August 26, 2013

టిడిపి ఎమ్.పిలకు పరామర్శ

పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న తెలుగుదేశం ఎమ్.పిలను కేంద్ర మంత్రి చిరంజీవి,కాంగ్రెస్ ఎమ్.పిలు కెవిపి రామచంద్రరావు,లగడపాటి రాజగోపాల్,అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పరామర్శించారు సీమాంధ్రకు న్యాయం చేయాలని అంటూ వారు దీక్ష చేస్తున్నారు.కొనకళ్ల నారాయణ,మోదుగుల వేణుగోపాలరెడ్డి, నిమ్మల కిష్టప్పలు మండుటెండలో దీక్ష చేశారు.అయితే వారు కొంచెం వయసు మీరినవారు కనుక ఆరోగ్య రీత్యా ఇబ్బంది వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఎందుకైనా మంచిదని అంబులెన్స్ కూడా సిద్దం చేశారు.