత టిడిపికి కనబడింది. ఇక వైకాపాకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో దాదాపు తుడిచిపెట్టుకు పోయినట్టు సర్వేలో తేలింది. రాయలసీమలో 49.12 శాతం, కోస్తాంధ్రలో 34.35 శాతం ఓట్లతో తెలుగుదేశం పార్టీ ె తర్వాత రెండో స్థానాన్ని కట్టబెట్టేందుకు సిద్ధంగా వున్నట్టు ప్రజానాడితో స్పష్టమయింది. కడప, కర్నూలు జిల్లాల్లో వైఎస్‌ఆర్ పార్టీకి 60 శాతం మేర అత్యధికులు ఆదరణ చూపుతున్నట్టు తెలిపింది.

పెరుగుతున్న సైకిల్ మైలేజీ

గతంలో వస్తున్నా మీ కోసం యాత్ర చేసిన బాబు మిగిలిన సీమాంధ్ర జిల్లాల్లో ఆత్మగౌరవ యాత్ర పేరుతో కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ యాత్రను 25 నుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మొదటగా చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

25 నుండి ఆత్మగౌరవయాత్ర!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ నేతలతో సమా వేశాలు నిర్వహిం చనున్నారు. రెండు ప్రాంతాలకు చెందిన నేతలతో వేర్వేరుగా చర్చించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ఇప్పటికే ఉద్యమాల్లో టిడిపి ముందుం టున్నందున ఇటు తెలంగాణలో కూడా తాము వెనకబ డకుండా ఉండాలని ఆయన ముఖ్య నేతలకు సూచించినట్టు సమాచారం. ఇరు ప్రాంతాల్లోనూ పార్టీ పటిష్టంగా ఉండటం కోసం, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నేతలతో చర్చించనున్నారు. కాంగ్రెస్‌ నిర్ణయంతో తాము ఇబ్బంది పడకూడదనే ఈ భేటీలను ఏర్పాటు చేసినట్టు తెలి సిందే. గురువారం నుండే భేటీలను ప్రారంభించే అవకాశం ఉంది.

తెలంగాణ, సీమాంధ్ర నేతలతో త్వరలో చంద్రబాబు భేటీ

August 20, 2013

యూపీఏ సర్కారు దేశాన్ని భ్రష్టు పట్టించిందని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధిరేటు తగ్గడం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందన్నారు. విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి పక్షవాతం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆర్థికసంక్షోభంపై ప్రభుత్వానికి అధ్యయనం కరవైందన్నారు. బొగ్గు శాఖలో దస్ర్తాల గల్లంతుకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. ఇంత నికృష్టమైన ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు.

దేశాన్ని భ్రష్టు పట్టించిన యూపీఏ : బాబు

రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఉండి కాలువలో జలదీక్ష చేపట్టారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజలు నీటి వనరులు కోల్పోతారని తాను ప్రజల కోసం నిరవధికంగా జలదీక్షకు పూనుకున్నట్లు ఆయన దీక్షకు ముందు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉండి కాలువలో వలలు వేసుకొని వలపై కుర్చీవేసి దానిపై కూర్చున్నారు. ఉండి కాలువ ఎఫ్‌ఎస్‌ఎల్ 4.5 అడుగులు కాగా ప్రస్తుతం 4.0 అడుగుల స్థాయిలో ప్రవహిస్తోంది. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే టివి రామారావు గోదావరి ఒడ్డున ఉన్న గోష్పాద క్షేత్రంలో బాలా త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ పొర్లు దండాలు చేశారు. 108 సార్లు ఈ ప్రదక్షిణ చేశారు. దేవాలయ ఆవరణలో మోకాళ్లపై కొద్ది దూరం నడిచారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విధంగా సోనియా, యుపిఎ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరినట్లు చెప్పారు.

సమైక్యత కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జలదీక్ష

చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌కు బెయిల్‌ కోసమే వైకాపా గౌరవఅధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలను కుదుర్చుకున్న వైకాపా సమైక్యాంధ్ర కోసం దీక్ష చేపట్టడం ప్రజలను మోసం చేయడమేమని ఆయన ఆరోపించారు.

జగన్‌ బెయిల్‌ కోసమే విజయమ్మ దీక్ష: పయ్యావుల

August 10, 2013

ప్రభావిత వర్గాలతో చర్చించండి
ప్రకటనలో టీఆర్ఎస్ ప్రస్తావన దారుణం
హైదరాబాదే పెద్ద సమస్య
ప్రధాని మన్మోహన్‌కు చంద్రబాబు లేఖ
అపోహలు, భయ సందేహాలేమిటో తెలుసుకోండి
ముందు చర్చించనందు వల్లనే 'విభజన' సెగ
రాజకీయ లబ్ధే కాంగ్రెస్ లక్ష్యం
ఆంటోనీ కమిటీ కూడా అందులో భాగమే
రాజధాని ఉన్న ప్రాంతాన్ని విభజించడమా?
కాంగ్రెస్ సృష్టించిన అనిశ్చితితో రాష్ట్రం నాశనం


ఆంధ్రప్రదేశ్ లో సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడానికి ప్రధాని మన్మోహన్ తక్షణం జోక్యం చేసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 'ఆర్థికంగా, సామాజికంగా, భావోద్వేగాల పరంగా రాష్ట్రం నాశనం అవుతున్న తీరు చూస్తుంటే బాధ కలుగుతోంది. దేశ ప్రధానిగా మీ భుజస్కంధాలపై నైతిక, రాజ్యాంగపరమైన గురుతర బాధ్యత ఉంది. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి విభజన నిర్ణయంవల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి మీపైగల బాధ్యతను శిరసావహించండి. ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలు, భయసందేహాలను తీర్చి, సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగండి. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ హ్రస్వదృష్టితో తీసుకున్న నిర్ణయంవల్ల తెలుగువారి మధ్య విద్వేషాలు పెరగకుండా చూడండి. ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలేమిటో తెలుసుకొని వాటిపై చర్చించండి. వారి ప్రయోజనాలు కాపాడండి. వారికి న్యాయం చేయండి'' అని శుక్రవారం ప్రధానికి పంపిన లేఖలో విజ్ఞప్తిచేశారు.

అధికశాతం పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపినా అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ దీనిపై నిర్ణయం తీసుకొనేముందు సీమాంధ్ర భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడం.. ఆ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి, నిర్వేదానికి, అనూహ్యస్థాయిలో ఉద్యమానికి నెట్టివేశాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, మహిళలు..ఇలా అనేక వర్గాలవారు రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, రోజురోజుకూ ఉధృతం అవుతున్న ఈ ఆందోళనలపై సకాలంలో స్పందించకపోతే పరిస్థితి చేయిజారే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంవల్ల ప్రభావితమయ్యే వర్గాలతో తొలుత తగినంతగా చర్చలు జరిపి వారి మనోగతం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం ప్రకటించడమే ఈ సమస్యను సృష్టించిందని పేర్కొన్నారు.

"ఆంధ్రప్రదేశ్ విభజనను మిగిలిన రాష్ట్రాలతో పోల్చలేం. అవి ప్రధాన రాష్ట్రంనుంచి విడివడి ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. కాని ఇక్కడ మెజారిటీ ప్రాంత ప్రజలు విధిలేని పరిస్థితుల్లో తాము కొత్త రాష్ట్రంగా ఏర్పడి రాజధానిసహా అన్నీ కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం సీమాంధ్ర ప్రజల మనసుల్లో అనేక భయాలను రేకెత్తించింది. తమ పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాలు, హైదరాబాద్‌లో రక్షణ-భవిష్యత్తు అవకాశాలు, నదీజలాల పంపిణీ, కొత్త రాష్ట్రం రూపు దిద్దుకోవడానికి అవసరమైన వనరులు, ప్రస్తుత కార్యక్రమాలకు అవసరమైన నిధులు వంటి వాటిపై వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వో ద్యోగులు కూడా తమ భవిష్యత్తుపై దిగులుతో ఉన్నారు. ఐదు దశాబ్దాలుగా హైదరాబాద్‌తో తాము పెంచుకొన్న అనుబంధం తెగిపోతుందన్న భావన కూడా సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర అశాంతిని రేకెత్తించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారి సమష్టి కృషితో హైదరాబాద్ పురోగమి స్తూ వస్తోంది. తెలుగుదేశం పాలనలో ఇది ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది. పెట్టుబడులు, ఉద్యోగాలు సహా అన్ని అవకాశాలకు కేంద్రంగా మారడంవల్లే దీనిపై ఇప్పుడింత చర్చ జరుగుతోంది.

సాధారణంగా ఒక కుటుంబంలో సమస్య వస్తే.. కుటుంబ పెద్దలు, గ్రామ పెద్దలు ఆ కుటుంబంలో అందరితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన శాంతియుత పరిష్కారాన్ని కనుగొంటారు. కానీ ఎనిమిదిన్నర కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొనేటప్పుడు సంబంధిత వర్గాలన్నింటితో చర్చించాలన్న తెలివిడి కాంగ్రెస్‌కు కొరవడటమే ప్రస్తుత చిచ్చుకు కారణమైంది' అని విమర్శించారు. ప్రజా కోణంలో కాకుండా రాజకీయ ప్రయోజనాల దృష్టితోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసినట్లు కనిపిస్తోందని చంద్రబాబు తన లేఖలో తప్పుబట్టారు. "రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకటించే సమయంలోనే.. టీఆర్ఎస్ విలీనం అంశాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకొన్నదనడానికి ఇదే నిదర్శనం. హైదరాబాద్ ప్రతిపత్తికి సంబంధించి దిగ్విజయ్ సింగ్ రకరకాలుగా చేసిన ప్రకటనలు కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనలకు కారణమయ్యాయి. 2009లో కాంగ్రెస్ రకరకాలుగా తీసుకొన్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అగ్ని గుండంలోకి నెట్టి ఒక ప్రాంతంలో భారీగా యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమయ్యాయి. ఇటీవలి నిర్ణయం మళ్లీ ఆందోళనలు, మరో ప్రాంతంలో ఆత్మహత్యలకు కారణమైంది. శ్రీకృష్ణకమిటీ సహా తనకు అందుబాటులో ఉన్న అనేక రకాల నివేదికలను కేంద్రం అధ్యయనం చేసి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతో ముందుకు వస్తే ఈ సంక్షోభం తప్పేది.

ఇంత సున్నితమైన అంశాల్లో గతానుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ పాఠాలూ నేర్చుకోలేదు. కాంగ్రెస్ సరైన రీతిలో వ్యవహరించకపోవడం నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని అనిశ్చితిలో పడవేసి పరిశ్రమలు, పెట్టుబడులు తరలిపోవడానికి, ఉద్యోగావకాశాలు దెబ్బతినిపోవడానికి కారణమైంది. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే' అని ఆయన తేల్చి చెప్పారు. సమస్య తీవ్రతను గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ యదాలాపంగా నిర్లక్ష్య ధోరణితో నిర్ణయాలను ప్రకటించడం..తెలుగు వారి మధ్య ఘర్షణలకు, ద్వేష భావాలకు దారితీసి మొత్తం తెలుగు జాతి పురోగమనాన్నే దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీ కూడా ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉద్దేశించినట్లే కనిపిస్తోందని, అందులో సభ్యులంతా ఆ పార్టీవారే కావడం దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకన్నా తన రాజకీయ ప్రయోజనాలే ఆ పార్టీకి మిన్నగా మారాయని, రాష్ట్ర విభజన వ్యవహారాన్ని ఆ పార్టీ తన అంతర్గత వ్యవహారంగా చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం ప్రజా సంక్షేమానికి మంచిది కాదని...ఈ పరిస్థితుల్లో ప్రధాని జోక్యం తప్పనిసరిగా భావించి తాను ఈ లేఖ రాస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు

ప్రధాని గారూ..! చక్కదిద్దండి..తక్షణం రంగంలోకి దిగండి


హైదరాబాద్‌ : తెలంగాణలో టీడీపీకి గట్టి పట్టు ఉందని ఆ పార్టీ నేత, మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఆత్మీయతా, అభిమానం ఉందన్నారు. కాంగ్రెస్‌పై సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలమేమిటో తేలిపోయిందని ఆయన తెలిపారు. సీమాంధ్రలో టీడీపీ గెలుస్తుందన్న భయంతో కాంగ్రెస్‌ ఉందన్నారు. భవిష్యత్‌లో వైకాపా ఉండదన్నారు. కాంగ్రెస్‌లో కలువడం ఖాయమని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ గెలువదు కనుక సీమాంధ్రలో వైకాపాను అడ్డు పెట్టుకొని లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో రెండు చోట్ల టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

తెలంగాణ, సీమాంధ్రలో రెండు చోట్ల టీడీపీ అధికారంలోకి : యనమల


రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో తలెత్తే సమస్యలను పరిష్కరించాలని ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారని, దాని ద్వారా కేసీఆర్ వచ్చే ఇబ్బందేంటని టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన కేసీఆర్‌కు ఇష్టం లేదని ఆరోపించారు.

రాష్ట్ర విభజన సమస్యను సాగదీసి వసూళ్ల దుకాణం నడుపుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీయం చేయలేదు కాబట్టే విభజన ప్రక్రియ ఆలస్యమవుతోందని, తెలంగాణ ఏర్పాటు జాప్యానికి ప్రధాన కారకుడు కేసీఆరే అని వారు అన్నారు. అన్నదమ్ముల్లా విడిపోవటమే తమ కోరిక అని ఎర్రబెల్లి, మోత్కుపల్లి పేర్కొన్నారు.

లేఖ ద్వారా కేసీఆర్ వచ్చే ఇబ్బందేంటి? : ఎర్రబెల్లి, మోత్కుపల్లి