August 23, 2013

ఎమ్మెల్యే రామకృష్ణను పరామర్శించిన సోమిరెడ్డి

సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యే రామకృష్ణ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించడంతో ఆయన అక్కడే దీక్షను కొనసాగిస్తున్నారు. ఆస్పత్రిలో రామకృష్ణను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరామర్శించారు. ప్రజాదరణ అధికంగా వస్తుందనే ప్రభుత్వం దీక్షను భగ్నం చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు.