December 24, 2012
సిటీ/ సుల్తానాబాద్/పెద్దపల్లి): 'పసుపుమయమైన
రాజీవ్ రహదా రి.. అడుగడుగునా నీరాజనాలు.. మ హిళల మంగళ హారతులు..డప్పుల చ ప్పుళ్లు..ఒగ్గు
డోలు వాయిద్యాలు..గంగిరెద్దుల ఆటలు..సింధోళ్ల వేషాలు.. కి క్కిరిసిన సుల్తానాబాద్ సభ..
వెరసీ సోమవారం జరిగిన చంద్రబాబు పా దయాత్ర జాతరను తలపించింది. ఈ ప్రభుత్వం చేసిన నమ్మక
ద్రోహం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.. మీరు న మ్ముకున్న పార్టీలు మిమ్మల్ని మోసం చేశాయి..
కరెంట్ లేదు.. ఉద్యోగాలు లేవు.. మీ కష్టాలకు కారకులెవ్వరో ఆ లోచించండి.. నేను చెప్పేది
వాస్తవమై తే నమ్మండి'.. అని టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా మీ
కోసం పాదయాత్రలో భాగంగా సోమవారం వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జి
ల్లాలోని సుల్తానాబాద్ మండలం న ర్సయ్యపల్లి, కాట్రపల్లి, పూసాల క్రాస్ రోడ్, సుల్తానాబాద్,
గొల్లపల్లి, రేగడిమద్దికుంట వరకు 13.4 కిలోమీటర్లు నడిచారు. రాజీవ్ రహదారి మీదుగా సాగిన
ఈ యాత్ర అంతా పసుపుమ యమైంది. యాత్రకు ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివ
చ్చారు. అడుగడుగునా నీరాజనాలు పలికారు.
మధ్యాహ్నాం ఒంటి గంటకు పాదయాత్రను మొదలెట్టారు. మార్గమధ్యంలో పార్టీ నాయకులు,
కార్యకర్తలతో మాట్లాడారు. కాట్రపల్లిలో ప్రజ లు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.
సుల్తానాబాద్లో ముస్లిం లు, ఆయా కులాలకు చెందిన వాళ్లు ఆ యనను కలుసుకున్నారు. తమ సమస్యలను
పరిష్కరించాలంటూ వినతిప త్రాలు అందించారు. సుల్తానాబాద్లో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు
ఉత్సాహంగా మాట్లాడారు. కార్యకర్త లు కిరీటం పెట్టి కత్తి అందించారు. కర్రతో చేసిన చిన్న
ఎడ్లబండి బహూకరించారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనపై దుమ్మెత్తి పో శారు. టీఆర్ఎస్
తీరును ఎండగట్టిన ఆయన వైఎస్ఆర్ పార్టీపైనా విరుచు కుపడ్డారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రభు
త్వం అసమర్థ పాలన సాగిస్తున్నదని, ప్రజల కష్టాలు చూడలేకనే దేశంలో ఏ నాయకుడు చేయలేని
విధంగా దాదా పు 1350 కిలోమీటర్లు పాదయాత్ర చే సుకుంటూ వచ్చానని.. పొలాలకు వె ళ్లాను..
ఇళ్లళ్లకు, గుడిసెలకు వెళ్లాను.. మీ కష్టాలు చూస్తే గుండె తరుక్కుపో తున్నదని ఆవేదన
వ్యక్తం చేశారు.
మీ కష్టాలను తీర్చాల్సిన ఈ ప్రభుత్వం క ష్టాలను సృష్టించిందన్నారు. వ్యవసా
య ఖర్చులు బాగా పెరిగి పోయాయ ని కరెంట్ ఇవ్వడం లేదని.. ఎరువుల ధరలు పెరిగాయని, నిత్యావసర
వస్తువుల ధరలు పెరిగాయన్నారు. పొద్దం తా కష్టపడితే వచ్చే 100 రూపాయల తో కిలో నూనె కూడా
రావడం లేదని ఉప్పులు, పప్పులు అన్నీ ధరలు పెరిగాయి కానీ పేద, మధ్యతరగతి కు టుంబాల ఆదాయం
పెరగలేదని అ న్నారు. వ్యవసాయానికి 9 గంటల క రెంట్ ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇ చ్చారు.
సర్చార్జీల భారంవల్ల బిల్లులు అడ్డగోలుగా వస్తున్నాయన్నారు. కరెం ట్ ఎప్పుడు వస్తుందో,
ఎప్పుడు పో తుందో ఆ భగవంతుడికే తెలియాలన్నారు. తెలుగుదేశం పాలనలో సం స్కరణలు తీసుకువచ్చి
జవాబుదారీ తనాన్ని పెంచామన్నారు. అవినీతికి పాల్పడాలంటేనే భయపడే వాళ్లని కా నీ ఇప్పుడు
ఆ పరిస్థితి లేదన్నారు. వి చ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదన్నారు. ఎస్సారెస్పీ ఆధునీకీకరణకు
ఈ జిల్లాలో 1500 కోట్ల రూపాయల ఖర్చు చేశామని గుర్తు చేశారు.
బాబ్లీ ప్రాజెక్టు మరో 14 ప్రాజెక్టుల వల్ల శ్రీ రాంసాగర్లోకి నీళ్లు
రాక ఈ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి వచ్చిందన్నా రు. అక్రమ నిర్మాణాలపై తాము పో రాడితే
అర టీఎంసీయే కదా అని టీఆర్ఎస్ కొట్టేసిందని, బాబ్లీ కట్టుకుంటే మనకు నష్టమేమిటని కాంగ్రెస్
అంద ని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో, మ హారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రె స్ పార్టీ
బాబ్లీని ఆపకపోవడం సిగ్గు చే టు అని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధర ల్ని 28 సార్లు పెంచారని,
మహిళల శ్రమను దోచుకుంటున్నారని పావలా వడ్డీ అని చెప్పి రూపాయి, రెండు రూ పాయలు వసూలు
చేస్తున్నారని అన్నా రు. వంట గ్యాస్కు 6 సిలిండర్ల పరిమి తి పెట్టి గ్యాస్ ధరలు పెంచారని
పేర్కొన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల పంట రుణాల మాఫీపై తొలి సంతకం
చేస్తానని, డ్వా క్రా మహిళల అప్పులను తీర్చే విషయ మై ఆలోచన చేస్తానని హామీ ఇచ్చారు.
బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు ఇస్తామని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల
కోసం పోరాడుతామని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు ఇస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ
చేపతామన్నారు. టీఆర్ఎస్ బ్లా క్ మెయిల్ చేసే పార్టీ అని సాగునీరు, కరెంట్, విద్య, వైద్యం
గురించి ఏనా డు పట్టించుకోలేదన్నారు. వైఎస్ఆర్ పార్టీ అవినీతి పార్టీ అని విమర్శించా
రు. 'కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ వై.. అభివృద్ధికి నై.. అవినీతికి సై' అని చమత్కరించారు.
నా పట్ల మీరు చూపుతున్న ఆదరణను నా జీవితంలో ఎన్నడూ మర చిపోనని చంద్రబాబు నాయుడు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పెద్దప ల్లి, కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యేలు
సీహెచ్ విజయరమణారా వు, గంగుల కమలాకర్, సుద్దాల దేవ య్య, ఎల్ రమణ, నిజామాబాద్ ఎమ్మెల్యే
నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం, నియోజకవర్గ ఇన్చార్జీలు కర్రు నాగయ్య,
గండ్ర నళిని, పి రవీందర్రావు, పుట్ట కిశోర్, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, గోపు
అ యిలయ్య యాదవ్, జిల్లా ప్రధాన కా ర్యదర్శి వాసాల రమేష్, రాష్ట్ర కార్యదర్శులు బోనాల
రాజేశం, అన్నమనేని నర్సింగరావు, తాజుద్దీన్, జిల్లా బీసీ, ఎస్సీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు
అడ్డగట్ల లక్ష్మీనారాయణ, అక్కపాక తిరుప తి, ఎండీ మస్రత్, జిల్లా ఉపాధ్యక్షులు గోపగాని
సారయ్య గౌడ్, కళ్యాడపు ఆ గయ్య, అధికార ప్రతినిధులు సాయిరి మహేందర్, ఒంటెల సత్యనారాయణ
రెడ్డి, గూడెల్లి తిరుపతి, నాయకురాళ్లు గంగం రజిత, అమీనా బేగం, పెద్దప ల్లి నియోజకవర్గ
నాయకులు ఆకుల నర్సయ్య, మినుపాల ప్రకాశరావు, కు మార్ కిశోర్, అమిరిశెట్టి తిరుపతి, అ
బ్బయ్య గౌడ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు పాల రామారావు, గంట రాములు, ఎ విద్యాసాగర్
రావు తదితరులు ఉన్నారు.
బాబు కాలికి బొబ్బలు..: జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చం ద్రబాబు నాయుడు
సోమవారం కొత్త బూట్లు ధరించడం వల్ల ఆయన ఎడ మ కాలికి బొబ్బలు వచ్చాయి. సుల్తానాబాద్
సభ అనంతరం ఊరు దాటిన అనంతరం వైద్యులు కాలికి చికిత్స చే శారు. ఆ తర్వాత మళ్లీ పాత
బూట్లు ధ రించి పాదయాత్రను రేగడి మద్దికుం ట వరకు కొనసాగించారు.
జన హోరు...
మీట నొక్కితే షాక్..మార్కెట్కు వెళితే దడ..బస్సు ఎక్కి టికెట్ చూసుకుంటే
గుండె గుభేల్..పప్పు నుంచి పెట్రోల్ దాకా ధరలు ఎంత పెరిగిపోయాయి? స్వాతంత్య్రం వచ్చిన
త రువాత ఇంతలా నిత్యావసరాలు నిప్పులు కక్కడం ఎప్పుడూ లేదు. సుల్తానాబాద్ వైపు వె ళుతుండగా
కొంతమంది కలిశారు. ధరాఘాతానికి కందిపోయిన వాళ్లను చూస్తే బాధనిపిం చింది. ధరల పెరుగుదలపై
వారిలో తీవ్రమైన ఆవేదన కనిపించింది.
"ఏం కొనేటట్టు లే దు..ఏం తినేటట్టు లేదు'' అన్న వేదన వారి మాటల్లో
వ్యక్తమయింది. ధరల పెరుగుదల విషయంలో హేతుబద్ధత లేకుండా పోయింది. కరెంటు చార్జీలు, పెట్రోల్,
డీజిల్ ధరలు, ఆర్టీసీ చార్జీలు, ఎరువులు, నిత్యావసరాలు..ఇలా ఏది ముట్టుకున్నా మండిపోతున్నాయి.
అదీ ఇదీ అని తేడా లేకుండా ఎడాపెడా ధరలు పెంచి పారేశారు. మరీ ఇంత అన్యాయమా?
ఆరోగ్యం కోసం ఆరిపోతున్నవారు ఎందరో..ఒకవైపు ఆస్పత్రి ఖర్చులు, మరోవైపు
పిల్లల చదువులు.. పేదలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో
కనీస సౌకర్యాలు లేవు. ప్రైవేట్ ఆస్పత్రులు, స్కూళ్లు తప్ప మరో మార్గం లేని పరిస్థితిని
పాలకులు కల్పిస్తున్నారు. ఆ ఖర్చులను భరించడానికి వీళ్లు అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నారు.
కార్పొరేట్ ఆస్పత్రులను మేపేందుకే ఆరోగ్య శ్రీ. పేదలకు ఖరీదైన వైద్యం పేరిట పెద్దోళ్లకు
ఖజానాను దోచిపెడుతున్నారు. ఇప్పుడా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు 'ఆరోగ్యశ్రీ'పై నిరా
సక్తత చూపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం.
కార్పొరేట్ ఆస్పత్రి మెట్లు ఎక్కేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి
వస్తోంది. ఆరోగ్యశ్రీని సమర్థంగా అమలుచేయని ప్రభుత్వం.. ఈ పథకాన్నీ ధరవరల్లాగే చుక్కల్లో
కలిపే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు విద్యుత్ విషయమై వైఎస్ చేసిన పాపం రూ. 6,500
కోట్ల రూపంలో పేదల నెత్తిన పడింది. వచ్చే ఏడాది కోసం మరో పది వేలకోట్లు సిద్ధం చేసి
పెట్టారు. ఈ జనం చెప్పేది వింటుంటే ఢిల్లీ వీధుల్లో కనిపించిన తిరుగుబాటు మనదగ్గరా
జరగాలనిపిస్తోంది.
ఢిల్లీ వీధి పోరాటాలే పరిష్కారం!
వైఎస్
పాలనపై చంద్రబాబు ధ్వజం
సహకార
ఎన్నికల్లో అధికార దౌర్జన్యం
అడ్డుపడిన
మా పార్టీ నేతలపై లాఠీచార్జి
పోలీసులూ..
మీకూ ఆ ఐఏఎస్లు, మంత్రుల గతే!
మేమూ
దాడులు చేస్తే కాంగ్రెస్సే మిగలదు
వైఎస్ హయాంలో 117 సెజ్ల పేరిట 2.75 లక్షల ఎకరాలను ప్రజల నుంచి లాక్కొని
ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని, ఒక్క హైదరాబాద్లోనే 8వేల ఎకరాలను ధారాదత్తం చేశారని
టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రం గా ఆక్షేపించారు. కరీంనగర్ జిల్లా నర్సయ్యపల్లె నుంచి
సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం 14.5 కిలోమీటర్లు నడిచారు. రాష్ట్రంలో
మాఫియాలను తయారు చేసి ప్రైవేటు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు.
తన హయాంలో ఐటీ కంపెనీలకు ఒక ఎకరా ఇస్తే వేయి ఉద్యోగాలు కల్పించాలని షరతు పెట్టామని,
లక్షల ఎకరాలను ప్రైవేటు వారికి కట్టబెట్టినా ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని విమర్శించారు.
ఏపీఐఐసీని పావుగా చేసుకుని అధికార పార్టీ నేతలు నోటీసులు ఇచ్చి రైతుల
భూములను లాక్కున్నారని, ఒక వాన్పిక్ కంపెనీకే 19 వేల ఎకరాలు ఇచ్చారని ఆరోపించారు.
కలెక్టర్లతో కాకుండా ప్రైవేటు వ్యక్తులతో భూసేకరణ చేయించి రైతులకు ఎకరాకు రూ.లక్ష
ఇచ్చి, ఎకరా రూ.2-3 కోట్లకు అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశార న్నారు. ప్రజల నుంచి
రూ.20 వేల కోట్ల ఆస్తులు లాక్కొని రెండుమూడు వందల కోట్లు మాత్రమే చెల్లించారన్నారు.
చివరకు అసైన్డ్ భూములను కూడా స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు.
పేదలకు వంద గజాల స్థలం ఇవ్వలేకపోగా ఒక్కరికే 20 వేల ఎకరాలు కట్టబెట్టడం
ఏమిటని ప్రశ్నించారు. ఎవడ బ్బ సొమ్మని ఎడాపెడా భూపందేరం చేస్తున్నారని దుయ్యబట్టారు.
టీడీపీ అధికారంలోకి వస్తే డీకేటీ అసైన్మెంట్ పట్టాలను శాశ్వత పట్టాలుగా చేసి అమ్ముకునే
అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అవినీతిపరులను ప్రొత్సహించే సీఎం అవసరమా? అని
సుల్తానాబాద్ సభలో ప్రజలను ఆయన ప్రశ్నించారు. సహకార ఎన్నికలు ప్రకటించిన ప్రభుత్వం...
కాంగ్రెస్ వారికే సభ్యత్వ పుస్తకాలు ఇచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
తప్పుడు రికార్డులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. ఒక
కాంగ్రెస్ నేత ఇంట్లో సభ్యత్వ పుస్తకాలున్నట్లు తెలిసి, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్
అక్కడకు వె ళితే పోలీసులు దౌర్జన్యం చేశారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని
అనుకూలంగా వ్యవహరించిన అధికారులు జైలుకు పోయారని, అలా చేసిన మం త్రి కూడా జైలులోనే
ఉన్నారని అన్నారు. " మీరు కూడా అదే చేస్తే జైలు తప్పద''ని పోలీసులను హెచ్చరించారు.
కాగా, కరీంనగర్జిల్లాలో ఒక చేతకాని మంత్రి మంథనిలో తమ నేత నాగయ్య ఇంటిపై
దాడులు చేయించార ని, ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు
ధ్వజమెత్తారు. తమ కార్యకర్తలు తిరిగి దాడి చేస్తే మంత్రి జిల్లాలో తిరగలేరని హెచ్చరించారు.
తామూ అలా చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఉండడని హెచ్చరించారు. చేతకాని కాంగ్రెస్
ప్రభుత్వం వల్ల అరాచకం పెరిగిపోతున్నదని ఢిల్లీలో అత్యాచారం ఘటనను గుర్తుచేశారు. కేంద్రం
లో, రాష్ట్రంలో అధికారంలో ఉండి, తెలంగాణ ఇచ్చే శక్తి ఉన్నా మళ్ళీమళ్ళీ అభిప్రాయం కోరడం
టీడీపీని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే'నని ఆరోపించారు.
హన్మకొండ: పత్తి రైతుల సమస్యలపై వచ్చేనెల మొదటి వారం లో వరంగల్ ఏనుమాముల
మార్కెట్లో చంద్రబాబు ఒక రోజు దీక్ష చేపడతారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి
సోమవారం మీడియాకు ఈ విషయం తెలిపారు.
మాఫియాతో శాసించాడు! ప్రజలను కొట్టి లక్షల ఎకరాలు దోచి పెట్టాడు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బావ
మరిది, సినీ హీరో నందమూరి బాలకృష్ణను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన
ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం
బాలయ్యకు ఆయన ఫోన్ చేసి ఈ ఆహ్వానం అందచేసినట్లు సమాచారం. 'ఎన్టీ రామారావు
అంటే మాకు గౌరవం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
మీరు తప్పనిసరిగా రావాలి' అని ఆయన బాలయ్యను కోరారు.
తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బిజెపితో దూరంగా ఉంటుండడంతో పార్టీ ప్రతినిధిగా కాకుండా ఎన్టీఆర్ కుటుంబం పేరుతో మోడీ ఆయనను ఆహ్వానించినట్లు కనిపిస్తోంది. మోడీ ఆహ్వానానికి బాలకృష్ణ వ్యక్తిగతంగా సానుకూలంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొన్న వ్యక్తి పిలిస్తే వెళ్ళడంలో తప్పులేదని, దానిని రాజకీయ కోణంలో చూడకుండా వెళ్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కాని తాను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉంటున్నందువల్ల పార్టీతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుకొంటున్నారు.
పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించి ఆయన అభిప్రాయం తీసుకొన్న తర్వాతే వెళ్ళాలో వద్దో ఆయన నిర్ణయించుకొనే అవకాశం ఉంది. 'బాలకృష్ణను మోడీ ఏ పేరుతో పిలిచినా ఆయన వెళ్ళడం అంటూ జరిగితే చంద్రబాబు పంపించారనే అంటారు. వెళ్ళాలో వద్దో రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు' అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బిజెపితో దూరంగా ఉంటుండడంతో పార్టీ ప్రతినిధిగా కాకుండా ఎన్టీఆర్ కుటుంబం పేరుతో మోడీ ఆయనను ఆహ్వానించినట్లు కనిపిస్తోంది. మోడీ ఆహ్వానానికి బాలకృష్ణ వ్యక్తిగతంగా సానుకూలంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొన్న వ్యక్తి పిలిస్తే వెళ్ళడంలో తప్పులేదని, దానిని రాజకీయ కోణంలో చూడకుండా వెళ్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కాని తాను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉంటున్నందువల్ల పార్టీతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుకొంటున్నారు.
పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించి ఆయన అభిప్రాయం తీసుకొన్న తర్వాతే వెళ్ళాలో వద్దో ఆయన నిర్ణయించుకొనే అవకాశం ఉంది. 'బాలకృష్ణను మోడీ ఏ పేరుతో పిలిచినా ఆయన వెళ్ళడం అంటూ జరిగితే చంద్రబాబు పంపించారనే అంటారు. వెళ్ళాలో వద్దో రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు' అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బాలకృష్ణకు నరేంద్ర మోడీ ఆహ్వానం
అక్రమాస్తుల వెలికితీతకు వైఎస్ జగన్కు చెందిన
భవనాల్లో నేల మాళిగలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శోధించాలని
తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. 'జగన్ వద్ద రూ. లక్ష కోట్ల డబ్బు
ఉందని అందరూ అనుకొంటున్నారు. వాటిని బెంగుళూరు, హైదరాబాద్, పులివెందుల,
ఇడుపులపాయ తదితరచోట్ల నిర్మించిన భవనాల నేళ మాళిగల్లో దాచి ఉంచారని ప్రచారం
జరుగుతోంది.
సిబిఐ, ఇడి, కేంద్ర విజిలెన్స్ సంస్ధలు ఇంతవరకూ ఆ ప్రాంతాలకు వెళ్ళి తనిఖీలు చేయలేదు. దీనిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ తనిఖీలు జరగకుండా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ల మధ్య అవగాహన కుదిరిందనే అనుకోవాల్సి వస్తోంది' అని ఆయన అన్నారు. జగన్ అవినీతిని పూర్తి స్ధాయిలో నిర్దారించడానికి పై మూడు సంస్ధలు ప్రత్యేక తనిఖీ బృందాలను పెట్టి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాల నేల మాళిగల్లో తనిఖీలు నిర్వహించాలని, తమ నేత కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని చెప్పే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు దీనికి పూర్తి స్ధాయిలో సహకరించాలని ఆయన కోరారు.
ఈ సంస్ధలు దీనికి స్పందించకపోతే టిడిపి తరపున తాము హైకోర్టు, సుప్రీం కోర్టుల దృష్టికి ఈ అంశాలు తీసుకువస్తామని, కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరతామని ఆయన పేర్కొన్నారు.
సిబిఐ, ఇడి, కేంద్ర విజిలెన్స్ సంస్ధలు ఇంతవరకూ ఆ ప్రాంతాలకు వెళ్ళి తనిఖీలు చేయలేదు. దీనిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ తనిఖీలు జరగకుండా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ల మధ్య అవగాహన కుదిరిందనే అనుకోవాల్సి వస్తోంది' అని ఆయన అన్నారు. జగన్ అవినీతిని పూర్తి స్ధాయిలో నిర్దారించడానికి పై మూడు సంస్ధలు ప్రత్యేక తనిఖీ బృందాలను పెట్టి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాల నేల మాళిగల్లో తనిఖీలు నిర్వహించాలని, తమ నేత కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని చెప్పే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు దీనికి పూర్తి స్ధాయిలో సహకరించాలని ఆయన కోరారు.
ఈ సంస్ధలు దీనికి స్పందించకపోతే టిడిపి తరపున తాము హైకోర్టు, సుప్రీం కోర్టుల దృష్టికి ఈ అంశాలు తీసుకువస్తామని, కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరతామని ఆయన పేర్కొన్నారు.
జగన్ నేల మాళిగలు శోధించాలి: యనమల
దేశంలో సమర్ధ వంతమైన పాలన ఉన్నప్పుడే బంగారు భవిష్యత్ ఉంటుందని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా శనివారం
సాయంత్రం అల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్లో శీనివాస రామను జయంతి ఉత్సవాల్లో , కిమ్స్ ఇంజనీరింగ్
కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దేశం అవినీతిలో
కూరుకుపోవడం వల్లనే వెనుకబడుతున్నామని సమర్ధవంతమైన పాలన ఉన్నప్పుడే దేశంలో పేదవారు
ఉండరన్నారు. ఎందరో మహానుభావులు పేదరికం నుండే పైకొచ్చారని, అంబేద్కర్, శ్రీనివాసరామనుజన్,
అబ్దుల్ కలాం, ఎన్టిఆర్ లాంటి వాళ్లు బావి తరాలకు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
దేశ రాజధానిలో బస్సెక్కితే కిరాతకంగా అత్యాచారంచేయడం నీచమని, దేశంలో భయం లేకుండా పోయిందని
అలాంటి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షలు అమలు చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు.
మహిళల అభివృద్ది కోసం ఆడపిల్లల సంరక్షణ కోసం అనేక పతకాలు ప్రవేశపెట్టిమని,
ఆడపిల్లల ఆత్మసైర్యం నింపడానికి సైకిల్ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాకా బాల బాలికలందరికి
సైకిళ్లు ఇస్తామని, అలాగే లాబ్టాప్లు కూడా అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్
విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం
చేస్తుందని, ఇంటర్మీడియెట్ సెంకండియర్లో జంబ్లింగ్ పద్దతిని తీసివేయాలని దీంతో విద్యార్థులకు
తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. అలాగే తెలంగాణ సమస్యపై కూడా పరిష్కరించాలని
తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావాలని, సమస్యలు పరిష్కారం కావాలని చంద్రబాబును
కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలో శీనివాస
రామనుజం జయంతి ఉత్సవాల్లో బాగంగా గణిత శాస్త్రం పోటీ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు
చంద్రబాబు చేతుల నగదు బహుమతులను అందించారు.
సమర్థ పాలనతోనే బంగారు భవిష్యత్తు
Subscribe to:
Posts
(
Atom
)