August 10, 2013

ఆంటోని కమిటీ వద్దు: సోమిరెడ్డి


రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ కమిటీ అవసరం లేదని, ఆంటోని కమిటీని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తున్నదని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు నర్తకి సెంటర్‌లో తెలుగుదేశం ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర సభలో ఆయన మాట్లాడారు. సరిహద్దుల్లో విఫలమైన ఆంటోని కమిటీ ఆంధ్రరాష్ట్రంలో కూడా విఫలమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కమిటీ అవసరం లేదని, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కమిటీని వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఆంటోని కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వర్తిస్తుందని, ఇతర పార్టీలు సమైక్యవాదుల మనోగతం తెలుసుకునే అవకాశం ఉండదని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 75 శాతం రెవెన్యూ తెలంగాణా నుంచి వస్తుందని కేసీఆర్ ఒప్పుకున్నాడని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో 25 శాతం రెవెన్యూతో సీమాంధ్ర ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.