August 26, 2013

టిడిపి రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్

సీమాంద్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ టిడిపి ఎమ్.పిలు సుజనా చౌదరి, సి.ఎమ్.రమేష్ లు రాజ్యసభలో ఆందోళనకు దిగడం తో వారిని సభ నుంచి డిప్యూటి ఛైర్మన్ కురియన్ సస్పెండ్ చేశారు. లోక్ సభలో టిడిపి ఎమ్.పిలు సస్పెండ్ కావడంతో వీరిద్దరూ కూడా రాజ్యసభలో సస్పెండ్ అయ్యారు. వీరు కూడా దీక్షలో పాల్గొనే అవకాశం ఉంది.