August 22, 2013

పెరుగుతున్న సైకిల్ మైలేజీ

సీమాంధ్రలో రాజకీయ సమీకరణలు , ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకు బలాబలాల్లో శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. విభజన నిర్ణయం తర్వాత కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలు జనంలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక పోతే కాంగ్రెస్‌తో రాజకీయ భవిష్యత్తు వుండదనే విధంగా మానసికంగా సిద్ధమయ్యారు. కొందరైతే కాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చోటుచేసుకున్న ఆగ్రహావేశాలు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భవిష్యత్తును ఆందోళనలో పడవేశాయి. సర్వేల విషయంలో పేరెన్నికగన్న ఒక సంస్థ ఈనెల 10,15 తేదీల మధ్య ఆరు రోజుల పాటు సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి వ్యతిరేకతతో వున్నట్టు అక్కడి ప్రజలు కుండబద్దలుకొట్టారు. మరి దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను అట్టిపెట్టుకున్న ఓటు బ్యాంకు ఎటువైపు మళ్ళనున్నది అనే అంశంపై జరిగిన అధ్యయనంలో మెజార్టీ ప్రజలు తెలుగుదేశం వైపే మొగ్గుచూపుతున్నట్టుగా తేలింది. కొన్ని జిల్లాల్లో దేశం, వైసీపీల మధ్య ెరాెరీగా పోరు సాగే అవకాశం వున్నట్టు, కొన్ని జిల్లాల్లో దేశం కంటే వైసీపీ ముందంజలో వుండగా, ఎక్కువ జిల్లాల్లో వైసీపీ కంటే తెలుగుదేశాన్ని ఎక్కువమంది ఆదరించేందుకు సిద్ధంగా వున్నట్టుగా అభిప్రాయం వెల్లడయింది. కోస్తా జిల్లాల్లో 2009 ఎన్నికల నాటికి 34.1 శాతం మేర కలిగివున్న దేశం ఓటు బ్యాంకు మారిన పరిస్థితిలో పెరిగింది. 12 శాతం మేర అదనంగా తెలుగుదేశం పార్టీ పట్ల ఓటర్లు ఆకర్షితు లవుతున్నట్టుగా సర్వేలో వెల్లడవుతోంది. 47 శాతం మేర ఓటు బ్యాంకును ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ కొల్లగొట్టే అవకాశం వున్నట్టు తేలింది. రాయలసీమలో 2009 ఎన్నికల సమయంలో 37.99 శాతం ఓటు పొందిన తెలుగుదేశం పార్టీ మరో 6 శాతం ఓటును పెంచుకుంది. అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, వెస్ట్‌గోదావరి, కృష్ణా, గుంటూరులలో అత్యధిక శాతం ఓటర్లు టిడిపివైపు మొగ్గు చూపుతున్నట్టు తేలింది. విశాఖ, నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో స్వల్ప ఆధిక్యత టిడిపికి కనబడింది. ఇక వైకాపాకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో దాదాపు తుడిచిపెట్టుకు పోయినట్టు సర్వేలో తేలింది. రాయలసీమలో 49.12 శాతం, కోస్తాంధ్రలో 34.35 శాతం ఓట్లతో తెలుగుదేశం పార్టీ ె తర్వాత రెండో స్థానాన్ని కట్టబెట్టేందుకు సిద్ధంగా వున్నట్టు ప్రజానాడితో స్పష్టమయింది. కడప, కర్నూలు జిల్లాల్లో వైఎస్‌ఆర్ పార్టీకి 60 శాతం మేర అత్యధికులు ఆదరణ చూపుతున్నట్టు తెలిపింది.