August 24, 2013

లోక్‌సభ నుంచి నామా వాకౌట్

టీడీపీ నేతల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఎంపీ నామా నాగేశ్వరరావు శనివారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. సభ్యుల హక్కులను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో మాట్లాడేందుకు నామా ప్రయత్నించగా, అందుకు స్పీకర్ మీరాకుమార్ నిరాకరించారు. ఎంపీ నామాకు బీజేపీ, ఏడీఎమ్‌కే, ఎస్పీ పార్టీ నేతలు మద్దతు తెలిపారు.