December 11, 2012

నిర్మల్/దిలావర్‌పూర్/కుంటాల/లోకేశ్వరం/సారంగాపూర్: తొమ్మిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న మీకు తో డుగా నిలిచి మీ ముఖాల్లో ఆనందాన్ని నింపేందుకే తాను నేరుగా మిమ్మల్ని కలవడానికి వచ్చానని తెలుగుదేశం పా ర్టీ అధినేత నారా చంద్రబాబునాయు డు అన్నారు. మంగళవారం మండలంలోని సిర్గాపూర్, ట్యాల ఎక్స్‌రోడ్డుల వ ద్ద ప్రసంగించారు. ఈ సందర్భంగా ముజ్గి గ్రామానికి చెందిన మాడావి ల క్ష్మీ అనే మహిళ చంద్రబాబుకు పలు వి షయాలను వివరించారు. వచ్చిన పిం ఛన్లను కాంగ్రెసోల్లు కట్ చేశారని, ఇళ్లు లేని వారికి ఇప్పటికీ ఎవరూ ఇళ్లు క ట్టించి ఇవ్వడం లేదని, ఎవరూ పట్టించుోకపోతే మా బ్రతుకులు ఎట్లా అం టూ చంద్రబాబును ప్రశ్నించారు.

అ మ్మా లక్ష్మీ తొమ్మిదేళ్ల క్రితం ధరలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, అప్పుడు పద్దతి ప్రకారం పరిపాలన చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనేది అనుమానంగానే ఉందన్నారు. కుటుంబానికి 35 కేజీల బియ్యం ఇవ్వగా, ప్రస్తుతం నా లుగు కేజీలు ఇస్తున్నారని, మిగతావన్ని కాంగ్రెసోల్లు పంది కొక్కుల్లా తింటున్నారని చంద్రబాబు అన్నారు. నేను మీ వద్దకు పదవి కోసం రాలేదు మీ కష్టాలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి నా శాయశక్తుల కృషి చేస్తానన్నారు. పేద వారికి తోడుగా ఉండి వారి ము ఖాల్లో ఆనందాన్ని తప్పకుండా చూస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీని ఆదరించి ఆశీర్వదిస్తున్న మహిళా సోదరిమణుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నారు.

పల్లెల రూపు రేఖలు మారుస్తా..: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పల్లెల రూపురేఖలు మారుస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామాల్లో తాగునీరు దొరకని పరిస్థితి ఉందని, పారిశుద్ధ్యం అస్తవ్యస్థంగా ఉం దని, నేను పర్యటించిన ప్రతీ గ్రా మంలో ఎంతో మంది ఆడపడుచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇది తనకెంతో బాధ కలిస్తోందన్నారు. ఈ కాం గ్రెస్ ప్రభుత్వం తాగడానికి మంచినీళ్లు ఇవ్వదు కానీ మద్యం ఎంత కావాలంటే అంత ఇస్తుందన్నారు. తాను అధికారంలోకి రాగానే రెండో సంతకం బెల్టు షా పుల రద్దుపైనే పెడతానన్నారు. గ్రామాలను ప్రగతి పథంలో నడిపించే బా«« ద్య త తెలుగుదేశం పార్టీ తీసుకుందన్నారు.

మీ ముఖాల్లో ఆనందం చూస్తా... చంద్రబాబు

ఆదిలాబాద్ : టీడీపీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లాలోని సిర్గాపూర్ క్రాస్ రోడ్డు నుంచి చిట్యాల క్రాస్‌రోడ్, తల్వెద క్రాస్‌రోడ్, మంజులాపూర్, నిర్మల్ పట్టణంలోని ఈద్గా చౌరస్తా, రూరల్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల క్రాస్‌రోడ్, శాంతినగర్ చౌరస్తా, వెంకటాపూర్, అక్కాపూర్, మూక్తాపూర్ వరకు మంగళవారం 14.8 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఎన్టీ రామారావు జిల్లాను ఆదర్శ జి ల్లాగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారని, నేను సైతం ఆయన బాటలోనే నడుస్తానన్నారు. జిల్లాను అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. జిల్లాలో అధికంగా ఉన్న గిరిజనుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేసిన ఘనత టీడీపీదేనన్నారు. ఇక్కడి గిరిజనుల అభివృద్ధికి మరింత కృషి చే స్తానని హామీ ఇచ్చారు. 500 జనాభా ఉన్న తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, అభివృద్ది చేస్తానన్నారు.

సర్వం కోల్పోయి పునరావాసం ఏర్పర్చుకున్న ఎస్ఆర్ఎస్‌పీ ముంపు బాధితులకు నష్ట పరిహారం అందిజేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో పత్తి, పసుపు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనీ, ఏ రైతును కదిలించిన క న్నీరు మున్నీరవుతున్నారని అన్నారు. రైతుల కష్టాలు తెలుసుకొని వారి కన్నీటిని తుడిచేందుకే తాను పాదయాత్ర చేపట్టాననీ అన్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు 174 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందించలేదన్నారు. రైతులను కాపాడతాననీ, వారు తీసుకున్న అన్ని రుణాలను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల 50 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారనీ, బీడీ కార్మికులను ఆదుకుంటానన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు బీడీ కార్మికుల పొట్టకొట్టేందుకు బీడీ కట్టపై పుర్రెబొమ్మ గుర్తు పెట్టించారన్నారు. తాను ఢి ల్లీలో ఆందోళన చేస్తే పుర్రె గుర్తును తొలగించారని అన్నారు.

ఉత్తర తెలంగాణను ఎడారిగా మార్చే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడ్డుకోలేదనీ, తాను అడ్డుకునేందుకు వెళ్లగా త నను మూడు రోజులు మహారాష్ట్ర జైలు లో పెట్టారని అన్నారు. జిల్లాలో రోడ్లన్ని అధ్వానంగా మారాయని, త మ హయాంలో నాలుగు లైన్ల రోడ్లను వేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే తెలంగాణ పేరుతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి అవినీతితో జైలులో ఉన్న జగన్‌ను కలిశాడని, వైఎస్ఆర్ పార్టీలోకి పోతున్నాడని, ఇది నియోజక వర్గ ప్రజలు గమనించాలనీ చంద్రబాబు సూచించారు. వైఎస్ఆర్ పార్టీ ఏ నాటికైనా మళ్లీ కాం గ్రెస్‌లో కలిసి పోయేదేనన్నారు.

ఒక మంచి పని చేసేందుకు దేవాలయాలకు వెళ్తాం, కానీ మీ మాజీ ఎమ్మెల్యే మాత్రం జగన్‌ను కలువడంలో అంతర్యమేమి టో ఆలోచించాలని పరోక్షం గా ఇంద్రకరణ్‌రెడ్డి ఉద్దేశించి అన్నారు. సకలజనుల సమ్మెలో సింగరేణి కార్మికులు, విద్యార్థుల పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. టెట్ పరీక్షను రద్దు చేసి, బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించడంతో పాటు రెగ్యులర్‌గా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని బెల్టు షాపుల ఓనర్లను కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రైతులుగా నియమించిందని, దాంతో ఒక ఎస్ఎంఎస్ కొడితే మ ద్యాన్ని ఇంటికి పంపిస్తున్నారనీ, దాంతో జిల్లాలో మద్యం ఫుల్, మంచినీరు నిల్ అన్నట్లు ఉందన్నారు. పోచంపాడ్ రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు.

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశానని, తన రికార్డును ఎ వరూ చేరుకోరన్నారు. తాను పదవి కోసం పాదయాత్ర చేయడం లేదని, ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు పాదయాత్ర చేస్తున్నానని ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే నగేష్, టీడీపీ సీనియర్ నాయకులు పాయల శంకర్, లోలం శ్యామ్ సుందర్, బాబర్, యూనిస్ అక్బానీ, అందుగుల శ్రీనివాస్, జుట్టు అశోక్, రమాదేవి, కడెం మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్, ఆదిలాబాద్ నియోజక వర్గం నాయకుడు గణేష్‌రెడ్డి, అల్లూరి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రకు...జన నీరాజనం: ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ని యోజక వర్గంలో మంగళవారం పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబునాయుడుకు జనం నీరాజనం పలికారు. పలు వివిధ గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లతో, మేళ వాయిద్యాలతో, మం గళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడి పాదయాత్ర వస్తుందని తెలుసుకున్న పలు గ్రామాల ప్రజలు రెండు, మూడు కిలోమీటర్లు నడిచి పాదయాత్ర వెళ్ళే మె యిన్ రోడ్‌కు చేరుకొని స్వాగతం పలికారు.

అనంతరం తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను విన్నవించారు. టీడీపీ పాలనలోనే అభివృద్ధి పనులు జరిగాయనీ, ఇప్పటి వరకు కొత్త అభివృద్ధి పనులు చేపట్టకపోగా పాత అభివృద్ధి పనులకు మరమ్మత్తులు కూడా చేయడం లేదని తెలిపారు. సిర్గాపూర్ క్రాస్ రోడ్డు నుంచి చిట్యాల క్రాస్‌రోడ్, తల్వెద క్రాస్‌రోడ్, మంజులాపూర్, నిర్మల్ పట్టణంలోని ఈద్గా చౌరస్తా, రూరల్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల క్రాస్‌రోడ్, శాంతినగర్ చౌరస్తా, వెంకటాపూర్, అక్కాపూర్, మూక్తాపూర్ వరకు పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబునాయుడు ఆయా ప్రాంతాల్లోని పూరి గుడిసెల్లోకి వెళ్లి పేదలను పలకరించారు. రైతులను, కూలీలను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. అలాగే ఆగిన బస్సుల్లోకి వెళ్లి ప్రయాణికులను పలకరించారు.

అధికారంలోకి వచ్చాక రైతుల రుణాలు మాఫీ..

ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు నన్ను తమ అన్నలా ఆదరిస్తున్నారు. ఊరి పొలిమేరల వరకు వచ్చి హారతులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. చిట్యాల క్రాస్ వద్ద కొంతమంది మహిళలు పాద యాత్రలో నడిచారు. నాపై పాటకట్టి వాళ్లకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వాళ్ల అభివృద్ధికి ఎన్టీఆర్, నేనూ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఉన్నంతలోనే నన్ను బాగా చూసుకున్నారు. అదంతా చూసినప్పుడు పొల్లూ, తాలూ వారికి బాగానే తెలుసుననిపించింది. చిన్న మేలు చేసినా గుండెల్లో పెట్టుకొనే మనసును ఆ పాటల్లో చూడగలిగాను. అప్పుడూ ఇప్పుడూ మహిళలే మా బలం.

స్వాతంత్య్రం వచ్చిన తరువాతే ఏ ప్రభుత్వం చేయనంత మేలు వాళ్ల కోసం ఎన్టీఆర్ చేశారు. ఆడపిల్లకు ఆస్తిలో సగం హక్కును కల్పించడం అప్పట్లో సంచలనమే. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆడపడుచులపై ఆయనకున్న ప్రత్యే క అభిమానానికి నిదర్శనం. నేను వచ్చాక కాలేజీల్లో 33 శాతం కేటాయించాను. డ్వాక్రా సంఘాలు పెట్టి ఆత్మవిశ్వాసం పెంచాను. సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి ప్రోత్సహించాను. డ్వాక్రా వేదికగా పేదరిక నిర్మూలన కోసం వెలుగు పథకాన్ని ఇదే జిల్లా ఖానాపూర్‌లో ప్రారంభించాను. ఆ పాటలోని ప్రతి చరణమూ నన్ను అప్పటి జ్ఞాపకాల్లోకి నడించింది. వాళ్లలా గతాన్ని గుర్తుచేసుకుంటున్నారంటే.. వర్తమానంలో వాళ్ల బతుకు నరకప్రాయం కావడమే కారణమనిపిస్తోంది. వీళ్లొచ్చి పథకాల రూపుమార్చి నిలువునా మోసం చేశారు.

గ్యాస్ ధర తగ్గిస్తామని గాలి మాటలు చెప్పారు. పావలా వడ్డీ అని చెప్పి రెండు రూపాయల వడ్డీతో నడ్డి విరిశారు. మైక్రో ఫైనాన్స్ కోరలకు బలిచేశారు. ఆ రోజున వాళ్లలో ఆశలు రేపి వాటికి రెక్కలు తొడిగి గగనవీధుల్లోకి నడిచించిన వాడిగా.. వాళ్ల కష్టంలో భాగమూ నాదే. డ్వాక్రా అప్పుభారం తగ్గించడానికి అందుకే సూత్రప్రాయంగా సిద్ధమయ్యాను. కానీ, ఎలా? ఏమి చేస్తే వాళ్ల జీవితాల్లో పునర్వైభవం చూడగలను?..ఈ ఆలోచనలతోనే చిట్యాల గ్రామం దాటొచ్చాను.

ఆడపడుచులతో ఆత్మీయబంధం!

అందుకే రాష్ట్రం కోరుకోవడం లేదు
కాంగ్రెస్‌తో కలిసి డ్రామాలాడుతున్నాడు
నాన్చుడు సోనియాను ఒక్క మాట అనడేం?
టీఆర్ఎస్ అధినేతపై చంద్రబాబు నిప్పులు
అఖిలపక్షంలో ఏం చెప్పాలో అదే చెబుతాం
అన్ని పార్టీలూ నా దారిలోకే..
ఆదిలాబాద్‌లో పాదయాత్రకు బ్రహ్మరథం

ఆదిలాబాద్, డిసెంబర్ 11 : " తెలంగాణ ఇస్తే కేసీఆర్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు. అందుకే ఆయన తెలంగాణ రావాలని కోరుకోవడం లేదు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తేల్చాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై నాన్చుడు ధోరణి అవలంభిస్తుండగా, ప్రశ్నించాల్సిన టీఆర్ఎస్.. టీడీపీను దెబ్బతీయాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లా సిర్గాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆయన మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు.

చిట్యాల క్రాస్‌రోడ్, తల్వెద క్రాస్‌రోడ్, మంజులాపూర్, నిర్మల్ పట్టణంలోని ఈద్గా చౌరస్తా, రూరల్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల క్రాస్‌రోడ్, శాంతినగర్ చౌరస్తా, వెంకటాపూర్, అక్కాపూర్, మూక్తాపూర్ వరకు 14.8 కిలో మీటర్లు నడిచారు. ప్రజల్లో మమేకం అవుతూ, వైసీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లపై పలు సభల్లో నిప్పులు చెరుగుతూ చంద్రబాబు ముందుకు సాగారు. నిర్మల్ నియోజక వర్గంలో జనం ఆయనకు నీరాజనం పలికారు. పలు వివిధ గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లతో, మేళ వాయిద్యాలతో, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.

వెంకటాపూరం గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు." కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయి. తెలంగాణ వస్తే కేసీఆర్‌కు రాజకీయ భవిష్యత్తు ఉండదు. అందుకే తెలంగాణ రావాలని కోరుకోవడం లేదు. తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నాడు.కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై ఒక్క మాట కూడా మాట్లాడడు. తెలంగాణ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఉద్యమం చేపడుతున్న కేసీఆర్ అధికార పార్టీపై పోరాడాలి. అలాగని ప్రతిపక్షాలపై పోరాడం ఎలా సమంజసం?'' అని ప్రశ్నించారు.

అఖిలపక్షం సమావేశంలో తమ పార్టీ ఏం చెప్పాలో అదే చెబుతుందన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ.. తన అభిప్రాయం చెప్పకుండా నాటకాలు ఆడుతుందన్నారు. తమ పార్టీ ప్రజల మనోభావాలను గౌరవిస్తుందని చెప్పారు. కొత్త కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే కొత్త రాగాలు ఆలపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ విషయంపై తేల్చడానికి కాక, అవగాహనల కోసమనీ, కొత్త విషయాలను తెలుసుకునేందుకనీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

టీడీపీకి ఓటేస్తే తెలంగాణ వస్తుందనీ, అప్పుడు సీమాంధ్రులు పాస్‌పోర్ట్, వీసా తీసుకొని తెలంగాణకు వెళ్లాల్సి ఉంటుందని 2009 ఎన్నికల్లో వైఎస్ చేసిన ప్రచారాన్ని ఆయన గుర్తుచేశారు. దానివల్ల మూడు, నాలుగు శాతం ఓట్లు తగ్గి అధికారానికి దూరమయ్యామని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పాలనలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేయడంతో ఆదాయం పెరిగిందనీ, ఆ పెరిగిన ఆదాయాన్ని కాంగ్రెస్ నాయకులు దోచుకు తింటున్నారని విమర్శించారు. ఎప్పుడైనా తనదారికే మిగతా పార్టీలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలూ రైతులూ కోరితే రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని ఆయన గుర్తుచేశారు.

ఆలాగే.. బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ముందు విముఖత చూసి.. తమ పోరాటం తరువాత కేసీఆర్ మేల్కొన్నారని చెప్పారు. అదే దారిలో.. మొదల ఇన్‌పుట్ సబ్సిడీ కోసం తాను ఉద్యమిస్తే విమర్శించిన ప్రభుత్వం.. ఇప్పుడు సబ్సిడీ ప్రకటించిందని తెలిపారు. కేంద్ర కార్మిక మంత్రిగా ఉండగా పుర్రెబొమ్మను ముద్రించి.. కేసీఆర్ బీడీ కార్మికుల పొట్ట కొట్టారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని ఎనమిది వేల ఎకరాలను 53 కంపెనీలకు వందల కోట్ల ముడుపులు తీసుకొని వైఎస్ పందేరం చేస్తుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

దోచుకున్న లక్ష కోట్ల రూపాయలతో వైఎస్ కుటుంబం పేపర్‌ను, చానల్‌ను పెట్టిందని దుయ్యబట్టారు. అందులో నాలుగు పేజీలు తనను విమర్శించుకుంటూ కథనాలు రాస్తారని, మరో నాలుగు పేజీలు వారు చేయని పనులను చేసినట్లు రాసుకుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ది మొండెద్దు ప్రభుత్వమని, మొండెద్దు నడవకపోతే ముల్లుకర్రతో పొడుస్తారని, అయినా నడవకుంటే దాన్ని వదిలించుకుంటారని, కాంగ్రెస్‌నూ అలాగే వదిలించుకోవాలని కోరారు.

మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకువస్తానని, ఎరువుల ధరలను తగ్గించి గ్యాస్ సిలెండర్లపై సబ్సిడీ ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే..గోదావరి జలాలను అన్ని గ్రామాలకు తరలించే ఫైల్‌పై సంతకం చేస్తానన్నారు. ఐఏఎస్‌కు ఒక పరీక్ష ఉండి, డీఎస్సీకి మాత్రం మూడు పరీక్షలు నిర్వహించడం సబబు కాదనీ, అధికారంలోకి వస్తే టెట్‌ను రద్దు చేసి ఎస్జీటీ అవకాశం కల్పిస్తానని భరోసా ఇచ్చారు.

తెలంగాణ వస్తే కేసీఆర్‌కు భవిష్యత్తు లేదు: చంద్రబాబు

11.12.2012 "vastunna meekosam" padayatra photos ( part-2)

11.12.2012 "vastunna meekosam" padayatra photos ( part-1)