August 26, 2013

రెచ్చగొట్టే వికృత క్రీడలకు ఇదేనా సమయం?: చంద్రబాబు

అన్నదమ్ముల మధ్య విద్వేషాలు రగిలి పరిస్ధితులు సున్నితంగా మారిన తరుణంలో కొన్ని పార్టీలు ప్రజలను మరింత రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేస్తూ కాంగ్రెస్, టిఆర్ఎస్, వైసీపీ పార్టీలు ఈ వికృత క్రీడలో భాగస్వాములు కావడం దురదృష్టకరమని, వాటి వ్యవహారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. 'రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుత నిరసన హక్కు కల్పించింది. కాని గత కొన్ని రోజులుగా సచివాలయం, విద్యుత్ సౌధ, జల సౌధ, ఇతర ప్రధాన కార్యాలయాల్లో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.