August 26, 2013

సీమాంధ్ర టీడీపీ ఎంపీల దీక్షకు అనుమతి నిరాకరణ

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర టీడీపీ ఎంపీలు చేపట్ట దలచిన నిరవధిక నిరాహార దీక్షకు స్పీకర్ మీరాకుమార్ అనుమతి నిరాకరించారు. కాగా ఎంపీలు తమ పట్టువీడలేదు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టేందుకు ఎంపీలు సన్నద్దమవుతున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.