August 24, 2013
అనరులకు యోగాధ్యయన పరిషత్ అప్పగించొద్దు......ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ
రాష్ట్ర యోగాధ్యయన పరిషత్ కార్యదర్శి పదవిని అనర్హులకు
అప్పగించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై అధ్యాపక సిబ్బంది, వైద్యుల్లో
ఆందోళన నెలకొందని, అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రిని
ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎంకు లేఖ రాశారు.
యోగా సూపర్వైజర్గా ఉన్న ఒక వ్యక్తిని ఈ పరిషత్కు కార్యదర్శిగా నియమించే
ప్రయత్నాలు జరుగుతున్నా యని తన దృష్టికి వచ్చిందని, కొందరు అధ్యాపక
సిబ్బంది, వైద్యులు అనేకసార్లు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు
వెళ్లినా ఫలితం లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా
కార్యదర్శి పదవిని భర్తీ చే సేలా చూడాలని కోరారు.
Posted by
arjun
at
8:09 PM