August 31, 2013

జగన్‌ది దొంగ దీక్ష : మోత్కుపల్లి

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అని, కేసీఆర్ కూడా ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని దీక్ష చేశారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకే కాంగ్రెస్, వైసీపీ కుమ్మక్కయారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కుట్రలను బహిర్గతం చేసుందుకే చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రను చేస్తున్నట్లు మోత్కుపల్లి తెలిపారు.