August 23, 2013
ఇక్కడ ఇల్లు లేదు.. అక్కడ నోరు లేదు : రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మహబూబ్ నగర్ లో ఇల్లు లేదు..లోక్ సభలో నోరు
లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ ఆవేదనతోనే
రాజీనామా చేశాడని, విభజన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్
లో కర్రీపాయింట్ పెట్టుకుంటే కేసీఆర్ కలెక్షన్ పాయింట్ పెట్టుకుంటారని,
సీమాంధ్రలో సమైక్య ఉద్యమాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత
కేసీఆర్ కు లేదా అని టీడీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి రేవంత్
రెడ్డి ప్రశ్నించారు.
రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని, కేసీఆర్ రెచ్చగొట్టే వాఖ్యల మూలంగానే
సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎగిసి పడుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం
పార్టీ ఎంపీలను పార్లమెంటు నుండి మార్షల్స్ తో గెంటేయించారని, సస్పెన్షన్
చేసినా వారు సభ నుండి బయటకు వెళ్లలేదని, లోక్ సభలో తాము మాట్లాడే అవకాశం
లేకుండా చేశారని ఆరోపించారు.
Posted by
arjun
at
8:42 AM