August 22, 2013
విజయమ్మది దొంగ దీక్ష, కొంగ జపం : రాజేంద్రప్రసాద్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు,
పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మది దొంగ దీక్షని, కొంగ జపమని తెలుగుదేశం
పార్టీ నేత రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన
మీడియాతో మాట్లాడుతూ టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా కాంగ్రెస్
అధ్యక్షురాలు సోనియాగాంధీ అడిస్తున్న నాటకంలో భాగమే ఈ దీక్షని మండిపడ్డారు.
గతంలో తెలంగాణకు అనుకూలంగా వైసీపీ చేసిన వ్యాఖ్యల సీడీని టీడీపీ విడుదల
చేసింది. తెలంగాణకు అనుకూలమని గతంలో దివంగత వైఎస్, విజయమ్మ , జగన్లు
చెప్పారని, తెలంగాణకు మద్దతుగా వైఎస్ అధిష్టానం వద్దకు పంపిన వారిలో తాను
కూడా ఉన్నానని కొండా సురేఖ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
కోసమే తెలుగు ప్రజలను బలి చేస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు.
ఈరోజు పార్లమెంట్లో టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేస్తామని ప్రకటన చేయడాన్ని
ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో అందరిమాటకు విలువ ఇవ్వాలని అన్నారు. 2జీ
స్పెక్ట్రమ్ కుంభకోణంలో రెండు నెలలపాటు సభలో ఆందోళనలు జరిగాయని, ఎవరినీ
సస్పెండ్ చేయలేదని, ఇప్పుడు న్యాయం కావాలని కోరుతూ ఆందోళన చేస్తే సస్పెండ్
చేస్తారా అని ఆయన ధ్వజమెత్తారు.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే
తెలుగు జాతి గుండె రగులుతోందని, తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
తెలుగువారికి నాయకుడని రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం
చేయమన్నాం కానీ, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయమనలేదని తెలిపారు. రాజకీయ
అనివార్యంతోనే లేఖ ఇవ్వాల్సి వచ్చిందని, ఇంతటి విపత్కార పరిస్థితుల్లో కూడా
ఇచ్చిన మాటకు నిలబడిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని ఆయన పేర్కొన్నారు.
సీమాంధ్రప్రజలకు న్యాయం చేయాలని కోరడానికే చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర
చేయనున్నారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. వైసీపీలా బాధ్యతా రాహిత్యంగా
మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీకి లేదని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
Posted by
arjun
at
6:28 AM