August 22, 2013

తెలంగాణ, సీమాంధ్ర నేతలతో త్వరలో చంద్రబాబు భేటీ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ నేతలతో సమా వేశాలు నిర్వహిం చనున్నారు. రెండు ప్రాంతాలకు చెందిన నేతలతో వేర్వేరుగా చర్చించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ఇప్పటికే ఉద్యమాల్లో టిడిపి ముందుం టున్నందున ఇటు తెలంగాణలో కూడా తాము వెనకబ డకుండా ఉండాలని ఆయన ముఖ్య నేతలకు సూచించినట్టు సమాచారం. ఇరు ప్రాంతాల్లోనూ పార్టీ పటిష్టంగా ఉండటం కోసం, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నేతలతో చర్చించనున్నారు. కాంగ్రెస్‌ నిర్ణయంతో తాము ఇబ్బంది పడకూడదనే ఈ భేటీలను ఏర్పాటు చేసినట్టు తెలి సిందే. గురువారం నుండే భేటీలను ప్రారంభించే అవకాశం ఉంది.