August 23, 2013

హెచ్‌పీసీఎల్ ప్రమాదంపై చంద్రబాబు విచారం

విశాఖలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.