August 10, 2013

లేఖ ద్వారా కేసీఆర్ వచ్చే ఇబ్బందేంటి? : ఎర్రబెల్లి, మోత్కుపల్లి


రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో తలెత్తే సమస్యలను పరిష్కరించాలని ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారని, దాని ద్వారా కేసీఆర్ వచ్చే ఇబ్బందేంటని టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన కేసీఆర్‌కు ఇష్టం లేదని ఆరోపించారు.

రాష్ట్ర విభజన సమస్యను సాగదీసి వసూళ్ల దుకాణం నడుపుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీయం చేయలేదు కాబట్టే విభజన ప్రక్రియ ఆలస్యమవుతోందని, తెలంగాణ ఏర్పాటు జాప్యానికి ప్రధాన కారకుడు కేసీఆరే అని వారు అన్నారు. అన్నదమ్ముల్లా విడిపోవటమే తమ కోరిక అని ఎర్రబెల్లి, మోత్కుపల్లి పేర్కొన్నారు.