August 22, 2013

కేంద్రమంత్రులు రాజీనామా చేయాలి : పయ్యావుల

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో వైకాపా పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బహిరంగ ప్రకటన చేయాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నాలుగు రోజులుగా అమరణ దీక్షకు కూర్చున్న ఎమ్మెల్యే కరుగొండ్ల రామకృష్ణకు ఆయన సంఘీభావం తెలిపారు. గాంధీ కుటుంబాన్ని సమాధిచేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. సిగ్గు, శరం ఉంటే కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రులను గ్రామాల్లోని ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఆయనతోపాటు సూళ్లూరిపేట ఎమ్మెల్యే పరసారత్నం ఎమ్మెల్యే దీక్షకు సంఘీభావం తెలిపారు