August 20, 2013

దేశాన్ని భ్రష్టు పట్టించిన యూపీఏ : బాబు

యూపీఏ సర్కారు దేశాన్ని భ్రష్టు పట్టించిందని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధిరేటు తగ్గడం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందన్నారు. విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి పక్షవాతం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆర్థికసంక్షోభంపై ప్రభుత్వానికి అధ్యయనం కరవైందన్నారు. బొగ్గు శాఖలో దస్ర్తాల గల్లంతుకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. ఇంత నికృష్టమైన ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు.