November 16, 2012

మీ బేరసారాల కోసం అవిశ్వాసమా?
వాళ్ల కోసం మేం పెట్టం.. అవసరమైతే ప్రజా సమస్యలపై పెడతాం
చేతకాకుంటే రాజీనామా చేసి పోవాలని కిరణ్ సర్కారుకు సూచన
తెలంగాణకు కేసీఆర్ ఏం ఉద్ధరించారు?.. చేవెళ్లలో చంద్రబాబు గర్జన

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 16: బేరసారాల కోసమే కొందరు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని, వారికి బలం ఉంటే గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని పడగొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాలు చేశారు. అవసరమైతే ప్రజాసమస్యలపై తాము అవిశ్వాస తీర్మానం పెడతామే తప్ప వారి కోసం పెట్టబోమని చెప్పారు. 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని దామరగిద్ద, న్యాలట, రామన్నగూడ, ఇబ్రహీంపల్లి, చేవెళ్ల, దేవునిఎర్రవల్లి, ఊరెళ్ల, కొత్తపల్లి క్రాస్‌రోడ్డు, ఎన్కేపల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు.

సమస్యలను పరిష్కరించడం, ధరలను నియంత్రించడం చేతకాకుంటే తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోవాలని కిరణ్ సర్కారుకు చంద్రబాబు సూచించారు. చేవెళ్ల క్రాస్‌రోడ్డులో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే పన్నుల మీద పన్నులు వేసి కిరణ్ సర్కారు వారిని మరింత ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు. కిరణ్‌లాంటి అధ్వాన సీఎంను తాను ఎప్పుడూ చూడలేదని, ఆయన కనీసం హైదరాబాద్‌లో ఘర్షణలను కూడా నియంత్రించలేకపోతున్నారన్నారు. "నేను నిప్పులాంటి మనిషిని. నాకు విశ్వసనీయత లేదంటారా? ఎవరేంటో ప్రజలకు తెలుసు'' అని చంద్రబాబు అన్నారు.

తనకు ఎక్కడో హోటల్ ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారని, అది ఉన్నట్లు నిరూపిస్తే వారికే రాసిస్తానని సవాల్ విసిరారు. తాము అ«ధికారంలోకి వస్తే రైతులకు సోలార్ విద్యుత్ అందజేస్తామని చెప్పారు. కాగా చంద్రబాబు పాదయాత్రకు ఇంటలెక్చువల్ ఫోరం సంఘీభావం తెలిపింది. ఫోరం కో ఆర్డినేటర్ సుబ్బారావు, మాజీ ఐఏఎస్ రాంబాబు, సామాజికవేత్త వెంకటేశ్వరరావు బాబును కలిసి మద్దతు తెలిపారు.

మీ బేరసారాల కోసం అవిశ్వాసమా?

వణికించే చలిలోనూ..!
బాబు కోసం చేవెళ్లవాసుల ఎదురుచూపులు
పూలు జల్లి స్వాగతిం పలికిన ముస్లింలు

ఒకవైపు చలి గజగజా వణికిస్తోంది. అయినా.. చంద్రబాబు రాక కోసం రాత్రి 11 తర్వాత కూడా ప్రజలు చలిమంటలు వేసుకుని మరీ వేచి చూశారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 12-14 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అంత చలిలోనూ బాబు పాదయాత్ర ఆగట్లేదు. ఆయన కోసం తండాలు, గ్రామాల్లో ప్రజలూ ఎదురు చూస్తున్నారు. కొందరు కళాకారులు చలిమంటలు వేసుకుని, వాటిలోనే డప్పులు వేడి చేసుకుంటూ.. బాబు రాక కోసం ఎదురుచూడటం కనిపించింది. చేవెళ్ల నియోజకవర్గంలో బాబుకు జనం నీరాజనం పలికారు.

చేవెళ్లలోకి ప్రవేశించగానే పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా, భవనాలపై బారులు తీరారు. మైనార్టీలు దారిలో పూలుజల్లుతూ స్వాగతం పలికారు. సభకు జనం భారీగా హాజరుకావడంతో బాబు కూడా ఉత్సాహంగా గంటకుపైగా మాట్లాడారు. గతంలో వైఎస్ పాదయాత్ర చేవెళ్ల నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో సహజంగానే బాబు పాదయాత్రకు ఇక్కడ జనస్పందన ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే శుక్రవారం నాటి యాత్రకు జనం భారీగా వచ్చారు. రోడ్లన్నీ కిక్కిరిశాయి. జనస్పందన చూసి బాబు అన్ని విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి గెలిచాక అడ్రస్ లేరని ఎద్దేవా చేశారు.

6 నెలలు ఇంట్లో పడుకుని..
కేసీఆర్‌పై చంద్రబాబు ఫైర్

కేసీఆర్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. మాటల గారడి చేసే కేసీఆర్ ఆరునెలలు ఇంట్లో పడుకుని లేచి మళ్లీ సెంటిమెంట్ రేపుతాడని, ఆయన వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అసలు తాను ఆయనకు మంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్ పార్టీ పెట్టేవారా అని అడిగారు. "ఆయన తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉద్ధరించారా? ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా పలకరించారా? తాను ప్రాతిని«ధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఎప్పుడైనా వెళ్లారా?'' అని ప్రశ్నించారు.

వణికించే చలిలోనూ..! బాబు కోసం చేవెళ్లవాసుల ఎదురుచూపులు



chandrababunaidu_vastunnameekosam_padaytra_11photos_at Rangareddy dist

46వ రోజు చంద్రబాబునాయుడి పాదయాత్ర పోటోలు...రంగారెడ్డి జిల్లా( 16.11.2012)



రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేవెళ్లలో శుక్రవారం అవసరమైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదిస్తామని ప్రకటన చేశారు. ప్రజా సమస్యలపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని, ఇతర పార్టీలు అడిగాయని కాదని చంద్రబాబు అన్నారు. అంతేకానీ ఇతరపార్టీల్లా బ్లాక్ మెయిల్ చేసి కేసుల నుంచి బయటపడడానికి, బేరాసారాలు చేసుకోవడానికి తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని ఓడించి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలో ఉంటే ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఉండేదని, ప్రాజెక్టు ప్రస్థుత పరిస్థితి చూస్తే ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెసు కు ఒక్క రోజు కూడా పాలించే అర్హత లేదని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని అడుగుతున్నారని, ఎప్పుడు అవిశ్వాసం పెడతారో తెలియని వారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారని, చంద్రబాబు అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్న వారు గవర్నర్ వద్దకు వెళ్తే మంచిదని ఆయన అన్నారు.

ప్రజా సమస్యలపై అవిశ్వాస తీర్మానం :శుక్రవారం రంగారెడ్డి జిల్లా పాదయాత్రలో చంద్రబాబు



chandrababunadiu_vastunnameekosam_padayatra_35photos_rangareddy dist

45 వరోజు వస్తున్నా మీకోసం పాదయాత్ర పోటోలు...రంగారెడ్డి జిల్లా..15.11.2012